మానవశరీరం అనే ఒక దైవదత్తమైన పరికరానికి కలిగే క్లేశాలను నివారించే ఆరితేరిన వైద్యులు అందరూ అవ్వగలరా...??
అంతరిక్షంలో వినువీధిలోకి దూసుకుంటూ సాగిపోయే క్షిపణి / వ్యోమనౌక యొక్క విన్యాసాలను భూమిపైనుండే తమ చేతివేళ్ళతో
శాసించే రాకెట్ సైంటిస్ట్ అందరూ అవ్వగలరా...??
శాసించే రాకెట్ సైంటిస్ట్ అందరూ అవ్వగలరా...??
వాటికి ఒక ప్రత్యేకమైన అర్హత, అనుగ్రహం, కఠోర పరిశ్రమ, జన్మాంతర పుణ్యబలం ఇత్యాదుల సమ్మిళిత సంఘాతమై ప్రభవించే జీవితం మాత్రమే యోగ్యతను సంతరించుకొని సరితూగుతుంది....
అది స్వగ్రాహ్యమా కాద అన్నది వేరు విషయం.....
అది స్వగ్రాహ్యమా కాద అన్నది వేరు విషయం.....
అట్లే అత్యంత ఉత్కృష్టమైన
సంగీత పరిజ్ఞ్యానం కూడా..!!
సంగీత పరిజ్ఞ్యానం కూడా..!!
అది ఆలపించడానికే కాదు....
ఆలకించి ఆస్వాదించి ఆనందామృతరససిద్ధిని మనలోనే ప్రభవింపజేయుటకు కూడా ఆ దైవానుగ్రహమే కారకమై వర్ధిల్లుతుంది....😊
ఆలకించి ఆస్వాదించి ఆనందామృతరససిద్ధిని మనలోనే ప్రభవింపజేయుటకు కూడా ఆ దైవానుగ్రహమే కారకమై వర్ధిల్లుతుంది....😊
అందుకే కద సద్గురు శ్రీత్యాగరాయుల వారు,
" రాగ సుధారస పానము జేసి రంజిల్లవే ఓ మనసా...."
అనే తమ కృతిలో...
శ్రీశారదాంబ కటాక్షజనితమైన సుసాహిత్య సమ్మిళిత శాస్త్రీయ సంగీత సంపద యొక్క వైభవాన్ని నిర్వచించడానికి
" యాగ యోగ త్యాగ భోగ ఫలమొసంగే (రా)
చ. సదాశివ మయమగు నాదోంకార స్వర
విదులు జీవన్ముక్తులని త్యాగరాజు తెలియు (రా) "
విదులు జీవన్ముక్తులని త్యాగరాజు తెలియు (రా) "
అంటూ అంతటి ఘనమైన పదసంపదను ఎన్నుకున్నారు...!!! 😊
Sudhakar Modumudi
ో ఏమి ఆనందం ఉంటుందో నాకర్థం కాదు.నేను నిజానికి ఆ సంగీతాన్ని ఆస్వాదించలేను.జానపద సంగీతమో, సినిమా పాటలో వింటే కలిగే ఆనందం,నాకు శాస్త్రీయ సంగీతం వింటే కలగదు.' అంటూ వేదికపై సెలవిచ్చారు మా బెజవాడలో ఒక పెద్దాయన.
నేను మనసులో అనుకొన్నాను.'అవునులెండి..అలా బుర్ర ఊపి, ఆనందించడానికి ఎన్నో జన్మల సంస్కారం కావాలి.ఇక,తాళం విషయానికొస్తే..అలా తాళం వేయగలగడం వెనుక ఎంతో శిక్షణ,సాధన,అనుభవం ఉంటాయి.అవి మీకెలా అర్థమవుతాయి?'
గురు ముఖంగా ఎన్నో సంవత్సరాలు కష్టపడి,నేర్చుకొని,సాధన చేస్తే..సంగీత రచనలైతే వస్తాయిగానీ..శ్రుతిలయలు రావు.మంచి సంగీతాన్ని గుర్తించి,విని ఆనందించడం రాదు.ఇవిమాత్రం, జన్మాంతర సంస్కారం వల్ల మాత్రమే అబ్బుతాయి.
నేను అక్కడ,ఆ పెద్దమనిషితో ఈ విషయాలు చర్చించడం-' చెవిటివాడి ముందు శంఖం ఊదటమే అవుతుంది.అందరికీ అర్థమైతే..అది 'శాస్త్రీయ' మెందుకు అవుతుంది? అసలు శాస్త్రం తెలుకోవాలనే జిజ్ఞాస ఎంతమందికుంటుంది?
అయితే,ఈ సందర్భంగా మరొక విషయం చర్చించాలి.మా సంగీత కళాకారుల్లో కూడా ఎక్కువ శాతం మంది కచేరీలు వినడానికి రావట్లేదు.వాళ్లు నేర్చుకున్న శాస్త్రీయ సంగీతం మరొకరు పాడితే వారు ఎందుకు వినటానికి రారు?ఊరిలో జరిగే కచేరీలకు హాజరవకుండా,రకరకాల కుంటిసాకులు ఎందుకు చెప్తారు? అప్పుడు నాకు అనిపిస్తుంది'కర్ణాటక సంగీతం అందరూ అనుకొనేట్లు నిజంగా అంత కర్ణ కఠోరమా?'
సంగీతం నేర్చుకొని,వేదికలెక్కి పాడటం మొదలైనాక, విద్యార్థి అభిరుచిలో మార్పు వస్తోంది.విద్యలో, ఖ్యాతిలో తమకన్నా గొప్ప వారి కచేరీలే వినాలి అనుకోవడం,తమకు అవకాశమివ్వని సభలకు దూరంగా ఉండటం,వేరే గురువుల శిష్యులను పరాయివారిగా చూడటం, తోటి కళాకారుల యెడ ఈర్ష్యాసూయలు...ఇటువంటివన్నీ ప్రారంభమౌతాయి.తాము వేదికలెక్కేందుకు చూపే శ్రద్ధ, వేదికపై జరిగే కచేరీలు వినటంపై చూపరు.మళ్లీ వారే,తమ కచేరీలకు హాజరవని సామాన్య జనాన్ని ఆడిపోసుకుంటారు.
అసలు ఏ రాజకీయాలతో సంబంధం లేకుండా,ప్రతి కార్యక్రమానికీ హాజరై,బాగుంటే ఆసాంతం కూర్చొని,విని,నచ్చకపోతే మారుమాట్లాడక, వెళ్ళిపోయే కొంతమంది 'సీనియర్ సిటిజన్స్' కూడా నాకు తారసపడుతూ ఉంటారు.వారిలో కొందరు, తమకు వచ్చే పెన్షన్ డబ్బులలో వీలైనంత అప్పుడప్పుడూ ఇస్తూ..నన్ను మనస్ఫూర్తిగా అభినందించి మరీ వెడుతూ ఉంటారు.వారికి చేతులెత్తి నమస్కరిస్తాను నేను.నిజం చెప్పాలంటే..31 సంవత్సరాలుగా నెలనెలా కచేరీలను 'స్వరఝరి' లో నేను నిర్వహించ గలుగుతున్నానంటే..ప్రధానంగా అటువంటివారి సహకారంతోనే.
'శాస్త్రీయ సంగీత కళాకారులు సాహిత్యానికి ప్రాథాన్యతనివ్వరు కనుక,మేము వినలేమని' కొందరు ఆంధ్ర సాహితీప్రియులనవచ్చు.మరి,ఏ భాషా అవసరంలేని రాగాలాపన,స్వరకల్పన,తానం వంటివాటినైనా ఆస్వాదించవచ్చుకదా! వాద్యసంగీతాన్ని వినవచ్చుకదా!
తెలుగు భాష తెలియని పొరుగు రాష్ట్రాలవారు ఆరాధించినంతగానైనా,మన భాషలోని సంగీతాన్ని మనం ఎందుకు ఆస్వాదించలేకపోతున్నాము?
వీటన్నిటికీ సమాధానం త్యాగయ్యగారు ఎప్పుడో చెప్పారు..
"సీతావర! సంగీత జ్ఞానము ధాత వ్రాయవలెరా!"
ఈ విషయంలో,సంగీత కళాకారులకూ మినహాయింపు లేదు...'సంగీత జ్ఞానం' అంటే..త్యాగయ్యగారి దృష్టిలో,సంగీతాన్ని ఆస్వాదించగలగడం అనికూడా అర్థం.
ఈ కథ వినండి...
సంగీతాభిరుచి పెద్దగాలేని ఒక రాజుగారు,ఒక సందర్భంలో తమ కొలువులో ఒక ప్రసిద్ధ విద్వాంసుని గాత్ర కచేరీ ఏర్పాటుచేశారు.విద్వాంసుడు ఎంతో హృద్యంగా పాడుతున్నాడు..శ్రోతలు ఆనందంతో తలలూపుతూ ఆస్వాదిస్తున్నారు.ఆ సంగీతాన్ని ఆస్వాదించలేకపోతున్న రాజుగారికి,అనుమానం వచ్చింది.'వీళ్లంతా నిజంగా ఆనందిస్తున్నారా? లేక నా మెప్పుకోరి నటిస్తున్నారా?' అని.కచేరీ మధ్యలో ఇలా ప్రకటించారు' ఇక శ్రోతలెవ్వరూ తలలూపడానికి వీలులేదు.తల ఊపితే..శిరచ్ఛేదమే'..
కచేరీ తిరిగి ప్రారంభం అయింది.గంగాప్రవాహంలా సాగుతోంది గాత్ర కచేరీ.సభలో అందరి తలలూ ఊగటం ఆగిపోయాయి..ఒక వ్యక్తి తల మినహా...రాజుగారు పట్టరాని కోపంతో..'ఎవరా తల ఊపుతున్నది? వెంటనే ఆ తలతీసేయండి' అని భటులకు ఆదేశమిచ్చారు.
ఆ తల ఊపుతున్న వ్యక్తి నుంచొని, వినయంగా ఇలా అన్నాడు..'మహారాజా!మంచి సంగీతాన్ని విని,ఆనందంతో స్పందించని నాతల ఉంటేనేం? పోతేనేం?వెంటనే తీసేయండి ప్రభూ..'
రాజుగారికి తన తప్పు తెలిసింది.తన అభిప్రాయం మార్చుకొని,ఆనాటి నుండీ సంగీతాన్ని గురించి తెలుసుకొంటూ,తరచుగా వింటూ, తానూ సంగీతాభిమానిగా మారారు.
దూరదర్శన్ భారతి చానెల్ లో విఖ్యాత సితార్ విద్వాంసులు విలాయత్ ఖాన్ గారు అన్న మాటలు నేనెన్నటికీ మరువలేను..'శంకరా' రాగం విన్నా..పాడుకొన్నా...'అంబరాన్ని అంటే అనంత శరీరుడై, శిరసు నుండి వ్రేలాడే మహా జటలతో, భస్మ ధారియై, ధ్యానముద్రలో గంభీరుడైన శంకరుని దర్శనం నాకు కల్గుతుంది'.
ఎంత గొప్పగా చెప్పారు? ఒక మహమ్మదీయునికి కలిగిన ఆ దర్శనం...భావిస్తే మనకెందుకు కలుగదు?
నాకైతే..శృతిలయ బద్ధమై, శాస్త్రనిబద్ధతతో కూడిన సంగీతం ఎవరు పాడినా...ఖచ్చితంగా దైవదర్శనం కలుగుతుంది.హంసధ్వని రాగం వింటే..గణపతి రూపం..సరస్వతి రాగం వింటే ..వీణాధరి అయిన వాణీమాత దర్శనం, నాదనామక్రియ రాగం వింటే...లీలగా శ్రీరాముడి దివ్యరూపం,సురటిరాగం వింటే..మారుతి సాక్షాత్కారం..ఇలా ప్రతిరాగం, ఒక దైవస్వరూపంగా కనిపిస్తాయి.నాకు సంగీతం వినడంలో ఉన్న ఆనందం, పాడటంలో కూడా కనబడదు.నేను విన్న ప్రత్యక్ష సంగీతం,నా సమకాలీనులలో ఎవరైనా విన్నారా? అని సందేహం కల్గుతుంది.
నవవిధ భక్తి మార్గాలలో ఒకటైన శ్రవణ భక్తిని నాకు అనుగ్రహించిన వాగ్దేవికి సదా వందనాలు!
నేను మనసులో అనుకొన్నాను.'అవునులెండి..అలా బుర్ర ఊపి, ఆనందించడానికి ఎన్నో జన్మల సంస్కారం కావాలి.ఇక,తాళం విషయానికొస్తే..అలా తాళం వేయగలగడం వెనుక ఎంతో శిక్షణ,సాధన,అనుభవం ఉంటాయి.అవి మీకెలా అర్థమవుతాయి?'
గురు ముఖంగా ఎన్నో సంవత్సరాలు కష్టపడి,నేర్చుకొని,సాధన చేస్తే..సంగీత రచనలైతే వస్తాయిగానీ..శ్రుతిలయలు రావు.మంచి సంగీతాన్ని గుర్తించి,విని ఆనందించడం రాదు.ఇవిమాత్రం, జన్మాంతర సంస్కారం వల్ల మాత్రమే అబ్బుతాయి.
నేను అక్కడ,ఆ పెద్దమనిషితో ఈ విషయాలు చర్చించడం-' చెవిటివాడి ముందు శంఖం ఊదటమే అవుతుంది.అందరికీ అర్థమైతే..అది 'శాస్త్రీయ' మెందుకు అవుతుంది? అసలు శాస్త్రం తెలుకోవాలనే జిజ్ఞాస ఎంతమందికుంటుంది?
అయితే,ఈ సందర్భంగా మరొక విషయం చర్చించాలి.మా సంగీత కళాకారుల్లో కూడా ఎక్కువ శాతం మంది కచేరీలు వినడానికి రావట్లేదు.వాళ్లు నేర్చుకున్న శాస్త్రీయ సంగీతం మరొకరు పాడితే వారు ఎందుకు వినటానికి రారు?ఊరిలో జరిగే కచేరీలకు హాజరవకుండా,రకరకాల కుంటిసాకులు ఎందుకు చెప్తారు? అప్పుడు నాకు అనిపిస్తుంది'కర్ణాటక సంగీతం అందరూ అనుకొనేట్లు నిజంగా అంత కర్ణ కఠోరమా?'
సంగీతం నేర్చుకొని,వేదికలెక్కి పాడటం మొదలైనాక, విద్యార్థి అభిరుచిలో మార్పు వస్తోంది.విద్యలో, ఖ్యాతిలో తమకన్నా గొప్ప వారి కచేరీలే వినాలి అనుకోవడం,తమకు అవకాశమివ్వని సభలకు దూరంగా ఉండటం,వేరే గురువుల శిష్యులను పరాయివారిగా చూడటం, తోటి కళాకారుల యెడ ఈర్ష్యాసూయలు...ఇటువంటివన్నీ ప్రారంభమౌతాయి.తాము వేదికలెక్కేందుకు చూపే శ్రద్ధ, వేదికపై జరిగే కచేరీలు వినటంపై చూపరు.మళ్లీ వారే,తమ కచేరీలకు హాజరవని సామాన్య జనాన్ని ఆడిపోసుకుంటారు.
అసలు ఏ రాజకీయాలతో సంబంధం లేకుండా,ప్రతి కార్యక్రమానికీ హాజరై,బాగుంటే ఆసాంతం కూర్చొని,విని,నచ్చకపోతే మారుమాట్లాడక, వెళ్ళిపోయే కొంతమంది 'సీనియర్ సిటిజన్స్' కూడా నాకు తారసపడుతూ ఉంటారు.వారిలో కొందరు, తమకు వచ్చే పెన్షన్ డబ్బులలో వీలైనంత అప్పుడప్పుడూ ఇస్తూ..నన్ను మనస్ఫూర్తిగా అభినందించి మరీ వెడుతూ ఉంటారు.వారికి చేతులెత్తి నమస్కరిస్తాను నేను.నిజం చెప్పాలంటే..31 సంవత్సరాలుగా నెలనెలా కచేరీలను 'స్వరఝరి' లో నేను నిర్వహించ గలుగుతున్నానంటే..ప్రధానంగా అటువంటివారి సహకారంతోనే.
'శాస్త్రీయ సంగీత కళాకారులు సాహిత్యానికి ప్రాథాన్యతనివ్వరు కనుక,మేము వినలేమని' కొందరు ఆంధ్ర సాహితీప్రియులనవచ్చు.మరి,ఏ భాషా అవసరంలేని రాగాలాపన,స్వరకల్పన,తానం వంటివాటినైనా ఆస్వాదించవచ్చుకదా! వాద్యసంగీతాన్ని వినవచ్చుకదా!
తెలుగు భాష తెలియని పొరుగు రాష్ట్రాలవారు ఆరాధించినంతగానైనా,మన భాషలోని సంగీతాన్ని మనం ఎందుకు ఆస్వాదించలేకపోతున్నాము?
వీటన్నిటికీ సమాధానం త్యాగయ్యగారు ఎప్పుడో చెప్పారు..
"సీతావర! సంగీత జ్ఞానము ధాత వ్రాయవలెరా!"
ఈ విషయంలో,సంగీత కళాకారులకూ మినహాయింపు లేదు...'సంగీత జ్ఞానం' అంటే..త్యాగయ్యగారి దృష్టిలో,సంగీతాన్ని ఆస్వాదించగలగడం అనికూడా అర్థం.
ఈ కథ వినండి...
సంగీతాభిరుచి పెద్దగాలేని ఒక రాజుగారు,ఒక సందర్భంలో తమ కొలువులో ఒక ప్రసిద్ధ విద్వాంసుని గాత్ర కచేరీ ఏర్పాటుచేశారు.విద్వాంసుడు ఎంతో హృద్యంగా పాడుతున్నాడు..శ్రోతలు ఆనందంతో తలలూపుతూ ఆస్వాదిస్తున్నారు.ఆ సంగీతాన్ని ఆస్వాదించలేకపోతున్న రాజుగారికి,అనుమానం వచ్చింది.'వీళ్లంతా నిజంగా ఆనందిస్తున్నారా? లేక నా మెప్పుకోరి నటిస్తున్నారా?' అని.కచేరీ మధ్యలో ఇలా ప్రకటించారు' ఇక శ్రోతలెవ్వరూ తలలూపడానికి వీలులేదు.తల ఊపితే..శిరచ్ఛేదమే'..
కచేరీ తిరిగి ప్రారంభం అయింది.గంగాప్రవాహంలా సాగుతోంది గాత్ర కచేరీ.సభలో అందరి తలలూ ఊగటం ఆగిపోయాయి..ఒక వ్యక్తి తల మినహా...రాజుగారు పట్టరాని కోపంతో..'ఎవరా తల ఊపుతున్నది? వెంటనే ఆ తలతీసేయండి' అని భటులకు ఆదేశమిచ్చారు.
ఆ తల ఊపుతున్న వ్యక్తి నుంచొని, వినయంగా ఇలా అన్నాడు..'మహారాజా!మంచి సంగీతాన్ని విని,ఆనందంతో స్పందించని నాతల ఉంటేనేం? పోతేనేం?వెంటనే తీసేయండి ప్రభూ..'
రాజుగారికి తన తప్పు తెలిసింది.తన అభిప్రాయం మార్చుకొని,ఆనాటి నుండీ సంగీతాన్ని గురించి తెలుసుకొంటూ,తరచుగా వింటూ, తానూ సంగీతాభిమానిగా మారారు.
దూరదర్శన్ భారతి చానెల్ లో విఖ్యాత సితార్ విద్వాంసులు విలాయత్ ఖాన్ గారు అన్న మాటలు నేనెన్నటికీ మరువలేను..'శంకరా' రాగం విన్నా..పాడుకొన్నా...'అంబరాన్ని అంటే అనంత శరీరుడై, శిరసు నుండి వ్రేలాడే మహా జటలతో, భస్మ ధారియై, ధ్యానముద్రలో గంభీరుడైన శంకరుని దర్శనం నాకు కల్గుతుంది'.
ఎంత గొప్పగా చెప్పారు? ఒక మహమ్మదీయునికి కలిగిన ఆ దర్శనం...భావిస్తే మనకెందుకు కలుగదు?
నాకైతే..శృతిలయ బద్ధమై, శాస్త్రనిబద్ధతతో కూడిన సంగీతం ఎవరు పాడినా...ఖచ్చితంగా దైవదర్శనం కలుగుతుంది.హంసధ్వని రాగం వింటే..గణపతి రూపం..సరస్వతి రాగం వింటే ..వీణాధరి అయిన వాణీమాత దర్శనం, నాదనామక్రియ రాగం వింటే...లీలగా శ్రీరాముడి దివ్యరూపం,సురటిరాగం వింటే..మారుతి సాక్షాత్కారం..ఇలా ప్రతిరాగం, ఒక దైవస్వరూపంగా కనిపిస్తాయి.నాకు సంగీతం వినడంలో ఉన్న ఆనందం, పాడటంలో కూడా కనబడదు.నేను విన్న ప్రత్యక్ష సంగీతం,నా సమకాలీనులలో ఎవరైనా విన్నారా? అని సందేహం కల్గుతుంది.
నవవిధ భక్తి మార్గాలలో ఒకటైన శ్రవణ భక్తిని నాకు అనుగ్రహించిన వాగ్దేవికి సదా వందనాలు!
No comments:
Post a Comment