చైత్ర శుద్ధ సప్తమి 2026 మార్చ్ 25, సౌమ్య వాసర మృగశిర నక్షత్ర ప్రయుక్త మిథునలగ్న పుష్కరాంశ సుముహూర్తంలో, బ్రహ్మాండనాయకుని పంచత్రింశత్ 35వ వార్షిక బ్రహ్మోత్సవాంతర్గత కళ్యాణమహోత్సవంలో దేవతలందరూ దివినుండి వారి అనుగ్రహాన్ని వర్షించే సుముహూర్తంలో ఎంతో విశిష్టమైన శ్రీశ్రీనివాస అనుగ్రహంతో భక్తులందరూ తరించే మధురాతిమధురమైన పర్వసమయం...😊💐
కృతేతు నారసింహో భూ త్రేతాయాం రఘునందనః
ద్వాపరే వాసుదేవశ్చ కలౌ శ్రీవేంకటనాయకః !
కృతయుగంలో నరసింహ భగవానుడు,
త్రేతాయుగంలో శ్రీరామ భగవానుడు,
ద్వాపరయుగంలో శ్రీకృష్ణ భగవానుడు మరియు
కలియుగంలో శ్రీవేంకటేశ్వరుడు (శ్రీనివాసుడు)
ప్రత్యక్ష దైవములు (అనగా ప్రత్యక్ష ప్రామాణికతతో గ్రాహ్యమై ఉండే దేవతలు) అని పెద్దల ఉవాచ...
అనగా శ్రీవేంకటేశ్వరుడు కలియుగానికి అధిష్ఠానదైవం కనుక శ్రీశ్రీనివాస కళ్యాణకైంకర్యం విశేషమైన భగవదనుగ్రహదాయక వైభవమై ఒప్పారే అధ్యాత్మ అంశం అని పెద్దల ఉవాచ....
సింపుల్ గా రిజిస్ట్రార్ ఆఫీస్ లో జరిగే ఒక సామాన్య పెళ్ళికి మరియు
అంగరంగవైభవంగా ఎంతోమంది సాదర అతిథులు, ఆహ్వానితులు, బంధుజనుల సమక్షంలో ఎంతో అట్టహాసభరితంగా సంప్రదాయవైభవంతో
జరిగే మహదైశ్వర్యవంతుల పెళ్ళికి, విందుకి, ఎంత భేదం ఉండునో.....,
అట్లే..,
మామూలుగా ఇతర రోజుల్లో నిర్వహింపబడే భగవద్ కళ్యాణ కైంకర్యములకు, మరియు సాలంకృత ఆరాధిత గరుడధ్వజారోహణతో ఆలయప్రాకారానికి విచ్చేసి విశేషమైన సూక్ష్మద్యుతిశక్తితో కొలువైఉండే దివిజ సమూహం, నిత్యసూరులు, దిగ్దేవతలు,
మరియు భగవద్సన్నిధికి విచ్చేసిన
భూసురోత్తములు,
కళ్యాణకైంకర్యపరులు,
భక్తభాగవతోత్తములు,
ఇందరి సమక్షంలో ఎంతో అట్టహాసభరితంగా ఆగమసంప్రదాయవైభవంతో నిర్వహింపబడే అఖిలాండకోటి బ్రహ్మాండనాయకుడైన శ్రీమద్ అలర్మేల్మంగా పద్మావతీ సమేత శ్రీశ్రీనివాసుడి కళ్యాణం, భోజనప్రసాదవితరణ అంత విశేషంగా ఉండే వైభవం....!
ఆపాదతలమస్తకం స్వర్ణాభరణాలంకృత దేవతామూర్తుల దర్శనం కలిసంతారకమైన విశేషభగవదనుగ్రహదాయక వైభవం అని శాస్త్రోక్తి...
అటువంటి అరుదైన భగవదనుగ్రహానికి పాత్రులై తరించాలంటే, శ్రీవేంకటాచలం వంటి శ్రీక్షేత్రాల్లో నిర్వహింపబడే ఆర్జిత సేవల్లో పాల్గొని దర్శించి తరించగలం....
మరియు
మన కూకట్పల్లి వివేకానందనగర్ కాలని లో కొలువైన,
శ్రీమద్ అలర్మేల్మంగా పద్మావతీ సమేత శ్రీశ్రీనివాసుడి
చైత్ర శుద్ధ సప్తమి నాటి వార్షిక బ్రహ్మోత్సవాంతర్గత కళ్యాణోత్సవంలో పాల్గొని దర్శించి తరించగలం....
శ్రీ విఖనస మహర్షి గా భగవంతుడే అవతరించి అనుగ్రహించిన ఆరాధనామంజరిని శ్రీవైఖానస ఆగమశాస్త్రం అని...
శ్రీ నారాయణ మహర్షి గా భగవంతుడే అవతరించి అనుగ్రహించిన ఆరాధనామంజరిని శ్రీపాంచరాత్ర ఆగమశాస్త్రం అని...
తిరుమలలో శ్రీవైఖానస ఆగమోక్త ఆరాధనా విధానాన్ని,
తిరుచానూర్ మరియు ఇతర ఎన్నో శ్రీవైష్ణవక్షేత్రాల్లో శ్రీపాంచరాత్ర ఆగమోక్త ఆరాధనా విధానాన్ని పాటించడం అనాదిగా వర్ధిలుతున్న సత్సంప్రదాయం....
నిత్యం షట్కాల ఆరాధనతో వర్ధిల్లే తిరుమలలో శ్రీవైఖానస ఆగమోక్త ఆరాధనా విధానాన్ని పాటించడం అనే సత్సాంప్రదాయవైభవాన్ని భగవంతుడే ఎందుకు స్థిరీకరించాడంటే....
శ్రీచాగంటి సద్గురువులు వారి ప్రవచనాల్లో ఒకసారి వివరించినట్టుగా....,
యుగలక్షణం అనే అనివార్యమైన అంశం కారణంగా
శౌచము, సదాచారము, ధర్మము, సిద్ధి,
అనే నాలుగు ప్రధాన అంశాలపై వర్ధిల్లే దేవతాశక్తి తత్ దేవతామూర్తుల్లో నిత్యం కొలువై ఉండి అనుగ్రహించడం అనే వైభవం ఈ కలియుగంలో దుర్లభమై ఉన్న కారణంగా,
ఏఏ పద్ధతులను పాటిస్తే ఈ నాలుగూ కూడా ఒనగూరి దేవతామూర్తుల్లో తత్ ఆవాహిత దైవికశక్తి నిత్యం ప్రస్ఫుటంగా కొలువై ఉండి భక్తులను నిరంతరం అనుగ్రహిస్తూ ఉండునో...
అట్టి సమ్మునతమైన అధ్యాత్మ అంశాల సమాహారంగా కొందరు విజ్ఞ్యులకు మాత్రమే ప్రధానదేవతా / మూలవర్ బింబాన్ని స్పృశించే అరుదైన అనుగ్రహంతో సమకూర్చబడిన సారస సాకార సమూర్త్యారాధనా వైభవాంశముల సామాహర భగవద్
శాస్త్రమే శ్రీవైఖానస ఆగమశాస్త్రం...
కొందరు / కొన్ని కుటుంబాలకు చెందిన విజ్ఞ్యులు మాత్రమే ఎందుకు అని అంటే, ఒక స్టెప్ అప్ కరెంట్ ట్రాన్స్ఫార్మర్ ని నిత్యం టచ్ చేస్తూ, శుద్ధి గావిస్తూ, ఆపరేట్ చేయాలంటే ఆ స్థాయిలో తగు సమ్మునతమైన తర్ఫీదును పొందిన వారు మాత్రమే తగినవారు అని అనడం ఎట్లు సమంజసమో....,
శ్రీవైఖానస ఆగమశాస్త్రం / శ్రీవైఖానస అర్చకులు కూడా అట్లే...
ఈ లోకంలో ఎన్నో ప్రదేశాల్లో ఇట్టి విశేషమైన భగవద్ అనుగ్రహం ఎందరో భక్తులకు అందిరావాలంటే,
ఒక స్టెప్ అప్ ట్రాన్స్ఫర్నర్ నుండి అధ్యాత్మద్యుతిశక్తిని నిరంతరం తరంగితంగావింపజేసుకుంటూ / స్వీకరిస్తూ వర్ధిల్లే....
ఒక స్టెప్ డౌన్ కరెంట్ ట్రాన్స్ఫార్మర్ ని నిత్యం టచ్ చేస్తూ, శుద్ధి గావిస్తూ, ఆపరేట్ చేయడం (ఆ స్థాయిలో తగు సమ్మునతమైన తర్ఫీదును పొందిన ఎందరో విజ్ఞ్యులు) అనే అంశానికి సామ్యమే శ్రీవైష్ణవ శ్రీపాంచరాత్ర ఆగమశాస్త్ర వైభవం....
మన ప్రపంచంలో స్టెప్ అప్ ట్రాన్స్ఫార్మర్స్ వందల సంఖ్యలో ఉంటే, స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్స్ వేల సంఖ్యలో ఉండడం EEE ఎంజినీర్స్ కి తెలిసిన అంశమే.....
అట్లే మన భూలోకంలో శ్రీపాంచరాత్ర ఆగమశాస్త్ర ఆరాధనావైభవంతో అలరారే ఆలయాలు వేలాదిగా ఉండడం అధ్యాత్మ విజ్ఞ్యులకు విదితమై ఉండే అంశమే...
మన భూలోకంలో శ్రీపాంచరాత్ర ఆగమశాస్త్ర ఆరాధనావైభవంతో అలరారే అట్టి వేలాది ఆలయాల్లో, ఎంతో విశేషమైన వైభవంతో, మహిమ్నతతో, అలరారే ఆలయం
మన కూకట్పల్లి వివేకానందనగర్ కాలని లో కొలువైన శ్రీమద్ అలర్మేల్మంగా పద్మావతీ ఆండాళ్ సమేత శ్రీశ్రీనివాస భగవదాలయం....
భగవద్ సన్నిధిలో / ఆలయంలో, గోశాలలో, తులసీవనంలో, బిల్వవృక్ష, ఆమలక/ఉసిరి/ఉశిరి వృక్ష, సన్నిధిలో నిర్వహింపబడే భగవద్ కైంకర్యోత్సవాలు విశేషమైన అనుగ్రహాన్ని వర్షించును అని పెద్దల ఉవాచ....
విష్వక్సేనారాధన
స్వస్తిపుణ్యాహవాచనం,
వివిధపుణ్యతీర్థావాహితజలసంప్రోక్షణ,
మహాసంకల్పపఠనం,
లగ్నాష్టకచూర్ణికాపఠనం,
గుడజీరకధారణ,
మంగళసూత్రధారణ,
తలంబ్రాలు/తలబాలు,
నిలయవిద్వాంసుల సుస్వరరాగాలాపన,
భగవద్గౌణగుణగానసంకీర్తనం,
కళ్యాణమహోత్సవ మహాప్రసాదసేవనం,
ఇత్యాది సత్త్వగుణసాంద్రతాభివృద్ధికారక కార్యక్రమాల సమ్మిళిత సమాహార విశేషంగా కొనసాగే భగవద్కళ్యాణక్రతువులో పాల్గొని తరించే భక్తభాగవతోత్తములకు విదితమైనట్టుగా,
శ్రీశ్రీనివాసపరిణయోత్సవం భక్తులెల్లరికీ ఒక మహావైభోగదాయక మహోత్సవం...
మామూలుగా మానవుల పెళ్ళిలో పాటించే కార్యక్రమాలన్నీ కూడా వారిరువురి శ్రేయస్సుకై పెద్దలు, దైవజ్ఞ్యులచే నిర్వహింపబడే కళ్యాణక్రతువు.
దేవుళ్ళ పెళ్ళిలో పాటించే కార్యక్రమాలన్నీ కూడా వీక్షకమహాశయుల శ్రేయస్సుకై పెద్దలు, దైవజ్ఞ్యులచే నిర్వహింపబడే కళ్యాణక్రతువు.
భగవద్కళ్యాణాంతర్గత ఏ క్రతువు ఏ భక్తుణ్ణి ఎవ్విధంగా అనుగ్రహించును అనేది భక్తుడికి మరియు భగవంతుడికి మాత్రమే గ్రాహ్యమయ్యే అధ్యాత్మ విశేషం...
ఎందుకంటే సదరు డాక్టర్ గారు సూచించిన ఏ ఔషధం ఎవ్వరికి ఎట్లు ఉపకరించి స్వస్థతను సమకూర్చిందో తెలిసేది ఆ వైద్యనారాయణమూర్తికి మరియు ఆ ఔషధాన్ని సేవించిన వారికే కద....
ఈ క్రింది స్పేస్ ఎక్స్ప్లొరేషన్ స్టోరి గురించి వినే ఉంటారు కొందరైనా....
అంతరిక్షంలో నోట్స్ రాసుకోవడానికి వీలైయ్యే విధంగా ఎన్నో శాస్త్రాలను శోధించి, ఎన్నో పరిశోధనలు చేసి, ఎన్నో కోట్లు వెచ్చించి గ్రావిటి లేకున్నా కూడా అంతరిక్షనౌకల్లో కూడా పనిచేసే ఒక స్పెషల్ పెన్ ని కనిపెట్టి ఉపయోగించారంట అమెరికా వాళ్ళు.....
అంతరిక్షంలో నోట్స్ రాసుకోవడానికి అన్ని కోట్లు వెచ్చించి ఒక స్పెషల్ పెన్ ని కనిపెట్టారా అమెరిక వాళ్ళు...!
హుమ్మ్...
ఒక పెన్సిల్ ని ఉపయోగించి నోట్స్ రాసుకుంటే సరిపోద్ది కద...
అని రష్యావాళ్ళు సింపుల్ గా ఒక నార్మల్ పెన్సిల్ తో నోట్స్ రాసుకున్నారంట.....
అట్లే....
ఎన్నో గహనమైన శాస్త్రాలను శోధించి, ఎన్నో పరిశోధనలు చేసి, ఎంతో ధనం వెచ్చించి కొందరు అవి ఇవి అని ఏవేవో కాంప్లెక్స్ అధ్యాత్మ సాధనలను / సాధనాలను అవలంబిస్తూ ఉంటారు....
(గహనమైన శాస్త్రాలను తక్కువ చేసి మాట్లాడడం ఇక్కడి ఉద్దేశ్యం కాదు...సామాన్య జనబాహుళ్య గ్రాహ్యానికి అందనంత ఎత్తులో ఉండే గహనమైన సిద్ధాంతాలే అధ్యాత్మశాస్త్ర రీత్యా వివిధ సమస్యలకు గల పరిష్కారాలు అని చెప్తూ, భక్తులను ఏమార్చి వారిని లూటి గావించే వ్యాపారాలతో వివిధ ఛానెల్స్ లో ప్రసారమయ్యే కొందరు సొ కాల్డ్ అధ్యాత్మవ్యక్తుల కొన్ని ప్రకటనలు అంతగా ఉపయుక్తమైనవి కాదని చెప్పడం మాత్రమే ఇక్కడి ఉద్దేశ్యం అని విజ్ఞ్యులు గమనించవలె...
అంగడి సరుకులుగా అమ్మబడే పిరమిడ్లు, వివిధ యంత్రాలు, ఇతర కాంప్లెక్స్ పూజా వస్తువులు, కొత్త కొత్త యోగ ధ్యాన ప్రక్రియలను నిర్వహించే ఆశ్రమాలు, విరించికుమారీస్ అని శాస్త్రంలో ఎక్కడా లేని మెట్టవేదాంతాన్ని ప్రచారం గావిస్తూ ప్రజలను మభ్యపెట్టే ప్రకటనలతో పుట్టగొడుగుల్లా విస్తరిస్తున్న హానికారక సంస్థలు, ఇత్యాదివి జీవితాభివృద్ధికారక అధ్యాత్మ అంశాలు కాదని చెప్పడం మాత్రమే ఇక్కడి ఉద్దేశ్యం అని విజ్ఞ్యులు గమనించవలె...)
ఇంకొందరు సింపుల్ గా భగవద్ కళ్యాణమహోత్సవాల్లో పాల్గొని భక్తిశ్రద్ధలతో భగవంతుడికి నమస్కరించి సకల శ్రేయస్సులను అందుకొని తరిస్తూ ఉంటారు....
ఎందుకంటే, "శుభం కరోతు కళ్యాణం" అని ఆర్యోక్తి....
ఎవరికి ఏది శుభం అని అంటే....
అది అడిగే భక్తుడికి....అనుగ్రహించే దేవుడికి సంబంధించిన అంశం....అని అనవలసి ఉంటుంది....
కొందరు భక్తులు ఏవైనా ఎప్పుడైనా అడుగుతూనే ఉంటారని భగవంతుడికి కూడా తెలుసు....
అందుకే "నిత్యశుభప్రద గోవిందా..." అని స్తుతించేది....
అట్టి భక్తులు అడిగినవి దేశకాలానుగుణంగా అనుగ్రహించే భగవంతుడే భక్తిజ్ఞ్యానములను కూడా అనుగ్రహిస్తాడు...
భక్తిజ్ఞ్యానములతో తనను ఆరాధిస్తూ భాగవతోత్తములుగా
తమనుతాము తీర్చిదిద్దుకున్న భక్తులకు అడిగినా అడగకున్నా ఉపయుక్తమైనవన్నీ అనుగ్రహిస్తూ తన భక్తవత్సలతను ప్రదర్శించే వాడే భగవంతుడు.....
అందుకే శ్రీ తాళ్ళపాక అన్నమాచార్యులవారు స్వామి వారిని ఆశ్రితపారిజాతంగా అభివర్ణిస్తూ,
"వెతకి వెతకి వరములొసంగెడి వేంకటపతి యితడు"
అని స్తుతించారు ఈ క్రింది సంకీర్తనలో.....
https://annamacharya-lyrics.blogspot.com/2008/05/495vide-nelakonnadu-srivemkatagiri-mida.html
నిత్యం సకలలోకమాన్యులచే, సకలదేవతలచే నమస్కరింపబడుతూ వర్ధిల్లే దేవతాసార్వభౌముడైన శ్రీవేంకటేశ్వరస్వామివారిని మరి మనం ఎంతగా వెతకి వెతకి సేవించి తరించాలో కూడా ఈ క్రింది సంకీర్తనలో శ్రీ తాళ్ళపాక అన్నమాచార్యులవారు అంతే గొప్పగా అభివర్ణించారు....
"త్రిదశవంద్యుడగు తిరువేంకటపతి | వెదకి వెదకి సేవించుడీ ||"
https://annamacharya-lyrics.blogspot.com/2007/11/347vedam-bevvani-vedakedivi.html?m=1
"త్రిదశవంద్యులు" అనగా బాల్యం, కౌమారం, యవ్వనం, అనే మూడు దశల్లో వర్ధిల్లి ఎల్లప్పుడూ 30 సంవత్సరాల యవ్వనప్రాయం వారిగా అగుపించే ద్యుతిశక్తిభరిత దివిగమన తైజసికదేహధారులైన దేవతలు అని ఇతః పూర్వం ఒక పోస్ట్లో శ్రీ చాగంటి సదురువుల ప్రవచన వాక్కును వివరించాను.....
దేవతలను మరియు ఈ కలియుగ ప్రత్యక్ష దేవతాసార్వభౌముడైన శ్రీవేంకటేశ్వరస్వామివారిని విజ్ఞ్యులు ఎందుకు నిత్యం ఆరాధిస్తారో ఒక చిన్న ఎగ్సాంపుల్ తో వివరిస్తా...
బయట వీధిలో ఏదో సమస్యతో మన ఇంట్లో కరెంట్ / పవర్ సప్లై ఆఫ్ అయినప్పుడు రాత్రి పూట ఫలాన వస్తువు ఫలాన చోట ఉంది అని ఒక టార్చ్ లైట్ వేసి దర్శించగలగడం శ్రీలక్ష్మీ అనుగ్రహానికి సంకేతం...
ఆ ఉపయుక్తకరమైన వస్తువును అందుకొని తరించడానికి అవలంబించవలసిన శ్రేయస్కరమైన మార్గాన్ని టార్చ్ లైట్ వెలుగులో దర్శిస్తూ ముందుకుసాగడం శ్రీమన్నారాయణానుగ్రహం....
అనగా మొదట మనం టార్చ్ లైట్ ఎక్కడ ఉందో గుర్తుపెట్టుకొని అందుకోవాలి....
ఆ తదుపరి మన గమ్యాన్ని బాగా దర్శించాలి....
ఆ తరువాత మన గమనమార్గాన్ని బాగా దర్శించాలి....
అప్పుడు గమ్యగమనసిద్ధిని గడించి కావలసిన ఉపయుక్తకరమైన శ్రియానుగ్రహం అందివచ్చి మనం తరించెదము....
అందుకే విజ్ఞ్యులైన పెద్దలు చెప్పే మాట....
ధ్వజస్తంభానికి నమస్కరించి ఒక ఆలయవ్యవస్థలోకి ప్రవేశించిన తదుపరి మొదట మనం గరుడాళ్వార్ ఎక్కడ ఉన్నారో గుర్తుపెట్టుకొని నమస్కరించాలి....
ఆ తదుపరి శ్రీమహాలక్ష్మి అమ్మవారిని బాగా దర్శించాలి....
ఆ తరువాత శ్రీవేంకటేశ్వరస్వామి వారిని బాగా దర్శించాలి....
అప్పుడు జీవజీవేశ్వరైక్యభావ సిద్ధిని గడించి కావలసిన ఉపయుక్తకరమైన శ్రియానుగ్రహం అందివచ్చి మనం తరించెదము....
అధ్యాత్మ పరంగా శ్రీమహావిష్ణువు యొక్క వాహనం గరుడాళ్వార్....
అనగా వైనతేయా...ఫలాన ప్రదేశానికి / లోకానికి వెళ్దాం పద...అని స్వామివారు సంకల్పించిన మరుక్షణం ఆ చోట /ప్రదేశంలో స్వామివారిని ప్రకాశింపజేసే సాధనం గరుత్మంతులవారు.....
ఓక్ టార్చ్ లైట్ కూడా అంతే కద...
అనగా ఫలాన ప్రదేశంలో లైట్ బీం ని ప్రకాశింపజేసే సాధనమే కద....
కొన్నికొన్ని టార్చ్ లైట్స్ ఎంత పవర్ఫుల్ గా ఉంటాయంటే కొన్ని కిలోమీటర్ల దూరంలో ఉండే వస్తువులను కూడా ఎంతో గొప్పగా దర్శింపజేయగలవు....
అవ్విధంగానే కొన్నికొన్ని ఆలయాల్లోని గరుడాళ్వార్ ఆరాధన ఎంత పవర్ఫుల్ గా ఉంటుందంటే, జన్మజన్మల అఘాన్ని నశింపజేసి, జన్మజన్మలకు వర్ధిల్లే శ్రియానుగ్రహాన్ని ప్రసాదించే గారుత్మతశక్త్యానుగ్రహాన్ని భక్తులకు అనుగ్రహించేంతగా...
గరుత్మంతుల వారి శక్తి ఎంతటి ఘనమైనదో తెలుసుకోవాలంటే
శ్రీచాగంటి సద్గురువుల సంపూర్ణ శ్రీమద్రామాయణ ప్రవచనాలను,
ప్రత్యేకించి యుద్ధకాండలో మేఘనాథుడి నాగాస్త్రబంధనంతో అశక్తులై ఉన్న శ్రీరామసేన మొత్తాన్ని ఎవ్విధంగ తన బంగారు రెక్కలతో సుపర్ణుడు శ్రీవైకుంఠ ప్రాకారాలనుండి రయ్యన భూమండలానికి చేరుకొని కాంచన లంకలో వాలి తన రెక్కల సవ్వడితో నాగాస్త్రబంధనాన్ని క్షణాల్లో లయించి,
"అడగకుండానే మాకు ఇంతటి మేలును ఒనరించిన నీవెవరవు..." అని శ్రీరాముడు అడగగా...
"నేను మీకు ఒక గొప్ప మిత్రుణ్ణి అని ప్రస్తుతానికి అనుకోండి శ్రీరామ....
మీకు ఈ రామరావణసంగ్రామంలో విజయం సిద్ధించుగాక....
శుభమస్తు...."
అని అంతే వేగంగా దివికి ఎగిరిన సకల వేదపురాణేతిహాసమంత్రాధిదేవతైన
శ్రీగరుత్మంతుల వారి అనన్యసామాన్యమైన అనుగ్రహంతో
విజ్ఞ్యులెల్లరూ తరించెదరని అభిలషిస్తూ....
భక్తభాగవతలోకానికి విజ్యులైన ఆలయ కమిటీ వారిచే అందివ్వబడిన శ్రీవారి పంచత్రింశత్ 35వ వార్షికబ్రహ్మోత్సవ ఆహ్వాన కరపత్రం జతపరిచాను...మీరూ చదవండి...మీతోటి విజ్ఞ్యులచే చదివించండి...
శ్రీవారి బ్రహ్మోత్సవాలకు విశేషంగా....
తరలిరండి....దర్శించండి...తరించండి....!
జన్మజన్మలకు వర్ధిల్లే శ్రియానుగ్రహాన్ని గడించి తరించండి....!!
************************************
గోవిందాది నామోచ్ఛారణ కొల్లలు దొరకెను మనకిపుడు
ఆవలనీవల నోర(గుమ్మలుగ నాడుద మీతని పాడుదము
సత్యము సత్యము సకలసురలలో
నిత్యుడు శ్రీహరి నిర్మలుడు
ప్రత్యక్షమిదే ప్రాణులలోపల
అత్యంతము శరణనరో యితని
చాటెడి చాటెడి సకలవేదములు
పాటించినహరి పరమమని
కూటస్ఠు(డితడు గోపవధూపతి
కోటికి యీతని గొలువరో జనులు
నిలుచున్నా(డిదె నే(డును నెదుటను
కలిగిన శ్రీవేంకటవిభుడు
వలసినవారికి వరదుం(డీతదు
కలడు గలడితని(గని మనరో
https://annamacharya-lyrics.blogspot.com/2007/03/158govimdadi-nmochcharana.html?m=1
************************************
భగవద్కళ్యాణకైంకర్యం ఎవ్విధంగా భగవంతుణ్ణి భక్తభాగవతోత్తములకు మరింగ దెగ్గరగా చేసి విశేషమైన శ్రియానుగ్రహపరంపరలను వర్షించునో స్వామివారి అనుగ్రహంతో మరో పోస్ట్లో మళ్ళీ తరచి తరిద్దాం....
స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం
న్యాయేన మార్గేణ మహీం మహీశాః |
గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం
లోకాస్సమస్తా స్సుఖినో భవంతు ||
సర్వే సుజనాః సుఖినోభవంతు....💐😊