Wednesday, February 26, 2020

Wishing one and all a very Happy MahaaSivaraatri 2020.... :)

శ్రీశైలశృంగే విబుధాతిసంగే తులాద్రితుంగేపి ముదావసంతమ్
తమర్జునం మల్లికాపూర్వ మేకం నమామి సంసారసముద్ర సేతుమ్...... 🙏

అంటూ ద్వాదశజ్యోతిర్లింగ స్తోత్రంలో శివయ్యను స్తుతిస్తాం కద.....

ఘొరమైన సంసారసాగరతరణానికి 
చక్కనైన సేతువైన ఆ శివుడికి అత్యంత ప్రీతికరమైన అభిషేకకైంకర్యంలో నిన్నటి శివరాత్రిపర్వదినంలో అందరు పాల్గొని ఆ పరమాత్మ యొక్క అనుగ్రహాన్ని పొంది తరించిఉంటారు......

అలంకారప్రియోర్విష్ణుః
అభిషేకప్రియః శివః
నమస్కారప్రియః సూర్యః

అని కద మన పెద్దలు, శాస్త్రాలు మనకు సనాతనంగా బోధిస్తూ వచ్చారు.......

అదివిని పాటిస్తూనే ఉన్నాం.....
కాని  ఎందుకని అలా అని అసలు ఎప్పుడైనా ఆలోచించారా...??

శ్రీచాగంటి సద్గురువులు ప్రవచనాంతర్గతంగా తత్సంబంధమైన చాల విషయాలు మనకు తెలిపినారు కద......

అందులో కొన్ని ముఖ్యమైనవి అందరికి తెలిసే ఉంటుంది.......

శివలింగం నిరంతరం అభిషేకించబడుతూ ఉంటే లోకంకూడా అట్లే చల్లగా ఉంటుంది అని.... ( పైన ధారాపాత్ర పెట్టేది అందుకే కదామరి....)

అసలు లయకారకుడికి ఎందుకని అలా అభిషేకం అంటే ఇష్టం....?

స్థితికారకుడికి ఎందుకని అలంకారం అంటే ఇష్టం....?

సూర్యుడికి ఎందుకని నమస్కారం అంటే ఇష్టం...?

అనే ప్రశ్నలు మన లౌకిక ప్రపంచంలోని.....

" నాకు గులాబ్ జామూన్ అంటే ఎందుకు ఇష్టం...? "

" నీకు కాజు బర్ఫి అంటే ఎందుకు ఇష్టం ....? "

మొదలైన ప్రశ్నలలాంటివైతే మనం పెద్దగా పట్టించుకోనవసరం లేదనుకోండి.......

కాని మన సనాతన శాస్త్ర వాజ్ఞ్మయం, అది ఆపోశనపట్టిన సద్గురువులు ఏది చెప్పినా దాని వెనక ఎంతో గహనమైన విజ్ఞ్యానం దాగుంటుందని ఎల్లరికి విదితమే....

ఎవరి స్వాధ్యాయం కొలది వారు అది తెలుసుకొని ఆచరించి తరిస్తుంటారు కొందరు......

ఇంకొందరు అవి పెద్దగా తెలియకపోయినా భక్తి శ్రద్ధలతో / ధార్మికులైన సద్వర్తనులైన పెద్దల ఎడల గౌరవవిశ్వాసాలతో వారు చెప్పినవి త్రికరణశుద్ధిగా నమ్మి ఆచరించి తరిస్తుంటారు.......

వృత్తి పరంగా ఒక సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా నా పరిధిలో ఉండే ప్రతి అంశాన్ని ఎంత సునిశితంగా పరిశీలించి పరిశోధించి అమలుచేస్తానో.....

ప్రవృత్తి పరంగా ఒక ఆధ్యాత్మిక పరిశోధకుడిగా ప్రతి అధ్యాత్మతత్వ ప్రతిపాదితమైన విషయాన్ని కూడా  అంతే నిశితంగా పరిశీలించి పరిశోధించి తదనుగుణంగా అన్వయం చేస్కుంటాను నేను.....

ఏదో తినాలి కాబట్టి తినెయ్యడం లేదుకద తిళ్ళు....
మనకు ఇష్టమైనవి మన శరీరతత్వానికి సరిపడేవి కఫవాతపిత్త దోషాలు కలిగించి ఆరోగ్యాన్ని హరించకుండా మంచిచేసేవి మాత్రమే ఏరికోరి మరి తింటాము......

అట్లే అధ్యాత్మ కృతువులను కూడా ఏదో చేసేయ్యాలి కాబట్టి చేసేయ్యడం కంటే వాటిని అమూలాగ్రం పరిశోధించి తద్ప్రతిపాదితమైన ఆ పరతత్వాన్ని గ్రహించే విధంగా వాటిని ఆచారించడoన్లోనే వాటియొక్క నిజమైన విలువ దాగుంటుందని నా వ్యక్తిగత అభిప్రాయం..........

సరే ఇక విషయానికి వస్తే.......

శివుడు / మహేశ్వరుడు / రుద్రుడు / శంభుడు / శర్వుడు / ఈశ్వరుడు / ఇట్లా చెప్కుంటూ పోతే ఆయనకు ఎన్నో పేర్లు.........

కాని లయకారుడు అనగానే ఆ అన్ని పేర్లలో ప్రతిపాదించబడే పరత్త్వం శివుడు అని ఇట్టే చెప్పేస్తాం కదా......

అంటే అన్ని తనలోకి కలిపేసుకుంటాడు కాబట్టి లాయకారకుడు అని అభిషేకించడమా.....?

లేదా అభిషేకించకపోతే అన్ని తనలోకి లాగేసుకుంటాడన...?

ఒకపక్క బ్రహ్మగారు చక్కగా స్థితి చేస్తుంటే, శ్రీమహావిష్ణువు స్థితికారుడై ఆ సృష్టిని సమ్రక్షిస్తుంటే ఈయన లయకారుడై వాటన్నిటిని తనలోకి లయించడం ఎందుకు.....? అట్లే ఉండనివచ్చుకదా.....

అనే ప్రశ్నలు రావడం పరిశోధాత్మక దృక్కోణం గలవారికి ఉదయించడం సహజమే......

మనం నిత్యం చూసేట్టుగా శివలింగాకృతిలోనే ఆ లయకారుడికి అభిషేకాలు చెయ్యడం.....

శివలింగం నిజానికి శక్తి సహితమైన త్రిమూర్త్యాత్మక పరబ్రహ్మ సూచకం..... 
లింగాకృతిలో ఉండే యావద్ విశ్వాన్ని మన ఎదురుగా ఉండే శివలింగంలో దర్శిస్తూ ఆ పరమాత్మకు ప్రణమిల్లడమే పూజా అనే కృతువులోని అంతరార్ధం.......

కంటికి కనిపించేవి మాత్రమే నమ్ముతాము అనే పాశ్చాత్య ప్రపంచ భౌతికశాస్త్రవేత్తలు కూడా  నాసా వారి వివిధ ఖగోళపరిశోధనల్లో భగాంగా ముక్తకంఠంతో అంగీకరించిన సత్యం, మన భూమండలం ఉన్న సౌరమండలం లానే కొన్ని కోటానుకోట్ల సౌరమండలాలు ఈ విశాలవిశ్వంలో ఎన్నో ఉన్నాయి అని...
" ఇన్ని లైటియర్స్ దూరంలో ఫలాన పేరుతో ఉన్న ఒక బృహత్ నక్షత్రం కేంద్రంగా ఒక సౌరమండలం ఉండి దాని యొక్క ప్రభావం మన భూమి ఉన్న సౌరమండలంపై ఏవిధంగా ఉంది అనే......అంశంపై ఎన్నో వెస్టర్న్ జర్నల్స్ వ్యసాలను ప్రచురిస్తే అబ్బా ఎంత బాగున్నాయి వీళ్ళ పరిశోధనలు అని అంటాము.......

కాని అదే సత్యాన్ని మన అధ్యాత్మ శాస్త్రాలు....

" ఉన్మేషనిమిషోత్పన్నవిపన్నభువనావళిః....

అనేకకోటిబ్రహ్మాండజననీ దివ్యవిగ్రహ...."

అనే బ్రహ్మాండపురాణాంతర్గతమైన, సాక్షాత్తు వాగ్దేవతలు వెలయించిన  లలితాసహస్రనామాలకు భాష్యంగా గొప్ప ఔపాసనిక బలం గల తత్త్వవేత్తలు చెబితే......

" హుమ్మ్ ఎంటో...వీళ్ళు వీళ్ళ చాదస్తం...."
 అని పెదవి విరిచే వారికి అవి ఎంత చెప్పినా అర్ధంకావు.....
ఎందుకంటే ఒకవైపు సనాతన ధర్మం / శాస్త్రం పై విశ్వాసలేమి మరోవైపు
కేవలం ఆధునిక భౌతిక శాస్త్రాలే తప్ప ఆధ్యాత్మికతపై 
కనీస అవగాహన కూడా లేని జీవితాలు కావడం వల్ల ఆ అమోఘమైన విజ్ఞ్యాన సారస్వతం వారికి ఎల్లప్పుడు అందని ద్రాక్షే....!

ఒక సద్గురువు యొక్క నిర్హేతుక కరుణను సముపార్జించుకుంటే ఆ వైశ్వికవిజ్ఞ్యానానికి కొంతలోకొంతైనా వారు దెగ్గరై వాటిని అర్ధంచేసుకునే  భాగ్యం కలుగుతుందేమో.....

సరే ఇక శివలింగమే విశ్వంగా భావించి సేవించి అభిషేకించే పేక్రియ గురించి వస్తే ఈ క్రింది విషయాల వల్ల అది ఈశ్వరుడికి ప్రీతిపాత్రమై మనకు సకల ఈప్సితసిద్ధితమై వర్ధిల్లడం అనేది ఆ అధ్యాత్మ సత్యం.....

1. అభిషేకం అనగా పైనుండి పదార్ధాన్ని ఈశ్వరుడిపై అనగా శివలింగంపై జాలువార్చడం.....

( శాస్త్రసమ్మతమైన 
శుద్ధజలం, బిల్వోదకం,పుష్పోదకం, 
శుద్ధమైనగోక్షీరం / ఆవుపాలు,

ఆ పాలు కాచి తోడుపెట్టగా వచ్చిన
గోదధి, ఆ పెరుగు నుండి తయారుచేయబడిన వెన్నను కరిగించగా వచ్చిన గోఘృతం,

చెరుకుగడలనుండి వచ్చిన బెల్లం తో తయారుచేయబడిన చక్కెర,

వివిధ పండ్లరసాలు ఇత్యాదిగా ప్రకృతి మనకు ప్రసాదించే సత్త్వగుణప్రధామైన పదార్ధాలు , 

తుదకు 

విభూతి / గంధ లేపనంతో ఆ క్రతువు పూర్తి అవ్వడం.......

అనేది సాధారణంగా మనము చేసే అభిషేకప్రక్రియ......

ఏఏ పదార్ధాల వల్ల ఏఏ ఫలితాలు లభిస్తాయి ఇత్యాదిగా కొందరు చెప్పే వాటిని కాసేపు పక్కనపెట్టి, ఈశ్వర ప్రీత్యర్ధమై
కావించిన పదార్ధ పరమాత్మ సమ్యోగమే అభిషేకం......

ఇక్కడ గమనిస్తే ఉపయోగించిన అన్ని పదార్థాలు కూడా జలతత్త్వభరితమైనవి......

1. గోధుమలు, నువ్వులు, ఇత్యాది అన్ని పదార్థాలు కూడా నువ్వే స్వామి అంటూ
"గోధూమాశ్చమే.....తిలాశ్చమే...."
అని ఒక వైపు శ్రీరుద్రనమకచమకం పఠిస్తున్నాసరే ఈశ్వరుడిపైన / శివలింగంపైన సమర్పించేది మాత్రం
జలతత్త్వసంవృద్ధిగల పదార్ధాలుమాత్రమే......
( చివరన ఉండే ఆ విభూతిలేపనం కూడా సజలవిభూదిలేపనమే కద...)

" తత్త్ త్వమసి " అనే వేదవాక్యంలా,

" తత్త్ జలాన్ " అంటూ ఈశ్వరుడిని వేదం నమస్కరిస్తుందని కద శ్రీచాగంటి సద్గురువులు మనకు విశదీకరించింది....

అంటే కేవలం జలం మాత్రమే ఈశ్వరుడు, యావద్ విశ్వవ్యాప్తమైన పంచభూతాల్లోని మిగతావి

అనగా,

ఆకాశం
వాయువు
అగ్ని
పృథ్వి

ఈశ్వరుడు కాదని ఇక్కడ అభిషేకంలోని పరమార్ధం అని చెప్తున్నావా నాయనా అని అనుకోకండి.....

పిండాండమైన మన ఎల్లరి శరీరాల్లో ఉన్నది అవే పంచభూతాలు.....

అనేకకోటి బ్రహ్మాండాల్లో ఉన్నది కూడా అచ్చం అవే 
పంచభూతాలు.......

కాని వాటిలో ఒక్క జలతత్త్వం మాత్రమే ఈశ్వరుడిని జీవుడిని ఏకీకృతంగావించి తన్మూలంగ జీవాత్మ పరమాత్మ సమ్యోగమనే యోగప్రక్రియను మనలోనే స్థిరీకరించి మన 
పాంచభౌతికమైన మృణ్మయం లోనే ఆ అవ్యక్తమైన చిన్మయాన్మి జాగృతపరిచి

"ఒహో ఇదన్నమాట ' పరమాత్మ ' అనే పేరుతో వ్యవహరించబడే ఆ నిర్గుణ నిరంజన నిర్వికార నిర్వికల్ప అవ్యక్త అగోచర అమేయ అద్వంద్వమైన 
బ్రహ్మానుభవ స్థితి అనగా....."

అనే ఎరుక,
(  ' ఆత్మానుభవం ' అనే నామంతో వ్యవహరించబడే దైవిక స్థితిని ) మనలో కలిగించి మనకు సకల శ్రేయస్సులను కలిగించడమే అభిషేకం అనే ప్రక్రియ లోని అంతరార్ధం.....

జలతత్త్వం కాకుండా, 

మీరు ఆకాశం తెచ్చి ఆయనమీద జాలువార్చగలరా...?

మీరు గాలిని తెచ్చి ఆయనమీద జాలువార్చగలరా...?

మీరు అగ్నిని తెచ్చి ఆయనమీద జాలువార్చగలరా...?

మీరు పృథ్విని తెచ్చి ఆయనమీద జాలువార్చగలరా...?

అలా మీరు తెచ్చి జాలువార్చగలిగినా తదంతర్గంతంగా మీకు అది ఎటువంటి జ్ఞ్యానసిద్ధి , అభివృద్ధి కలిగించలేదు.....

కేవలం జలతత్త్వభరిత పదార్ధాలకే ఆ శక్తి, సమర్ధత కలవు.....

మిగతా 4 పంచభూత తత్త్వ పదార్ధాలు పక్కనపెట్టగలరేమో కొద్దిసేపైనా, ఉదజని ప్రాణవాయువు 2:1 నిష్పత్తిలో ఉండే నీటిని విడిచి
అసలు ఏ ప్రాణి ఎక్కడా మనలేదు..... ISS  లొ ఉన్న వ్యోమగాములు సైతం అన్ని విడిచి ఉండగలరేమో కాని నీటిని తద్ అంతర్భాగమైన వాయుతత్వాన్ని

( ప్రాణాద్ వాయురజాయత......
 అని స్తుతించబడే పరమాత్మతత్త్వం ) 

విడిచి మనలేరు......

కాబట్టి కేవలం అటువంటి జలతత్వ పూర్వకంగా మాత్రమే పరబ్రహ్మతత్వాన్ని సంపూర్ణంగా మనకు లభ్యమయ్యేలా ఈశ్వరుడు ఈ సృష్టిని నిర్మించాడు కాబట్టి, అభిషేకం లో జలతత్త్వభరిత పదార్ధసమర్పణపూర్వకంగా మాత్రమే ఈశ్వరుడు మనవాడై,  నిర్మల భక్తి ప్రపత్తులతో మనవశమవుతాడు అనేది ఇక్కడి అధ్యాత్మ విషయవిశేషం......

ఇంకా సింపుల్ గా చెప్పాలంటే నీరే అన్ని శక్తులకు ఆధారం, ఆలవాలం కాబట్టి అని చెప్పొచ్చు....

పాత సినిమాలనుండి ఇప్పటి వరకు కూడా మీరు ఏ సినిమా చూసినా సరే పంచభూతాత్మకమైన ఈ ప్రకృతికి అతీతమైన ఆ పరమాత్మను 
" సాధించడం " కోసం తపస్సులు ఆచరించిన మహర్షులందరు వెంటబెట్టుకొని తిరిగేది కమండలాలను...... వారి తపోశక్తిని నిక్షిప్తంగావించేది అందులోని జలంలో.....

వారికి ఉన్న అత్యంత పదునైన, శక్తివంతమైన, తిరుగులేని, వజ్రాయుధం 
వారి అరచేతిలోకి ఒలికించబడిన ఆ కమండలజలం లోకి అభిమంత్రించబడిన వారి మహత్తర తపశ్శక్తి/ మంత్రబలం.....

కాబట్టే " తత్త్ జలాన్ " అని వేదం ఈశ్వరుడిని గ్రాహ్యరూపంగా ధృవపరిచింది.....😊

అటువంటి అన్ని జలరాశులకు అధిదేవత గంగమ్మ కనుక ఆవిడ పేరుతో ఈ వేదభూమి తరతరాలుగా 

" జిస్ దేశ్ మే గంగా బెహ్తీహై....."

అంటూ యావద్ ప్రపంచంచే నమస్కరించబడుతోంది.....🙏😊

ఇంటర్మీడీట్ నుండి అనగా గత 16 సంవత్సరాలుగా శివరాత్రిమహోత్సవంలో నా చేత అభిషేకం స్వీకరించి నన్ను అనుగ్రహిస్తూ చల్లగా కరుణిస్తున్న శ్రీబాలాత్రిపురసుందరీ సమేత శ్రీరామలింగేశ్వరస్వామి వారి ఆలయం యొక్క రాజగోపురం.....🙏😊..🙏😊

" నిన్న సాయంత్రమే పితకబడిన శుద్ధమైన దేశవాళి ఆవుపాలు ఎక్కడ దొరుకుతాయి....? " 

అని ఎంతో వెతుక్కుని జీవించవలసిన కలికాలం లోకి వచ్చిన మనజీవితాలు, ఫలాన చోట దొరుకుతాయంట అని ఎవ్వరైనా చెప్తే 
అక్కడికి వెతుక్కుంటూ వెళ్ళిన్నట్టుగా.....

" ఉదాత్త అనుదాత్త స్వరిత భరిత స్వరశుద్ధితో గావించే మంత్రపఠనంతో మూర్తిలోకి ఈశ్వరుడి సంపూర్ణ షోడషకళలను ఆవహింపజేసి వైదికస్వరశుద్ధితో ఈశ్వరుడు అంత ఘనంగా ప్రసన్నమయ్యే విధంగా అర్చనలు జరిగే ఆలయాలు ఎక్కడున్నాయి...? "

అని వెతుక్కేనంతగా మారిన ఈ కలికాలపు జీవితాల్లో, అంతటి స్వరశుద్ధి కలిగిన ఒక సత్బ్రాహ్మణోత్తముని దర్శనంకోసమే నేను ఆ శివరాత్రి అభిషేకానికి వెళ్తుంటాను అని అనడం కొంచెం విడ్డూరంగా ఉంటుందేమో కాని ఆ పవిత్ర మనసు గల స్వరమే నన్ను ఇన్ని సంవత్సరాలుగా శివరాత్రికి ఈ గుడికి లాగి నాకు నిజమైన శివజాగరణ ప్రసాదించింది.....

వృత్తిరీత్యా ఏదో నాగార్జునా కెమికల్స్ / ఫెర్టిలైసర్స్ లో ఒక ఉన్నతాధికారి అయిన వారి స్వరశుద్ధికి గల పవిత్రత, మహిమ్నత అటువంటిదనే నా విశ్వాసమే నాకు శివరాత్రి యొక్క లింగోద్భవకాల శివదర్శనం....😊

శివరాత్రి తర్వాత వచ్చే శ్రీ వికారి ఫాల్గుణ శుద్ధ తదియ యొక్క శివస్వరూపమైన చంద్రరేఖ..... 🌙

https://youtu.be/bZOBlBvKDvg.... 🌙

Monday, February 17, 2020

" శ్రీరామజయం.....! " :)

" శ్రీరామజయం.....! "
అని మన పెద్దలు ఉత్తరాలు వ్రాసేముందు మొదటగా వ్రాయడం.....
మరియు ఇతరత్ర వ్రాతప్రతుల యందుకూడా ఉండడం చాలామందికి గుర్తుండే ఉంటుంది........
25 పైసలకు ఒక పోస్ట్ కార్డ్ లభించే మా స్కూల్ రోజుల్లో
మా తాత, పితామహులు కీ.శే శ్రీ అయిత హనుమయ్య గారు ప్రతినెల కొడుకులకు యోగక్షేమాలు విచారిస్తు ఉత్తరాలు వ్రాసే ఆ రోజుల్లో మా తాత కూడా
" శ్రీరామజయం " అని మొదలుపెట్టి మిగతా అన్ని సంగతులు వివరంగా వ్రాసే ఆ శైలినే నేను కూడా అవలంబించి కొందరు ఫ్రెండ్స్ కు / చుట్టాలకు అదేవిధంగా వ్రాసేవాడిని......😊
************************
శ్రీరామజయం
కొడుకు శ్రీవేంకటేశ్వరులకు దీవేనలతో నీ నాన్న వ్రాయునది.....
ఇక్కడ అంతా క్షేమము.....మీరు కూడా క్షేమమేని భావిస్తున్నాను.... ఈ నెల నీ 200 రూపాయల మని యార్డర్ కొంచెం ఆలస్యంగా చేరినది.....
మీ అమ్మ నాగమ్మకు కొన్ని మందులు ఎక్కువ కొనడం వల్ల ఈ నెల ఖర్చులు కొంచెం ఎక్కువైనవి......కాబట్టి వచ్చేనెల అందరు కూడా ఇంకో 50 రూపాయలు ఎక్కువ పంపించగలరు.....
ప్రత్యేకమైన ఆయుర్వేదవనమూలికలతో గుమ్మడిహల్వా తయారు చేసి రోజు మీ అమ్మ నేను తీసుకుంటున్నాము....కావలసినవారు వచ్చి తీస్కెళ్ళవచ్చు......
.
.
.
.
************************
అంటూ అలా అన్ని సంగతులు కూడా విపులంగా రాసే మా తాత శైలిలోనే నేను కూడా కొత్తగుడెంలో ఉండే మా అమ్మమ్మ వాళ్ళింటికి, చుట్టు ఉండే ఇతర ఫ్రెండ్స్ కి ఉత్తరాలు రాసే వాడిని.....😊
ఇంటర్ 1స్ట్ ఇయర్ వరకు కూడా మాది ఒక చిన్న రెండు రేకుల రూముల బీద బస్తీలోని ఇల్లు..... మా ఇంట్లో మరియు ఇతర చుట్టుపక్కల అన్నిరకాల తీగలు / కూరగాయలమొక్కలు చూసాను కాని గుమ్మడితీగను మాత్రం ఎక్కువగా ఎక్కడా చూడలేదు......
అది తినడానికి కూరగాయల్లో కూడా ఎప్పుడు మాఇంట్లో వాడలేదు కాబట్టి గుమ్మడి కేవలం ఇంటిముందు వేలాడదీయడానికి తప్ప మరెందుకు ఉపయోగించబడనిది అని అనుకున్న నాకు, జమ్మికుంటలోని మా నానమ్మ ఇంటికి వెళ్ళినప్పుడల్లా అక్కడ తాత తయారుచేసే ఆ బూడిదగుమ్మడిహల్వా నాకు ఎప్పుడు ఒక వింతగానే అనిపించేది.....
తాత నానమ్మల ఇంటివెనకాలే ఉండే పెద్ద పెద్దనాన, ఆనందం పెద్దనాన్న వాళ్ళింటికి వెళ్ళి అక్కడ ఉండే భాగ్యక్కని కూడా అడిగే వాడిని.....
"అక్క.....తాత ఏదో గుమ్మడికాయి హల్వ చేసి పైన ఉట్టిలో అందకుండా దాచిపెట్టాడు....నీకు అది తయారు చేయడం ఎమైనా వచ్చా....?" అని....
పొదుపుపథకాల భాగంలో
వస్త్రాలు నేసేందుకు వాడే దారం తయారి మిషన్లు గవర్నమెంట్ అందరికి ఇవ్వగా... ఇంటిపనులు పూర్తి అవ్వగానే అందరు వాటిని తిప్పుతూ బిజీగా ఉండేవారు.......
భాగ్యక్క కూడా....
" ఏమోరా విన్నిగా......మాకు ఈ దారం మిషన్లతోనే టయిం మొత్తం సరిపోతది..... ఆ కొత్తరకం హల్వాలు నేను ఎప్పుడు చేయలేదుర....
పెద్దనాన్న తెచ్చిన బన్నులు, బిస్కెట్లు అక్కడున్నాయి.....కావాలంటే అవి తిను కాని తాత కనిపెట్టే ఆ కొత్తరకం హల్వాలు తయార్ చేయమని అనకురా....." అంటూ నవ్వేది.....😁
తాత బయటికి వెళ్ళినప్పుడు అక్కడుండే బల్లఒకటి వేసి దానిపైన పీటలు వేసి పైకెక్కి ఉట్టిలో మా తాత దాచిపెట్టిన ఆ గుమ్మడిహల్వాను రెండు గుప్పిట్ల వరకు లాగించి ఏమి తెలియనట్టు మూత పెట్టేసి......
తాత వచ్చాక......
" నానమ్మ చెప్పింది..... ఆ పైన ఉట్టిలో ఏదో తినే హల్వా తయారు చేసి దాచావని......కొంచెం పెట్టరాదు తాత......" అని అడిగేవాడిని.....😂
"ఒహ్ చెప్పేసిందా మీ నానమ్మ.....
హుమ్మ్.....ఐతే ఇగొ తీస్కొ..... "
అని కేవలం ఒక స్పూన్ మాత్రమే హల్వా పెట్టగా అది తిని బాగ నవ్వుకునేవాడిని......
మా తాత 70 పైచిలుకు వసంతాలవరకు గుండ్రాయిలా దృఢంగాఉండడానికి అందులోని పొషకవిలువలు ఎంతటి ఘనమైనవో అప్పుడుతెలియదు.....
తెలిస్తే నెలకొక జాడి హల్వా తెప్పించుకొని తినుండేవాడిని......😁
సరే ఇంతకి ఇక్కడ నేను చెప్పదలచుకుంది ఏంటంటే అలా మన పెద్దలు " శ్రీరామజయం " అని ముఖ్యమైన పనులన్నీ మొదలుపెట్టడంలో కేవలం దైవనామస్మరణ మాత్రమే ఉన్నదా లేక.....అందులో విశేషమైన అధ్యాత్మతత్వచింతన ఇమిడిఉన్నదా అని వివేచనగావించిన ఎవ్వరికైనా ఈ క్రింది తత్త్వసమన్వయం సమకూరడం సహజమే.....
శ్రీచాగంటి సద్గురువుల శ్రీమద్రామాయణ
( సంపూర్ణరామాయణం ) ప్రవచనాలు శ్రద్ధాసక్తులతో ఆలకించినవారికి గుర్తున్నట్టుగా, నవవిధ భక్తిమార్గాల్లో దాస్య భక్తికి ప్రతీకగా ఉదహరించబడే హనుమంతుల వారికి సాటిరాగల శక్తి మరోకటి ఉండడం అసంభవం..... ఈ విశ్వంలోని ఏ శక్తినైనా సరే తనలోకి లయించి వేసే అపర రుద్రాంశసంభూతుడు హనుమంతులవారు......
" ఓం కబలీకృతమార్తాండమండలాయ నమః...." అని కదా మనం హనుమను అర్చించేది......
సూర్యుడిని మధురఫలంగా భావించి ఆరగించే క్రమంలో నింగికెగసిన బాలాంజనేయస్వామిని ఇంద్రుడు తన వజ్రాయుధప్రహారం తో హనువును
( దక్షిణ దవడను ) గాయపరచగా
" హనుమ " అనే పేరుతో పాటుగా
అసలు ఆంజనేయుడిని కట్టడి చేయగల శస్త్రాస్తములు ఈ విశ్వంలోనే ఉండజాలవని సకలదేవతలు వాయుదేవునకు ఆనతివ్వగా.....ఆనాడే హనుమంతులవారు అప్రతిహత శక్తిపుంజంగా వినుతికెక్కారు.....
ఆ శక్తియుక్తులను శ్రీరామ భక్తికై,
సీతారాములను ఒక్కటిచేయుటకై తన జీవితాన్నే అర్పించుకున్నందుకు చిరంజీవివై వర్ధిల్లమని శ్రీరాముడు ఆనాడు అయోధ్యలో వరమివ్వగా ఇక ఆనాడే సప్తచిరంజీవులలో కెల్ల అత్యంత శక్తిమంతుడై, శాశ్వతమైన శక్తియుక్తులకు భక్తిప్రపత్తులకు నెలవై హనుమంతులవారు కోరి కొలిచినవారికి కొంగుబంగారమై వర్ధిల్లుతున్నారు.......
హనుమ యొక్క అప్రతిహత శక్తియుక్తులు
శ్రీమద్రామాయణంలో ఎన్నో చోట్ల మనకు విశదీకరింపబడింది.....
శ్రీచాగంటి సద్గురువులు ఎంతో గంభీరంగా వివరించిన
" అక్షకుమారవధ " వృత్తాంతాం విన్న ఎవ్వారైనాసరే
" వామ్మో......హనుమంతులవారి అరివీరభయంకర పరాక్రమం ఇలా ఉంటుందా......అని ఆశ్చర్యపోవలసిందే........
ఎప్పుడైనా నుమాయిష్ కి వెళ్ళినవారు, అక్కడుండే పేద్ద మెర్రిగోరౌండ్ ఎక్కినప్పుడు అది గిరా గిరా తిరిగే వేగానికి ఒళ్ళు ఏవిధంగా జలధరించి, కిందకి దిగినతర్వాత కూడా ఓ 5 నిమిషాలవరకు మన చుట్టూ ఉన్న లోకం మొత్తం ఇంకా అలా స్పీడ్గా తిరుగుతూనే ఉన్నట్టుగా అనిపిస్తుందో......
అచ్చం అదేవిధంగా పొగరుతో మిడిసిపడుతు హనుమను నిందించిన ఆ రావణకుమారుడిని........
పాదములురెండు గట్టిగా ఒడిసిపట్టి గాల్లోకి అంతెత్తున అమాంతం ఎగిరి అక్షకుమారుడిని ఈడ్చి కొన్ని వేల ఋఫంస్ వేగంతో గిరగిరగిర తిరగడంతో మొదట వాడి తల ఎగిరిపోవడం, ఆ తర్వాత వాడి బాహువులు రెండు ఎగిరిపోవడం , ఆ తర్వాత వాడి నాభి ఉపరితలం మొత్తం ఎగిరిపోవడం, ఆ తర్వాత వాడి తొడలు ఎగిరిపోవడం, ఆ తర్వాత వాడి పిక్కలు ఊడిపోయి చివరికి మిగిలిన 2 పాదములను అలా అవతల పడేసిన తర్వాత హనుమంతులవారు కిందికి దిగిరావడం.....!!
అంతటి భయానకమైన అక్షకుమారవధ గురించి తెలిసిన రావాణాసురుడికి జీవితంలో అసలు భయమంటే ఎంటో పరిచయం చేసిన హముమంతుల వారి అంతటి శక్తిపరాక్రమాలకు అసలు ఏంటి కారణం అని అధ్యాత్మవేత్తలు ఎవరైనా హనుమంతులవారిని ధ్యానం
గావించి ప్రార్ధిస్తే తెలిసేఉంటుంది ఆ తత్వరహస్యం....
అంతటి మహోన్నతమైన శౌర్యానికి ఆలావాలమై ఎదిరించి నిలిచి గెలిచే వారే లేని హనుమంతులవారు నిరంతరం
హ్రీంబీజగర్భితమైన దుర్భేద్య మంత్రశక్తివలయాన్ని తమ చుట్టు ఏర్పరచి
"శ్రీరామ జయరామ జయజయరామ....."
అనే శ్లోకమంత్రాన్ని నిరంతరం జపిస్తూ ఉండడం వల్లే.....!
చతుర్దశభువనాలను తన క్రీగంటిచూపులతో సమ్రక్శించే ఆదిపరాశక్తియొక్క శ్రీభువనేశ్వరిస్వరూప బీజాక్షరం - హ్రీం.....
శ్రీ - శ కార, ర కార, ఈ కార, శక్తిసంఘాతమైన శాక్తేయప్రణవం శ్రీకారం.....
రా - అగ్ని బీజం
మ - అమృతబీజం ( శ్రీమహవిష్ణువుయొక్క శక్తికి ప్రతిరూపం )
3 సార్లు జయ వాచకం - సర్వకాలసర్వావస్థల్లోనూ సత్యంగా సకల జయములకు సూచకం.....
పై శ్లోకంలో జాగ్రతగా గమనించగలిగితే, పంచభూత తత్వాలు / వాటిని సృజించే పరమాత్మ తత్త్వంకూడా నిఘూడంగా అందులో గర్భితమై ఉన్నది.....
అందుకే అది సకల శక్తులకు ఆలవాలమైన హనుమ సాగించే స్మరణమయ్యింది.....!!!
ఆకాశ తత్త్వం, వాయు తత్త్వం / పరమాత్మ తత్త్వం - శ్రీ కారం లో
అగ్ని తత్త్వం - రా బీజాక్షరంలో
జల తత్త్వం - మ బీజాక్షరంలో
పృథ్వి తత్త్వం - జయ వాచకం లో
అందుకే అసలు హనుమంతులవారి ముందు నిలిచి గెలిచే శక్తి ఈ 14 భువనాల్లోనూ ఎక్కడా ఉండజాలదు.....!
"అంజనానందనంవీరంజానకీశోకనాశనం
కపీశమక్షహంతారంవందేలంకాభయంకరం...."
అని అందుకే హనుమంతులవారిని శ్రీమద్రామాయణం నమస్కరించింది......! 🙏
హనుమంతులవారు సకలశక్తులుసమ్మేళనం గావించబడిన భక్తభాగవతోత్తమభగవంతుడని అందుకే అన్నమాచార్యులవారు ఎంతో రమ్యంగా తమ ఈ క్రింది సంకీర్తనలో కృతిపరిచారు......
************************ ************************
108.okkaDE EkAMga viiruDurviki - ఒక్కడే ఏకాంగ వీరుడుర్వికి
Audio link :G.BalaKrishnaPrasad
Archive link :
ఒక్కడే ఏకాంగ వీరుడుర్వికి దైవమౌనా
యెక్కడా హనుమంతుని కెదురా లోకము
ముందట నేలెడి పట్టమునకు బ్రహ్మయినాడు
అందరు దైత్యులచంపి హరిపేరైనాడు
అంది రుద్రవీర్యము తానై హరుడైనాడు
యెందునా హనుమంతుని కెదురా లోకము
చుక్కలు మోవ పెరిగి సూర్యుడు తానైనాడు
చిక్కు పాతాళము దూరి శేషుడైనాడు
గక్కన వాయుజుడై జగత్ప్రాణుడైనాడు
ఎక్కువ హనుమంతుని కెదురా లోకము
జలధి పుటమెగసి చంద్రుడు తానైనాడు
మలసి మేరుపుపొంత సింహమైనాడు
బలిమి శ్రీవేంకటేశు బంటై మంగాంబుధి
ఇల ఈ హనుమంతుని కెదురా లోకము
************************
************************

Many Happy Returns of the Day to Shree KCR, hon'ble Chief Minister..... :)

శ్రీకల్వకుంట్లచంద్రశేఖర్రావ్ గారు,
గౌ|| మాననీయ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు, మరెన్నో వసంతాలు జన్మదినవేడుకలు ఆయురారోగ్యైశ్వర్యాలతో జరుపుకుంటూ రాష్ట్రం అన్ని రంగాల్లోనూ ప్రగతిపథంవైపు పురోగమించి, ఈ దేశంలో సర్వోతోముఖాభివృద్ధితో వర్ధిల్లే రాష్ట్రాల్లోకెల్లా తెలంగాణ ఒక తలమాణిక రాష్ట్రంగా వెలిగేలా పరిపాలనను వ్యవస్థీకరించి, ఈ క్రిందపేర్కొనబడిన వాటిపై మరింత శ్రద్ధతో కట్టుదిట్టమైన చర్యలను తీసుకొని పౌరులందరికి అలనాటి శ్రీరామరాజ్యం లో ఉన్నవిధంగా రాజనీతిభరిత సుపరిపాలనను అందించి తరతరాలకు తరగని పేరుప్రఖ్యాతలతో చిరయశోభరితులై వర్ధిల్లాలని కోరుకుంటూ ఒక పౌరుడి హార్దిక జన్మదినశుభాభినందనాపూర్వక నమస్సులు....🙏👍👏🍨🍧🍕🍦😊
1. అన్ని రంగాలలోను వీలైనంతవరకు దళారివ్యవస్థను తగ్గించేదిశగా తగుచర్యలకు శ్రీకారం గావించి,
మరీముఖ్యంగా చిన్న/సన్నకారు/కౌలు రైతులకు, ఆర్థికంగా బడుగుబలహీనవర్గాలకొరకై ఉద్దేశ్యించబడిన పథకాల సొమ్ము ఆయా లబ్ధిదారులకు నేరుగా లభించేలా టెక్నాలజి ని విస్త్రుతంగా ఉపయోగించి అవినీతిని వీలైనంత ఎక్కువగా అరికట్టడం.....
( ఆధార్ అండ్ బయోమెట్రిక్ బేస్డ్ ఆటోమేటెడ్ ఎండ్ యూజర్ ఓరియెంటెడ్ గవర్న్మెంట్ స్కీం మ్యానేజ్మెంట్ సిస్టెంస్ )
2. పట్నంతోపాటుగా ప్రతిఊరికి మెరుగైన రవాణ మరియు త్రాగునీటి వ్యవస్థ....
( కరెంట్ కష్టాలు తీర్చినట్టే వీటిపై కూడా ప్రత్యేక శ్రద్ధచూపినచో ప్రజలందరికి బహులాభదాయకముగా ఉండును....)
3. విద్యావ్యవస్థ ఒక పెద్దవ్యాపారంగా మారడాన్ని అరికట్టేందుకు, రాష్ట్రం మొత్తం సరళీకృత విద్యావిధానాన్ని అవలంబించడం.......
మరీ ముఖ్యంగా వివిధ తప్పనిసరి ఫీజులపేరుతో హద్దెరగని రీతిలో దోచుకుంటున్న ప్రభుత్వేతర పాఠశాలలు / జూనియర్ కళాశాలలు
అన్నీకూడా ఒక నియమిత ప్రభుత్వనియంత్రిత వ్యవస్థకు లోబడి ఒక సమంజసమైన హద్దుదాటకుండా ఫీజులు తీసుకునేలా కఠినచర్యలను తీసుకొని విద్యార్ధుల భవితకు అండగా ఉండేలా విద్యావ్యవస్థను తీర్చిదిద్దడం......
4. రెవెన్యూ విభగాంతో సహా వివిధ ప్రభుత్వ విభాగా సేవలన్నీకూడా టెక్నాలజి ఆధారిత / అనుసంధానిత ఆన్లయిన్ ఏకీకృతవ్యవస్థగా తీర్చిదిద్ది, అటు ప్రజలకు త్వరితగతిన సేవలు అందేలా, ఇటు ప్రభుత్వానికి " ఇంప్లిమెంటేషన్ ఒవర్ హెడ్ " తగ్గేలా తగు మార్పులను స్వాగతించడం.......
5. సనాతన / హైందవ ధర్మాన్ని పరిరక్షించే విధంగా ఆలయాల మనుగడకు / అభివృద్ధికి తగు రీతిలో ప్రత్యేక బడ్జెట్ ని కేటాయించి ఇతర ధర్మాల్లోని ప్రార్ధనా మందిరాలకు ఇవ్వబడినట్టుగా ఆలయాలకు కూడా కొంతైనా సరే స్వయంప్రతిపత్తి ఉండేలాచూసి ఆలయాల ద్వారా ఆర్జింపబడిన ధనం కేవలం ఆలయాలకోసమే వెచ్చింపబడేలా, ఆ నిధులను ఇతర వ్యవస్థలకు మళ్ళించకుండా ఉండేలా కట్టుదిట్టమైన చర్యలను తీసుకొని సనాతన ధర్మదేవతకు తగు రీతిలో సేవను ఒనరించడం......
ఇవ్విధముగా మీహయాంలో రాష్ట్ర పరిపాలన మరింత శోభాయామానంగా దినదినాభివృద్ధి చెందాలని ఆకాంక్షిస్తూ, once again a very happy birthday to one of the most dynamic chief ministers of the Indian Polity who made a genuine difference to the lives of many by ensuring that government is indeed better recognized as a service rendering entity rather than being a mere authority establishing entity for it's citizens....😊
Harish Rao Thanneeru
7 hrs
తెలంగాణ మీ స్వప్నం
ఈ రాష్ట్రం మీ త్యాగఫలం
ఈ అభివృద్ధి మీ ధక్షతకు నిదర్శణం
ఈ నేలకు మీరే శ్రీరామ రక్ష
తెలంగాణ జాతిపిత శ్రీ కేసిఆర్ గారు శతవసంతాలు చూడాలని మనసారా కోరుకుంటూ.. జన్మదిన శుభాకాంక్షలు

Friday, February 7, 2020

శ్రీహరి " అల వైకుంఠపురములో...."అసలు ఏం చేస్తూ ఉంటాడు.......??

శ్రీహరి " అల వైకుంఠపురములో...."
అసలు ఏం చేస్తూ ఉంటాడు.......??

శ్రీమహాలక్ష్మీ అమ్మవారు పాదసంవాహనం చేస్తుండగా, తన సహస్రఫణిమండలం తో స్వామి వారికి ఛత్రమై, చామరమై, పానుపై, పదపీఠమై, సేవించే ఆదిశేషుడి తో పాటుగా గరుడాళ్వార్ళు, విశ్వక్సేనులవారు ఇత్యాదిగా ఉండే నిత్యసూరులతో అలరారే ఆ అప్రాకృత దివ్యదేవపురమైన శ్రీవైకుంఠనగరిలో ఉండే స్వామివారి వైభవాన్ని సహజకవి శ్రీపోతనామాత్యులవారు తెనిగించిన శ్రీమద్భాగవతంలో సర్వస్యశరణాగతి గావించిన గజేంద్రుణ్ణి సమ్రక్షించుటకై తరలి వచ్చిన వైనాన్ని వివరిస్తూ రచింపబడిన ఈ క్రింది పద్యంలో చెప్పబడిందికద....

( శ్రీచాగంటి సద్గురువులు శ్రీమద్భాగవత ప్రవచనంలో చెప్పినట్టుగా అది సాక్షాత్ శ్రీరామచంద్రుడు ఘంటాన్ని చేబూని రచించిన పద్యం అని......
పోతనమాత్యుల పుత్రిక కు ఆ శ్రీరామచంద్రులవారు పోతన గారి
రూపంలో వచ్చి దర్శనం ఇచ్చిన సంఘటన అందరికి గుర్తే ఉండి ఉంటుంది.....

"శ్రీవ్యాస మహర్షి ప్రణీతమైన సంస్కృతమూలంలో గజేంద్రుడి మొరనాలకించి స్వామి వారు వచ్చి మకరిని సమ్హరించి కరిని కాపాడినట్టు మాత్రమే ఉన్న ఆ ఘట్టాన్ని ఏవిధంగా తెనిగించాలి అనే ఆలోచనలో ఉండగా ఏమి అర్ధంకాక అలా వెళ్ళి సంధ్యవార్చి వస్తానమ్మ అని వారి పుత్రికకు చెప్పి బయటికి వెళ్ళగా.....
అప్పుడు శ్రీరామచంద్రులవారే పోతనగారిలా కామరూపంధరించి వచ్చి, తను శ్రీవైకుంఠపురం నుండి గజేంద్రుడి ఆర్తికి పరుగుపరుగున కదలి వచ్చిన వైనాన్ని ఈ పద్యంలో రచించి వెళ్ళారు..... " అని తరతరాలుగా మన పెద్దలు చెప్పే అధ్యాత్మ సత్యాన్ని అవధరించిన వారెల్లరికి ఆ శ్రీహరి యొక్క భక్తవాత్సల్యం ఎంతటి ఘనమైనదో
తెలిసే ఉంటుంది.........

******** ******** ********
8-95-మ.

అల వైకుంఠపురంబులో నగరిలో నా మూల సౌధంబు దా
పల మందారవనాంతరామృత సరః ప్రాంతేందు కాంతోపలో
త్పల పర్యంక రమావినోది యగు నాపన్నప్రసన్నుండు వి
హ్వల నాగేంద్రము "పాహిపాహి" యనఁ గుయ్యాలించి సంరంభియై.

భావము:

ఆపదలలో చిక్కుకున్న వారిని కాపాడే ఆ భగవంతుడు ఆ సమయంలో వైకుంఠంలో ఉన్నాడు. అక్కడ అంతఃపురంలో ఒక పక్కన ఉండే మేడకు సమీపంలో ఒక అమృత సరస్సుంది. దానికి దగ్గరలో చంద్రకాంతశిలల అరుగుమీద కలువపూల పాన్పుపై లక్ష్మీదేవితో వినోదిస్తున్నాడు. అప్పుడు భయంతో స్వాధీనం తప్పిన గజేంద్రుడు కాపాడమని పెట్టే మొర విన్నాడు. గజరాజుని కాపాడడానికి వేగిరపడ్డాడు.

******** ******** ********

అసలు అలా శేషపర్యంక శయనుడై ఆదిశేషుణ్ణి పానుపుగా చేసుకొని  పవ్వళించిఉండడం కేవలం ఏదో చల్లగా ఉన్న తెల్లని పరుపు పై పడుకోవడం మాత్రమేనా...??

లేదా అందులో మహోన్నతమైన అధ్యాత్మ తత్వసందేశం ఇమిడిఉన్నదా ?? అనే తత్వ చింతన గావించే వారికి బోధపడినట్టుగా.....

బ్రహ్మ విష్ణు మహేశ్వరులైన త్రిమూర్తులకు వారి వారి కర్తవ్యాలైన సృష్టి స్థితి లయ
అనే జగద్పరిపాలనా వ్యవస్థని విభాగించి అప్పగించిన ఆ ఆదిపరాశక్తి తననుండి వారికి కావలసిన శక్తి స్వారూపాలను సృజించి, అనగా

బ్రహ్మకు బ్రాహ్మి / శ్రీసరస్వతీ గా...

విష్ణువుకు శ్రీలక్ష్మి గా.....

మహేశ్వరునకు శ్రీపార్వతి గా....

ఇవ్విధంగా శక్త్యాంశలను సమకూర్చి తుదిమొదలు లేని ఈ కాలచక్రంలో నిరంతరం కొనసాగే విశ్వపరిపాలనను
వ్యవస్థీకరించడం అందరికి తెలిసే ఉంటుంది......

అందునా వీరిలో ఒకే శక్తికి ఇరు కేంద్రాలుగా ఉండే అన్నచెళ్ళెల్ల వ్యవస్థను  శ్రీ చాగంటి సద్గురువులు తమ ప్రవచనంలో విశదీకరించడం కొందరికైనా గుర్తుండే ఉంటుంది.....

నల్లని విష్ణువు , పార్వతీ అన్నచెళ్ళెల్లు....
తెల్లని శివుడు, సరస్వతీ అన్నచెళ్ళెల్లు....
ఎర్రని బ్రహ్మ, లక్ష్మీ అన్నచెళ్ళెల్లు.....

అదేంటి బ్రహ్మ గారు శ్రీమహావిష్ణువు యొక్క నాభికమలమునుండి ఉద్భవించినందుకు ఆయన్ని శ్రీమహావిష్ణువు యొక్క కొడుకుగా, సరస్వతీ మాతను కోడలుగా చెప్తుంటారుకదా.....

మరి పైన చెప్పిన చుట్టరికంప్రకారంగా బావాబామ్మర్దులు తండ్రీకొడులు అవ్వడం ఏంటి....?

అత్తాకోడళ్ళు వదినామరదలు అవ్వడం ఏంటి...?

ఇదంతా బాగ కంఫ్యూసింగ్ గా ఉంది అని
అనుకుంటారేమో.......

ఇదంతా బాగ కంఫ్యూసింగ్ గా ఉంది అని

అనుకుంటారేమో......

లౌకిక ప్రపంచంలో ఉన్నట్టుగా మన లౌకిక సంపదలను మాత్రమే పరిగణనలోకి తీసుకొని గౌరవించే బంధుత్వాలలా దేవతలవి కూడా అట్లే అనుకుంటే అలా కన్ ఫ్యూస్ అవ్వడం సహజమే......

నేను ఇదివరకే ఒక పోస్ట్లో దేవతలు అనగా వివిధ ప్రత్యేకతలు కలిగిన శక్తివలయాలు అని వారి గురించి వివరించాను......

అట్లే ఈ బంధుత్వాలు కూడా......

స్థితికారుడైన శ్రీమహావిష్ణువుకు
పార్వతీ అమ్మవారు చెల్లెలు అనగా.....
దాని అర్ధం ఆవిడ కూడా స్థితికారిణి అని.......

" స్థితికారకులు " అనే అధికారకేంద్రానికి ఉండే రెండు పరిపాలనా / నియంత్రణా / శక్తికేంద్రాలు......ఈ అన్నచెళ్ళెల్లు....

( ఇంకా సింపుల్ గా చెప్పలంటే మన లౌకిక ప్రపంచంలో
ప్రెసిడెంట్ / వైస్ ప్రెసిడెంట్
సీ.ఎం / డిప్యూటి సీ.ఎం

అని ఏవిధంగా ఐతే మనము ఒకేఅధికార కేంద్రాన్ని ఇద్దరు వ్యక్తులవద్ద ఉండేలా విభాగించామో....

అచ్చం అదేవిధంగా ఈ విశ్వాన్ని పరిపాలించే స్థితికారకశక్తి
పుం రూపంలో ఆరాధించబడినప్పుడు శ్రీమహావిష్ణువు / శ్రీమన్నారాయణుడిగా, స్త్రీమూర్తి రూపంలో ఆరాధించబడినప్పుడు పార్వతీ / నారాయణి గా ఉంటుంది....

అదే విధంగా సృష్టికారకులు, లయకారకులు గా ఉండే శక్తిస్వరూపాలుకూడా......

బ్రహ్మగారు / శ్రీమహాలక్ష్మీ గా,
సృష్టి ని సాగించడం....

శివుడు / సరస్వతిగా లయనుగావించడం.....

" అదేంటి బ్రహ్మగారు మాత్రమే సృష్టి ని రచించేది అని విన్నాము....
అందులో శ్రీమహాలక్ష్మీ అమ్మవారి పాత్ర కూడ ఉందని ఎక్కడ వినలేదే......" అని అంటారేమో....

శ్రీచాగంటి సద్గురువులు ప్రవచనంలో ఒకచోట చెప్పారు ఆ విషయాన్ని.....

పుర్రెలపై నుదుటి రాత రాసేటప్పుడు
బ్రహ్మగారు అడుగుతారు శ్రీమహాలక్ష్మీ అమ్మవారిని .....
"ఈ జీవుడికి లక్ష్మీ కటాక్షం ఎంత రాయాలి....? " అని

అప్పుడు అమ్మవారు......

" ఓహ్.....ఆ జీవుడా..... ఎందరో భక్తభాగవతులకు, సాధుసత్పురుషులకు దానధర్మాలు చేస్తు బ్రతికిన జీవితం.....
ఈ జన్మలో నా కటాక్షం అంతకు వంద రెట్లు వేసి......
అపరకుబేరుడై వర్ధిల్లే లా రచించు వాడి లలాటలిఖితాన్ని....."

అని ప్రసన్నంగా జవాబివ్వడం....

లేదా.....

" ఓహ్.....ఆ జీవుడా.......వాడికున్న ఐశ్వర్యంలో వీసమెత్తైనను పాత్రతనెరిగి దానధర్మాలు చేయకుండా, భక్తభాగవతులను ఆదరించకుండా, తిని ఊరిమీదపడితిరగడం కోసం మాత్రమే వాడి ఐశ్వర్యం ఉపయోగించుకున్నాడు......
కాబట్టి లవలేశమైనను శ్రీకటాక్షం దరిచేరని దౌర్భాగ్యజీవితమే వారికి తగును...."

అని తన భ్రుకుటి ముడిపడేలా చూస్తుందంట......

అవ్విధంగా శ్రీమహాలక్ష్మీ అమ్మవారు సదరు జీవుడి ఐహిక స్థితిగతులను రచించినట్టే కదా మరి......

అందుకే ఈ లోకంలో ఒక సామెత.....
" పెట్టిపుట్టాడండి....అందుకే అంతటి సిరిగలవారింట్లో సంపన్నమైన జీవితం వారిది......."

అచ్చం అదేవిధంగా లయకారకులైన శివుడు , సరస్వతీ అమ్మవారు.....

" అదేంటి రుద్రుడిగా శివుణ్ణి లయకారకుడిగా విన్నాం కాని......
సదరు జీవుడి యొక్క సరస్వతీ కటాక్షాన్ని శాసించే ఆ విరించి యొక్క సతీమణి లయకారిని గా ఉండడం ఎక్కడా వినలేదే......." ?

అని అంటారేమో.....

జ్ఞ్యాన దాయకులైన శివుడు, సరస్వతీ అమ్మవారు ఇరువురు కూడా జీవుల మేధోమండలానికి అధిదేవతలు......

"శివాజ్ఞ్య లేనిదే చీమైనా కుట్టదు...." అనే సామెత ఇందుకే....

ఒక చీమకు కుట్టాలి అనే తలపు రావలంటే అసలు దాని బుర్ర పనిచేసి....

"మనకు హానికలిగించడానికి ఎవరో మీదికివస్తునారు......కాబట్టి వారిని కుట్టి మనం జాగ్రత్త పడాలి...." అనే ఆలోచన వచ్చినపిదప ఒకరిని కుట్టేది కద......

అనగా చీమ స్థాయిలో అది ఆ సదరు జీవుడి యొక్క లయప్రక్రియకు కారణం ఆ ఆలోచన కలిగించిన శివానుగ్రహం.....

అసలు శివానుగ్రహంలేనిదే ఒక్క అక్షరం ముక్కకూడ రాయలేము, పలకలేము........

అందుకే పిల్లలకు అక్షరాభ్యాసం జరిగేటప్పుడు అర్చకులు వారితో.....
" ఓం నమః శివాయ సిద్ధం నమః....."
అని తొలిపలుకులు  దిద్దించేది..... అది బాసర సరస్వతీ ( వాసర పీఠం ) ఆలయంలోనైనాసరే రాయించేది మాత్రం అదే శ్లోకం......!

అసలు లయం అనగా ఏమిటి....?
అనే ప్రశ్నకు సరిగ్గా సమాధానం అర్ధమైననాడు ఆ సరస్వతీ మాత కూడా లయకారిణి ఎట్లైనది అనే ప్రశ్నకు సమాధానం అర్ధమైనట్టే....

లయం అనగా ఏమి ఉండని స్థితి.....
అనగా అన్నీ లుప్తమైన శూన్య స్థితి...
లేదా అన్నీ జీర్ణమైన పూర్ణస్థితి....

అనగా ఏమి తెలియని అజ్ఞ్యాన స్థితిలో జీవించడం శూన్యమైన స్థితిలో బ్రతకడం తో సమానం......అనగా ఆ జీవితం లయమైన జీవనంతో సమానం.....

మరియు ఏమి తెలియవలసిన / తెలుసుకోవలసిన అవసరంలేని జ్ఞ్యానాజ్ఞ్యానవిరహితమైన పూర్ణస్థితిలో జీవించడం కూడా లయమైన జీవనంతో సమానం.....

మొదటిది జ్ఞ్యానలేమి వల్ల సంభవించిన అచేతనాత్మక లయం...

రెండవది పరిపూర్ణజ్ఞ్యాన భరితమైన జీవనం తదుపరి సమకూరిన జ్ఞ్యానాజ్ఞ్యానవిరహితమైన
సంపూర్ణచేతనాత్మక లయం......
( శ్రీ అరుణాచల రమణులు ఉండే తురీయ స్థితిలా..... )

సదరు జీవుడి యొక్క ఈ రెండు స్థితులను శాసించేది
జ్ఞ్యానదాయకులైన శివ / శ్రీవాణీ
కాబట్టి ఆ ఇరువురు కూడా లయకారకులే......!

సృష్టి / లయం ఈ రెండు సాధారణంగా ఎవ్వరు పెద్దగా పట్టించుకోని స్థితులు.......

సృష్టి ----- జరిగింది కాబట్టి అక్కడ జీవుడికి ఉన్న పని ఏమిలేదు...... ఉన్నది ఉన్నట్టుగా అంగీకరించడం మినహ......

లయం ----- జరిగిపోయింది కాబట్టి.... ఇక్కడ కూడా జీవుడికి ఉన్న పని ఏమిలేదు...... ఉండకుండాపోయినది / లేనిది
లేనట్టుగా అంగీకరించడం మినహ......

ఇక అందరి గోల మిగిలిన " స్థితి " అనే ప్రక్రియ గురించే.......

అందుకే కదా మరి నారాయణ / నారాయణి ఇద్దరు  అన్ని అవతారలు ఎత్తి స్థితికారులై అందరి యోగక్షేమాలు చూస్తు అన్ని పనులు చక్కబెట్టేది....!

అంటే శేషపర్యంకశయనుడై అలా ఆలోచిస్తూ ఉండడమో / లేదా యోగనిద్రలో ఉండడం మాత్రమే శ్రీమహావిష్ణువు యొక్క స్థితికారకత్వానికి సూచికయా...?

అని కాదు......

ఆయన ఆలోచించేది నాలాంటి ఒక సదరు వ్యక్తి లా......

" ఈసారి ఏ మామిడి కాయలు బాగా తిందాం....
కొబ్బరిమామిడికాయలు ఏ సంతలో దొరుకుతాయి....."  వంటి విషయాలగురించి మాత్రమే అనుకుంటే అది పెద్ద విశేషమేమి కాదు.....

కాని ఆయన నిరంతరం సమాలోచనగావించేది యావద్ విశ్వపరిపాలన గురించి.....

ఆయన యోగనిద్రలోకి వెళ్ళేది ఏ జీవుడి ఆర్తికి తగినట్టుగా ఆ జీవుడిని ఉన్నతమైన దైవికమార్గంలోకి నడిపించి, వారి జీవితాలను సర్వతోముఖాభివృద్ధితో పరిపూర్ణంగావించడానికి తగు రీతిలో వారి స్థితిని ఉద్ధరించడానికి భక్తభాగవతుల సమాశ్రయణం గావించడం కొరకు.....

ఆదిపరాశక్తిచే ఆయనకు ఒసగబడిన విహితధర్మం అది....

అంటే మనం కూడా అలా చల్లగా ఉండే తెల్లని హంసతూలికా శయ్యలపై
పరుండి ఆలోచిస్తే అది కూడా విశ్వపరిపాలనం గురించే..... అనొచ్చా...... అని అడిగితే.....

స్థితికారుడిగా ఒక రాష్ట్రాన్ని చక్కబెట్టే ముఖ్యమంత్రి మరియు ఇతర అమాత్యులు వారి వివిధ విహితధర్మాలైన కార్యాచరణకొరకు వారి ఆఫిస్లో ఏర్పాటుచేసుకున్న పోష్ కుర్చీలు తెచ్చుకొని వాటిపై కూర్చున్నంతమాత్రాన మనం వారైపోము కద......

వారి మర్యాద కొద్ది మనల్ని ఆహ్వానించి వారి సీట్లో మనల్ని వారే కొద్దిసేపు కూర్చొమ్మన్నాసరే
మనము వారిలా ఆలోచించి రాష్ట్రాన్ని నడిపిస్తున్నాము అని కాదుకద అర్ధం......

విద్యా, లౌకిక ధనం, ఇత్యాదివి మనకు మనమే సముపార్జించుకునే సంపదలు....

కాని " అధికారం " అనేది నీ పై అధికారులు నీకు కట్టబేట్టే లౌకిక సంపద.....

కాదు కుదరదు....నాకు నేనే తురుంఖాన్, తీస్మార్ఖాన్, తోప్,
అని అనుకుంటే నీకు నువ్వుగా యజమాని అయిన ప్రాంతంలో అనగా నీ ఇంట్లో, నీ దోస్తుల మధ్య కాలర్ ఏగరేసి జీవించు......

అంతే కాని నేనుచెప్పినట్టే నా పైఅధికారులు వినాలి అని అనడం,  అనుకోవడం మూర్ఖత్వమవుతుంది......

అయినాసరే నేను మూర్ఖుడను అంటూ నీ కింద ఉండే కార్యకర్తలను బాధిస్తు, నీ పైన ఉండే అధికారులను బాధిస్తు, నేనే సీ.ఎం, నేనే పీ.ఎం లా ఉండి వినని వారిని బాధిస్తాను అంటే అది నీ హద్దెరగని గర్వానికి, నీ స్వయంప్రకటిత అధికారదాహానికి, నీ బుద్ధిలేమికి కొలబద్ద అవుతుందికాని మర్యాద అనిపించుకోదు......

గవర్నర్, సీ.ఏం గౌ || శ్రీ కే.సీ.అర్, గారు మరియు  మిగతా సచివులు ఇత్యాదిగా ఉండే అధికార/పరిపాలక విభాగ గణమందరు వ్యవస్థ ఇలా ఒకలా ఉండాలి అని తీర్మానం చేస్తుంటే.... నువ్వు కొత్తగా మధ్యలో దూరి నేను చెప్పినట్టే మీరందరు వినాలి అని గోల చేస్తే....
ముందు మర్యాదగా చెప్తారు...
" నీ పై ఉన్న అధికారులు వాళ్ళ పని వాళ్ళు చేస్తున్నారు....వాళ్ళు నీకు చెప్పిన పని నువ్వు చేసి సంస్థ యొక్క ఆశయాలకు అనుగుణంగా నీ వైఖరి ఉండేలా నిన్ను నువ్వు సరిదిద్దుకో....." అని.....

ఆ తర్వాత ....

" నేనే బాసును..నేనే అన్నిటికి హెడ్డు....."
అని నీకు చెప్పబడని, నీకు ఇవ్వబడిన స్థాయికి తగని రీతిలో నువ్వు ఇతరులను ఇబ్బంది పెట్టేలా నీ సొంత దుకాణం పెట్కొని నడుపుతా అంటే.....

పార్టీలో ఉండి, పార్టి యొక్క ఆశయాలకు, మ్యానిఫెస్టొకు, అధికారగణానికి, విరుద్ధంగా ఉండి అందరిపైకి అరుస్తూ ఉంటాను అంటే..... "వెళ్ళి నీ సొంతదుకాణం పెట్టుకొని అక్కడ అందరిపై అరువుపో....."
అని జవాబిస్తారు.....

" Power never shouts on others.....
It only makes a firm statement ( when it is really required ) , that needs to be adhered to by everyone who belongs to that segment being lead by that power.........."

నలుగురిలో నువ్వు గొప్ప అవ్వాలి అంటే నీ పైఅధికారులు నువ్వు గొప్పోడివి అనేలా నీ కార్యాచరణ ఉండాలి....

అంతేగాని నీకు అధికారం కావాలి కాబట్టి అందుకోసం అందరిపైకి అరిచి సాధిస్తా అంటే నువ్వు హిట్లర్ అవుతావుతప్ప, లీడర్ కాలేవు.....
అనువుగానిచోట అధికులమనరాదు....
అనే సామెతను గౌరవించి, నువ్వున్న దేశకాలమానములను గుర్తించి మసలుకోవడంలో నీకు గౌరవం లభిస్తుంది కాని......
అందరిపైకి అరుస్తూ ఉంటే నిన్ను అధికారి అనరు.....
అధికప్రేలాపి అనిమాత్రమే అంటారు.......

నువ్వు పనిచేస్తున్న సంస్థలో కష్టించి అందరి మన్ననలను పొందుతూ ఒక గొప్పస్థాయిలో ఉండాలని ఆశించు.....అది ఆత్మవిశ్వాసం అనిపించుకుంటుంది....మరియు అది జవాబుదారిగా ఉండడం అని అంటారు....

కాని ఆ సంస్థను / సంస్థలోని బృందసభ్యులను కేవలం  నీ అధికారదాహం తీర్చే ఒక ఊటబావిగా భావించి వారిని ఎంతోకఠినంగా పరుషపదజాలంతో దూషించి, అది తీరకపొయేసరికి నీ ప్రయాస ఎండమావి లోని జలపానంలా మారగా ఆ అక్కసు చుట్టూ ఉన్నవారిపై వెళ్ళగక్కడం విజ్ఞ్యత అనిపించుకుంటుందా....?
లేదా అనవసరంగా వివాదాలను కలిగించి అందరి మనఃశాంతిని హరించే మూర్ఖత్వం అనిపించుకుంటుందా....?

"నేను వయసులో నీకంటే ఇంత పెద్ద తెలుసా...."
అని అనడంలో పెద్దరికముండదు......

ఆ వయసుకు తగ్గట్టు బుద్ధిబలాన్ని / లౌక్యాన్ని ఆర్జించి, వయసుతో నిమిత్తం లేకుండా నీ చుట్టూ ఉండే అన్నివయసులవారితో, అందరితో కూడా ఆప్యాయతతో వ్యవహరించి పనులుచక్కబెట్టుకోవడంలోనే అసలైన పెద్దరికం దాగుంటుంది.....
అని తెలుసుకోవడమే అసలైన పెద్దరికం......

అలా మసలుకోగలిగిననాడు గౌరవం తనంతట తానే ఎరుపు రంగు గులాబి పువ్వుపై వచ్చివాలిన రంగురంగుల సీతాకోకచిలుకలా....,
దోరగాఉన్న గున్నమావిపై వచ్చి వాలిన పంచవన్నెల రామచిలుకలా......,
వచ్చిచేరి మీకీర్తిని మరింతగా ఇనుమడింపజేస్తుంది.....

మొన్న నేను, హరిత  " అల వైకుంఠపురములో...."
సినిమా కి వెళ్ళినప్పుడు, మాస్ & క్లాస్ అందరిని సమంగా అలరించే అల్లు అర్జున్ పేక్యులియర్ యాక్టింగ్ తో పాటుగా, బన్ని ఇచ్చిన బంపర్ మెస్సేజ్ బినీత్ ద స్టోరీ లైన్ కి 'వాహ్ రె వాహ్' అని అనుకున్నాము....

అంతటి సంపన్నమైన రామచంద్రగారు
తన నిజమైన తండ్రని తెలిసినా,
సిరిగలవారింట్లో ఉండి సకల రాజభోగాలు అనుభవించవలసిన తన స్థానంలో తనకు ద్రోహంచేసిన డ్రామ తండ్రి యొక్క కొడుకు ఉన్నాసరే, ఆ సత్యాన్ని తనలోనే దాచుకొని, అటు ఇరుకుటుంబాల శాంతికి ఏమాత్రం భంగం కలగకుండా ఇటు తన అసలైన తండ్రికి కావలసిన సమ్రక్షణను తనదైన శైలిలో ఇచ్చేలా ప్రవర్తించి పనులు చక్కబెట్టుకోవడంలోనే విజ్ఞ్యత ఉంటుంది.....అని, అందుకు తగ్గటుగా తన కార్యాచరణ రూపొందించాడే తప్ప.....
అక్కడున్న ఎవరిపై కూడా ఇసమంతైనను తన ఆవేదనచ్ఛాయలు ప్రసరించనీయలేదు.....
( అంటే ఆ స్టోరి వ్రైటర్ కే అనుకొండి అసలైన క్రెడిట్ వెళ్ళేది..... )

అందుకే అన్నమాచార్యులవారు కూడా ఆ అప్రాకృతశ్రీవైకుంఠంలో తణుకులీనే శ్రీవైష్ణవదివ్యప్రభలను, సర్వవ్యాపకుడిగాఉండి కూడా సగుణసాకారపరబ్రహ్మంగా కొలువైఉండే ఆ స్థితికారక బ్రహ్మపదార్ధాన్ని ఎంతో వైభవంగా.....

" అణురేణుపరిపూర్ణమైనారూపము......"

అని కొనియాడిన సంకీర్తనలో ఆ సాటిలేని శ్రీవైకుంఠనగరిలో మెరిసే పరతత్వమే శ్రీవేంకటగిరిపై కొలువై మనందరికి ప్రత్యక్షదైవమై అలరారుతుందని బహుచక్కగా వర్ణించారు కదా...... 😊

**************************************

అణురేణు పరిపూర్ణమైన రూపము
అణిమాదిసిరి అంజనాద్రిమీది రూపము

వేదాంతవేత్తలెల్ల వెదకేటిరూపము
ఆదినంత్యము లేని యారూపము
పాదుగ యోగీంద్రులు భావించురూపము
యీదెస నిదివో కోనేటిదరి రూపము

పాలజలనిధిలోన (బవళించేరూపము
కాలపు సూర్యచంద్రాగ్నిగల రూపము
మేలిమి వైకుంఠాన మెరసిన రూపము
కీలైనదిదె శేషగిరిమీదిరూపము

ముంచినబ్రహ్మాదులకు మూలమైనరూపము
కొంచని మఱ్ఱాకుమీది కొనరూపము
మంచి పరబ్రహ్మమై మమ్మునేలిన రూపము
యెంచగ శ్రీవేంకటాద్రి నిదె రూపము

**************************************

http://annamacharya-lyrics.blogspot.com/2007/04/197anurenu-paripurnamaina.html?m=1