Wednesday, March 25, 2020

శ్రీ కోటి ఫలి క్షేత్ర మాహాత్మ్యం......😊 అందరికి 2020 ఉగాది పర్వదిన శుభాభినందనలు.....🙏😊

శ్రీ కోటి ఫలి క్షేత్ర మాహాత్మ్యం......😊

ముందుగా అందరికి 2020 ఉగాది పర్వదిన శుభాభినందనలు.....🙏😊

రమారమి ఒక 7 సంవత్సరాల క్రితం
( 2013 గురుపౌర్ణమి ఉత్సవానికి ) కాకినాడ లోని సర్పవరంలో నా మితృని ఇంటికి వెళ్ళినప్పుడు,
అలా కాసేపు చుట్టుపక్కన ఉండే
గుళ్ళు చూసొద్దామని వెళ్ళాము.....

అప్పుడు నాకు అస్మద్ గురుదేవులు శ్రీచాగంటి సద్గురువులు నుడివిన ఒక అధ్యాత్మ విశేషం ఠక్కున గుర్తొచ్చి,
" హె వినోద్...గోదావరి సముద్ర సంగమానికి దెగ్గరగా ఉండేవాటన్నిటికి తీస్కెళ్ళవ...."
అని అడగగా.....
అట్లే అని మితృలందరం బైక్స్ వేస్కొని బయల్దేరాం......

దక్షారామం,
( శక్తిపీఠం, శ్రీమాణిక్యాంబాసమేతభీమేశ్వర స్వామి ఆలయం )

పిఠాపురం
( శక్తిపీఠం శ్రీ పురుహూతికాదేవి
మరియు శ్రీహుంకారిణిదేవి సమేత శ్రీ కుక్కుటేశ్వర స్వామి వారి ఆలయాలు) 

సర్పవర శ్రీభావనారయణస్వామి ఆలయం , 
( ఈశ్వరానుగ్రహం వల్ల ఆనాడు భానువాసరం..... ఆదివారం నాడు ఎదురుగా ఉన్న నారదకుండంలోని తీర్థజలాన్ని సేవించి సర్పవరం శ్రీభావనారాయణస్వామిని దర్శించి సేవించిన వారికి 108 దివ్య దేశాల దర్శనఫలితం సిద్ధిస్తుందని శాస్త్రవచనం...! 😊 )

ఇలా కాకినాడ చుట్టుపక్కన ఉండే వివిధ ఆలయాల సందర్శనలో భాగంగా కోటిపల్లి శ్రీసోమేశ్వరస్వామి వారి ఆలయాన్ని కూడ సందర్శించి తరించాము......
శ్రీచాగంటిసద్గురువులు ప్రవచనంలో ఒకచోట చెప్పిన్నట్టు
అది కోటిపల్లి కాదు కోటిఫలి క్షేత్రం......

( వాడుకభాషలో దక్షారామం ద్రాక్షారామం ఐనట్టు, కోటిఫలి కోటిపల్లి గా అయ్యింది అనేది వివరణ....)

అప్పుడు నాకు అక్కడి క్షేత్రాల మాహాత్మ్యం గురుంచి పెద్దగా అవగాహన లేదు కాని గురువుగారు చెప్పిన ఒక్క వాక్యం కొరకు కోటిఫలి క్షేత్రం చూడ్డానికి వెళ్ళాము......

" ఉత్తరభారత ప్రాంతంలో ప్రవహించే జీవనదుల జన్మస్థానముల వద్ద ఉండే తీర్థాలు క్షేత్రాలు     కడుశక్తిదాయక బహుపుణ్యదాయకాలు......

అట్లే దక్షిణ భారత ప్రాంతంలో ప్రవహించే జీవనదుల సముద్రసంగమ ప్రాంతాలకు దెగ్గరగా ఉండే తీర్థాలు క్షేత్రాలు కడుశక్తిదాయక బహుపుణ్యదాయకాలు............" 

అనే ఆ అధ్యాత్మసూక్ష్మశ్రవణం నాకు కోటిఫలి క్షేత్ర సందర్శనభాగ్యం ప్రసాదించిందన్నమాట......😊

( ఆ అనుగ్రహవిశేషాన్ని త్వరలో  వేరొక పోస్ట్లో రాస్తాను.....)

ఇక్కడ అర్ధంచేసుకోవలసిన విషయం ఏంటంటే,

కొందరు దేశకాల మహిమ్నతను, తత్సంబంధమైన శాస్త్రవచనాలను,
అవిపాటించే వ్యక్తులను / భక్తులను చాలా చులకన చేసి అగౌరవపరిచేలా మాట్లాడుతుంటారు / వ్యవహరిస్తుంటారు......

వాళ్ళకు గల అహంకార భరిత అజ్ఞ్యాన భావజాలాన్ని సరిదిద్దడం నా ఉద్దేశ్యం కాదు కాని,
కొన్ని లౌకిక ప్రపంచపు ఉదాహరణలద్వార శాస్త్రం యొక్క హితవచనాల గొప్పదనం గురించి నా యొక్క భావాన్ని తెలియజేసే ప్రయత్నం గావిస్తాను......

1. శ్రీచాగంటి సద్గురువులు ప్రవచనంలో ఒక చోట ఉదహరించిన ఒక గొప్ప లౌకిక సామాన్య విషయాన్నే ఇక్కడ నేను ముందుగా ఉదహరిస్తాను......

ఒక నాలుగు గోడల మధ్యలో, ఒక 100 గజాల్లో మీరు కట్టుకున్న ఒక చిన్న  ఇంట్లోనే.......

ఒక మూలన కొంచెం పెద్దగా ఉండేలా ఒక గది వేసి ఇది నిద్రపోయే మాస్టర్ బెడ్రూం.... అని అంటున్నారు.....

దాని పక్కనే ఇంకో రెండు గోడలు వేసి ఇది వంట చేసుకునే కిచెన్ రూం అంటున్నారు....

దాని ముందు ఇంకో రెండు గోడలు వేసి ఇది హాల్ రూం అందరు కూర్చొని టీ.వి చూడ్డానికి అని అంటున్నారు.....

ఆ మధ్యలో ఇంకో రెండు సన్న గోడలు కట్టి ఇది పూజ గది....ఇందులో మా దేవుడు ఉంటాడు.....అని అంటున్నారు.....

మరో మూలన ఇంకో రెండు గోడలు కట్టి ఇది స్నానాదికాలకు బాత్రూం అని అంటున్నారు......

బాత్రూంలోనే స్నానాలు చేయాలి....
పూజ గదిలోనే దైవారాధన చేయాలి.....
కిచెన్ లోనే వండి ఆ పక్కనే తినాలి....
బెడ్రూంలోనే పడుకోవాలి.....

అంటు ఏగదిలో ఎప్పుడు ఎక్కడ ఎలా ఉండాలో చెప్తూ 
" This is how a house is to be used for peaceful living and thus call it a home......."

అని ఒక చిన్న 100 గజాల భూమి ముక్కలోనే మీరు ఇన్ని విభాగలు గావించి అది అందుకు ఇది ఇందుకు ఇది ప్రత్యేకం అని అంటున్నారే......

మరి యావద్ ప్రపంచాన్ని ఈ భూమిపై తనదైన ఒక సక్రమ పద్ధతిలో శాస్త్రాన్ని ఆధారంగా గావించి ఈశ్వరుడు నిలిపినాడు.....
సనాతనంగా మన పూర్వీకులు పెద్దలు అది ఆచరించి తరించినారు......
అందుకు విరుద్ధంగా అంటే శాస్త్ర విరుద్ధంగా ఉంటే అశుభం కలుగుతుంది కాబట్టి శాస్త్రసమ్మతంగా కొన్ని ముఖ్యమైన వాటిని మాత్రం కచ్చితంగా పాటించడంలోనే శ్రేయస్సుకలదు అని విజ్ఞ్యులైన వారన్నప్పుడు,
అది శాస్త్ర మౌఢ్యం, చాదస్తం, వెర్రి, పిచ్చి, ఇత్యాదిగా చులకనజేయడం మీ యొక్క అజ్ఞ్యానానికి కొలమానమవుతుందేమో కాని అది పాటించిన సదరు వ్యక్తి యొక్క ఔన్నత్యానికి కాదు.....

"కిచెన్లో స్నానాలు ఎందుకు చేయొద్దు...
బెడ్రూంలో పూజలు ఎందుకు చేయొద్దు..."

ఇలాంటి వెర్రి ప్రశ్నలను అడిగినవారిని ఏమని సంబోధించాలో,

దేశకాల ప్రాముఖ్యతను గుర్తించి 
శాస్త్ర వచనాలను గౌరవించి జీవించే వారిని తప్పు పట్టేవారిని కూడా అట్లే సంబోధించవలసి ఉంటుందని నా యొక్క వ్యక్తిగత అభిప్రాయం.....

అలా ఒక పద్దతిగా ఈశ్వరభక్తి భరిత గార్హస్త్య జీవితం లో ఉండి అధ్యాత్మ సాధన చేసే వారే అందరికంటే గొప్ప అని శ్రీచాగంటి సద్గురువులు గృహస్తాశ్రమ ధర్మాన్ని ఎన్నెన్నో ప్రవచనాల్లో నొక్కి వక్కానించారు.......

ఎందుకంటే ఒక గృహస్తు యొక్క భక్తభాగవత ఆరాధన సాధుసజ్జన ఆదరణ వల్లే ఇతర ఆశ్రమధర్మాలను స్వీకరించి జీవించేవారికి జీవనం సంభవం.....

అవతల ఉన్న వ్యక్తి యొక్క యోగ్యతను, పాత్రతను, ఈశ్వరభక్తిప్రపత్తిని బట్టి ఒక గృహస్తు తన శక్తికొలది దానధర్మాలు చేస్తేనే సదరు  పురోహితునకు కాని, సాధుసన్యాసికి కాని, ఇతర భక్తభాగవతులకు కాని లౌకిక జీవనం సంభవమయ్యేది......

సమజానికి సహాయకారులైన వ్యక్తులు
ఈ భూమిపై ప్రభవించాలన్నా గృహస్తాశ్రమాన్ని గౌరవించినప్పుడే అది సాధ్యం......

కాబట్టి సాంసారిక కర్తవ్యాలతో విహిత ధర్మాచరణతో కామ క్రోధాది " అరిషడ్వర్గ " స్పర్ష లేకుండా ఒక గృహస్తు జీవించడం అసాధ్యం.....

సంసారం లో ఉన్నంత మాత్రన భక్తి లేనట్టు కాదు.......
సంసారాన్ని త్యజించినంత మాత్రాన భక్తి ఉన్నట్టు కాదు.....

శ్రీ చాగంటి సద్గురువులు చెప్పినట్టుగా 
"నీటిపై నావ ఉండాలి కాని, నావలో నీరుండరాదు......"

అప్పుడే ఆ నావను ఆధారంగా చేసుకొని ఉన్నవారందరి మనుగడ సంభవమయ్యేది.....
అట్లే 
వ్యక్తి సంసారంలో ఉండాలి కాని, వ్యక్తిలో సంసారం ఉండకూడదు....

అప్పుడే ఆ వ్యక్తి యొక్క గృహస్తాశ్రమధర్మాన్ని
ఆధారంగా చేసుకొని ఉన్నవారందరి మనుగడ సంభవమయ్యేది.....

ఒడ్డున నిల్చున్న వ్యక్తికి కనిపించేది కేవలం ఒక సముద్రంలో  సాగిపోతున్న నావ, అందులో ప్రయాణం సాగిస్తున్న జనం.....

కాని ఆ నావ నడిపేవారికి కనిపించేది కల్లోల కెరటాల సాగరం.....
వారికి అవసరమయ్యేది అందులో మునిగిపోకుండా ఎంతో జాగ్రత్తగా నావను తీరానికి చేర్చే నావిక కౌశలం.....

కాబట్టి సంసారంలో ఉన్నవారికి యొగము భోగము రెండూ అవసరం......

భోగము లేనిదే యోగము సిద్ధించదు.....
యోగము సిద్ధించనిదే అమరిన భోగానికి సార్ధకతలేదు....

ఇవ్విధముగా భోగ యోగములు సమ్మిళితములైనప్పుడు మాత్రమే ఆ గృహస్త జీవితం పరిపూర్ణతను సంతరించుకొని భగవద్ప్రీతికరమై తుదకు మోక్షప్రదమై వర్ధిల్లుతుంది..... 

ఇది కూడా శ్రీ చాగంటి సద్గురువులు ఎంతో సరళంగా విశదీకరించారు చాలా సార్లు వారి వివిధ ప్రవచనల్లో......

ఒక చెరుకుగడను 4 భాగాలుగా నరకాలంటే వెయ్యాల్సిందే 3 వేట్లే..... మూడో వేటుకు ఆ నాలుగో ముక్క అయాచిత ఆర్జితంగా లభించి ఆ ప్రయాస లాభిస్తుంది......

అట్లే ధర్మార్ధకామమోక్షములు అనే నాలుగు ముక్కలను సాధించడమే ప్రతి ఒక్కరి జీవిత పరమావధి కాబట్టి 
ధర్మం, అర్ధం, కామం వీటికొరకై భక్తియుత జీవితం గడిపిననాడు ఆఖరిదైన మోక్షం పైన లభించిన నాలుగో చెరుకు ముక్కలా 
ఈశ్వరుడు అనుగ్రహించి మన ధార్మిక జీవితానికి పరిపూర్ణతను ఆపాదిస్తాడు అనేది సద్గురువుల సార్వకాలిక సత్యబోధ......

ఆ అర్ధకామములను కూడా అందుకే మధ్యలో పెట్టారు.....
అంటే గార్హస్త్య ధర్మంతో అర్ధకామములను ముడివేసిన నాడు అవి ధర్మం తో పూర్వబంధనం చెందిన కారణంగా ఉత్తరబంధనమైన మోక్షం ఈశ్వరానుగ్రహంగా సిద్ధించబడడం తథ్యం....!

ఎందరెందరో అధ్యాత్మవేత్తలు ఎన్నెన్నో గొప్ప గొప్ప ప్రౌఢ శాస్త్రవచనాలను వల్లే వేస్తుంటారు.......
మరీ ముఖ్యంగా గృహస్తులకు బోధలు జేయడమంటే ఈ కలికాలం లో ప్రతి ఒక్కరికి ఎంత ప్రీతికరమైన విషయమో నేను పెద్దగా చెప్పకర్లేదు.....

వేలకు వేల పీఠాలు, ఆశ్రమాలు, సన్యాసులు, అలా అధ్యాత్మిక ప్రపంచం ఈ కలియుగంలో ఎన్ని విధాలుగా కొత్త పుంతలు తొక్కి, ఒక్కొక్కరు తమదైన శైలిలో శాస్త్రబోధ గావిస్తునారో పొద్దున లేచింది మొదలు మనంచూస్తూనే ఉన్నాం......
టీవీలు వందల ఛానెల్లో చూపిస్తూనే ఉన్నాయి...

కొన్ని లక్షలమంది ఇవ్వాళ కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీనివాసుడి గురించి,  ఇతర దైవాల గురించి
ఎన్నో బోధలు చేస్తునారు.....

శ్రీచాగంటి సద్గురువులు ఒక చోట అడిగినట్టుగా, ఇవ్వాళ తిరుమలకు ఎంతమంది పాదరక్షలను త్యజించి వెళ్తున్నారు......??

తిరుపతి వరకు మినహాయింపు ఇచ్చినా సరే, తిరుమల కొండ ప్రారంభం అయ్యేప్రదేశానికి చెప్పులు అనేవి ఆ దరిదాపుల్లో ఎక్కడా కూడా ఉండకుండా ఉండడమే ఆ స్వామికి మనమిచ్చే సర్వోన్నత గౌరవం.....

ఎంత మంది ఇవ్వాళ తమ గుండేమీద చెయ్యేసి మేము తిరుమలకు వెళ్ళేటప్పుడు అసలు చెప్పులు వేసుకోము అని ధైర్యంగా చెప్పగలరు......??

కొండ మొత్తం పరమాత్ముడే అని ఒక  వైపు చెప్తునారు.....
మరి ఆ కొండకు చెప్పులు ఎలా చెప్తున్నారు....?

మీరు AC కార్లల్లో వెళ్ళినా ఆ స్వామి ఏమి అనుకోడు......
మీరు VIP  సూట్లో బసచేసినా ఆయన ఏమి ఫీల్ అవ్వడు.......

కాని అంతటి పవిత్రమైన కొండపైకి ఒకటో రెండో రోజులు ఉండే యాత్రకి కూడ చెప్పులు లేకుండా వెళ్ళము / వెళ్ళలేము అనేవారు.......,
ఎవరైనా తిరుమల వెంకన్న లడ్డూ ప్రసాదం అని లడ్డు ఎదురుగా పెడితే
'ఎంత సౌభాగ్యం ఉంటే తిరుమల ప్రసాదం లభిస్తుందో కద.....'  అని, కాళ్ళకున్న పాదరక్షలు
( లోఫర్స్ ) ఒక్క రెండు సెకన్ల పాటు అలా వదిలి, అది కళ్ళకద్దుకొని తినాలి అనే సోయి కూడా లేని వారికి,
ఇతరుల భక్తి గురించి,
వారి భక్తి భరిత గార్హస్త్య జీవితం గురించి మాట్లాడేంతటి అర్హత, యోగ్యత ఉందని నేనైతే అనుకోను.........

" పరోపదేశవేళాయాం సర్వే వ్యాసపరాశరాః...... " అనే గురువుగారి ఛలోక్తి ఇక్కడ బాగ సరిపోతుందనుకుంటా......

కాబట్టి యోగ భోగములను కలిగించి
అవి భక్తభాగవతులకు సాధుసజ్జనులకు ఉపయుక్తమయ్యేవిధంగా మన గృహస్తజీవితాలను పరిపూర్ణం గావించి,
మనం కావించే కాస్తో కూస్తో అధ్యాత్మ ప్రయాసను ఈశ్వరుడు కోటి రెట్లు హెచ్చ వేసి కరుణించే
 ఇలాంటి అరుదైన అనన్యసామాన్యమైన 
' యోగ లింగ / ముక్తి లింగ ' క్షేత్రం జీవితంలో ఒక్కసారైన భక్తులు వీలుచేసుకొని దర్శించి తరించండి......

క్షేత్రం గురించిన మాహాత్మ్యము మరియు ఇతర వివరాలు ఇంటర్నెట్లో అందరికి లభ్యమే.....😊

సద్యోజాత, వామదేవ, తత్పురుష, అఘోర, ఈశాన, మనబడే పంచముఖాలతో యావద్ విశ్వాన్ని నడిపించే ఆ సర్వేశ్వరుడి దయతో, 

తన వామదేవ స్వరూపమైన శ్రీమహావిష్ణువుయొక్క కలియుగ ప్రత్యక్ష అవతారమైన 
ఆ తిరుమల శ్రీశ్రీనివాసుని కరుణాకటాక్షాలతో ఈ 
" శ్రీ శార్వరి " నామ తెలుగు నూతన సంవత్సరం ఎల్లరికి సర్వ శ్రేయస్సులను కలుగజేయుగాక అని అభిలషిస్తూ అందరికి 2020 ఉగాది పర్వదిన శుభాభినందనలు.....🙏😊




Sunday, March 15, 2020

శ్రీ వికారి ఫాల్గుణ శుద్ధ ఏకాదశ్యోపరిద్వాదశి, భృగువాసర పుష్యమి నక్షత్ర యుక్త మేషలగ్న సుముహూర్తంలో, 06-మార్చి-2020 ఉదయం 9.51 నిమిషాలకు, శ్రీపాంచరాత్రాగమోక్త పాంచాహ్నిక ప్రతిష్ఠామహోత్సవం జరిపించుకొని కొత్తగ వచ్చి కొలువైన శ్రీ కార్యసిద్ధి అభయాంజనేయస్వామి వారి నూతన ఆలయ గోపుర కలశం...... 😊

శ్రీరాఘవం దశరధాత్మజ మప్రమేయం
సీతాపతిం రఘుకులాన్వయ రత్నదీపం
ఆజానుబాహుం అరవింద దళాయతాక్షం
రామం నిశాచర వినాశకరం నమామి

వైదెహీసహితం సురద్రుమతలే హైమే మహామణ్డపే
మధ్యే పుష్పకమాసనే మణిమయే వీరాసనే సుస్థితం
అగ్రే వాచయతి ప్రభంజనసుతే తత్త్వం మునిభ్యఃపరం
వ్యాఖ్యాంతం భరతాదిభిః పరివృతం రామం భజేశ్యామలం

ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం
లోకాభిరామాం శ్రీరామం భూయో-భూయో నమామ్యహం॥

యత్ర యత్ర రఘునాథకీర్తనం
తత్ర తత్ర కృతమస్తకాంజలిం
భాష్పవారిపరిపూర్ణలోచనం
మారుతిం నమతరాక్షసాంతకం

శ్రీవాల్మీకి మహర్షి విరచిత ఆదికావ్యం, శ్రీరామాయణాంతర్గతమైన ఇలాంటి ఎన్నెనో వివిధ శ్లోకాల్లో శ్రీరాముడి మరియు అతడి ప్రియాతిప్రియమైన సఖుడైన హనుమంతుల వారి వైభవం మనకు గోచరిస్తూనే ఉంటుంది.......

వారి అవ్యాజమైన మిక్కుటమైన నిస్వార్ధమైన మైత్రికి కారణం వారు అనాదిగా ఉండే అభిన్నమైన హరిహరులు కావడంచేత......

అందుకే కద ఎంతటి బలాఢ్యులకు సైతం, ఆఖరికి అపర శివభక్తిధురంధరుడైన రావణ బ్రహ్మతో సహా, కనీసం అంగులం కూడా కదిలించలేని ఆ హరచాపమును ఎక్కుపెట్టి విరిచేంతటి భుజబలం ఆ నవ యవ్వన శ్రీరాముడికే చెల్లింది......

ఆ తదుపరి ఆగ్రహోదగ్రుడై వచ్చి విరుచుకుపడుతున్న ఆ పరశురాముడి ఉగ్రతను తనలోకి లయించివేసినా సరే అది శ్రీరాముడికే చెల్లింది......
అసలు క్షత్రియులంటేనే గిట్టని, క్షత్రియసమ్హారమే పనిగా లోకమంతా తన గండ్రగొడ్డలి ( పరశు ) పట్టుకొని తిరుగుతున్న ఆ అపారమైన రాజసిక బ్రాహ్మణ తేజస్సును నిలువరించి తనలోకి లయించి వేసేంతటి క్షాత్రము సామాన్యమైన క్షత్రియులకు కలదే....??

హర తేజస్సుకు కేవలం హరి తేజస్సు మాత్రమే సాటిరాగలదు......
ఇతరములన్నీ కూడా వాటిలోకి లయించిపోవలసిందే.......

అందుకే కదా హరి హర తేజస్సుల కలయికతో సంభవించిన వీరుడి మినహా మరెవ్వరిచేతను సమ్హరించబడని విధంగా అతి తెలివితో వరము పొంది మర్త్యులకు దుర్లభమైన అమరత్వాన్ని సాధించానని మిడిసిపడిన ఆ కలిపురుష స్వరూపమైన మహిషిని సమ్హరించుటకు హరిహర తనయుడిగా అయ్యప్ప స్వామి దిగిరావలసివచ్చింది......

త్రిపురాసుర వధలో భాగంగా శ్రీహరికి ఇచ్చిన మాటకు అనుగుణంగా ఆ హరుడు హనుమంతుడై ఇలకు దిగిరావడం,
అపారమైన హర తేజస్సును సాధించి లోకాన్ని, ముఖ్యంగా సాధు సత్పురుషులను బాధించడమే పనిగా బ్రతుకుతున్న పౌలస్త్యుడి వధ హనుమ యొక్క

1. శక్తి --

( అప్పటికప్పుడే కాంచన లంకనుండి హిమాలయపర్వతశ్రేణికి లంఘించి సంజీవని పర్వతం తీసుకొని రావడం మళ్ళీ అంతే జాగ్రత్తగా అది సంగ్రహించిన చోటే తిరిగి భూస్థాపితం గావించడం అనే అనితరసాధ్యమైన దేవకార్యం.... )

2. యుక్తి --

( ఎప్పుడు ఎక్కడ ఎందుకు ఎంతవరకు బుద్ధిబలాన్ని ఉపయోగించి కార్యాన్ని సాధించాలో తెలిసినందుకు......

మహేంద్రగిరి పర్వతం శిధిలమయ్యేంతటి విరాట్ రూపాన్ని ధరించి 100 యోజనాల సాగరాన్ని లంఘించడమే కాదు......

కీటకమంత చిన్నగామారి నాగమాత సురస పెట్టిన పరీక్షలో నెగ్గి సాగరలంఘనంలో ముందికు సాగడం తెలిసినందుకు.....

పిల్లి పిల్లంత రూపాన్ని ధరించి కాంచనలంకలో సీతాన్వేషణ గావించడం కూడా తెలిసినందుకు.....

రాబోవు రామరావణ సంగ్రామానికి కావలసిన వ్యూహప్రతివ్యూహాలను రచించేందుకు, లంక యొక్క ఆనుపాను తెలియుటకు మేఘనాథుడి బ్రహ్మాస్త్ర బంధనానికి కట్టుబడిన వ్యక్తిలా ఉండడమే కాదు.......

దూత గా వచ్చిన తనను,
శ్రీరాముడి గౌరవభరితమైన సంధివచనాలను తిరస్కరించడమే కాకుండా హద్దెరగని పొగరుబోతుతనంతో ఘోరంగా అవమానపరిచినందుకు,
శ్రీరాముడికి కొంత భారం తగ్గేలా,
సీతమ్మవారి చూడామణి తో పాటుగా
సగం లంకను సమూలంగా సర్వనాశనం గావించిన
" కాంచనలంకాదహనం " అనే రిటర్న్ గిఫ్ట్ ని తీసుకొని రావడం.......
ఇత్యాది గా ఎన్నో చోట్ల యుక్తిప్రధానమైన కార్యాచరణ గావించడం..... )

3. భక్తి --

(  రావణుడి వేధింపులకు మానసికంగా ఎంతో కృంగిపోయిన సీతమ్మ శింశుపా వృక్ష కొమ్మలకు తన కేశపాశాన్నే తాడుగా కట్టి ఉరి వేసుకొని ఇక కొమ్మను వదిలేయడానికి సిద్ధంగా ఉన్న ఆ అత్యంత సంక్లిష్టమైన సందర్భంలో అసలు ఏం చేయాలో ఏమి తోచక ఉక్కిరి బిక్కిరి అవుతూ
ఇక తన ప్రభుభక్తి మాత్రమే దిక్కని తలచి అత్యంత సుమనోహరంగా శ్రీరామ నామగుణవైభవాన్ని ఆలపించి సీతమ్మను ఊరడించి ఆ పెనుప్రమాదమునుండి రక్షించడం అనే చతురత భరిత కార్యసాధన  చెట్టుపైనుండే గావించడం......

రావణుడి ప్రాణ రహస్యం గురించి విభీషణుడు తెలిపినాసరే ధనుర్వేద నియమావళికి విరుద్ధంగా నాభిదిగువకు శర ప్రహారం కావించని తన ప్రభువుకు విజయం చేకూరేలా వాయుదేవుణ్ణి ప్రార్ధించి శ్రీరాముడి కోదండ సంధిత శర గమనాన్ని రావణుడి నాభిమండలంలో కుంభకమై ఉన్న ప్రాణాలపైకి సవరించి ప్రహారం గావించబడడం......

ఇత్యాది గా భక్తి ప్రధానంగా సాధించబడిన కార్యాలు...... )

వల్లే సంభవమయ్యిందనే సత్యం మనం శ్రీరామయణంలో నేర్చుకున్నాము కదా......

అందుకే కద హనుమస్వామి యొక్క శక్తి యుక్తి భక్తి సమ్మిళితమైన ఆ హరతేజోవిరాజిత స్వరూపాన్ని
" ఎవ్వరికి వశపడని ఎదురులేని కాలస్వరూపమే ఈ హనుమంతుడు......"
అని స్తుతించింది వేదోపబృహ్మణమైన శ్రీమద్రామాయణం

( అశోకవననాశకుడిగా తన విశ్వరూపాన్ని జూపిన వైనాన్ని శ్రీవాల్మీకి మహర్షి తమ ఈ క్రింది సుందరకాండ 54 వ సర్గలోని 35వ శ్లోకంలో ఎంత ఆశ్చర్యజనకంగా అభివర్ణించారో చూస్తే, హనుమంతుని సకలదేవతాశక్త్యాత్మక వైభవం గోచరిస్తుంది..!!
***************************************************************
వజ్రీ మహేంద్ర స్త్రిదశేశ్వరో వా సాక్షాద్యమోవా వరుణోనిలోవా!
రుద్రోగ్నిరర్కో ధనదశ్చ సోమో న వానరో అయమ్ స్వయమేవ కాలః!! 5-54-35

వజ్రము ధరించినటువంటి దేవపతియైన ఇంద్రుడా లేక యముడా లేక వరుణుడా లేక వాయువా లేక ఈశానుడా లేక అగ్నిదేవుడా లేక కుబేరుడా లేక సూర్యుడా లేక చంద్రుడా
ఇతడు వానరుడు కాడు. స్వయముగా కాలస్వరూపుడే...!!

vajrī mahendrastridaśeśvaro vā |
sākṣādyamo vā varuṇo.anilo vā |
rudrognirarko dhanadaśca somo |
na vānaro.ayam svayameva kālaḥ | 5-54-35

"He is not a monkey. He is either Indra the Lord of celestials wielding a thunderbolt, or Yama the lord of death or Varuna the Lord of water, or Anila  the wind-god or Agni the fire seated in the third eye of Lord Shiva or the sun-god or Kubera the lord of riches or the moon-god.
He may be Kaala (the Time-spirit) himself....  !

**********************************************

ఒక శక్తిని నిలువరించాలంటే అదే శక్తి లేదా ఆ శక్తికి సాటి అయిన, సామ్యమైన శక్తి ని అడ్డుగా వేసిన నాడే అది సాధ్యము.......

లేనిచో శక్తి సాంద్రత లోని హెచ్చు తగ్గుల కారణంగా వివిధ ఉత్పాతకరమైన ఉపద్రవాలు సంభవిస్తాయి......

సద్గురు శ్రీ చాగంటి గారి సులభమైన మాటల్లో
చెప్పాలంటే.....
" నీ ఇంట్లో ఫ్యూస్ పోతే...... నువ్వే వేస్కుంటావ్......పరవాలేదు......
కాని ట్రాన్స్ఫార్మర్ లో ఫ్యూస్ పోతే ఆ వ్యవస్థను చక్కదిద్దే తగు తర్ఫీదు ఉన్న లైన్మెన్ మాత్రమే ఆ పని చెయ్యాలి......"

ఎందుకంటే, ఇక్కడ రెండూ కరెంట్ సంబంధితమైన చర్యలే......
కాని ఆ విద్యుత్ శక్తి యొక్క పరిమాణంలో ఉన్న భేదాల కారణంగా రెండింటిని ఒకేలా హ్యాండిల్ చెయ్యలేము అనేది మనము లౌకికంగా చూసే వ్యవస్థలోని
సర్వ సాధారణమైన సత్యం.......
( మన ఇంట్లోకి వచ్చేది 11/33 kV సబ్ స్టేషన్ నుండి స్టెప్డౌన్ ట్రాన్స్ఫార్మర్ల ద్వార స్థిరీకరించబడిన 230 V విద్యుత్శక్తి....... )

సరిగ్గా ఇదేవిధంగా అమేయమైన దైవిక శక్తికూడా మనుష్య ఉపాధికి ఉపలబ్ధమయ్యే విధంగా ఒక నిర్ణీతమైన పరిమాణంలో తన ఉనికిని సంక్షిప్తపరిచి వచ్చినప్పుడు అది స్వీకరించిన ఉపాధిచేత ఆ శక్తిని తక్కువ అంచనా వేసి తూలనాడడం సాధారణంగా అల్పులే తప్ప మాన్యులు గావించరు.....

అందుకే కద దూతగా వచ్చినందుకు రావణ సభలో ఉన్నవారెందరో.....

" శ్రీరాముడి పలుపున వచ్చిన కేవల మర్కటము......."

అని అపహాస్యం గావించి భంగపడ్డారు......

కాని విజ్ఞ్యుడైన విభీషణుడు మాత్రం
" వచ్చింది కేవల మర్కటము కాదు...... సాక్షాత్తు మహేశ్వరుడే...... " అని భావించి
"దూతను సమ్హరించడం దౌత్య ధర్మానికి విరుద్ధము......"  అంటూ తనదైన రీతిలో రావణుడికి హితవచనాలు చెప్పి కాంచనలంకను కాపాడినాడు........

ఆ సందర్భంలో హనుమస్వామిని దూతగా భావించి విడిచిపెట్టడమే ధర్మము అని విభీషణుడు సభలోని ఒక పెద్దమనిషిగా తన విహిత ధర్మాన్ని నిర్వహించి ఉండిఉండకపొయ్యుంటే హనుమంతుల వారి ఆగ్రహానికి రావణుడితో సహా కాంచనలంక మొత్తం ఆ క్షణమే సమూలంగా సర్వనాశనమయ్యుండేది......
ఆ మాటను హనుమంతులవారే స్వయంగా చెప్తారు కద.........

" సీతమ్మ జాడ కనిపెట్టడమే తన ప్రభువు ఆజ్ఞ్య కాని మిమ్ములను సమ్హరించుటకు ఆజ్ఞ్య లేదు కాబట్టి వదిలేస్తున్నాను......" అని రావణుడికి ప్రత్యుత్తరమిచ్చి, ధర్మాన్ని ఆలంబనగా గావించి జీవించే సీతమ్మ మరియు విభీషణుడు అక్కడ ఉన్నారు కాబట్టి లంకను మొత్తం దహించకుండా వదిలేసాడు.........

రక్కసుల మలిబంధన చర్యలతో మేఘనాథుడి బ్రహ్మాస్త్ర బంధనం తొలగిన ఆ క్షణమే హనుమంతుల వారు అక్కడున్న అందరిని సమ్హరించి సీతమ్మను మాత్రమే క్షేమంగా తరలించి ఉండగలిగిన సందర్భం అది......

కాని రాజాజ్ఞ్య అది కాదు కాబట్టి సందర్భోచితంగా వ్యవహరించి సగం లంకనే దహించినాడు ఆ శ్రీరామదూత....

" హనుమ వాలానికి పెట్టబడిన నిప్పు మంచు వలే చల్లగా ఉండి ఆంజనేయునికి ఎట్టి హాని చేయకుండు గాక....."
అని నిండు మనసుతో సంకల్పించిన ఆ సీతమ్మ ఉన్న అశోకవన పరిసరాలు, మరియు అప్పుడు అక్కడ కాపలా కాసే రాకాసి మూకలు మాత్రం ఆ హనుమ ఆగ్రహానికి గురికాకుండా ఉండడం మనం గమనించవచ్చు......

శ్రీమద్రామాయణం లో రాముడు ఎంతో హనుమంతుడు కూడా అంతే......

శ్రీచాగంటి సద్గురువులు మనకు శ్రీసీతారామలక్ష్మణహనుమ స్వామి సహితమైన చిత్రపటం ఓంకార స్వరూపమై ఉండడం గురించి చెప్పిఉన్నారు కద.....

అ కార
ఉ కార
మ కార

లకు శ్రీరామలక్ష్మణసీతమ్మ ప్రతీకలైతే

" ఉమ్మ్ " అని భ్రమరనాదం లా  ధ్వనించే ఆ ఓంకారనాదస్వరూపమే హనుమంతులవారు..........

అనగా నాదబ్రహ్మస్వరూపాత్మకంగా ఇక్కడ హరుడే హరీశ్వరుడైన హనుమంతుడు అవ్వడంవల్ల ఆతడు ప్రత్యక్ష పరబ్రహ్మమైన శ్రీహరికి అభిన్నమై వెలుగొందుతున్నాడు అనేది ఇక్కడి అధ్యాత్మ సత్యసూక్ష్మము....!!

ఈ ప్రపంచంలోని ప్రతి ప్రాణి కూడా
బ్రతికి ఉన్నడు అని చెప్పడానికి సదరు శరీరంలోని దశవాయువులే అందుకు సాక్ష్యం......

వాటిలోని పంచ ప్రాణాలు

1.ప్రాణ
2.అపాన
3.వ్యాన
4.ఉదాన
5.సమాన

మరియు పంచ ఉపప్రాణలు

6.నాగ
7.కూర్మ
8.కృకర
9.ధనంజయ
10.దేవదత్తము

ఈ పది వాయువులు నిరంతరం తమ తమ స్థానాల్లో శరీరధారకుడి హృదయకోశంలో " అంతర్యామి " గా నెలకొన్న పరమాత్మ ఆజ్ఞ్య మేరకు శరీరంలోని ఏ భాగంలో ఎంతపరిమాణంలో ఉండాలో ఆ మేరకు ఉండి మనల్ని నిత్యం సజీవంగా నిలుపుతున్నాయి......

ఒక ప్రాణికి ఇక భూలోక యాత్ర ముగించే సమయం ఆసన్నమైన సందర్భంలో పంచ ఉపప్రాణాల సంఘాతమై శరీరమంతాకూడా నాదరూపాత్మకంగా వ్యాపించి ఉండే ఆ నాదబ్రహ్మ వైదొలగడం ప్రారంభిస్తాడు........

అనగా మనలోనే కొలువైఉండే హనుమ స్వామి దూరం అవ్వడం అన్నమాట.....
అందుకే వారికి ఇహలోకసంబంధమైన ధ్వనులు వినిపించడం ఆగిపోతాయి.......

ఆ పంచ ఉపప్రాణాలు వైదొలగిన పిదప, ఇక పంచ ప్రాణాలు తమ తమ స్థానాలనుండి వైదొలగిన పిదప, హృదయకోశంలోని జీవుడు తుదకు జ్యోతిస్వరూపాత్మకంగా శరీరం నుండి బయల్వడి అంగుష్ఠమాత్ర తైజసిక దేహాన్ని ధరించి ఇక తన పరలోక యాత్రను ఆరంభిస్తాడు.....

అందుకే లౌకికంగా మొదట

పల్స్ చెక్ చేస్తారు......
ఆతర్వాత హార్ట్ బీట్....
అలా మిగతా ప్రాణసూచీలన్నీ చెక్ చేసి.....
ఆ కీలకసూచిలన్నీ కూడా శూన్యమైన పిదప ఇక అందులోనుండి
" శివం " సంపూర్ణంగా వైదొలగింది
అని ధృవీకరిస్తారు........

ఈ నిర్దేశిత విశిష్టమైన దశప్రాణవాయువులు తొలగిన పిదప ఇక అది శూన్యము కాబట్టి బయటి లౌకిక వాతావరణంలోని అన్ని రకాల విషవాయువులు ఆ పార్ధివదేహం లోకి ప్రవేశించి ఆ శరీరం తన సహజత్వాన్ని కోల్పోతు శిధిలమవ్వడం ప్రారంభమవుతుంది.......

ఆ విషపూరిత వాయురసాయనచర్యలవల్లే దేహం ఉబ్బడం, దుర్గంధం రావడం, కొయ్యబారిపోవడం ఇలా వింత వింత గా అయిపోతుంటుంది.......

బయట కాపలాగ ఉన్న సెక్యురిటి గార్డు వైదొలగిన తర్వాత రోడ్డు పై తెరిచి ఉన్న బంగారం దుకాణం లోకి చోరులు ఎగబడితే పరిస్థితి ఎట్లైతదో పరమాత్మ యొక్క ఆజ్ఞ్య సడలి అనుగ్రహం ఈ శరీరం నుండి వైదొలగినప్పుడు ఈ శరీరం యొక్క స్థితి కూడా అంతే......

అందుకే  శ్రీరాముడికి హనుమంతుడికి అంతరమేమి లేదు అని విశదీకరిస్తూ

"హరికి లంకినీ హంతకు అంతరమేటున్నది...." అంటూ అన్నమాచార్యులవారు ఎంతో రసరమ్యంగా ఆ శ్రీరామ, హనుమ స్వామి అనగా హరిహరుల అభిన్నతత్వాన్ని ఎంతో హృద్యమైన సంకీర్తన గా రచించి లోకానికి అందించారు......

ఆత్మరాముడిగా ప్రతీప్రాణియొక్క హృదయకోశంలో దేదీప్యమానంగా వెలుగుతూ కొలువైన పరమాత్మ అయిన శ్రీహరి కలియుగ శ్రీనివాసుడైతే, ఆ హృదయకోశమునుండి శరీరానికి అన్నివైపులా కొన్ని వేల మెగాహెర్ట్జ్ పౌనహ్పున్యంతో విరజిమ్మబడే నాదస్వరూపమే హనుమంతుడు......!

మా ఇంటిదెగ్గరి వివేకానందనగర్లోని శ్రీమదలర్మేల్మంగా పద్మావతీ ఆండాళ్ సమేత శ్రీవేంకటేశ్వరస్వామి వారి సన్నిధిలో,
శ్రీ వికారి ఫాల్గుణ శుద్ధ ఏకాదశ్యోపరిద్వాదశి, భృగువాసర పుష్యమి నక్షత్ర యుక్త మేషలగ్న సుముహూర్తంలో, 06-మార్చి-2020 ఉదయం 9.51 నిమిషాలకు,
శ్రీపాంచరాత్రాగమోక్త పాంచాహ్నిక ప్రతిష్ఠామహోత్సవం జరిపించుకొని కొత్తగ వచ్చి కొలువైన
శ్రీ కార్యసిద్ధి అభయాంజనేయస్వామి వారి నూతన ఆలయ గోపుర శిఖరం...... 😊

కొండగట్టులో కొలువైన హనుమంతులవారికోసం శ్రీలక్ష్మీవేంకటేశ్వరస్వామివార్లు వచ్చి ఇరువైపులా కొలువైఉంటే.......

ఇక్కడ శ్రీలక్ష్మీవేంకటేశ్వరస్వామివార్ల కోసం హనుమంతుడు వచ్చి అభయముద్రలో కొలువైనాడు....!!

" ఏమయ్య హనుమయ్య, స్వామివారు వచ్చి కొలువయ్యాక వెంటనే రాక నీకు దాదాపు 3 దశాబ్దాలు  పట్టిందేమయ్య కొలువై ఉండడానికి.....? "

అనే నా తుంటరి ప్రశ్నకు స్వామి వారి అంతే తుంటరి సమాధానం.....

" మరి  ' Speed of the light is faster than that of the sound....' కదర అందుకనే అంతర్యామి అయిన స్వామి వచ్చాక నాకు రావడానికి కొంచెం టైం పట్టింది...!! " 😂

శ్రీఅభయాంజనేయసహితశ్రీశ్రీనివాసపరబ్రహ్మణేనమః.....!  😊🙏

No photo description available.
Image may contain: tree, sky and outdoor
Image may contain: text

Tuesday, March 3, 2020

శ్రీవేంకటాచలాధీశంశ్రియాధ్యాసితవక్షసం శ్రితచేతనమందారంశ్రీనివాసమహంభజేత్.....🙏😊

శ్రీవేంకటాచలాధీశంశ్రియాధ్యాసితవక్షసం
శ్రితచేతనమందారంశ్రీనివాసమహంభజేత్.....🙏😊

శ్రీ కి నివాసం గా నెలకొన్నవాడుకాన " శ్రీనివాసుడు " అని కద అర్ధం..... శ్రీకారం లేనిచో " నివాస్ " అనే పదానికి అంతగా ప్రాముఖ్యత ఏమి ఉండదు కద.....

అనగా తన శక్తిస్వరూపం ఉరమందుకొలువైన పిదప ఆతడు శ్రీనివాసుడయ్యాడు........

అప్పటివరకు ఎన్నో బాధలకోర్చి శ్రీశుకపురంలో పద్మసరోవరాన్ని తానే స్వయంగా ఏర్పాటు చేసి దేవలోకమునుండి పసిడిపద్మాలను తెచ్చి అవి సదావికసితముగా ఉండేలా 
సూర్యభగవానుడిని ఆ కొలను ఎదురుగా నెలకొని ఉండి ఆ పసిడిపద్మాలు వాడిపోకుండా తన సూర్యరష్మితో సమ్రక్షించమని
తెలిపి కఠోర తపమాచరించగా, కరవీరవాసినిగా కొలువైఉన్న తన సతీమని శ్రీపద్మావతిదేవిగా ఆ పసిడిపద్మాలనుండి ప్రభవించి స్వామిని చేబట్టి,
భృగుమహర్షి పాదతాడనానికి అలిగి శ్రీవైకుంఠాన్ని మరియు స్వామివారి వక్షసీమను వీడి భులోకానికి వెళ్ళిపోయిన ఆ శ్రీపతి సతి తిరిగి పద్మావతీదేవిగా ఆ వక్షసీమను అలంకరించి స్వామిని శ్రీనివాసుడిగా చేసింది......
భూవైకుంఠమైన తిరుమల దిగువన తను అవతరించిన ఆ తిరుశుకపురిని 
తన అవతారవిశేషం ఈ కలియుగాంతంవరకు కూడా భక్తులెల్లరికి గుర్తుండేలా స్వతంత్రవీరలక్ష్మిగా శ్రీతిరుచానూరుపద్మావతీదేవి గా 
ఊర్ధ్వహస్త కమలధారిణి యై, దక్షిణ వరద అభయ హస్తాలంకృతయై శ్రీ నారయణమహర్షి స్థిరీకరించిన అర్చారాధనా విధానమైన శ్రీపాంచరాత్రాగమసేవితయై,
కొలిచినభక్తుల కొంగుబంగారమై కలియుగ ప్రత్యక్ష శ్రీమహాలక్ష్మియై వెలసిన వైనం కడు రమ్యమైనది......

ఒకానొక సందర్భంలో పురప్రజలందరి సమక్షంలో అన్నమాచార్యులవారి పిలుపుకు పలికి
తన భక్తపరాధీనతను లోకానికి
చాటిచెప్పిన ఆ శ్రీదేవి అపారమైన భక్తవాత్సల్యం గల దయామయి.......

శ్రీచాగంటి సద్గురువులు శ్రీవేంకటేశ్వరవైభవ ప్రవచనంలో మనకు విశదీకరించినట్టుగా,
తన పతికి ఫలాన భక్తుడి పట్ల బాగ కరుణించి వారికి శ్రేయస్కరమైన కావలసినవన్నీ కూడా కటాక్షించమని ప్రత్యేకంగా సిఫారసు చేసి ఆ శ్రీవేంకటలక్ష్మీనారాయణులిరువురు కావించే విశేషమైన భక్తసమ్రక్షణ, ప్రసాదించే అనుగ్రహం అమేయం.......

" నీరు కొలది తామర....." అని అన్నమాచార్యులు తమ "ఎంత మాత్రమున ఎవ్వరు తలచిన అంతమాత్రమే నీవు...." అనే సంకీర్తనలో వివరించినట్టుగా మనము ఎంత అనుకుంటే దైవము అంత.......

మనం దైవం అనగా ఇంత......
అని అనుకుంటే వారు అంతే.......

మనము దైవము అనగా అంతా.....
అని అనుకుంటే వారే అంతా.......

అనగా మనకు అన్నీ వారై, అన్నిటా వారై, మన జీవితాల్లో వారు మమేకమవుతారు..........

"శ్రీనివాస కల్యాణం / పద్మావతీపరిణయం  అనే ఆధ్యాత్మిక క్రతువులో శాస్త్రవిహితమైన, సద్గురుప్రోక్తమైన విధంగా శ్రద్ధాసక్తులతో పాల్గొని సర్వస్యశరణాగతి గావించి భక్తిప్రపత్తులతో ప్రణమిల్లినవారికి ఈప్సితములన్నీ దైవానుగ్రహంగా ఈడేరి సకలకల్యాణసంవృద్ధితో జీవితాలు సుఖశాంతిసంపదలతో చతుర్విధపురుషార్ధసిద్ధితో పరిపూర్ణమవుతాయి....." అని పెద్దలు చెబితే, వారి వాక్కులయందు శ్రద్ధ విశ్వాసం గలవారికి ఆ అనుగ్రహఫలం లభించడం మరియు ఏదో " మమ " అన్నట్టుగా ఏదో చేసామ లేదా అనే ధోరణిలో ఉండేవారికి దైవానుగ్రహం ఎప్పుడూ ఇంకా ఆమడదూరంలోనే ఉంటుంది అని నేనంటే, కుతర్కానికి ఎల్లప్పుడు కాలుదువ్వే కొందరు సమ్మతించకపోవచ్చు.......

" అదే గుడి, అదే దైవ మూర్తి, అదే బ్రాహ్మాణోత్తముడు, అదే కల్యాణ క్రతువు, అదే మంత్ర / శ్లోక పఠనం అదే ప్రసాదం.....
కదా.....
మరి అందరికి ఆ దైవానుగ్రహం ఒకేలా ఉండాలి కద అనేది సాధారణంగా హేతువాదులు అనే పేరుతో పిలవబడే అతివాదుల యొక్క 
నిరర్ధక తర్కం......

జీవాత్మ పరమాత్మలను అనుసంధానించి అనుగ్రహం అనే ప్రార్ధనాఫలాన్ని ఒసగే ఆ విశ్వాసభరిత భక్తిప్రపత్తుల గురించి ఈ క్రింది ఒక చిన్న లౌకిక ఉదాహరణతో సమన్వయపరిచి తేలికగా అర్ధమయ్యేలా చెప్పే ప్రయత్నం చేస్తాను.......

" మూడు పూటలా తినడం, తిన్నదరిగేందుకు ఊరిమీదపడితిరగడం, మధ్య మధ్యలో మందు, సిగరెట్లు, గుట్కాలు, ఇత్యాది వాటితో విషాన్ని ఒంట్లోకి నింపడం, భక్తి భగవంతుడు గుడి గోపురం అంటూ పద్ధతిగా ఈశ్వరుడి ప్రీత్యర్ధమై జీవించే వారిని దూషిస్తూ బ్రతికేశైలితో జీవితాన్ని వారికి వారే భారంగా మార్చుకొని, చుట్టూ ఉన్న వారికి కూడా భారంగా జీవించడం, ఎంత చెప్పినా కూడా నలుగురు అభినందించే రీతిలో, లేదా కనీసం చుట్టూ ఉన్నవారిని కష్టపెట్టకుండా ఒక పద్దతితో కూడిన జీవితం జీవించడానికి ససేమిరా సమ్మతించని వ్యక్తి,
"నేను హేతువాదిని......." అని....
పైన చెప్పిన విధంగా భక్తి అంటే చాలు 
కయ్యానికి కాలుదువ్వే ఆంబోతులా విరుచుకుపడటాన్ని...... " 

లోకజ్ఞ్యానం లేని ఒక ఊర్లోని పసులకాపరితో పోల్చి,
" సెల్ పోన్ల టక్కుం టక్కుం అని ఏల్లతో నొక్కి నీ బ్యాంకుల పైసలేసిన అంటుండే గా పొరగాడు.......!
గిదేం సిత్రమోనుల్ల.....
నాకు పోను కనిపిస్తాంది కాని పైసలెం అగుపడ్తలేవు......గిప్పుడెట్ల నమ్మాల్నే నా బ్యాంకులకు పైసలొచ్చినయంటే....? "

అని.....ఆ వ్యక్తి హై హై అని అరుస్తూ పశువులను అదిలిస్తూ నిట్టూరుస్తూ ముందుకు సాగడాన్ని పైన ఉన్న హేతువాది యొక్క ప్రశ్నగా భావించగలిగితే........
ఆ పసులకాపరికి గా పోరగాడు ఏం సమాధానం జెప్పాలే....?

1. You see...... There is an Android banking application installed in my cell phone.....
With proper credentials I have logged in and started a "session" that times out in 5 minutes. I have filled in your bank account details from the payee section. Once that goes through the necessary client and server side validations, the session will authenticate me against the bank's database via JDBC feature of the Application Server ( Oracle Weblogic, 
IBM WebSphere, Apache Tomcat etc configured to receive my HTTP request via the various HTTP servers like IBM HTTP, Apache Tomcat, MS IIS, and so on.....) on which this application is deployed in an exploded archive format. It will also allow me to choose if I can defer this payment for a specific duration so that you can come online to verify my instant money transfer via the configured messaging systems using asynchronous transactional methodologies
 ( IBM MQ, TIBCO EMS, and so on.... )
Once my pay gets credited to your bank account it will trigger a message as a payload to the SOAP ( Simple Object Access Protocol )  that invokes a configured SMS gateway which then sends the payload as a message to your cell phone. You can then verify and believe that I have indeed transferred you some money.....😊"

అని చెప్పాలి......లేదా.....

2. " నిజంగనే ఏసిన నన్ను నమ్మురా నాయన....
నీకు నిజంగా సొమ్ము అందుతది...... బ్యాంకుకు పోయి పైసలు తీస్కొపో....."

అని చెప్పాల్సుంటది.....

అవునా.....??

అచ్చంగా అదే విధంగా ఆధ్యాత్మికతలో ఓనమాలు కూడా సరిగ్గాదిద్దుకోకుండా కుతర్కం సాగించే ఆ హేతువాదికి,

1. You see.....

" ఇక్కడ శ్రీపాంచరాత్రాగమశాస్త్రోక్తంగా
కడు శ్రధాభక్తులతో ఆచార్యులందరు కలిసి శ్రీనివాసకల్యాణం నిర్వహిస్తారు......
ఈ విధంగా కల్యాణకైంకర్యపరులుగా పాల్గొన్నవారికి కంకణధారణ చేయించి యావద్ కైంకర్యపర్యంతం వారు శౌచసిద్ధులై ఉండేలా చూస్తారు.....

స్థలశుద్ధి,
ద్రవ్యశుద్ధి,
మంత్రశుద్ధి,
ఆచారశుద్ధి,
ఇలా సకల విధమైన శుద్ధిసిద్ద్యర్ధం

స్వస్తిపుణ్యాహవచనం, గావిస్తారు.....

విష్వక్సేనారాధన తో మొదలై స్వామివారి, అమ్మవారి కల్యాణముత్యాలతలవ్రాల పర్యంతం 
( తలంబ్రాలు ) వివిధ క్రతువులు జరుపుతారు......

ఎంతో పుణ్యప్రదాయకమైన మహాసంకల్పపఠనం గావిస్తారు...ఇరువురి ప్రవరను పఠిస్తారు.....
శతమానములకు లక్ష్మీపూజ / సర్వమంగళాపూజ గా కుంకుమ పూజ నిర్వహిస్తారు..... అందులో భాగంగా
ఆ కుంకుమపరాగములకు సోకిన సర్వమంగళానుగ్రహం అది ధరించిన  భక్తులెల్లరికి లభించి వారందరికి భగవదనుగ్రహంగా కోరికలు సిద్ధిస్తాయి.........

అక్కడికి సమంత్రకంగా ఆహ్వానించబడిన / ఆవహించబడిన వివిధ దేవతా శక్తులు భక్తులందరిని ఎంతో క్షుణ్ణంగా పరిశీలిస్తారు......
ముఖ్యంగా అన్నికాలాల్లో అన్నిలోకాలకు తిరుగుతూ ఉండే దేవవైద్యులైన అశ్వినీదేవతలు అక్కడి భక్తుల మనోభావాలను సైతం అధ్యయనం గావించి వారి వారి కొర్కెలను ఆ కల్యాణక్రతువు ఉద్దేశ్యించబడిన దేవతా శక్తికి విన్నవించి వారందరి ఈప్సితములను ఈడేరుస్తారు......

( ఏ విధంగా ఒక సశాస్త్రీయ యజ్ఞ్య క్రతువులో స్వాహాకారంతో అందివ్వబడిన హవిస్సు అగ్నిదేవునిచే 
ఉద్దేశ్యించబడిన దేవతా శక్తికి అందివ్వబడుతుందో.....
అవ్విధముగా అన్నమాట..... ) 

వారి సాక్షిత్వాన్ని సోమసూర్యాగ్నులు, చతుర్వేదాలు, పంచభూతాలు, షడృతువులు, పంచాంగాంతర్గతమైన సప్తవాసరములు, అష్టదిక్పాలకులు, నవగ్రహాలు, ఇత్యాదిగా ఉండే శాశ్వత తత్త్వాలన్నీ కూడా వహించి ఇహపరాలకు అందించి ఆ పుణ్యబలం కైంకర్యపరులైన జీవులకు ఎప్పుడూ ఉండేలా అనుగ్రహిస్తారు......
తద్వార ఆ పుణ్యబలం నీకు ఎప్పుడు ఎక్కడ ఎందుకు ఆలంబనగా అందించి నీ యోగక్షేమాలు చూడాలో ఆ పరమాత్మ తన దక్షిణాయన చాతుర్మాస్య యోగనిద్రలో లెక్కలుకట్టి తద్వార ఆ జీవుడి ఉద్ధరణకు బాటలు వేస్తాడు......
ఆ విధంగా నీకు ఆ కల్యాణక్రతువులో శ్రద్ధాభక్తులతో పాల్గొన్న పుణ్యం లభిస్తుంది నాయనా......"

అని చెప్పవలసి ఉంటుంది......

లేదా 

2. " పరంపరాగతమైన ఆచార్యులు / సద్గురువులు నుడివిన సనాతన ధర్మశాస్త్రంపై భక్తిప్రపత్తులతో
సంపూర్ణ శ్రద్ధావిశ్వాలాతో వాళ్ళు చెప్పింది ఆచరించి పుణ్యాన్ని సముపార్జించుకో నాయనా...." అని చెప్పవలసిఉంటుంది......

ఆ పసులకాపరికి మొదటి సమాధానం చెప్తే........

" నా బ్యాంకులకు పైసలెట్ల పంపినవ్ర పోరగా అంటే.....
యాపిల్లు యాపు సర్వర్లు సర్వపిండి అంటానవెంద్ర బిత్తిరిగా...... నువ్వెం మాట్లాడ్తానవో జర నీకన్న ఎర్కేనా...? సరే తి....మొత్తానికి నీ పోన్లకెల్లి నా బ్యాంకులకు పైసల్ పోయినవ్ అంటవ్.....గంతేగద....
సరే నమ్ముతన్లే....పొద్దుకూకుతాందిర
పాలుపితికి గొడ్లకు గడ్డి పట్కపోవాలే.....నేనొత్త మరి...."

అని తన దార్లో తాను సాగిపోతాడు కద......

If the former is explained to the herd keeper, he would rather look at you quite astonishingly and might even make fun of you saying.......
" What did you just say.....?
It looks some Greek and Latin to me and you seem to be really a weird guy who is talking about some app servers and web servers and all that which I don't even understand what it means to listen to it....
I know only apples and spider webs that's all....... Ok I better simply believe that your few clicks on the mobile will get me some money in to my bank account....... "

Similarly if you say the former explanation about the detailed devotional / spiritual process involved in the SreenivaasaKalyaanaKainkaryam to that 
guy who is full of only materialistic beliefs and no spiritual beliefs at all, 
he would rather look at you in a quite bizarre manner and say.....
" What did you just say....? 
Mahaasankalpam and all that something else just sounds all Greek and Latin to me...... I don't even understand what it means to listen to it......
Ok I better just listen to you and believe that God will hear my sincere prayers and answer them accordingly....."

Now which among these is true and which isn't....?? 

All of them are indeed true in their respective perspective. Its just that the person you are dealing with hasn't yet elevated himself / herself to those required intellectual heights to include an all inclusive optimistic belief in what is being explained technically as to how that entire bank transaction takes place right from originating as a simple mobile device' client operation and concluding on the bank's App server after it triggers the credit acknowledgement message to the destined mobile user / recipient after it traverses through those many enterprise J2EE layers stacked up together to be referred to as 
" The Technical Transactional Entities formed by grouping various software modules configured to work together in an inter operable fashion to ensure the end to end user transaction gets executed successfully in order to achieve the underlying business logic laid out by the corresponding banking firm....."

కాబట్టి ఇక్కడ వ్యక్తి భేదమే తప్ప....వ్యష్టిభేదం లేదు.....

అదే విధంగా విశ్వాసము / ఎరుక అనే భేదాలే తప్ప 
తత్త్వతః వారు వీరు అనే భేదభావాలు లేకుండా
భగవంతుడు ఎల్లప్పుడు అందరికీ శ్రేయోదాయకుడే...... ఆ భగవద్ అనుగ్రహానికి పాత్రతను సంతరించుకొవడమే ప్రతి జీవుడి యొక్క విహిత ధర్మం......
అదే సదరు వ్యక్తి యొక్క ఇహపర ఉన్నతికి దోహదపడే స్వార్జితము...😊

సరే, మిగతావన్ని ఎలా ఉన్నా, మనుష్యుడికి అత్యంత శ్రేయోభరితమైన మానసిక ప్రశాంతతను ఇవ్వగలిగేది కేవలం స్వరసిద్ధమైన శుద్ధగానం......
అందునా అది వేదమూర్తులచే ఆలపించబడే భగవద్గుణగానమైనప్పుడు అది ప్రసాదించే అనుగ్రహం అమేయం....!!

కాకినాడ లో శ్రీచాగంటి సద్గురువుల ఆధ్వర్యంలో 2013 లో జరిగిన మొట్టమొదటి శ్రీవేంకటేశ్వరవైభవోత్సవాల్లో
శ్రీనివాసగద్యాన్ని ఎంతో హృద్యంగా స్వరశుద్ధితో సామగానం లా ఆలపించి అక్కడి భక్తులందరికీ కూడా ఎంతగానో భగవదనుగ్రహం సిద్ధింపజేసిన ఈ తి.తి.దే వేదఘనాపాఠి ( మీరు ఫోన్ స్క్రీన్ చూస్తున్నప్పుడు మీకు ఎడమభాగంలో చివరన ఎర్రని పైపంచె వేస్కొని ఆలపించేవారు...)
గారి స్వరం మళ్ళీ ఇన్నాళ్ళకు నాకు యుట్యూబ్లో లభించింది...... మీరు కూడా ఒకసారి విని తరించండి.....
ఆ అత్యంత కర్ణపేయమైన శ్రీనివాసగద్య లహరిని..... 😊

శ్రీమదలర్మేల్మంగాపద్మావతీసమేతశ్రీశ్రీనివాసపరబ్రహ్మణేనమః.....🙏😊

---------------------------------------------------------------------
65.Entha Matramuna Evvaru Talachina - ఎంత మాత్రమున ఎవ్వరు తలచిన

Audio link : MS Subbalakshmi
Audio link : G.BalaKrishnaPrasad
Archive link :
Ragamalika, Composer : K.Venkataraman
ఎంత మాత్రమున ఎవ్వరు తలచిన, అంతమాత్రమే నీవు
అంతరాంతరములెంచి చూడ, పిండంతేనిప్పటి అన్నట్లు

కొలుతురు మిము వైష్ణవులు, కూరిమితో విష్ణుడని
పలుకుదురు మిము వేదాంతులు, పరబ్రహ్మంబనుచు
తలతురు మిము శైవులు, తగిన భక్తులునూ శివుడనుచు
అలరి పొగడుదురు కాపాలికులు, ఆది భైరవుడనుచు

సరి మిమ్ముదురు సాక్తేయులు, శక్తి రూపు నీవనుచు
దరిశనములు మిము నానా విధులను, తలుపుల కొలదుల భజింతురు
సిరుల మిమునే అల్పబుద్ది, తలచినవారికి అల్పంబగుదవు
దరిమల మిమునే ఘనమని తలచిన, ఘనబుద్ధులకు ఘనుడవు

నీవలన కొరతే లేదు మరి నీరు కొలది తామరవు
ఆవల భాగీరధి దరి బావుల ఆ జలమే ఊరినయట్లు
శ్రీ వేంకటపతి నీవైతే మము చేకొని వున్న దైవ(ము)మని
ఈవలనే నీ శరణనిఎదను, ఇదియే పరతత్వము నాకు

eMta maatramuna evvaru talachina, aMtamaatramae neevu
aMtaraaMtaramuleMchi chooDa, piMDaMtaenippaTi annaTlu

koluturu mimu vaishNavulu, koorimitO vishNuDani
palukuduru mimu vaedaaMtulu, parabrahmaMbanuchu
talaturu mimu Saivulu, tagina bhaktulunoo SivuDanuchu
alari pogaDuduru kaapaalikulu, aadi bhairavuDanuchu

sari mimmuduru saaktaeyulu, Sakti roopu neevanuchu
dariSanamulu mimu naanaa vidhulanu, talupula koladula bhajiMturu
sirula mimunae alpabuddi, talachinavaariki alpaMbagudavu
darimala mimunae ghanamani talachina, ghanabuddhulaku ghanuDavu

neevalana koratae laedu mari neeru koladi taamaravu
aavala bhaageeradhi dari bAvula aa jalamae oorinayaTlu
Sree vaeMkaTapati neevaitae mamu chaekoni vunna daiva(mu)mani
eevalanae nee SaraNaniedanu, idiyae paratatvamu naaku
-----------------------------------------------------------🙏😊