Thursday, June 29, 2023

శ్రీకరమైన 2023 శోభకృత్ నామ సంవత్సర ఆషాఢ బోనాల ఉత్సవం / జాతర మరియుఆషాఢ శుద్ధ ఏకాదశి / తోల్ ఏకాదశి / దేవశయన ఏకాదశిపర్వదిన శుభాభినందనలు....🙂🍧🍨🍑🍊😊💐🍎🍿

శ్రీకరమైన 2023 శోభకృత్ నామ సంవత్సర ఆషాఢ బోనాల ఉత్సవం / జాతర  మరియు
ఆషాఢ శుద్ధ ఏకాదశి / తోల్ ఏకాదశి / దేవశయన ఏకాదశి పర్వదిన శుభాభినందనలు....🙂🍧🍨🍑🍊😊💐🍎🍿

ఈ లోకంలో కొన్ని డైలాగ్స్ / పదాలను వినే ఉంటారు...

అంగబలం / అనుచరబలం,
అర్ధబలం,
అధికారబలం,

సాధారణంగా జనాలు వీటి చుట్టే పరుగులు పెట్టడం ఈ లోకరీతిగా గమనించే ఉంటారు.....

వీటికి తోడుగా బుద్ధిబలం / దైవబలం అనే పదాలను కూడా ఎప్పుడో ఎక్కడో వినే ఉంటారు కద....

"నాకెంత అంగబలం / అనుచరబలం  ఉందో తెలుసా...
ఒక్క పిలుపు ఇస్తే కోనసీమ నుండి కోకాపేట్ వరకు మా వాళ్ళు నాకోసం రడీగా ఉంటారు...."
అని ఒకరు తమ అంగబలం / అనుచరబలం గురించి మాట్లాడగలరేమో....

"నాకెంత అర్ధబలం ఉందో తెలుసా...
రేపు మా తండ్రి గతిస్తే బంగారంతో సమాధి కట్టి, బంగారు విగ్రహం పెట్టి, రోజు బంగారుపూలతో అర్చన చేస్తూ అందరికీ ఆ బంగారుపూలను పంచేంతగా...."
అని ఒకరు తమ అర్థబలం గురించి మాట్లాడగలరేమో....

"నాకెంత అధికారబలం ఉందో తెలుసా....
సి.సి.టి.వి కెమెరాలను స్విచాఫ్ చేయించి , ఒక సామాన్య మధ్యతరగతి వ్యక్తిని బాధించి, సిగ్గుశరం లేకుండా తిరిగి వాడి సొమ్మే దోచుకొని, ఏదో ఘనకార్యం సాధించినట్టు అధికారదర్పాన్ని ప్రదర్శించేంతగా...."
అని ఒకరు తమ అధికారబలం గురించి మాట్లాడగలరేమో....

కాని బుద్ధిబలం / దైవబలం అనేవి అమేయమైనవి....
ఎందుకంటే అవి కేవలం భగవంతుడి అనుగ్రహంగా దేశకాలానుగుణంగా ఉద్భవించే దైవిక సద్గుణ సంపద....

శ్రీలలితాసహస్రనామ ప్రవచనాల్లో...
" అరుణాం కరుణాతరంగితాక్షీం " అంటూ
ఒకసారి అమ్మవారి క్రీగంటి చూపుల మహత్తును మరియు ఇంకోసారి అమ్మవారి విశాల దృక్కుల మహత్తును
(ఆకర్ణదీర్ఘనయనా...అంటూ భీమవరం మావుళ్ళమ్మ తల్లి విశాల నేత్రద్వయాన్ని) వర్నిస్తూ శ్రీచాగంటి సద్గురువులు అమ్మవారి అనుగ్రహవైభవాన్ని బహుధా కొనియాడిన ఆ మహిమాన్విత ప్రవచనాలసారం చాలామంది భక్తులకు గుర్తుండే ఉంటుంది......
మరియు అథాంగపూజలో " ఓం నేత్రేపూజయామి " అనేటప్పుడు మందగించవలసిన మంత్రోఛ్చారణ వేగం గురించి కూడా వివరించడం కొంతమందికైనా గుర్తుండే ఉంటుంది....
మరియు 
" వక్త్రలక్ష్మీపరీవాహచలన్మీనాభలోచన... "
అనే నామవైభవంలోని మీనాక్షి తత్త్వ వైభవ వర్ణన కూడా చాలామంది భక్తులకు గుర్తుండే ఉంటుంది......
మరియు 
" ఉన్మేషనిమిషోత్పన్నవిపన్నభువనావళిః..."
అనే నామవైభవంలో అమ్మవారు చూపులతోనే విశ్వాన్ని శాసించే వైభవాన్ని కూడా చాలామంది భక్తులు వినితరించి ఉంటారు.....

ఇన్నిన్ని తత్త్వాలతో...ఇంతటి వైభవంతో అలరారే దేవతానేత్రజనిత అనుగ్రహం అంతటి శక్తివంతమైనది కాబట్టే.....
జలాధివాసం....ధాన్యాధివాసం...
ఇత్యాది ముఖ్యమైన క్రతువులతో దేవతాశక్తిస్థిరీకరణ జరిగిన తదుపరి సదరు దేవతామూర్తి ప్రతిష్ఠాపన మహోత్సవంలో 
" నేత్రనిమీలనం " అనే అతిముఖ్యమైన ప్రక్రియలో ఆ దేవతామూర్తి ఆయా వైదిక క్రతువులతో సంతరించుకున్న దైవికశక్తిసాంద్రతను కనుగొని తదనుగుణంగా ఆ దేవతానిత్యారాధనలో పాటించవలసిన నిత్య నివేదన ప్రక్రియల గురించి నిష్ణాతులైన ఋత్విక్కులు అక్కడి అర్చకబృందానికి తెలియజేసి ఆ దేవతామూర్తినేత్రమండల స్థిరీకృత దైవికపరారుణశక్తి అట్లే అశేషభక్తకోటిని అనుగ్రహిస్తూ ఉండేలా మన సనాతన ధర్మశాస్త్రం ఎంతో మహత్వపూర్ణమైన ఆచార వ్యవహారావైభవంతో పరిఢవిల్లే ఆలయ వ్యవస్థను మనకు అనుగ్రహించినది.....
ఇది నాణానికి ఒక పార్శ్వం....

పారదర్శక/నిస్వార్ధ ఆలయ పరిపాలక / ఆర్ధిక/కోశాగార వ్యవస్థ, సదాచారసంపన్నభరిత సద్బ్రాహ్మణ ఋత్విక్ / అర్చక వ్యవస్థ...అనగా " స్థల శుద్ధి & సంవృద్ధి + ద్రవ్య శుద్ధి & సంవృద్ధి + ఆచార శుద్ధి & సంవృద్ధి + మంత్ర శుద్ధి & సంవృద్ధి " కలిగిఉండడం అన్నిచోట్లా అందరికీ సాధ్యపడదు.... అన్నిచోట్లా ఘనంగా వ్యయప్రయాసలకు ఓర్చి గొప్పగొప్ప ఆలాయాలను నిర్మించి వాటి సమయాచారానుగుణంగా జరగవలసిన దైవిక వైదిక క్రతువుల వైభవంతో అలరారేలా పర్యవేక్షించడం అందరికీ కుదిరే పనికాదు....

అందుకే ఊరువాడాపల్లెపట్నం ఎల్లప్పుడూ క్షేమంగా ఉండేలా "గ్రామదేవతలు" అనే పదంతో పిలవబడుతూ వర్ధిల్లే "పొలిమేరదేవతలు" / వారిని ఉద్దేశ్యించి జరిగే జాతరలు / ఉత్సవాలు, మన పురాతన భారతం నుండి ఈనాటివరకు కూడా అనాదిగా కొనసాగుతున్న ఒక నైసర్గికాచార వైభవం.....

పురప్రజలు స్వయంగా వారే అమ్మవార్లకు నివేదన సమర్పించి, ఆయా గ్రామదేవతల ఆశీస్సులతో అంటురోగాలు, ఈతిబాధలు, దుష్టదిష్టిబాధలు ఇత్యాది వాటినుండి వారి 
ఊరువాడాపల్లెపట్నం రక్షింపబడేలా వార్షిక భోగం / నివేదన సమర్పణను ఒక ఉత్సవం గా / జాతరగా ఆచరిస్తూ ఆ పరాశక్తి అనుగ్రహాన్ని అందుకొని తరిస్తున్నారు...
ఈ గ్రామదేవతల జాతర గురించి కూడా, సామాన్యులకు కూడా అర్ధమయ్యే పరిభాషలో వివరించిన బ్రహ్మజ్ఞ్యానఘనులుగా శ్రీచాగంటి గారి ప్రవచనాస్వరం ఎందరెందరికో నిత్యమననీయమైనది....

నూకాలమ్మ గా,
తలుపులమ్మ గా,
మరిడమ్మ గా,
పోచమ్మ గా,
ఎల్లమ్మ గా,
ఇత్యాది ఎన్నెనో పేర్లతో అలరారే ఆ పరాశక్తి వైభవం ఎంతో హృద్యంగా వివరింపబడడం చాలమందికి గుర్తుండేఉంటుంది....

ఆక్కడ ఆలయాల్లో ఆయా వేదమూర్తులు వారివారి ఉన్నతమైన సవైదిక జ్ఞ్యానస్థాయిలో గావించే భగవద్ నివేదన....
ఇక్కడ మందిరాల్లో సామన్యప్రజలు వారివారి సాధారణస్థాయిలో గావించే భగవతి నివేదన....
రెంటినీ కూడా సమంగా స్వీకరించి ఎల్లరినీ కూడా చల్లగా అనుగ్రహించే ఆ ఆదిపరాశక్తి గురించి హరిహరాదులే వర్నించలేక
" అంబికాఽనాదినిధనా హరిబ్రహ్మేంద్రసేవితా..." 
" శివదూతీ శివారాధ్యా శివమూర్తిః శివంకరీ..."
ఇత్యాది లలితా నామాలతో వర్నింపబడే విధంగా....

ఆ పరాశక్తి తత్త్వం అమేయం, అగ్రాహ్యం, అగోచరం.....

సగటు సమాన్య భక్తుడు ఒక వేపచెట్టుకు పసుపుకుంకుమ రాసి పిలిచినా పలికే కారుణ్యమూర్తిగా ఉంటూనే....
" ఆబ్రహ్మకీటజననీ వర్ణాశ్రమవిధాయిని..." గా బ్రహ్మజ్ఞ్యానులచే ఆరాధింపబడే ఆదిపరాశక్తికి ఈ ఆషాఢమాసంలో మేలుకొలుపు జాతరగా / మహానివేదన జాతరగా వర్ధిల్లే " బోనాల ఉత్సవం " తెలంగాణ నైసర్గిక మహోత్సవంగా, మరీముఖ్యంగా హైదరాబాద్ మహానగరానికి మణికిరీటమైన మహోత్సవంగా వర్ధిల్లుతూ ఇక్కడ నివసించే పురప్రజలను చల్లగా అనుగ్రహించే వరదైవంగా నగరం నలువైపులా కొలువైన ప్రముఖ మందిరాల్లో / ఆలయాల్లో ఒక్కో ఆదివారం ఒక్కో ప్రదేశంలోని ఆలయాల్లో బోనం స్వీకరిస్తూ ఆషాఢ ఆదిశక్తిగా మేల్కొని, దక్షిణాయణకాలపగ్గాలను, తొలిఏకాదశి దేవశయన ఏకాదశి తో యోగనిద్రలోకి జారుకునే తన అన్న శ్రీమన్నారాయణుడి నుండి అందుకొని, విశ్వాన్ని పరిపాలించే ఆ పరాశక్తి ఒక్కోచోట ఒక్కో స్థలపురాణం / ఐతిహ్యం తో అలరారుతూ ఉండడం అనేది ఈ సనాతన భారతదేశం యొక్క విశేషం.....

ఒకవైపు ఆకాశాన్నంటే హర్మ్యాలతో, విశ్వనగరంగా భాగ్యనగరం ప్రపంచంలో ఒక అగ్రగామి నగరంగా దినదినాభివృద్ధి సాధిస్తూ శరవేగంతో మున్ముందుకు దూసుకుపోతూ...,
నాడు పదుల సంఖ్యలో, నేడు వందల సంఖ్యలో, రేపు వేలసంఖ్యలో ప్రపంచం నలుమూలలనుండి విమానాలు
భాగ్యనగరానికి Q కడుతూ ఉన్నా,
భారతదేశంలో శాంతిసౌఖ్యాలతో, మతసామరస్యంతో అలరారే నగరాల్లో ఒకటిగా హైదరాబాద్ అలరారుతున్నా...
దేశం నలుమూలలనుండి ఇక్కడికి వచ్చిన ప్రజలు ఆకలిదప్పికలతో అలమటించకుండా అందరికీ అన్నం దొరికి సుఖనిద్రలభించేలా జీవిస్తున్నా....,
అందుకు ముఖ్యకారణం ఇక్కడి విశేషమైన ఆదిపరాశక్తి ఆరాధన....భాగ్యనగరం నలువైపులా ఎన్నెన్నోపేర్లతో కొలువై ఉన్న నగరలక్ష్మిగా, నగరదేవతగా, ఆ భాగ్యలక్ష్మి ఆదిపరాశక్తి వైభవానికి దర్పణంపట్టే జనజాతరగా ఖ్యాతిగడించిన బోనాల ఉత్సవం అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన ఉత్సవంగా వినుతికెక్కిన తెలంగాణ రాష్ట్ర ఉత్సవం........

ఎన్నో స్వయంభూ ఆలయాలతో పాటుగా నెలకొన్న..... మానుష ప్రతిష్ఠ ఆలయాలుగా...
అప్పటి బిర్లా మందిర్ నుండి...
ఇప్పటి జూబ్లీ హిల్స్ పెద్దమ్మ గుడివరకు...
వారివారి హృదయవైశాల్యానికి అనుగుణంగా ఆలయాలను కట్టి అజరామరమైన కీర్తికాయులుగా పేరుగడించిన మాన్యులెందరో ఈ భాగ్యనగర ఆధ్యాత్మిక కీర్తిసిగలో వారి పేర్లను శాశ్వతంగా లిఖించుకున్న ధన్యజీవులు....

అవ్విధంగా, సామాన్య మధ్యతరగతి ప్రజలుచే వారివారి ఊరూవాడాపల్లెపట్నం యొక్క యోగక్షేమములను నిర్వహించే గ్రామదేవత యొక్క గుడి / ఆలయం గా స్థాపింపబడి, సంవత్సరంలో ఒక్క ఆషాఢ మాసం లో ఘనంగా మహానివేదన అందుకుంటూ విలసిల్లే శక్తి ఆరాధనా సముదాయాలు దేశవ్యాప్తంగా అనేకం కలవు.....

పోచమ్మ, ఎలమ్మ, గంగమ్మ, పోలేరమ్మ, అంకాళమ్మ, మైసమ్మ, గంగమ్మ, ఉప్పలమ్మ, ఇలా చెప్పుకుంటూ పోతే అనేకానేక పేర్లతో అనాదిగా విలసిల్లే గ్రామదేవతలది ఎంతో గొప్ప వైభవం.....

శ్రీతాళ్ళపాక గంగమ్మ తల్లి అనుగ్రహంతో వర్ధిల్లిన, శ్రీ తాళ్ళపాక అన్నమాచార్యుల వారు త్రిమూర్త్యాత్మక శ్రీవేంకటేశ్వరస్వామి వారి శాక్తేయ వైభవాన్ని వర్నిస్తూ....

"ఎంతమాత్రమున ఎవ్వరు తలచిన అంతమాత్రమే నీవు..."

అనే వారి ఈక్రింది సంకీర్తనలో అందుకే అన్నారు........

సరినెన్నుదురు శాక్తేయులు, శక్తిరూపు నీవనుచు....
అని

*****
Audio link : MS Subbalakshmi
Audio link : G.BalaKrishnaPrasad
Archive link :
Ragamalika, Composer : K.Venkataraman

ఎంత మాత్రమున ఎవ్వరు తలచిన, అంతమాత్రమే నీవు
అంతరాంతరములెంచి చూడ, పిండంతేనిప్పటి అన్నట్లు

కొలుతురు మిము వైష్ణవులు, కూరిమితో విష్ణుడని
పలుకుదురు మిము వేదాంతులు, పరబ్రహ్మంబనుచు
తలతురు మిము శైవులు, తగిన భక్తులునూ శివుడనుచు
అలరి పొగడుదురు కాపాలికులు, ఆది భైరవుడనుచు

సరినెన్నుదురు శాక్తేయులు, శక్తిరూపు నీవనుచు
దరిశనములు మిము నానా విధులను, తలుపుల కొలదుల భజింతురు
సిరుల మిమునే అల్పబుద్ది, తలచినవారికి అల్పంబగుదవు
దరిమల మిమునే ఘనమని తలచిన, ఘనబుద్ధులకు ఘనుడవు

నీవలన కొరతే లేదు మరి నీరు కొలది తామరవు
ఆవల భాగీరధి దరి బావుల ఆ జలమే ఊరినయట్లు
శ్రీ వేంకటపతి నీవైతే మము చేకొని వున్న దైవ(ము)మని
ఈవలనే నీ శరణనిఎదను, ఇదియే పరతత్వము నాకు

http://annamacharya-lyrics.blogspot.com/2006/11/65entha-matramuna-evvaru-talachina.html?m=1
*****

మీరు గమనించి ఉంటే....

బాలగంగమ్మ,
బాటగంగమ్మ,
పాచికాలువగంగమ్మ,
ఎలమ్మ,
దుర్గమ్మ,

ఇలా ఎన్నో పేర్లతో ఏడుకొండలపై వెలసిన శ్రీవేంకటేశ్వరస్వామి వారి ఆలయ పరిసరాల్లో ఎన్నో శక్తిమందిరాలు కలవు....

ఎంతో శక్తివంతమైన తిరుమల బాటగంగమ్మ గుడిలో ఇప్పటికీ ప్రతీ శుక్రవారం గణపతి సహిత శివశక్తులకు ఎంతో గొప్ప అభిషేక ఉత్సవం నిర్వహించి భక్తులకు పసుప్పచ్చని రక్షాతోరములను ప్రసాదంగా ఇవ్వడం భక్తులెల్లరు గమనించవచ్చు...ఈ బాటగంగమ్మ అమ్మవారి అనుగ్రహం నేను జీవితంలో ప్రత్యక్షంగా దర్శించిన సందర్భాలు అనేకం...!

రేపు తొలిఏకాదశి సందర్భంగా, ఇవ్వాళ అనగా శ్రీ శోభకృత్ 2023 ఆషాఢ శుద్ధ దశమి రోజున....
కూకట్పల్లి వివేకానందనగర్ లో వెలసిన...
శ్రీమదలర్మేల్మంగాపద్మావతీ సమేత శ్రీవేంకటేశ్వరస్వామి వారి సన్నిధానంలో ఎంతో వైభవంగా 
గో క్షీర దధి ఘృతములతో, వివిధ ఫలరసాలతో,
హరిద్రాచందనములతో...వార్షిక ఆషాఢమాస తొలిఏకాదశి పర్వదినానుబంధ అష్టోత్తరశతకలశాభిషేక ఉత్సవాంతర్గతంగా స్నపనతిరుమంజనం నిర్వహింపబడి
భక్తులెల్లరికి స్వామివారి దివ్యతిరుమేనిని అలంకరించిన ఆ పరిమళభరిత హరిద్రాచందనములను ప్రసాదంగా వితరణ గావించారు....

సంవత్సరంలో ఒక్కసారి మాత్రమే లభించే ఈ తొలిఏకాదశి పర్వదినానుబంధ మహా అభిషేక ఉత్సవ ప్రసాదమైన ఆ హరిద్రాచందనములను నేను కూడా ఇంటికి తెచ్చుకొని తరించాను...🙂💐

హైమోర్ధ్వపుండ్రమజహన్మకుటంసునాసం
మందస్మితం మకరకుండలచారుగండం
బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేశముఖమాత్మనిసన్నిధత్తాం....."

శ్రీవేంకటాద్రినిలయః కమలాకాముకః పుమాన్...
అభంగురవిభూతిర్నస్తరంగతు యదుమంగళం....
సర్వం శ్రీమదలర్మేల్మంగాపద్మావతీ సమేత శ్రీవేంకటేశ్వరశ్రీచరణారవిందార్పణస్తు...🙏💐

సర్వమంగళమాంగళ్యే శివేసర్వార్ధసాధికే
శరణ్యేత్రయంబికేదేవి నారాయణినమోస్తుతే....
సర్వం బల్కంపేట శ్రీరేణుకాహేమలాంబ శ్రీచరణారవిందార్పణమస్తు.....🙏💐

[
My old posts on the magnanimity of Bonalu can be found in the hyperlinks mentioned in the post below...

https://m.facebook.com/story.php?story_fbid=10224663296743187&id=1033694038&mibextid=Nif5oz

]

🌼🌼🌼🌻🌻🌻

Shree chaaganTi sadguruvu gaari chaandramaana janmadinoatsawam / birthday, Aaashaadha Shuddha Navami....🙏🙂💐

Shree chaaganTi sadguruvu gaari chaandramaana janmadinoatsawam / birthday, Aaashaadha Shuddha Navami, earmarks one of the prominent festival days in the spiritual world, especially to all the Telugites all over the world....
For that the glory of the Telugu language, extolled as the Italian of the east, has found a profound rejuvinative effect (along with that of the allied Samskrutam), with guruvugaari esteemed, Prahrushta Vachana / Pravachana Yagnyam by spreading the magnanimity and the linguistic power embedded in the usage of the phonetical energy of the langauge that was chosen by several great saints and poets to bless the world with many an eternally applauded literary treasure....

I have always considered sadguru Shree Chaaganti gaaru as a great saint who belongs to the group of those mighty selfless literary stalwarts of the TelugunaaDu / Telugu province namely...

Shree Bammera Poatanaamaatya , 
Shree sadguru Tyaagaraaya,
Shree Bhadraachala Raamadaasu,
Shree Taallapaaka Annamaachaarya, 
Shree Tarigonda Vengamaamba
and so on and so forth.....

who never had paisa/money as a driving 
factor/motto in creating such content rich magnanimous literary treasure cherished eternally by the blessed folks all over the world, for that God's grace was the only goal behind all such divine creative works.....

A typical movie song's lyric writer might say...
"How much will I be given to pen a song of so and so genre /  so and so situational moments so that I can use all my intellect to give you the best possible magnetic composition that attracts thousands and thousands of audience towards it in-order to make it a sensational hit....."

However, a true spiritualistic neither says nor means so, because their literary efforts are a selfless yeoman service to get God and his grace closer to even a common middle class person who can't afford to buy the time and paraphernalia required to make them spiritual enough to be closer to God and his grace because of being fully occupied with the mundane life and the Gruhastaashrama responsibilities...

Vandanam, Abhivaadam, Namaskaaram, Pranaamam, Saashtaanga Pranaamam, Praneepaatam might sound like similar terms / synonyms however each of them has their own significance and result when performed with the
required magnitude of respect and devotion in front of the right person at the right time......
which will in turn bless the one performing the same with god's grace for doing so soulfully.....

" Shravanam Keertanam Vishnohsmaranam Paadasevanam
Archanam Vandanam Sakhyam Daasyam Aatmanivedanam "

are the well known generic nava veda bhakti maargamulu followed by one and all in the spiritual world in order to get blessed with god's grace...

Amongst which Akroora is extolled and symbolised for the magnanimity of Vandanam by performing which in-front of Shree Krishna his life was filled with Lord Shree Krishna's unparalleled grace...
This is an example of the magnanimity of soulful Vandanam / Namaskaaram to the person in front of us as a mark of respect and devotion towards them....

[ A Namaskaaram coupled with the Sankalpabalam has a lot of power as can be learnt from the incident of Shree Tarigonda Vengamaamba, when she was insulted for not doing Namaskaaram to some swamiji / peethaadhipati whose intent was to enlighten Vengamaamba on what all she is ought to do and not to do, according to the then social / societal / cultural beliefs / customs.... ]

So, a soulful Vandanam, Abhivaadam, Namaskaaram, Pranaamam, Saashtaanga Pranaamam, Praneepaatam
when performed to a right / pious person, will bless us profusely because of our respect conveyed via the same towards the person / entity being respected/worshipped/extolled...

And it is needless to say that...
sadguru Shree Chaaganti gaaru is one such noble pious person of the present times, for creating all his magnanimous Pravachana treasure,
who deserves a soulful Vandanam, Abhivaadam, Namaskaaram, Pranaamam, Saashtaanga Pranaamam, Praneepaatam by every wise person, especially by every ardent / keen listener of his mighty pravachanams...

On the occasion of sadguru Shree Chaaganti gaari 65th birthday celebrations,
I offer my humble Namaskaaram to such a pious person who taught one and all 
" Uddaraytaatmanaatmaanam...." as the motto for a successful life via his pravachanams...,
with these little literary flowers at his holy feet...

మనము నమస్కరించేది ఒక ఆలయంలోని శిల్పానికి అని అనుకుంటున్నామా....
లేక ఆలయంలో వెలసి ఉన్న ప్రత్యక్ష పరమాత్మకి అని భావిస్తున్నామా...
అనే భావనపై భగవద్ అనుగ్రహవిశేషం ఆధారపడిఉంటుంది....

అట్లే

మనము నమస్కరించేది ఒక మాన్యులకు అని అనుకుంటున్నామా...
లేక 
మనము నమస్కరించేది సాక్షాత్తు శ్రీవేదవ్యాసుల వారికే అని భావిస్తున్నామా...
అనే భావనపై గురువానుగ్రహవిశేషం ఆధారపడిఉంటుంది...

శ్రీచాగంటి సద్గురువుల శ్రీచరణములకు వారి 65వ చాంద్రమాన జన్మదినోత్సవం / ఆషాఢ శుద్ధనవమి సందర్భంగా, ఒక వినేయుడి సవినయ సాష్టాంగ శుభాభినందనా నమస్సుమాంజలి...💐

శ్రీగురవేనమః......🙏🙂
🍎🍊🍨🍨🍧🍇🫐🍕🍒🌹🍏🍓🌺🌷🪷🌸💮🏵️🪻🌻🌼🍂🍁🌾🌱

Wishing a very happy and blessed 2nd birthday to my cute little princess, dear daughter Pranavi...🥳🙂🥰🍧🍨🍑🍊☺️🍎🍿🎂💐


I felt this world is all about making us live like a donkey carrying the weights of their hypocrisy and sarcasm unto us....
and you have made me a Unicorn that keeps flying amongst all the happy worlds and higher realms....

I thought my life is always lost in a sea of despair and is full of sorrows and sufferings and you are here now filling it with joy and blessings...

I thought dreams are like the flashy flares of Venus shining bright on a Friday night....
And you have become a reality dawned from those very shiny dreams....

Let the entire universe sprinkle a downpour of blessings on you to fulfill all your aspirations and to fill your life with everlasting happiness and joy....

Wishing a very happy and blessed 2nd birthday to my cute little princess, dear daughter Pranavi...🥳🙂🥰🍧🍨🍑🍊☺️🍎🍿🎂💐

Friday, June 16, 2023

శ్రీరమాసహితసత్యనారాయణ స్వామి వారి వ్రతంలో నా ధర్మపత్ని మరియు నేను....🙂💐🍕🍧🍇🥥🍒

శ్రీ సత్యనారాయణస్వామి వారి వ్రతకల్పవైభవం గురించి, శ్రీరమాసమేతసత్యనారాయణ స్వామి వారి మహిమ్నత గురించి, సాక్షాత్తు శ్రీనారద మహర్షి వారిచే శ్రీమహావిష్ణువే ఈ లోకంలో పరివ్యాప్తి గావించిన కలియుగతారక వ్రతవైభవం గురించి ఎందరో మహానుభావులు, మాన్యులు, ఆధ్యాత్మిక వేత్తలు, సెలవిచ్చి ఉన్నారు...
ప్రత్యేకించి పరమేశ్వరుణ్ణి, పరమేశ్వరవైభవాన్ని ఎంతో హృద్యంగా, సరళంగా, ప్రాక్టికలి అప్ప్లికబుల్ స్పిరిట్చువల్ అప్ప్రోచ్ లో, సామాన్యమానవుడికి కూడా గ్రాహ్యమయ్యేలా అందించే శ్రీచాగంటి సద్గురువుల వివిధ ప్రవచనాల్లో కూడా శ్రీ సత్యనారాయణస్వామి వారి వ్రత వైభవం బహుధా శ్లాఘించబడినది....

ఈ కలియుగంలో మనిషి ఈతిబాధలతో, వివిధ మానసిక శారీరక రుగ్మతలతో, ఎన్నో రకాల దారిద్యంతో, ఎంతగా సతమౌతూ ఉంటాడంటే ఓ 15 సంవత్సరాల్లో ఒక్కసారి మాత్రమే శ్రీసత్యనారాయణ స్వామి వారి వ్రతం చేసుకోవడమే గగనమైన జీవితంతో కుస్తి పట్టడమే బ్రతుకుజట్కాబండి లా జీవితయానం ఉండడం...

చుట్టుప్రక్కన ఉండే వారు మరియు ఇతర బంధుజనం ప్రతిసంవత్సరం కూడా కార్తీక మాసంలోనో మరేదో సమయంలోనో శ్రీసత్యనారాయణస్వామి వారి వ్రతాన్ని ఆచరిస్తూ సుఖసంతోషాలతో కూడిన జీవితాన్ని అనుగ్రహంగా బడసి తరిస్తూ ఉన్నా కూడా కొందరికి, "మరి మనం కూడా శ్రీసత్యనారాయణస్వామి వారి వ్రతాన్ని ఆచరించి స్వామి వారి అనుగ్రహంతో చల్లగా ఉండి తరించవచ్చును కద...?"
అనే అలోచనకూడా రానంతటి మూర్ఖత్వంతో ఈతిబాధల్లో మునిగి ఉంటారు....

ఎందుకంటే....
వారంలో కనీసం ఒక్కరోజైనా నిష్ఠగా ఆలయానికి వెళ్ళి కనీసం 3 ప్రదక్షిణములు, దైవదర్శనం చేయడం అనేది జీవితంలో అంతర్భాగం కానప్పుడు....

సూర్యుడు అనుకూలించి ఆరోగ్యం ఎట్లు సమకూరును..?

చంద్రుడు అనుకూలించి మనోబలం ఎట్లు సమకూరును..?

కుజుడు అనుకూలించి రోగ/దోష/ఋణ బాధలు ఎట్లు సమసును..?

బుధుడు అనుకూలించి బుద్ధివైభవం ఎట్లు సమకూరును..?

గురుడు అనుకూలించి సంకల్పబలం ఎట్లు సమకూరును..?

శుక్రుడు అనుకూలించి సుఖసంతోషాలు ఎట్లు సమకూరును..? 

శనైశ్చరుడు అనుకూలించి ఈతిబాధలు ఎట్లు సమసును..?

సూర్యేందు భౌమ బుధవాక్పతి కావ్యశౌరి
స్వర్భానుకేతు దివిశత్-పరిశత్-ప్రధానాః ।
త్వద్దాసదాస చరమావధి దాసదాసాః
శ్రీ వేంకటాచలపతే తవ సుప్రభాతమ్ ॥ 18 ॥

అని శ్రీవేంకటేశ్వరస్వామి వారి సుప్రభాతంలో మాన్యులచే తెలపబడినట్టుగా...

ఈ నవగ్రహాలు కూడా పరమాత్మకు కింకరులుగా వశవర్తులై ఉండడం వల్ల, స్వామి వారి ఒక్క క్రీగంటి చూపుకు సకలగ్రహమండలం కూడా స్వామివారి భక్తులపట్ల వాటి వాటి ప్రతికూల భ్రమణాన్ని కూడా అనూకూలంగా ఉండేలా సవరింపబడి నడుచుకోవడం అనేది ఆధ్యాత్మికతకు గల వైభవం.....

"చూపులు కలిసిన శుభవేళ...."
అనే సామెతను మన పెద్దలు కేవలం పెళ్ళి/కళ్యాణం లో వధూవరులు ఒక్కటవ్వడం అనే లౌకికతత్త్వం కోసం మాత్రమే సెలవివ్వలేదు......

మీనదృక్కులతో యావద్ విశ్వానికి కూడా పోషక, తోషక, రక్షక, శక్తిని అనుగ్రహించే ఆ పరమాత్మను,
సమూర్త్యారాధనలో భాగంగా సదరు దేవతా మూర్తి యొక్క ముఖమండలంలోకి ఆ వైశ్విక మీనశక్తి స్థిరీకరింపబడి, పరమాత్మ మూర్తిలో కొలువైఉండే
షోడషకళాత్మక శక్తిగా ప్రసరింపబడుతూ, నిత్యం భక్తులకు అందివ్వబడే హారతి/మంగళనీరాజనం రూపంలో ఆ దైవానుగ్రహశక్తి అనేది అందివ్వబడుతూ ఉంటుంది.....

అందుకే ఆలయానికి వెళ్ళొస్తే...
దేవుడి దర్శనం అయ్యిందా....?
(అనగా అక్కడ కొలువైన భగవంతుడిని
ఆపాదతలమస్తకం దర్శించావా..)
అని అడుగుతారే కాని...

ఆలయానికి వెళ్ళొచ్చావా...?
ఏమేం తీసుకెళ్ళావ్....?
ప్రసాదం ఎంత తిన్నావ్...?
పుళిహోరా తో పాటు ఇంకా ఏమేం ప్రసాదాలు పెట్టారు...?
ఎవరితో ఏమేం ముచ్చట్లు పెట్టావ్..?
ఇత్యాదిగా ప్రశ్నలు ఉండవు....
ఎందుకంటే దేవాలయ సందర్శనం అనునది ఈ లౌకిక ప్రపంచంలో ఉంటూనే అలౌకిక పరబ్రహ్మంతో 
మౌనంగా సంభాషించే మహిమోపేతమైన ప్రాచీన ఆర్షవిజ్ఞ్యాన వ్యవస్థ....

అనగా 'ఈశ్వర మూర్తికి నమస్కరిస్తూ...
మన చూపులను...ఈశ్వర మూర్తి యొక్క చూపులతో అనుసంధానించి ఆ దైవిక తన్మయత్వంలో మన హృదయకోశంలోని పరమాత్మను జాగృతపరచి....
పర, వ్యూహ, విభవ, అర్చ, అంతర్యామి అనబడే 5 రకాల భగవద్ స్వరూపములను ఆంతరమున దర్శిస్తూ....
మన ప్రార్ధనలకు సమాధానాలు పొంది శాంతచిత్తులై తరించడం...'
అనే సర్వశ్రేయోదాయక వ్యవస్థలో భాగమై జీవితాన్ని తరింపజేసుకోవడం...

ఈ ఆధునిక మానవుడు ఎంతటి సంపన్న దరిద్రుడిగా బ్రతుకుతూ ఉంటాడంటే...
ఒక సీసాకు 100 రూపాయలు పెట్టి ఓ గ్లాసెడు దరిద్రాన్ని, నికోటిన్ అనే ఎంతో ప్రమాదకరమైన విషాన్ని నింపుకున్న దరిద్రపు పొగాకు కడ్డీల పెట్టెను మరియు ప్రమోదానికి
గుప్పుగుప్పుమంటూ వాటిని పీల్చడానికి/ వెలిగించుకోవడానికి ఒక అగ్గిపెట్టెను, కొనుక్కొని తాగుతూ అవి సంతోషం ఇస్తాయేమో అని అనుకొని నిత్యం దుఃఖభరితమైన దుర్భర జీవితంతో సతమౌతూ, అసహనంతో ఉంటాడేమో కాని...
ఒక ఆలయానికి వెళ్ళి ఒక పదిరూపాయలు సమర్పించి ఒక చెంచాడు తీర్థాన్ని / డొప్పెడు ప్రసాదాన్ని స్వీకరించి అది మన జీవితాన్ని ఎంతో గొప్పగా ఉద్ధరించగలదు... అనే విశ్వాసంతో జీవించడానికి మాత్రం యత్నించడు....

జీవుడు దేవుడి దెగ్గరకు వెళ్ళడానికి చాలా బిజీగా ఉన్నప్పుడు.....
ఆ దేవుడే జీవుడి దెగ్గరకు వచ్చి విశేషంగా అనుగ్రహించే ప్రక్రియకే నోము / వ్రతం అనే పేరు....

మన లౌకిక ప్రపంచంలో కూడా ఈ ఎగ్సాంపుల్ ని గమనించవచ్చు.....
మామూలు రోజుల్లో....గుంతలమయమైన రోడ్లను బాగుపరచండిరా బాబు...అని ఎంత మొత్తుకున్నా పట్టించుకోరు....
కాని ఒక మంత్రో / ఒక డిగ్నిటరి పర్సనాలిటో ఇటువైపుగా ఏదో శిలాఫలక /శంఖు స్థాపనకో మరేదో పనిమీద వేంచేస్తున్నారు అనగానే..
రాత్రికిరాత్రే రోడ్లన్నీ కూడా సింగపూర్ రోడ్లలా స్మూత్ గా రడీఅవుతాయి....

అచ్చం అదేవిధంగా, ఏదేని ఒక నోము/వ్రతం లో సదరు భక్తుడి విశ్వాసానికి / చిత్తశుద్ధుకి అనుగుణంగా తత్ ఆరాధ్యదైవం అనునది వారి జీవితబాటలను ఎంతో ఘనంగా తీర్చిదిద్దే అనుగ్రహాన్ని వర్షించడం అనేది ఆధ్యాత్మికత యొక్క వైభవం...

వ్రతం యొక్క ప్రసాదం తిరస్కరించినందుకు ఒక వర్తకుడి పడవని ముంచాడని కథలో ఉన్నందుకు, సత్యనారాయణస్వామిని సాడిస్ట్ అని అనడమా....
లేక 
వ్రతం యొక్క ప్రసాదం స్వీకరించినందుకు ఒక సామాన్యుడిని భాగ్యవంతుడిగా అనుగ్రహించిన శ్రీసత్యనారాయణస్వామిని ఘన దైవతంగా శ్లాఘించడమా....
అనే భావాన్ని వ్యక్తపరుస్తూ శ్రీచాగంటి సద్గురువులు చమత్కరించడం కొంతమందికైనా గుర్తుండి ఉండాలి....
అది లౌకికంగా భగవద్ ప్రసాదం యొక్క వైభవాన్ని తెలుపుటకు, మరియు భగవద్ ప్రసాదంగా జీవితాన్ని స్వయంకృషితో తీర్చిదిద్దుకోవడంలో ఉండే వైభవాన్ని తెలిపే సాహిత్య ఛమక్కులే అయినా....వాటి ద్వారా మనిషికి భగవంతుడి పట్ల ఒక గౌరవభావం ఏర్పడి మనిషి తను తరించి, తన చుట్టూ ఉండే మంచివారు తరించడానికి, జీవితాన్ని ఒక ధర్మసాధనంగా మలచుకోవడమే అందలి ప్రతిపాదిత సాహిత్యం యొక్క నిజమైన సారాంశం.....

నా మాటల్లో సింపుల్ గా చెప్పాలంటే...
ఈ భూప్రపంచంలో మరెక్కడా కూడా లేని విధంగా....
శ్రీరత్నగిరి వాసుడిగా అన్నవరంలో పంపానదీ తీరాన,
త్రిమూర్త్యాత్మక పరమాత్మగా...,
శ్రీరమాసత్యవతి సమేత శ్రీవీరవేంకటసత్యనారాయణ స్వామి వారిగా వెలసిన స్వామి వారి వైభవం మరియు
శ్రీసత్యనారాయణ స్వామి యొక్క వ్రతవైభవం ఎంత గొప్పదంటే.....
బెల్లం గోధుమనూకతో అన్నవరం ఆలయంలో తయారుగావింపబడే అమృతతుల్యమైన ప్రసాదం అంతటి గొప్పది...
మరియు అన్నవరక్షేత్రావిర్భావ ఘట్టంలో
ప్రస్తావింపబడే అన్నవర ఆలయ స్థలవృక్షమైన అంకోల వృక్షం అంతటి గొప్పది....
(జీవుణ్ణి దేవుడు తనవైపునకు ఆకర్షించడం అనే ఆధ్యాత్మిక విశేషానికి తార్కాణంగా తెలుపబడేది అంకోల వృక్షం...)

( ఆ ప్రసాదమైతే అన్నవరం వెళ్ళినప్పుడు ఒక విస్తరి మొత్తం బాగా లాగించి ఉంటావ్ కాని...
మరి అంకోల వృక్షం ఎక్కడ చూసావ్ అని అడగకండి....
శ్రీ చాగంటి సద్గురువుల ప్రవచనాల్లో వినడమే తప్ప అంకోల వృక్షాన్ని నేనూ ఎప్పుడూ చూడలేదు...జస్ట్ చదివాను అంతే...
https://alphadevi7.aminus3.com/image/2012-11-11.html
ఈశ్వరానుగ్రహంతో ఎప్పుడైనా చూసే భాగ్యం వచ్చినప్పుడు నేను విన్నది, చదివింది బేరీజు వేసుకొని మరింత గొప్పగా వివరించే ప్రయత్నం చేస్తాను..... )

(అత్తారింట్లో ఒడిబియ్యం కార్యక్రమానికి అనుబంధంగా యథాశక్తి కల్పోక్తప్రకారేణ) శ్రీరమాసహితసత్యనారాయణ స్వామి వారి వ్రతంలో నా ధర్మపత్ని మరియు నేను....🙂💐🍕🍧🍇🥥🍒

Saturday, June 3, 2023

శ్రీ శోభకృత్ నామ సంవత్సర జ్యేష్ఠ పౌర్ణమి ప్రయుక్తశ్రీవారి జ్యేష్ఠమాస జ్యేష్ఠాభిషేకోత్సవ శుభాభినందనలు....💐🙂🍦🍧🍕🍉🍨🍍

శ్రీవారి జ్యేష్ఠమాస జ్యేష్ఠాభిషేకోత్సవ శుభాభినందనలు....
💐🙂🍦🍧🍕🍉🍨🍍
 
పచ్చకర్పూరపు తిరునామములను ధరించి, ఆకుపచ్చని తులసిమాలలు మరియు రంగురంగుల వివిధ సుగంధభరిత విరులకలబోతతో ఎంతో ఒద్దికగా అల్లబడిన తోమాలలను అలకరించుకొని ఎంతో వైభవంగా ఆనందనిలయంలో మందస్మితుడై పద్మపీఠంపై వీరస్థానక ధృవమూర్తిగా కొలువైన ఆ తిరుమలేశుడే, తిరుగిరులే కాకుండా యావద్ విశ్వాన్ని కూడా బంగారు మెరుగులతో ధగధగలాడే ప్రాకృత ఆనందనిలయ త్రితల విమానగోపురంలో గుప్తమైన యోగరూపంలో నిక్షిప్తమై ఉండే నిజమైన బంగారు విమానం లో విశ్వమంతటా ప్రయాణిస్తూ భూగత 84 లక్షల జీవరాశులే కాకుండా భువరాది 6 ఊర్ధ్వలోకాల్లో కొలువైఉండే ద్యులోక తైజసిక వాసులను..మరియు అతలాది సప్త అధోలోక తిర్యంగ్ముఖ, అసురాది, జీవులను...సదా పరికిస్తూ....
తన శ్రీపాదపద్మములను ఎక్కడెక్కడ ఎవరెవరు నిత్యం ధ్యానిస్తున్నారో వారిని అనుగ్రహిస్తూ....
ఈ కలియుగ ప్రత్యక్ష పరమాత్మగా కొలువైన ఆ శ్రీవేంకటేశ్వరుడికి తిరుమలలో జరిగే నిత్యోత్సవ, వారోత్సవ, పక్షోత్సవ, మాసోత్సవ, సంవత్సరోత్సవ ఉత్సవాలు ఎన్నో కలవు.....
వేటి విశేషం వాటిదే....వేటి ప్రత్యేకత వారిదే....వేటి వైభవం వాటిదే....!

వాటిలో ఎంతో విశేషంగా ఉత్తరాయణం చివర్లో వచ్చే జ్యేష్ఠమాస పౌర్ణమికి ఉండే జ్యేష్ఠా నక్షత్రాన్ని పురస్కరించుకొని గావించే విశేషమైన అభిషేక ఉత్సవాన్ని , తిరుమల ఆచారవ్యవహార పరిభాషలో జ్యేష్ఠాభిషేక ఉత్సవం గా  పేర్కోనబడే 3 రోజుల ఉత్సవ విశేషాలేంటో కొంత పరికిద్దాం...

వజ్రకవచం, ముత్యపుకవచం, స్వర్ణకవచం.....
అనే మూడు ముచ్చటైన అలంకరణల్లో,
ఉత్సవమూర్తిగా తిరుమలపంచబేర సంప్రదాయంలో భక్తుల్లెల్లరికీ ప్రతీరోజు దర్శనభాగ్యాన్ని అనుగ్రహిస్తున్న శ్రీభూసమేత శ్రీమలయప్ప స్వామి వారు,
సంవత్సరంలో ఒక్కసారి మాత్రమే దర్శనమిచ్చే అరుదైన ఉత్సవం జ్యేష్ఠాభిషేక ఉత్సవం....

శ్రీ చాగంటి సద్గురువుల ప్రవచనాల్లో వివరింపబడిన స్థూల, సూక్ష్మ, కారణ శరీరాల గురించి మరియు తత్సంబంధమైన యోగవిశేషాల గురించి అవగాహన కలిగిన మాన్యులకు తెలిసినట్టుగా...

ఒక ఆకారంతో , ఒక రూపంలో, ప్రపంచానికి కనిపించే ప్రతీ మనిషికి కూడా స్థూల, సూక్ష్మ, కారణ శరీరములనబడే 3 విధములైన శరీరములు కలవు....
అనగా యోగపరిభాషలో హృదయకోశగత జీవాత్మపరమాత్మ సంఘాతంగా వెలుగొందే మనిషి అనే సర్వోత్కృష్ట ప్రాణికి గల తొడుగులు...

1.స్థూల శరీరం :
బాహ్యప్రపంచానికి కనిపించే మన పాంచభౌతిక శరీరం.....
మనము భుజించే ఆహారము / అన్నము నుండి అన్నాదము గా పరిణమిస్తూ, నిరంతరం రూపాంతరం చెందే ఈ స్థూల శరీరం గురించే ఈ లోకంలోని 99% జనాలు ఎల్లప్పుడూ మాట్లాడుకునేది....

"అప్పుడు రెండేళ్ళ క్రితం వచ్చినప్పుడు బక్కగా కరువుప్రాంతబాధితుడిలా ఉండేవాడివి..
ఇప్పుడు బాగా తిని బాక్సింగ్ ఛాంపియన్ లా తయారయ్యావ్...."
అని ఎవరైనా అంటే అది మన స్థూల శరీరం గురించి వారి అభిప్రాయం...

అన్నము అనగా....
" మనము తినునది...మనల్ని తినునది..."
అంటూ ఎంతో గొప్పగా నిర్వచింపబడిన శ్రీచాగంటి సద్గురువుల ప్రవచనాల్లోనే...ఆ భుజింపబడే అన్నములోని 6వ వంతు మన మనసుగా పరిణమిస్తుందనే వివరణ చాలా మందికి గుర్తుండే ఉంటుంది...

2. సూక్ష శరీరం :
అన్నాదము గా పరిణమించిన మన శరీరం లో నిరంతర సంకల్పవికల్పాల సమూహంగా ఉనికిని పొందే అగోచర సర్వేంద్రియసంఘాత తత్త్వమే మన మనసు....

ఆ మనసు యొక్క వేగం గురించి కూడా శ్రీచాగంటి సద్గురువులు వారి ప్రవచనాల్లో గొప్పగా వివరించి ఉన్నారు...
ఇప్పుడు టీ.వీ.లో ఏదో ఒక ప్రొగ్రాం ని వీక్షించే మన మనసు....
కొద్ది సేపట్లోనే పూజ గదిలో ఆచమనం గావించి ఆసీనులైన తదుపరి ఆనందనిలయం లో షట్కాల అర్చనలను అందుకుంటున్న శ్రీవేంకటేశ్వరుడి పాదపద్మములను అలంకరించి ఉన్న తులసీ పత్రాలను దర్శిస్తూ ఉంటుంది....

సూపర్సోనిక్ జెట్లో తిరుమలకు ప్రయాణించినా, మనసు ప్రయాణించే వేగానికి అది సరిరాదు....
వాయుపుత్రుడైన హనుమంతుల వారిని
" మనోజవం మారుతతుల్య వేగం..."
అని కీర్తించడం ఎల్లరికి తెలిసినదే...

మనసు యొక్క జవానికి / వేగానికి, గాలికి ఏంటి సంబంధం...?

రేచక, పూరక, కుంభకమనబడే ప్రాణాయామ ప్రక్రియలకు సాక్షిగా తమను తాము దర్శించే ఉపాసకులకు, వాయుశక్తి మనోశక్తి గా పరిణమించే వైచిత్రి, మరియు తదనుగుణంగా మనోశక్తి యొక్క సృజన గా రూపాంతరం చెందే సూక్ష్మశరీరం యొక్క వైచిత్రి గురించి ప్రాజ్ఞ్యులైన విజ్ఞ్యులకు విదితమే....
ఆ సూక్ష్మ శరీరం అనేది అన్యులకు అగ్రాహ్యం...అగోచరం...అనిర్వచనీయం...గా ఉండే ఆంతర జీవసంబంధమైన అంశం....

"అప్పుడు రెండేళ్ళ క్రితం వచ్చినప్పుడు
నీ మనసు నిత్యం తిరుమలకు ప్రయాణిస్తూ ఉండేది...
ఇప్పుడు బాగా ఆలోచిస్తూ హిమాలయాలను దాటి మానససరోవరానికి కూడా ప్రయాణిస్తూ ఉన్నదా నీ సూక్ష్మ శరీరం....?"
అని ఎవ్వరూ అనజాలరు....
ఎందుకంటే సూక్ష్మ శరీరం అనునది లోకులకు అగోచరమైనది కాబట్టి....

3. కారణ శరీరం : ఈ స్థూల, సూక్ష్మ శరీరాలకు అనుసంధానకర్తగా ఉంటూ ఇంద్రియసంఘాతానికి మరియు మనసుకి కూడా అనుసంధానంగా ఉండే మన చిత్తవృత్తులు సమీకరించుకున్న బౌద్ధిక పరిణతకు అనుగుణంగా సదరు యోగస్థాయికి జీవుడి ఉపాసన / తపోశక్తి చేరుకున్న తదుపరి ఆవిర్భవించేదే కారణ శరీరం....
అది కేవలం పరమాత్మకు మాత్రమే గ్రాహ్యమై ఉండే జీవజీవేశ్వర సంఘాతం...
ఒక్కో యోగీశ్వరుడు ఒక్కోవిధంగా ఈ కారణ శరీరాన్ని నిర్వచించడం అనేది సదరు ఉపాసకుల తపోసాంద్రతకు సంబంధించిన విషయం....

జ్యేష్ఠాభిషేక ఉత్సవాంతర్గతంగా, శ్రీవేంకటేశ్వరస్వామి వారికి అలకరింపబడే వజ్రకవచం...ముత్యపుకవచం...స్వర్ణకవచం....
అనే అలంకరణ సంప్రదాయం భక్తులకు ఈ 3 విధములైన శరీరముల గురించిన ఎరుకను అనుగ్రహించే ఉత్సవాంతర్గత యోగ విశేషం....

స్థూల శరీరం గొప్ప దేహదారుఢ్యం తో ఉన్నా సరే...
సూక్ష్మ శరీరం శక్తివంతమైనది గా ఉండనప్పుడు...
అనగా మనోబలం క్షీణించినప్పుడు...
ఆ మనిషి కేవలం ఒక కూలబడిన బియ్యం బస్తా లా తనకు తానే భారంగా ఉండిపోతాడు....

కనీసం ఆలయానికి వెళ్ళి ఓ 3 ప్రదక్షిణలైనా గావించి తీర్థప్రసాదాలను సేవించి రమ్మని చెప్పినా సరే...
అదేదో కాళ్ళు అరిగిపోతాయేమో అన్నట్టుగా 'వచ్చేవారమో ఆ తర్వాతో ఎప్పుడైనా వీలుంటే వెళ్తాలే....'
అన్నట్టుగా బదులిస్తాడు...
ఆలయానికి కూడా వెళ్ళలేనంతటి క్షీణమనోబలంతో ఉండే మనిషికి ఆ స్థూల శరీరం దేనికి ఉపయోగపడినట్టు...?

స్థూల శరీరం ఆర్నాల్డ్.ఎస్ లా 8 ప్యాక్ ఆబ్స్ తో ఉండకపోయినా...
ఒక డీసెంట్ సీరియల్ హీరో లా సింపుల్ 
కరాటే / టాయిక్వాండో ప్లేయర్ లా ఉన్నాసరే...
మనిషికి మనోబలం మెండుగా ఉన్నప్పుడు...
ఇప్పుడు ఈ క్షణం లో చంద్రమండలం వెళ్ళిరావడనికి కూడా మనిషి ఎప్పుడు సిద్ధంగానే ఉంటాడు.....
ఎందుకంటే అది సూక్ష్మశరీరం యొక్క గొప్పదనం....

అన్నం, చపాతీలు, బిస్కెట్లు, బిర్యానీలు, వగైరాలతో బాగా దృఢమైన స్థూల శరీరాన్ని సముపార్జించవచ్చును...
ఎందుకంటే అది లౌకిక పౌష్టిక ఆహారంతో వృద్ధిచెందే పాంచభౌతిక బ్రహ్మాండ పిండాండ సమన్వయ సంఘాతం...

మరి అలౌకిక ఆహారంతోనే ఎక్కువగా ప్రభావింపబడే సూక్ష్మ, కారణ శరీరములకు వేటిని భోజ్యంగా అందించి వాటిని దృఢమైన వాటిగా గావించగలము...?

అనే ప్రశ్న ఉదయించినప్పుడు....
అప్పుడు భక్తి, భగవంతుడు, శ్రీమద్రామాయణం, భాగవతం, ప్రాణాయామం, యుక్తాహారవిహార భరిత శౌచసిద్ధి, శమము, దమము, జితేంద్రియత్వము, యోగము....
ఇత్యాది వాటి గురించిన జిజ్ఞ్యాస, పరిశోధనాత్మక వివేచన అంకురించి మనిషి తరించడం అనే ప్రక్రియకు నాంది పలికే ఆంతర ప్రయాణం మొదలైయ్యేది.....

ఈ సుపీరియర్ ట్రైట్స్ అన్నీ కూడా ఏ సూపర్ మార్కెట్లోను కొనుక్కొని స్వీకరించడానికి కుదరదు....
ఎందుకంటే అవి ఎంతో శ్రమించి 
సద్గురువానుగ్రహం, భక్త భాగవత భగవద్ అనుగ్రహం తో మాత్రమే అందుకొనబడే ఈశ్వర విభూతులు కాబట్టి....

వజ్రసదృశమైన దృఢసంకల్ప శక్తిని...
ముత్యము వంటి స్వఛ్చమైన మనస్సును,
మృదువైన మనో సున్నితత్త్వాన్ని....,
పరిశుద్ధమైన స్వర్ణం లాంటి దేహసౌష్ఠవం / తత్త్వాన్ని....
భక్తులకు అనుగ్రహంగా అందించి వారి స్థూల, సూక్ష్మ, కారణ శరీరములను అత్యంత శక్తివంతంగా గావించే ఈశ్వరానుగ్రహ వైచిత్రికి ఈ జ్యేష్టాభిషేక ఉత్సవం ఒక ప్రతీక అని మాన్యుల విశ్వాసము.....

అటువంటి మహత్తరమైన తిరుమల జ్యేష్ఠాభిషేక ఉత్సవం జరుగుతున్న శుభవేళ, స్వామివారి అనుగ్రహవీచికలు భక్తులందరికి కూడా పరిపూర్ణంగా లభించి భక్తులెల్లరి జీవితాలు సుఖశంతోషాలతో పరిఢవిల్లాలని ఆకాంక్షిస్తూ.....

ఓం నమో వేంకటేశాయ.......
🙏🙏🙏🙏🙏🙏🙏
🙂🍊🍑🍎🥭🍓🍿🍧

"జలకమాడి వున్నాడు సర్వేశ్వరుడు నిగ్గు
గలిగిన మంచి నల్లకలువ వలెను...."

అని అన్నమాచార్యుల వారు స్వామివారి మీద కడు చక్కని సంకీర్తన రచించి భక్తులను అనుగ్రహించినారు....
*******
సేవింపరో జనులాల చేరి మొక్కరో
భావింప నున్నాడిందరి భాగ్యము వలెను

జలకమాడి వున్నాడు సర్వేశ్వరుడు నిగ్గు
గలిగిన మంచి నల్లకలువ వలెను
ఎలమి కప్పురకాపు ఇదె చాతుకున్నవాడు
వెలలేనియట్టి పెద్ద వెండికొండవలెను ||

అందముగా తట్టుపుణుగు అలదుక నున్నవాడు
కందువ ఇంద్రనీలాల గనివలెను
ముందటి వలెనె తా సొమ్ములు నించుకున్నవాడు
పొందిన సంపదలకు పుట్టినిల్లువలెను||

మించి అలమేల్మంగ మెడగట్టుకొన్నవాడు
మంచి(పొంచి?) బంగారు తామరపువ్వువలెను
ఎంచగ శ్రీవేంకటేశుడిదె కొలువై విన్నవాడు
నించిన దాసులపాలి నిధానము వలెను ||

http://annamacharya-lyrics.blogspot.com/2008/02/405sevimparo-janulala.html?m=1
*******

డార్క్ పర్పుల్ కలర్ లో ఉండే అరుదైన నల్లకలువలను మీరు ఎప్పుడైనా చూసారో లేదో కాని.....
నేను మాత్రం ఒకసారి శ్రీశైలం వెళ్ళినప్పుడు అక్కడ ఎవరో భక్తులు మల్లన్నకు నల్లకలువల పుష్పమాలను సమర్పించడం చూసి వాటి సౌకుమార్యప్రభలకు అచ్చెరువొందాను కూడా....

"ఈశ్వరుడికి అభిషేక ఉత్సవం నిర్వహించి ఆ ప్రసాదం భక్తులు స్వీకరించడంతో, ఆ అభిషేకమూర్తికి లభించిన గొప్ప స్వాంతనలా మన మనసుకు కూడా ఎంతో గొప్ప స్వాంతన లభించి మనకు నూతన జవసత్వాలు అనుగ్రహింపబడును ...."
అని శ్రీనగర్ కాలని లోని సత్యసాయి నిగమాగమంలో ఒకసారి నిర్వహింపబడిన శ్రీవల్లీదేవసేనా సమేత శ్రీసుబ్రహ్మణ్యస్వామి వారి విశేష అభిషేక ఉత్సవాంతర్గత ప్రవచనాల్లో, శ్రీచాగంటి సద్గురువులు ఉటంకించడం అక్కడికి విచ్చేసిన కొందరు భక్తులకైనా గుర్తుండి ఉండాలి....
అప్పుడే చెన్నై నుండి ఫ్లైట్లో తెప్పించబడిన ఆ స్వచ్ఛమైన విభూతిని అభిషేకానంతరం శ్రీసుబ్రహ్మణ్యస్వామి వారి
ప్రసాదంగా గైకొని ధన్యులైన భక్తుల్లో నేను కూడా ఒకణ్ణి...🙂

స్రగ్-భూషాంబర హేతీనాం సుషమాఽఽవహమూర్తయే ।
సర్వార్తి శమనాయాస్తు వేంకటేశాయ మంగళమ్ 
॥ 11 ॥

శ్రీవైకుంఠ విరక్తాయ స్వామి పుష్కరిణీతటే ।
రమయా రమమాణాయ వేంకటేశాయ మంగళమ్ 
॥ 12 ॥

శ్రీమత్-సుందరజా మాతృముని మానసవాసినే ।
సర్వలోక నివాసాయ శ్రీనివాసాయ మంగళమ్ 
॥ 13 ॥

మంగళా శాసనపరైర్-మదాచార్య పురోగమైః ।
సర్వైశ్చ పూర్వైరాచార్యైః సత్కృతాయాస్తు మంగళమ్ 
॥ 14 ॥

శ్రీ పద్మావతీ సమేత శ్రీ శ్రీనివాస పరబ్రహ్మణే నమః...