Friday, December 14, 2018

శ్రీ సుబ్రహ్మణ్య షష్టి / స్కంద షష్టి / కుమార వైభవం... :) - 2018

శ్రీ సుబ్రహ్మణ్య షష్టి / స్కంద షష్టి / కుమార వైభవం... 
కుమారస్వామి, సుబ్రహ్మణ్యుడు, షణ్ముఖుడు, శరవణుడు, మురుగన్, కార్తికేయుడు, ఇత్యాది ఎన్నెన్నో నామాలతో లోకమంతా, మరీ ముఖ్యంగా దక్షిణభారతదేశం లో ఎందరో భక్తులచేత ఆరాధించబడే అపురూప దైవం శ్రీ సుబ్రహ్మణ్య స్వామి.
బ్రహ్మశ్రీ చాగంటి సద్గురువుల వివిధ ప్రవచనాంతర్భాగంగా అందరూ స్వామి వారి వైభవం గురించి ఎన్నెన్నో విషయాలు వినే ఉంటారు. నిన్న స్కంద షష్టి నైమిత్తిక తిథి కావడం చేత, స్కందగిరి లోని శ్రీకంచికామకోటి పీఠం వారి ఆధ్వర్యంలోని స్వామి వారి ఆలయానికి వెళ్ళగా, అక్కడున్న టీ.వీ స్క్రీన్ పై గురువుగారి ప్రవచనం కనపడేసరికి నమస్కరిద్దామని తలవంచేసరికి ఆశ్చరంగా ఆ వెనకే గురువుగారు వేదికపై స్వామి పక్కనే ఉండడం చూసి, ఆహా ఇది కదా సౌభాగ్యం అంటే, మార్గశిర స్కంద షష్టి నాటి గురువారపు రోజు స్వామి దర్శనానికి వెళ్ళగా అక్కడే ప్రత్యక్షంగా గురుదర్శనం కూడా సంప్రాప్తించడం, అని సంతసించడంతో ఇక అనందానికి అవధెక్కడుంటుంది...
ఒక వైపు గుడిలో విభూతిలేపనంతో ఎంతో రమణీయంగా అలంకరించబడిన వల్లీ దేవసేనా సమేత కుమార స్వామి ధృవమూర్తి, మరో వైపు జయదుర్గా అమ్మవారి సన్నిధి దెగ్గర ఏర్పాటు చేసిన అభిషేక/హోమ వేదికపై తన ఇరుదేవేరులతో స్వామివారు ఉత్సవమూర్తిగా కొలువై ఉండడం. ఈ ఇద్దరి మధ్యలో ప్రత్యక్షంగా ఆసీనులై ఉన్న, పోతపోసుకున్న కౌమారసదాచార సంపన్నులు, రాశీభూతమైన సుబ్రహ్మణ్యస్వరూపులే శ్రీ చాగంటి సద్గురువులు.
ఎందరో ఆధ్యాత్మ సద్గురువులున్నపటికీ, శ్రీ చాగంటి సద్గురువులను మాత్రమే ఇలా అభివర్ణించడానికి నాకు కొన్ని ప్రత్యేక కారణాలు ఉన్నాయి.
కొన్ని వేలమంది అభ్యసించింది అదే MBBS / FRCS వైద్యవిద్య అయినప్పటికీ మనం గమనించగలిగితే, నిరంతరం జనప్రవాహం తో ఉండే ఒక్కొక్క ఆరితేరిన వైద్యుడి దెగ్గరికి వచ్చిన ఎటువంటి రోగికైనా, ఎంతటి తీవ్రరోగమైనా, ఎంతో కఠినమైన శస్త్రచికిత్స అయినా, అది సంపూర్ణంగా ఫలించి, "ఫలానా వైద్యుడి/వైద్యురాలి గారి దెగ్గరికెళ్తే ఇక ఆ మనిషికి తిరుగులేని ఆరోగ్యం సమకూరడం ఖచ్చితమండి....వారి హస్తవాసి అటువంటిది మరి...ఎన్ని జన్మల పుణ్యమో ఆ మహానుభావులది... మానససేవే మాధవ సేవగా భావించి, అధిక లాభానికి ఆశపడకుండా, వృత్తిని దైవానుగ్రహంగా, దైవకార్యంగా భావించి, ' వైద్యో నారాయణో హరిః ' అనే నానుడిని 100 కి 100 పాళ్ళు నిజం చేసే వ్యక్తి వారు.... " అని అనడం అప్పుడప్పుడు చూస్తుంటాం...
ఇది ఏ సైన్స్ కి అందని అంశం...., భగవంతుని సంపూర్ణ అనుగ్రహం, జన్మజన్మల పుణ్యబలం, హృదయంలోని స్వచ్ఛత, పరిశుద్ధ జీవితం, సర్వేజనాః సుఖినోభవంతు లోకాసమస్తాః సన్మంగళానిభవంతు....అనే రీతిలో ఉండే వారి జీవితమే ఆ ప్రత్యేక దైవానుగ్రహానికి కారణమై వారి జీవితాలు అలా నిరంతరం అందరికి సుఖశాంతిపరిమళాలు వెదజల్లే దైవపారిజతాలై పరిఢవిల్లుతాయి....!
అదేవిధంగా, అన్ని విద్యలకు ఆదివిద్య/మూలవిద్య అయిన అధ్యాత్మవిద్య / ఆత్మవిద్య, అలాంటి పరిశుద్ధ జ్ఞ్యానబలం/ఆత్మబలం గల సద్గురువుల రసాంకురములందు అమేయశారదానుగ్రహంగా కొలువై వాగ్ సురగంగలా నిరంతరం ప్రవహిస్తూ, సకల శుభాలను వారి అనుగ్రహంగా ప్రభవించేలా చేస్తుంది... అది కేవల పుస్తకాలకు, పద్యగద్యస్తోత్రాది పఠనకు, ఇత్యాది లౌకిక అక్షరసంచయమైన సారస్వతానికి మాత్రమే సంబంధించినది కాకుండా, ' గురు శిష్యులు ' అనే ఇరు జీవుల మధ్య పెనవేసుకున్న ఆత్మసంబంధం గా సాగే ఒక అలౌకిక సంభాషణ.
ఈ మధ్య ఒకరోజు ఆంధ్రజ్యోతి పేపర్ లోని ఒక ఆర్టికల్ లో చదివా, రిమోట్లి ఆపరేటెడ్ రోబోటిక్ ఆర్మ్ తో ఒక వెటెరన్ కార్డియాలజిస్ట్ ఎక్కడో కిలోమీటర్ల దూరంలో ఉన్న వైద్యశాలలోని ఒక గుండెజబ్బున్న పేషెంట్ కి అత్యంత గహనమైన సర్జికల్ ప్రొసీజర్ విజయవంతంగా పూర్తి చేసి స్వస్థత కలిగించి వైద్యశాస్త్రంలో సరికొత్త పుంతలుతొక్కేలా అడ్వాన్సెడ్ మెడికల్ ఇంజినీరింగ్ ని వాడుకలోకి తీసుకురావడాన్ని....
లౌకికం గానే శరీర పోషణ విద్యలో ఇంత అభివృద్ధి సాధించగలిగితే, మరి సనాతనంగా ఎందరో మహర్షులు, యోగులు, మనకు అందించిన ఆధ్యాత్మవిద్యా లోతుపాతులను అందుకొని ఆరితేరిన సద్గురువులు అలా శిష్యులు ఎంత దూరంలో ఉన్నాసరే వారికి మనోసంకల్పంతోనే సకల ఈప్సితములు ఈడేర్చి శుభములను అనుగ్రహించగలరు, అని నమ్మడం కూడా అంతే సహజం కదా...
ఒకనాడు కేవలం తండ్రికి మాత్రమే ప్రణవరహస్యాన్ని ఉపదేశించి ' శివగురు ' గా పేర్గాంచింది స్కందుడైతె,
ఆ తరువాత కేరళ రాజ్యంలో శ్రీ శివగురు / ఆర్యాంబలకు శ్రీ శంకరులుగా అవతరించిన ఆ భోళాశంకరుడే, ఆసేతుహిమాచలపర్యంతం భారతదేశమంతా శ్రీ ఆది శంకరాచార్యులుగా పర్యటించి, వైదిక ధర్మాన్ని దృఢంగా పునర్ వ్యవస్థీకరించి, ప్రత్యక్ష శిష్యులుగా శ్రీ సురేశ్వర, హస్తామలక, పద్మపాద, గౌడపాదులతో కలిసి ఎందరెందరికో ఆ ప్రణవరహస్యాన్ని తమ ఆధ్యాత్మ బోధాంతర్గతంగా ఉపదేశించి తరింపజేస్తే,
ఈనాడు ఆర్తితో, భక్తితో, నమస్కరించిన కోట్లమంది శిష్యులకు ఆ ప్రణవరహస్యాన్ని తమ ఆధ్యాత్మ ప్రవచనాంతర్గత అనుగ్రహంగా శిష్యుల పంచకోశాల ఆంతరమునందు శాశ్వతంగా కొలువయ్యే విధంగా బోధించే శ్రీ చాగంటి సద్గురువులు కూడా ఈ నవయుగపు శివగురువులే కదా...! 
కుక్కే లోని కుమారధార నదీ జలాలకు / మరియు తిరుమల పై కొలువైన కుమారధార తీర్థ జలాలకు, సుబ్రహ్మణ్య స్వామి వారి వేలాయుధంలోని శక్తి ప్రత్యక్షంగా నిక్షిప్తం గావించబడిందని పెద్దల ఉవాచ..అందుకే ఆ రెండూ తీర్థజలరాశులు కూడా చర్మ సంబంధమైన సమస్యలను హరించడంలో చాలా మహిమోపేతమైనవని అంటారు...
మరీ ముఖ్యంగా కుక్కే లోని కుమారధార నదీ జలాలు ఎంత స్వఛ్ఛమైనవి / దివ్యౌషధగుణపూరితమైనవంటే, అసలు ఆ నీటి అడుగున చిన్న గుండుసూది ఉన్నా సరే ఎంతో సుస్పష్టంగా కనిపిస్తుంది. అక్కడ భక్తులు వేసే పేలాలు/పంచకజ్జాయం ఇత్యాది వాటిని తినడానికి గుంపులుగుంపులుగా తుళ్ళిపడే మీనములు ఎన్నో ఉన్నాసరే, ఆ జలప్రవాహం అంత స్వఛ్ఛంగా ఎలా ఉంటుందో ఏమో, ఆ అడవిలో తారకాసురున్ని సంహరించి పశ్చిమకనుమల కొండలపై విశ్రాంతి తీసుకుంటున్న ఆ కుమారస్వామికి, ఆ నీటి పరిసరాల్లో ఆ అడివిలో మాత్రమే లభించే విచిత్ర ( హెగ్సాగోనల్ స్టోన్స్ ) షట్కోణాకార రాళ్ళకే ఎరుక మరి...!
తిరుమల కొండపైగల కుమారధార తీర్థం దెగ్గర స్కందుని తపస్సుకు మెచ్చిన శ్రీవేంకటేశ్వర స్వామివారిని కీర్తిస్తు, అన్నమార్యులవారు ఒక కీర్తనలో, " కేకివాహనవరదా కేశవ..." అని స్వామివారిని సంబోధించడం ముదావహం... 
( కర్ణాటక లోని కుక్కే, కృష్ణా జిల్లాలోని మోపిదేవి క్షేత్రాల్లో స్వామి ప్రసాదించిన దర్శనం మరియు కొన్ని సంవత్సరాల క్రితం శ్రీనగర్ కాలనిలోని సత్యసాయి నిగమాగమం లో గురువుగారి ఆధ్వర్యంలో జరిగిన శ్రీ వల్లీ-దేవసేనా కుమారస్వామి కళ్యాణం తరువాత, మళ్ళీ ఇన్ని రోజులకు, స్థలవైశిష్ట్యం , వేదస్వరశుద్ధి, ఆచారశుద్ధి, పూజాకైంకర్య ద్రవ్యశుద్ధి, పర్వ తిథి ప్రత్యేకత, ఇన్నిటి శుభ కలయికలతో కూడిన అమోఘమైన మహాన్యాసపూర్వక అభిషేక/హోమ/అలంకారం తర్వాత, స్కందగిరి లోని శ్రీ వల్లీ దేవసేనా సమేత, వేలాయుధ/శక్త్యాయుధ - కుక్కుటధ్వజ ధర కుమారస్వామి వారి శోభాయమానమైన ఉత్సవ మూర్తి యొక్క పిక్.  )

కనకపుతేరుపై శ్రీనివాసుని దేవేరి ఊరెరిగింపు..... ! - 2018

కనకపుతేరుపై శ్రీనివాసుని దేవేరి ఊరెరిగింపు..... !
తన క్రీగంటి చూపులతోనే అందరికి సకలైశ్వర్యములు కటాక్షించే ' కనకధరాస్తుత వైభవ వందిత శంకరదేశిక మాన్యపదే ' అంటూ భక్తులచే కీర్తించబడే అష్టలక్ష్ములకు అధిదేవత అయిన ఆదిలక్ష్మి శ్రీమదలర్మేల్మంగమ్మ..😊

Let's cast our VOTE right and get our dream nation build bright....🙂 - 2018 Telangana VidhanSabha Elections

Let's cast our VOTE right and get our dream nation build bright....🙂
31 జిల్లాల నవ తెలంగాణ అవ్వాలి...
దుక్కి దున్నే ప్రతి కర్షకుడి స్వేదబిందువును ఫలింపజేసి సస్యసీమగా సిరులు దొర్లించే మాగాణి....
రెక్కాడితె గాని డొక్కాడని ప్రతి కార్మికుడి కష్టానికి స్వాంతన కలిగించే పారిశ్రామిక పారిజాతం...
అట్టముక్కలను అతుకులకాగితాలను బొంతల స్కూల్ బ్యాగులను మోసుకెళ్తూ ప్రభుత్వ బడిలో చదువుల కోసం అక్షరయజ్ఞ్యం సాగించే నిరుపేద బాలబాలికలకు సాకార సరస్వతీ ప్రాకారం....
అందుకోండి ప్రతిఒక్కరు వోటు అనే మీ వజ్రాయుధాన్ని...
ఎన్నుకోండి మంచి నేస్తమై సదా మీతోడుగా ఉండే దక్షత గల నేతలను...
నిర్మించండి సుపరిపాలనాభరిత రాష్ట్రమనే ఒక భవ్య రాజ్యాంగబద్ధ రామరాజ్యాన్ని...
ఆనక అందిపుచ్చుకోండి సర్వతోముకాభివృద్ధి అనే సర్వోన్నత సార్వజనీన ప్రతిఫలాన్ని.....😊
Friends! Let’s all do our part of duty as the citizens of this country!
Tomorrow....Dec 7 is the poling day! 😊

శ్రీ పద్మావతి అమ్మవారి కార్తిక బ్రహ్మోత్సవాలు ... :)

శ్రీ పద్మావతి అమ్మవారి కార్తిక బ్రహ్మోత్సవాలు ... 
ఈశానాం జగతోః అస్య వేంకటపతేః విష్ణోః పరాం ప్రేయసీం
తద్ వక్షస్థల నిత్యవాస రసికాం తత్ క్షాంతి సంవర్ధినీం
పద్మాలంకృత పానిపల్లవయుగాం పద్మాసనస్థాం శ్రియం
వాత్సల్యాది గుణోజ్వలాం భగవతీం వందే జగన్మాతరం...!
అంటూ శ్రీవేంకటేశ ప్రపత్తి లో కొనియాడబడే, ఈ కలియుగ ప్రత్యక్ష పరమాత్ముడైన శ్రీనివాసుని దేవేరి,
( శ్రీశుకనూరు --> తిరుశుకనూరు --> తిరుచుకనూరు -> ) తిరుచానూరు అనే పేరుతో ఇప్పుడు పిలవబడుతున్న శ్రీ శుకయోగీంద్రుల ఆశ్రమ స్థలి, అలర్మేల్మంగాపురం లో కొలువైన శ్రీ పద్మావతి అమ్మవారి కార్తిక బ్రహ్మోత్సవాలు ఉత్తరాషాఢ నక్షత్ర ప్రయుక్త పంచమితీర్థానికి పూర్తి అయ్యెలా 9 రోజుల నవాహ్నికోత్సవం గా, శ్రీ నారాయణ మహర్షి చే సిద్ధాంతీకరించబడిన శ్రీ పాంచరాత్ర విష్ణ్వాగమసంప్రదాయబద్ధంగా, అంగరంగవైభవంగా జరుగుతున్న శుభవేళ....! 
లోకశ్రేయస్సుకై తలపెట్టిన యజ్ఞ్యఫలం త్రిమూర్తులలో ఎవరికి చెందాలో నిర్ధారించడానికి నారదులవారి మాటప్రకారంగా శ్రీవైకుంఠం వెళ్ళిన భృగుమహర్షి పాదపీడనంచే తన నివాసస్థానమైన స్వామివారి వక్షసీమ అపవిత్రమైందని తలచి అవమానభారంతో భూలోకానికి అలిగివెళ్ళిన శ్రీమహాలక్ష్మి కొల్హాపురంలో లో వీరలక్ష్మిగా స్థిరపడింది కాబట్టి, ఇంకో కొత్తరూపంలో, శ్రీపద్మావతి దేవిగా, శ్రీ వేంకటేశ్వర స్వామివారి పుష్కరకాలపు తపస్సుకు / ప్రార్ధనలకు ఫలితంగా, బంగారు పద్మమునుండి దివ్యప్రభలతో పద్మసరోవరం మధ్యనుండి ప్రభవించింది కనుక, అలర్ మేల్ మంగై గా, పద్మావతి గా రూపాంతరం చెంది శ్రీ శుకపురం లో కొలువైంది ఆ శ్రీమహాలక్ష్మి...
బ్రహ్మశ్రీ చాగంటి సద్గురువుల ప్రవచనాంతర్భాగంగా ఈశ్వర తత్వాన్ని గ్రహించే వారికి తెలిసినట్టుగా,
అమ్మవారిని ' పురుషకారిణి ' అని సంప్రదాయం లో వ్యవహరించడం అనగా, స్వామి వారి విశాలవక్షసీమను నిత్యం అలంకరించి ఉండి, ఆర్తితో, భక్తితో నమస్కరించిన వారందరిపట్ల తన క్రీగంటి చూపులతోనే నిర్హేతుక దయను వర్షించి, స్వామి వారి అమేయానుగ్రహనికి కావలసిన పాత్రతను మనకు కలిగించి, సకల శుభములను ప్రసాదించే ఆ పద్మావతి దేవి వైభవం వర్ణనాతీతం....
ఈ చరాచర సృష్టిలో ఆ పరాశక్తి కాని పదార్థం అణువంతైననూ లేదు...
ఆఖరికి జడానికి కూడ ఒక శక్తి ఉంది అని తెలియజేస్తుంది, ' జడశక్తిర్జడాత్మిక ' అనే శ్రీ లలితాసహస్రంలోని నామం....
శ్రీలక్ష్మి అస్టోత్తరశతనామాల్లో, శ్రీపద్మావతి అమ్మవారి అష్టోత్తరశత నామాల్లో, మనం చదివినట్టుగా ,
ఓం శివాయై నమః
ఓం శివకర్యై నమః
ఓం నవదుర్గాయై నమః
ఓం మహాకాళ్యై నమః
ఓం బ్రహ్మ విష్ణు శివాత్మికాయై నమః
ఓం త్రికాల ఙ్ఞాన సంపన్నాయై నమః
ఓం భువనేశ్వర్యై నమః
ఓం లలితావధూట్యై నమః
ఇత్యాది నామాల్లో వర్ణించినట్టుగా, అద్వయమైన ఈశ్వర / ఈశ్వరి తత్వంగా ఒకే ఒక్కటిగా ఉండే పరాశక్తి, వివిధ కారణాలకు, వివిధ ప్రయోజనాలకు, వివిధ భక్తుల ప్రార్ధనలకు, ఒక్కో పేరుతో, ఒక్కో రూపంతో, ఒక్కో ఐతిహ్యంతో, ఒక్కోచోట ఒక్కోలా కొలువైఉండి దైవిక తత్వాన్ని ప్రదర్శించడం కేవలం లోకశ్రేయస్సుకోసమే....
ఒక ఐ.సి.యు లో ఉన్న పేషెంట్ యొక్క ప్రాణాన్ని నిలుపడానికి, ఎప్పుడు ఏ పరిస్థితిలో ఎంత మోతాదు లో ఏ మందు వాడి పల్స్ ని, శ్వాస ని, ఈ.సి.జి ని, ఇత్యాది కీలక ప్రాణసూచికలను బ్యాక్ టు నార్మల్ ఎలా చేయాలో అక్కడ నియమింపబడిన సుశిక్షిత వైద్యులకు అవగాహన ఉండి అక్కడి డ్యూటి నర్సులకు ఆదేశాలు ఇచ్చినట్టుగా,
ఈ కలియుగలక్షణం ప్రకారం, 3/4 వంతు ప్రపంచ జనాభ భగవంతున్ని మరచి విషయవాంఛల వలలోని విషానికి బలై ఎప్పుడూ ఒక ఐ.సి.యు లోని పేషెంట్ లాగా విషమ పరిస్థితులలోనే కొట్టుమిట్టాడుతూ జీవించడంలో, జీవితం యొక్క పరమార్ధాన్ని తెలుసుకుందాం అనుకునేలోపే ఆయుః ప్రమాణం యొక్క ఆఖరి దశకు దెగ్గరై, భగవంతున్ని తెలుసుకోకుండానే, భూమికి, భూపతి శ్రీపతి అయిన ఆ భగవంతుడికి కూడా దూరమైపోయేలా జీవిస్తారు కాబట్టి, ఈ కలి యుగధర్మం ప్రకారంగా, సనాతనమైన అవిచ్ఛిన్న గురుపరంపరాగతంగా అలనాడు జగద్గురువులైన శ్రీ ఆదిశంకరాచార్యులవారు (అద్వైతం), శ్రీ మధ్వాచార్యులవారు (ద్వైతం), శ్రీ రామానుజాచార్యులవారు (విశిష్టాద్వైతం), నెలకొల్పిన సంప్రదాయానుగుణంగా, మనకు నచ్చిన లేదా వర్ణాశ్రమప్రకారంగా జన్మతః మనకు మన పెద్దలచే అనుగ్రహించబడిన సంప్రదాయాన్ని గౌరవిస్తూ, ఆ భగవద్ జ్ఞ్యాన / సారస్వత సంపదను పునికిపుచ్చుకున్న ఈనాటి సద్ గురువులు, ఆచార్యులు, యతిపురుషులు, సాధువుల బోధలచే, జీవితంలో లభించిన కొంత కాలంలోనైనా ఏది ఎక్కడ ఎప్పుడు ఎంతవరకు అవసరమో వివేచనతో విభాగించి అంతవరకు నిర్వహించవలసిన లౌకిక కర్తవ్యాలను శక్తిమేరకు నిర్వహిస్తూ, మిగతా ' కాలధనాన్ని ' ( అంటే బ్యాంకుల్లో వెనకేసుకున్న బ్లాక్ మని అని కాదు, అమూల్యమైన కాలం అనే ధనాన్ని ) కాయిక వాచిక మానసికంగా త్రివిధాల ఈశ్వరుని సేవకై వెచ్చిస్తూ, ఉన్నతమైన ఉత్తమమైన జన్మలు లభించడానికి కావలసిన పుణ్యం అనే ధనాన్ని సముపార్జన చేస్తూ బ్రతకడం అందరి విహిత ధర్మం....
మనం ఇప్పుడు అనుభవిస్తున్న భోగాలన్నీ గత జన్మల + ఈ జన్మల తాలుక పుణ్యబలం యొక్క ఫలితాలు.... తిరిగి పుణ్యార్జన చేయకుండా అవి కేవలం అనుభవిస్తూ ఉండిపోతే వచ్చే జన్మలలో శూన్య పుణ్యం / నిల్ బ్యాంక్ బ్యాలన్స్ తో జీవితం మొదలైతే మళ్ళి అదే జీవ చక్రం అదే జీవన పోరాటం తో లైఫ్ రిపీటే...!
ఒక మండు వేసవిలోని మధ్యాహ్న సూర్యుడి కింద నిల్చొని చేతిలో పట్టుకున్న మంచు ముక్క వంటిది పుణ్యం...
సూర్యుడు ఎంత బాగా వెలిగిపోతుంటే అంత బాగా మన చేతిలోని అయిస్ క్యూబ్ కరిగిపోతుంది...
అది కరిగిపోతుంటే ఎంతో చల్లగా హాయిగా అనిపిస్తుంది.... కాని కరిగిన మరుక్షణం ఆ ఎండవేడికి తాలలేక అయిస్ ట్రే లో ఇంకో అయిస్ క్యూబ్ కోసం వెతుకుతాం...ఇంకోటి లేకపోతే ఇంక ఎండదెబ్బకు చేతులు ఎండిపోతాయి...
అదే విధంగా ఇప్పుడు మనం అనుభవిస్తున్న సకల భోగభాగ్యములు చేతిలో పట్టుకున్న మంచు ముక్క వంటివి...అవి ఉన్నంతసేపు చాల బాగా అనిపిస్తాయి ...కనీస అవసరాలకు పోను ఇంకొన్ని నిజంగా అవసరం అనుకున్నా, అంతే అవసరం వాటిని వెచ్చించి తిరిగి పుణ్యాన్ని సముపార్జించడం...!!
ఈ పుణ్యపాపాల లెక్కలు, ఈ జన్మ కర్మల తలనొప్పి, ఈ గహనమైన కర్మ సిద్ధాంతపు లెక్కల గోల అనవసరంగా మనకెందుకు అనుకున్ననాడు, ఆ భోగభాగ్యాలను, పుణ్యబలాన్ని ఈశ్వరుని సేవాంతర్భాగం చేసిననాడు, ఈశ్వరార్పనం గా తగురీతిలో మితంగా భోగాలను స్వీకరించి, ఈశ్వరుని సేవకై మిగతా జీవితాన్ని అంకితం చేసిననాడు, మన ప్రమేయం వద్దనుకున్నం కాబట్టి పరిపూర్ణుడైన ఆ ఈశ్వరుడే కల్పించుకొని మన కర్మలన్నిటికి పూర్ణత్వాన్ని ఆపాదించి తనలోకి మనలను స్వీకరించి మన జీవ యాత్రకు పరిపూర్ణతను సిద్ధింపచేస్తాడు అనేది విబుధ జనుల వాక్కు...
పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాద్పూర్ణముదచ్యతే
పూర్ణస్యపూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే
అని చిన్నప్పటినుండి మనం చదువుకున్నట్టుగా, ఒకసారి పూర్ణత్వాన్ని పొందిన వస్తువు, ఎన్ని మార్పులకు లోనైనప్పటికి అది సదా పూర్ణమే అయ్యి ఉంటుంది....
కేవలం ఈశ్వరుడు మాత్రమే సర్వ పరిపూర్ణుడు కాబట్టి మన కర్మలకు పూర్ణత్వాన్ని ఆపాదించి మన జీవితాలను పరిపూర్ణం చేయగలిగినవి కేవలం ఈశ్వర సంబంధమైన జీవితాలు...తత్ సంబంధమైన సద్గురుబోధలు....
శ్రీశంకరభగవద్పాదుల వారు తమ కనకధారాస్తవం లో అమ్మవారిని
గీర్ధేవదేతి గరుడధ్వజసుందరీతి
శాకంభరీతి శశిశేఖరవలభేతి
సృష్టిస్థితి ప్రళయకేలిషు సంస్థిస్తాయై
తస్యై నమస్త్రిభువనైక గురోస్తరుణ్యైః
అని ప్రార్ధించి, ఒక వృద్ధబ్రాహ్మణి ఆచార్యులకు మనస్పూర్తిగా సమర్పించిన ఒక ఎండిన ఆమలక (ఉశిరి / ఉసిరి కాయ) ఫలానికే ఫలితంగా, దయతలిచి ఏకధాటిగా ఆవిడ వాకిట్లో బంగారు ఉశిరికాయల వర్షాన్నే కురిపించిన ఆ శ్రీమహాలక్ష్మి,
( నాకు తెలిసినంత వరకు శ్రీ చాగంటి సద్గురువుగారితో సహా, ఎందరో మహానుభావులు కేరళ లో ఇప్పటికీ " స్వర్ణాట్టు మనాయ్ " అనే పేరుతో ఉన్న ఆ గృహాన్ని సందర్శించారు...)
అన్ని రకాల అజ్ఞ్యానాన్ని సమూలంగా దహించివేసే శ్రీ పాంచరాత్ర ఆగమసేవితయై, ' ఓం సకల శాస్త్రవిశారదాయై నమః 'అంటూ తిరుచానూరు లో నిత్య పూజలందుకునే శ్రీవాణి గా,
దీనజనావనపాలిటి దైవశిఖామని గా అప్రాకృతమైన సకలాఘనాశకమైన
శ్రీ వేంకటాచలముపై కొలువైన శ్రీవేంకటవిష్ణుమూర్తి యొక్క పట్టపురాణి అయిన అలర్మేల్మంగాపుర స్థిత శ్రీమహాలక్ష్మి గా,
సకలులకు సర్వ శ్రేయస్సులను అనుగ్రహించే శ్రీమాత గా,
త్రిలోకాలకు జగత్గురుస్వరూపిని యై సదా భాసించే శ్రీ పద్మావతి అమ్మవారు, ప్రార్ధించినవారందరిని సదా చల్లగా చూసి అనుగ్రహించుగాక.... 
ఓం శ్రియై నమః..... 🙏🙏🙏🙏🙏
ప: అంగనలీరే హారతులు అంగజగురునకు నారతులు
చ: శ్రీదేవి తోడుత జెలగుచు నవ్వే ఆదిమ పురుషుని కారతులు
మేదినీ రమణి మేలము లాడేటి ఆదిత్య తేజున కారతులు
చ :సురలకు నమౄతము సొరది నొసంగిన హరి కివో పసిడారతులు
తరమిది దుష్టుల దనుజుల నడచిన అరి భయంకరున కారతులు
చ: నిచ్చలు కల్యాణ నిధియై యేగేటి అచ్యుతునకు నివె యారతులు చొచ్చి శ్రీ వేంకటేశుడు నలమేల్మంగ యచ్చుగ నిలిచిరి యారతులు

Monday, December 3, 2018

Rajini rocks again in his " 2.0 ".. :)

Thalaiva's 'fans' across the globe might already have had their own share of ecstasy watching Sankar's " 2.0 " 
Needless to say that it has elevated Indian Cinemas to an unparalleled stature rising above any international wonder movie made so far, that has encompassed an emotional story-line blended with technical supremacy in to an action thriller !
Having watched it from 'Software Engineering' per-se, I personally like certain twists in the movie very much.
If one has some know how on "A Token based Continuous Integration / Build & Release model's execution methodology",
where in a contingency plan ( as a conditional connected downstream execution ) is put in place well before the actual execution mechanism is triggered, so that the former can plunge in to action should the latter run in to any unforeseen hiccups, to ensure the over all execution remains intact and the very purpose of setting up the entire software delivery model remains seamless. Even more to speak in simpler terms, just like a split second dynamic switch over to another fail over / balancing app server, should the actual one go unreachable for whatsoever technical snag, so that the cardinal principle of ' any-time accessibility' remains firm.
That twist of enabling the " 3.0 Microbots " upon an emergency message sent from " Chitti 2.0 " on his power failure, got a kool twist to the entire story-line. 
With an awesome screenplay, amazing graphics / VFX and humorous rendition of the script, " 2.0 " certainly stands apart from the rest in terms of establishing it as a movie that made a difference to the Indian Cinemas' heightened legacy for decades to come.
Today mobile phone has become 'a necessary devil'. Hence it is everyone's onus to use it sensibly and it is the telecom operators' onus to ensure they don't cross the levied TRAI's frequency thresholds causing damage to any of the species.
'Live and let live, motto should be embraced not just in words but in spirit ', is the underline essence of the movie. 
Super Star Rajini simply Rocks again ...! 
Hope a sequel " 3.0 " would be in soon... 
------------------------------------------------------------------
అన్నిట్లో ' గురువాక్కు / ఆచార్య ఆనతి ' ని దర్శించడం కూడా ఒక యోగమేనేమో... 
మొన్న 1 ఆఫ్ మై ఫేవరెట్ స్టార్స్', రజినీస్ 2.0 చూసెటప్పుడు, అస్మద్ గురుదేవుల, బ్రహ్మశ్రీ చాగంటి సద్గురువుల బోధాంతర్భాగంగా మదిలో నిక్షిప్తమైన కొన్ని విషయాలు గుర్తుకువచ్చాయి.....
అండజ / పిండజ / స్వేదజ / ఉద్భిజ మనే ఈ చతుర్విధమైన చరాచర సృష్టిలో, అండజులైన పక్షులకు మరియు పిండజులైన బ్రాహ్మణులకు మాత్రమే " ద్విజులు " అనే వ్యావహారిక నామం తో ఎంతో గౌరవం ఇవ్వబడింది.
( అంటే ఇక్కడ నా ఉద్దేశ్యం కేవలం జన్మతః బ్రాహ్మణత్వం పొందిన వారు అని కాదు...
దానితో పాటుగా ఆజన్మాంతం ఉపవీత ధారణ యొక్క శాస్త్రమరియాదను అందు నిక్షిప్తమైన గాయత్రి శక్తిని గౌరవించి, అందరికి అనునిత్యం శుభాలను అనుగ్రహించే వేదవిదులైన బ్రాహ్మణోత్తములు ' అని నా వచనార్ధం....)
వీరిద్దరికే మాత్రమే ఎందుకంటే, మొదట 'అండం' గా ( గ్రుడ్డు గా), ఆ తర్వాత ఇంకోసారి 'అండజం' గా (అంటే గ్రుడ్డు నుండి పక్షిగా), జన్మించి ఆకాశంలో ఇతర సాధారణ జీవులు చేరుకోలేనంత ఎత్తువరకు భౌతికంగా ఎగరలవు కనుక పక్షులకు...
మరియు అదే విధంగా మొదట, పిండజమైన ఒక సాధారణ మనుష్య ప్రాణిగా జన్మించి, ఆ తరువాత ' ఉపనయన ' సంస్కారంతో గురువుల / ఆచార్యుల అనుగ్రహంతో వేదమూర్తిగా ఇంకో జన్మనే స్వీకరించి, అందు ఆర్జించిన గాయత్రి శక్తిని
' ఉప - నయనం ' గా చేసి , ( అంటే ఎప్పుడు దెగ్గరే ఉండే మరో కన్ను గా / జ్ఞ్యాన చక్షువైన మూడో కన్నుగా చేసుకొని ), సాధారణ మానవ మేధకు అందనంతగా ఎంతో దూరం ఉన్నతంగా ఆధ్యాత్మికంగా ఆలోచిస్తూ బ్రహ్మజ్ఞ్యాన సముపార్జనతో సమాజ శ్రేయస్సు కోసం జీవిస్తారు కాబట్టి.....
అలాంటి ద్విజులైన పక్షులను, ద్విజోత్తముడైన ఒక కాల్పనిక పక్షిరాజును ఈ సినిమా స్టోరి లైన్ లోకి తీస్కొని, ప్రస్తుత సమాజంలోని కొందరు హద్దులు దాటుతున్న హానికరమైన సాంకేతికత రూపంలో సమసమాజంలో ఒక భాగమైన పక్షులకు కలగజేస్తున్న ఇబ్బందిని ఒక పక్షిప్రేమికుడి మనోగతంగా తెరకెక్కించిన వైనం అభినందనీయం .....