Sunday, May 19, 2019

With DVN Shravan gaaru at ABV during Annamaachaarya's 611th birth anniversary celebrations... :)

With DVN Shravan gaaru at ABV, a good Samaritan who has been doing yeoman service to all the Annamaaachaarya / Sri Venkateshwara devotees across the globe with his dedicated blog "http://annamacharya-index.blogspot.com", which is a vast repository of umpteen Annamaachaarya kruthis ( with their audio links as well, sung by many a famous devotional singer ), that has been the primary source for several hundreds of devotees to rely on for their learning needs.
Especially for me, this blog has been such a magnanimous blessing for that almost all of my little posts / spiritual commentaries on Annamaachaarya sankeertanaas and other spiritual / devotional topics have found their profound support in its contents where in I could easily hook up a specific Sankeertana's page as a link to my post while explaining the same. 
On the account of Saint poet Shree Taallapaaka Annamaachaaryaa's 611th birth anniversary day celebrations, ABV's special event named "Swagatham-2019 " was indeed a very memorable one forever with the choicest of the blessings showered by HH Sri Sri Sri TridanDi Chinnajeeyar Swaamiji, who has graced the occasion and rendered the pious 'Mangala aaShaasanams' to all the devotees present there. 

Annamaachaaryula aavirbhaavaaniki " Chintalamma " gaa aa Paraashakti anugrahinchinavainam..! :)

Padakavitaapitaamahulaina Annamaachaaryula vaari apratihata SangeetaSaahitya sammiLita SharadaakaTaakshapu Vaagvaibhavaaniki beejam, aa Vashinyaadi vaagdevataa vandita ParaaSakti "Chintalamma" gaa 3 taraalamunupea tana anugrahavarshitam gaa prasaadinchina vruttaantam asamad gurudeavula vaagvaibhavamloa....😊

శ్రీతాళ్ళపాక అన్నమాచార్యులవారి 611 వ జయంత్యుత్సవం....! :)

శ్రీతాళ్ళపాక అన్నమాచార్యులవారి 611 వ జయంత్యుత్సవం....! 
" అన్నమాచార్యులవారి సంకీర్తన " అనే మాట వినపడకుండ, ప్రపంచవ్యాప్తంగా కొలువైన సంగీతసాహిత్యారాధకులకే కాకుండా, కేవల లౌకిక ప్రశాంతత కోసమైనా కీర్తనలు వినేవారికి సైతం ఏ రోజు గడవదు....
ఆచార్యులను, వారి ఆనతిని, బాహ్యమున శ్రీవేంకటహరిలీలావిలాసభరిత గౌణములై ఆంతరమున గంభీరమైన అధ్యాత్మ శరణాగతిబోధ తత్వసూచికలై అలరారే వారి సంకీర్తనా సంపుటిని, వాటిద్వార భక్తభాగవతులకు సమకూరే అమేయమైన శ్రీనివాసానుగ్రహాన్ని యథోచితంగా స్మరించి వారికి కృతజ్ఞ్యతలను అర్పించుకోవడం కోసం ప్రత్యేకంగా వారి జయంతిగా జరుపబడే ఈ రోజు ప్రశస్తమైనందున విశేషించి ఎందరో సంగీతసాహిత్యోపాసకులకు చాల ప్రియమైన రోజు...... 
మనకు బాగా దెగ్గరివారై బర్త్ డే రోజని తెలిసి కూడా ఎవరైన విష్ చేయకుంటే మనం ఎంతగా వారి యొక్క విస్మృతికి విస్మయం చెందుతామో.....
అట్లే ఈ కలియుగపు భక్తభాగవతుల్లెలరికి ఎంతో ఆప్తులై, అందరికి ధర్మార్థకామ్యమోక్షములనే చతుర్విధపురుషార్ధాలను అత్యంత సులభంగా ఆర్జించి పెట్టే హరిభక్తిసౌలభ్యాన్ని ప్రతిపాదించబడిన సంకీర్తనసంపుటుల అనుగ్రహవిశేషంచేత మనజీవితాలను సుఖప్రదం చేసే వారి వాంజ్ఞ్మయ యజ్ఞ్యాన్ని ఇవ్వాళ విశేషంగా స్మరించకుంటే, ఆచార్యులు కూడా అట్లే విస్మయం చెందవలసిందే కదా. 
శ్రీవైష్ణవ భాగవతాగ్రేసరులై స్వామిని నిత్యం తమ పదకవితల పుష్పాలతో శ్రీపాదార్చనగావించే పనిలోనే నిమగ్నమై ఉండే ఆచార్యశిఖామణులు అలా భావించవలసిన పనిలేకపోయినా, ఆ భగవంతుడు మాత్రం ఫీల్ అవుతాడు మన విస్మృతికి అని నా భావన...... 
ఎందుకంటే, ఈ కలియుగపు లక్షణాలను, లుప్తమైపోయే స్వచ్ఛతతో, బాహ్యాంతర మనోశరీర వాతావరణ సామాజిక ఆచారవ్యవహార ఆహార ఆహార్య భావ భవ కాలుష్యంతో సతమతమవుతూ, మందబుద్దితో, రోగగ్రస్త జీవనంతో, భౌతిక మరియు ఆధ్యాత్మిక ఐశ్వర్యలేమితో ఇక్కట్లమధ్య గడిచే మనుజుల దైనందిన జీవితాన్ని ద్వాపరం నాడే భాగవతాంతర్గతంగా ఈ లోకానికి తెలిపి, కలియుగంలో వాటన్నిటికి విరుగుడు నిత్యం భగవద్ నామరూపగుణవైభవ సంకీర్తనమే అని తెలిపి, మానవాళికి ఆ భాగ్యం సాధికారికంగా సశాస్త్రీయంగా అందివ్వడానికి ఎందరెందరో పుణ్యజీవులను సద్గురువులుగా, సంకీర్తనాచార్యులుగా, ఈలోకంలో ఆయా దేశకాలానుగుణంగా ప్రభవింపజేసి,
" సకృదేవప్రపన్నాయతవాస్మీతీచయాచతే అభయంసర్వభూతేభ్యో దదామియేతద్వ్రతం మమ " అని తన త్రేతాయుగం నాడు కోదండరాముడిగా శ్రీరాముడిగా ఇచ్చిన అభయాన్ని, ఈనాటి కలియుగ పర్యంతం వరకు కూడా కోనేటిధాముడిగా శ్రీవేంకటరాముడై నిలుపుకుంటున్నాడు ఆ శ్రీమన్నారాయణుడు....
ఆ భగవద్ అనుగ్రహన్ని సద్గురువుల ద్వారా, ఆచార్యులద్వారా అందిపుచ్చుకొని జీవితాలను నిలుపుకోవడమే మన విహిత కర్తవ్యం.... 
అన్నమాచార్యుల పౌతృలు చినతిరుమలాచార్యుల వారు రచించిన " అప్పని వరప్రసాది అన్నమయ్య " అనే కృతిలో,
బిరుదు టెక్కెములుగా పెక్కుసంకీర్తనములు
హరిమీద విన్నవించె అన్నమయ్య
విరివిగలిగినట్టి వేదముల అర్ఠమెల్ల
అరసి తెలిపినాడు అన్నమయ్య ||
వేదవిభాగం గావించిన శ్రీవేదవ్యాసమహర్షులవలే,
దేవభాష అయిన సంస్కృతం లో శ్రౌతవిద్యగా మహర్షులకు, యోగులకు, జ్ఞ్యానఘనులకు మాత్రమే అందివచ్చిన వేదప్రతిపాదిత భగవద్ తత్వాన్ని ఒడిసిపట్టి,
పండిత పామర భేదంలేకుండ ప్రతిఒక్కరు పాడిపరవశించే విధంగా ఎంతో సరళమైన మధురాతిమధుర తెనుగుమాండలిక పదకవితల్లోకి ఒలికించి,
అధ్యాత్మ, శృంగార, వైరాగ్య సంకీర్తనలుగా వాటిని విభాగించి, మానవాళికి అందించిన అభినవ వ్యాసులువారు అంటూ అన్నమాచార్యుల ఔదార్యాన్ని, వారి సంకీర్తనల అనుగ్రహవిశేషాన్ని మనకు తెలుపుతూ, తుదకు
అందమైన రామానుజ ఆచార్యమతమును
అందుకొని నిలచినాడు అన్నమయ్య
విందువలె మాకును శ్రీవేంకటనాథునీచ్చే
అందరిలో తాళ్ళపాక అన్నమయ్య ||
అంటూ భగవంతుడు కొందరికి మాత్రమే అందే ఏ ఒక్కరి సొత్తు కాదు, అందరి దాహార్తిని తీర్చే ఆషాఢనీలమేఘం వంటివాడు, కాబట్టి మనుజానీకాన్ని తరింపచేసే ఆ స్వామి అస్టాక్షరి మంత్రం కేవలం తనకు మాత్రమే కాదు, ప్రతిఒక్కరికి చెందాలి అని గుడి గోపురంపైకెక్కి మరీ అలనాడు చాటి చెప్పిన శ్రీరామానుజుల సిద్ధాంతాలాను అందిపుచ్ఛుకొన్న మార్గాన్ని అవలంబించి, ఈ కలియుగ ప్రత్యక్ష దైవాన్ని ప్రతి ఒక్కరికి పసందైన విందు లాగ అనుగ్రహించారు
అన్నమాచార్యులు అంటూ తెలిపి, ఆ శ్రీవేంకటహరిని మనం కూడా ఆచార్యుల వారిలా సేవించి తరిద్దామని సెలవిచ్చారు..... 
అన్నమాచార్య దివ్యతిరువఢిగళే శరణం.....🙏

Friday, May 17, 2019

శ్రీ వికారి సంవత్సర స్వాతి నక్షత్ర ప్రయుక్త వైశాఖశుద్ధ చతుర్దశి, శ్రీలక్ష్మినృసిమ్హజయంతి / శ్రీతరిగొండ వెంగమాంబ జయంతి శుభాభినందనలు..... :)

Vinay Kumar Aitha
శ్రీ వికారి సంవత్సర స్వాతి నక్షత్ర ప్రయుక్త వైశాఖశుద్ధ చతుర్దశి, శ్రీలక్ష్మినృసిమ్హజయంతి / శ్రీతరిగొండ వెంగమాంబ జయంతి శుభాభినందనలు..... 
మత్స్యకూర్మవరాహనారసిమ్హాది శ్రీమహావిష్ణు దశావతరాల్లోని
4 వదైన శ్రీనృసిమ్హావతార ఆవిర్భావదినంగా మాధవమాసంలోని ఈరోజుని మన పెద్దలు నిర్ణయించినారు.... అస్మద్ గురుదేవులు శ్రీచాగంటి సద్గురువుల వివిధ ప్రవచనాంతర్గతంగా ఆలకించిన నృసిమ్హవైభవాన్ని కొంత వివరించే ప్రయత్నంచేస్తాను.... 
ఒకానొక సమయమున శ్రీవైకుంఠస్థిత రమాపతి యొక్క దర్శనార్థమై ఏతెంచిన బ్రహ్మగారి మానసపుత్రులైన సనక, సనంద, సనత్కుమార, సనత్సుజాతులను బ్రహ్మవేత్తలను, స్వామివారి సన్నిధికి వెళ్ళకుండా అడ్డగించి పరిహాసమాడినందుకుగాను, స్వామి వారి ద్వారపాలకులైన జయవిజయులను,
" కన్ను మిన్ను కానక అహంకారపూరితులై ఏ స్వామికి భాగవతులంటే అత్యంత ప్రీతికరమో అటువంటి భక్తవత్సలుడి సన్నిధికి వెళ్ళేందుకు మమ్ములను అడ్డగించినందుకు, అదే స్వామికి మీరు దూరమై మర్త్యలోకమునందు జన్మనెత్తెదరు గాక....." అని శపించగా,
వారి అపరాధాన్ని మన్నించి తిరిగి తమ స్వస్థానాల్లో చేరే భాగ్యాన్ని అనుగ్రహించమని ఆ ద్వారపాలకులు స్వామివారిని ప్రాధేయపడగా,
" స్వామివారిపై ప్రీతితో 7 జన్మలు...లేక వైరంతో 3 జన్మలు ఎత్తి, తిరిగి శ్రీవైకుంఠం చేరగలరు...." అని శ్రీమహావిష్ణువు శాపానుగ్రహమివ్వగా, 7 జన్మల పాటు స్వామివారి ఎడబాటును సహించడం కన్నా 3 జన్మలు ఎత్తి తిరిగివచ్చుటే మేలని భావించి, 3 వైరి జన్మలనే కోరిన ఆ జయవిజయులు
హిరణ్యాక్షహిరణ్యకశిపులు అనే అన్నదమ్ములుగా కృతయుగంలో,
రావణకుంభకర్ణులు అనే అన్నదమ్ములుగా శ్రీరాముని త్రేతా యుగంలో,
శిశుపాలదంతవక్తృలుగా శ్రీకృష్ణుని ద్వాపరంలో జన్మించి,
స్వామివారిచే నిహతులై తిరిగి విష్ణుపార్శ్వదులుగా తమ పూర్వపు ఉన్నత జన్మలకు ఏగిన వృత్తాంతాం అందరికి సుపరిచితమే కదా....
అందులో మొదటి జన్మలోని, హిరణ్యాక్షహిరణ్యకశిప దైత్యులుగా జన్మించినప్పుడు, వరాహావతారంలో సోదరుడు హిరణ్యాక్షుణ్ణి సమ్హరించిన శ్రీహరిపై కక్షతో హిరణ్యకశిపుడు ఘోర తపమాచరించి, బ్రహ్మగారిచే,
" దేవ దానవ నరులు మొదలుకొని ఏ జాతి జీవులచే కాని, పగలు కాని రాత్రి కాని, భూమి పై కాని ఆకాశంలో కాని, అస్త్రంతో కాని శస్త్రంతో కాని, జీవము ఉన్నదానితో కాని నిర్జీవమైనదానితో కాని, ఇవ్విధములైన వేటితోకూడా తనకు మృత్యువు లేకుండా వరమివ్వమని అడగగా..."
స్థితికారుడిగా ఎల్లప్పుడూ అంతటా పరివ్యాప్తమై అన్నిటికీ అతీతమైఉండే ఆ పరమాత్మతత్వం, లయకారుడిగా ఏ విధంగా ప్రభవించి వాడికి మృత్యువును అనుగ్రహించగలదో దర్శించి,
బ్రహ్మగారు ఆ దైత్యుణ్ణి, "అట్లే అగుగాక తథాస్తు..." అని, కోరుకున్న వరమిచ్చి అంతర్ధానమయ్యెను.....
మిగతా రాక్షస ఉపాధులకంటే వీడి అతితెలివి కొంచెం ఎక్కువైనదే అని భావించాలి...ఎందుకంటే, అప్పటివరకు ఈ విశ్వంలోనే ఎక్కడా లేని విధంగా దుస్సాధ్యమైన వరాన్ని ఆర్జించి అమర్త్యుడై విర్రవీగుదామనుకున్న వాడి అహంకారం కంటే కూడా, అమరత్వానికై ఉన్న ఏ ఒక్క అవకాశాన్ని కూడా వదలకుండ ఉండడానికి యావద్ జీవకోటిని, తద్ జనితమైన జడరాశిని తనవరంలోని ఐచ్ఛికాలలోకి తీసుకురాగలిగిన వాడి అహంభావానికి ఇక్కడ లోకమంతా నివ్వెరపోయింది....!
వాడు పెట్టిన ఆ కఠిన నియమావళికి అనుగుణంగా ఆ పరతత్వం రూపాంతరం చెంది, అత్యవసరమైన శిష్టరక్షణ అనివార్యమైన దుష్టశిక్షణ గావించేందుకు, విశేషక్రూరత్వాన్ని సంతరించుకున్న ఆ దైత్యుడి సమ్హారానికై, అంతే చిత్ర విచిత్రమైన, ఇదివరకు ఈ విశ్వంలో లేనిది, సరికొత్తదైన సాటిలేని బలసంపన్నమైన ఉపాధిని, దుస్సహమైన రుద్రతేజస్సును సంపూర్ణంగా తనలోకిగైకొని, స్వల్పకాల వ్యవధి గల అపురూపమైన అవతారంగా ప్రభవించి, ధర్మరక్షణగావించిన శ్రీహరి 4వ అవతారమే ఈ శ్రీనృసిమ్హావతారం.....!
హిరణ్యాక్ష హిరణ్యకశిపులు అనగా బంగారువర్ణంలో మెరిసే కళ్ళు, గోళ్ళు ఉన్నవారని అర్ధంకదా.....
ఏది ఎప్పుడు ఎక్కడ ఎలా ఉండాలో, అలా ఉంటేనే అది చక్కనిది, ఉత్తమైనది, అని భావం....
సాధారణమైన నలుపు, తెలుపు రంగుల్లో ఉండవలసిన కళ్ళు, గోళ్ళు, బంగారు వర్ణంలో ఉండడాన్ని అసలు ఊహించుకోడానికి కూడా సమ్మతించం...
ఆపాదతలమస్తకం నిండిపోయిన రాక్షసత్వాన్ని వాటిద్వార ప్రకటంగా విశదపరుస్తూ, అలాంటి వాటితో తిరిగే ఆ రాక్షసులను, వారి క్రౌర్యాన్ని ఇక లోకం ఏవిధంగా భరించగలదు....
ఏ జీవుల్లోనైనా సరే, విశేషించి కర్మస్వతంత్రత కలిగిన బుద్ధిజీవులైన మనుష్యుల కళ్ళు, గోళ్ళు ఈ రెంటికి ఉన్న శక్తి అపారం...ఒకటి ఐంద్రికంగా, మరొకటి భౌతికంగా....అది మంచిగాను, చెడుగాను రెండువిధాలుగా వ్యక్తపరచబడడం మనం చూస్తూనేఉంటాం....
"ఏ మహానుభావుని చల్లని చూపుల అనుగ్రహమో ఈ విశేషం....." అని పెద్దలు అనడం చూస్తుంటాం...
అట్లే,
"నరుని చూపునకు నల్లరాయి అయినా పగిలిపోవును..." అని కదా మన పెద్దలు చెప్పే సామెత.....
యోగపరిభాషలో చెప్పాలంటే, విశేషమైన జవశక్తి గల మనసులో జనించే సంకల్పశక్తికి అనుగుణంగా ఒక ఇంద్రియంచే తద్సమయంలో తరంగితమయ్యే ధనాత్మక / ఋణాత్మక భావాలే, ఈ మంచి చెడులు అని అర్ధం.....
అదేవిధంగా, మనిషి యొక్క జుట్టు, గోళ్ళు కూడా.... జీవాజీవ ద్వయమైన ఈ రెండు చాల విచిత్రమైనవి....
పెరుగుతుంటాయి కాబట్టి జీవమున్నట్టా.....అంటే ?
శరీరంలోని వైటమిన్-కె ని గ్రహించి, వాటి ఉద్గమ స్థానంలో సజీవకణజాల జనితపదార్ధమునుండి ప్రభవిస్తాయి కాబట్టి జీవమున్నట్టే....!
కత్తిరించినప్పుడు నొప్పి ఉండదు కాబట్టి జీవంలేనట్టా...అంటే ?
జనించి ఒక నిర్నీతపరిధిని దాటి పెరిగినతరువాత (అంటే when they protrude out of the dermis and epidermis layers of the skin ) శరీరబహిర్గతమైనప్పుడు, అందున్న జీవకణజాలం లుప్తమై పోతుంది కాబట్టి అప్పటినుండి అది నిర్జీవమే...!
హస్తనఖములను పరిశీలించి ఆ మనిషియొక్క ఆరోగ్యమును గురించి వివరించగల గొప్ప శాస్త్రీయవిద్వాంసులు గల దేశం ఈ భారతదేశం..!!
ఇక భౌతికంగా / ఆధ్యాత్మికంగా కూడా నఖముల శక్తి అపారం అని తెలిసిందే.... క్యారంస్ ఆడడం దెగ్గరినుండి, పెన్ పర్ఫెక్ట్ గా పట్టుకొని బాగా రాసేంతవరకు,
మరియు తలగోక్కోవడం నుండి స్వీయరక్షణకు సహజ శస్త్రాలుగా, భౌతికంగా మనం గోళ్ళను వివిధ ప్రయోజనాలకు ఉపయోగించడం తెలిసిందే....
ఇక ఆధ్యాత్మికంగా, అమ్మవారైతే భండాసురసమ్హారంలో తన దివ్య నఖములనుండి ఏకంగా శ్రీమన్నారాయనుణుని దశావతారాలను సంకల్పమాత్రం చేత సృజించి యుద్ధంలో వాడి అసురసేనను లయించివేసింది...!!
( " కరాంగుళినఖోత్పన్న నారాయణదశాకృతిః " )
అలా బంగారువర్ణపు గోళ్ళుండి క్రూరత్వంతో బాగామదించిన ఆ హిరణ్యకశిపుడు సొంత కొడుకని కనికరంకూడా లేకుండా ప్రహ్లదుని ఎన్నెన్నో కష్టాలకు గురిచేసి తుదకు విసిగివేసారి,
ఎక్కడరా నీ శ్రీహరి ఉండేది....అంటూ కసిరిననాడు,
" ఎక్కడైనా ఉంటాడు నా శ్రీహరి..." అని అంతే ధీటుగా సమాధానం ఇచ్చిన బాలుని ఓర్వక, సభాస్తంభాన్ని చూపి ఇందుగలడా నీ హరి అని గదమాయించిననాడు...
"ఇందు గలఁ డందు లేఁ డని
సందేహము వలదు చక్రి సర్వోపగతుం
డెం దెందు వెదకి చూచిన
నందందే కలఁడు దానవాగ్రణి! వింటే "
అనే శ్రీపోతనామాత్యుల వారి కందపద్య శైలిలో శ్రీహరి సర్వాంతర్యామిత్వాన్ని తేటతెల్లం చేసేలా ప్రహ్లాదుడు పలకడంతో, భాగవత వచనాన్ని నిజంచేసేందుకు, భగవంతుడే మునుపెన్నడు రాని రీతిలో, హిరణ్యకశిపుడు తన గదతో ప్రహారం గావించబడిన ఆ స్తంభమునుండి దుర్నిరీక్ష్యమైన దైవిక తేజస్సుతో,
అటు నరుడు ఇటు మృగము కాని ఆగ్రహోదగ్రుడైన ఉగ్రనారసిమ్హునిగా సద్యోప్రకటితమై,
అటు భూమి ఇటు ఆకాశం కాని గడపపై నిలిచి,
అటు పగలు ఇటు రాత్రి కాని సంధ్యాసమయంలో,
అటు అస్త్రం కాని ఇటు శస్త్రం కాని జీవాజీవములైన తన వాడి హస్తనఖములతో ఆ దైత్యుడి శరీరాన్ని తన ఊరువుపై పెట్టి, వాడి పొట్టను చీల్చి పేగులు పెకిలించి, సమ్హరించిన విశేష అవతారమే శ్రీమహావిష్ణుమూర్తి యొక్క శ్రీనారసిమ్హావతారం...!! 
ప్రహ్లాదుడు మరియు అందరు దేవతలు కలిసి పరి పరి విధముల స్తుతించి శాంతి పరిచి, అంతటి మహత్తరమైన స్వామి యొక్క అవతార వైభవం ఇలలో శాశ్వతంగా నిలిచి, భక్తభాగవతులకు చిరకాలం ఎనలేని రక్షణ వెలువరించేలా ఆనాడు ప్రార్ధించినందుకు అప్పటి కృతయుగం నుండి నేటి కలియుగం వరకు కూడా ఆ స్వామి వైభవం దిగ్దిగంతముల వ్యాపించి పరిఢవిల్లుతూనే ఉంది...!!
తత్ఫలితంగా పంచనారసిమ్హులు, ( యాదఋషి తపస్సును అనుగ్రహించి యాదాద్రిపై ) , నవనారసిమ్హులు ( అహోబిలాది 9 క్షేత్రాలు ), ఇత్యాదిగా ఆ స్వామివైభవం / అనుగ్రహం మనం ఇప్పటికీ పొందుతూనేఉన్నాం....
మంగళగిరి పానకాల శ్రీలక్ష్మీనరసిమ్హుడిగా,
అలనాడు కృత యుగంలో అమృతాన్ని,
త్రేతాయుగంలో గోఘృతాన్ని (ఆవునెయ్యి),
ద్వాపరంలో గోక్షీరాన్ని (ఆవుపాలు),
ఈ కలియుగంలో గుడోదకాన్ని (బెల్లం పానకం)
స్వీకరిస్తూ, భక్తులందరిని ఆ స్వామి చల్లగా అనుగ్రహిస్తూనే ఉన్నాడు నేటికి కూడా...! 
శ్రీ ఆదిశంకరచార్యుల వారిని ఒక కాపాలికుడు కపటయాచనతో, వారి శిష్యులు దెగ్గర్లో లేనిసమయంలో, బలి తీసుకునేటప్పుడు శిష్యులకు ఆ ఆపద మనోదృక్ గోచరమై శ్రీనరసిమ్హ స్వామిని ప్రార్ధించగా ఉత్తరక్షణం కొండనుండి స్వామి బయల్వడి ఆ కాపాలికుణ్ణి చీల్చిచంపేసాడు...
మరియు శ్రీశంకరాచార్యులవారు కొన్ని రోజులు తమ దేహాన్ని యోగమార్గంలో వీడి ఒక రాజు శరీరంలోకి పరకాయ ప్రవేశంగావించినప్పుడు (శ్రీ శిరిడి సాయిబాబా గారిలా ),
అది తెలుసుకొని ఆచార్యులను ఓర్వలేని దుండగులు భగవద్పాదుల భౌతికకాయాన్ని అగ్నితప్తం చేసినప్పుడు,
ఈ విషయాన్ని గ్రహించి తిరిగి తమ శరీరంలోకి యథాస్థానంలో పంచప్రాణాలను ప్రవేశపెట్టే యోగప్రక్రియలో కొంచెం ఆలస్యమై, చేతులు కాలిపోయినప్పుడు శ్రీ శంకరాచార్యులవారు వెంటనే తనను రక్షించిన శ్రీనరసిమ్హస్వామిని కరావలంబ స్తోత్రంతో ప్రసన్నం చేసుకొని కాలిపోయిన తమ హస్తాలాను తిరిగిపొంది, తమ శరీరంలోకి సంపూర్ణంగా పునఃప్రవేశం గావించారు.....
ఇక అదే భక్తప్రహ్లాదుని అంశలో ఈ కలియుగంలో జన్మించిన మహాసాధ్వీమణి మాతృశ్రీతరిగొండవెంగమాంబ గారికి మొదట తమ ఊరులోని సత్యప్రమాణాలక్షేత్రమైన శ్రీ తరిగొండ లక్ష్మీనరసిమ్హుడిగా అనుగ్రహించి, పిదప తన కలియుగ ప్రత్యక్షావాసమైన శ్రీవేంకటగిరిపైకి రప్పించి ( అలయ ఈశాన్యభాగాన తన హస్తనఖములు ప్రస్ఫుటంగా ప్రదర్శిస్తూ శ్రీయోగనారసిమ్హుడిగా స్వామి కొలువైఉండడం మనం ఇప్పటికీ చూడొచ్చు ), తిరుమల అభయారణ్యస్థిత తుంబురు కోనను సాధనాస్థలిగా అనుగ్రహించి, తుదకు శ్రీవరాహస్వామి ఆలయానికి దెగ్గర్లో ఉన్న శ్రీతరిగొండవెంగమాంబ బృందావనంలో సజీవసమాధియోగాన్ని అనుగ్రహించిన ఆ అప్రతిహత తేజోమూర్తి అయిన శ్రీవేంకటనృసిమ్హాన్ని అన్నమాచార్యులవారు, ఒకానొక సందర్భంలో అప్పటి భూపతి అయిన సాలువనరసిమ్హరాయులవారి చెరలో బంధీగా ఉన్నప్పుడు తనకు బంధనవిముక్తి కలిగించమని వేడుకుంటూ వెలువరించిన ఈ సంకీర్తన కూడా స్వామి వారి శ్రీనృసిమ్హావతారమంతటి కడు గగనగంభీరమైనదే...!! 
-------------------------------------------------------------------
http://annamacharya-lyrics.blogspot.com/…/170palanetranala-…
ప|| భాలనేత్రానల ప్రబల విద్యుల్లతా | కేళీ విహార లక్ష్మీనారసింహా ||
చ|| ప్రళయమారుత ఘొర భస్త్రీకాపూత్కార | లలిత నిశ్వాసడోలా రచనయా |
కూలశైలకుంభినీ కుముదహిత రవిగగన- | చలన విధినిపుణ నిశ్చల నారసింహా ||
చ|| వివరఘనవదన దుర్విధహసన నిష్ఠ్యూత- | లవదివ్య పరుష లాలాఘటనయా |
వివిధ జంతు వ్రాతభువన మగ్నౌకరణ | నవనవప్రియ గుణార్ణవ నారసింహా ||
చ|| దారుణోజ్జ్వల ధగద్ధగిత దంష్ట్రానల వి- | కార స్ఫులింగ సంగక్రీడయా |
వైరిదానవ ఘోరవంశ భస్మీకరణ- | కారణ ప్రకట వేంకట నారసింహా ||
ANNAMACHARYA-LYRICS.BLOGSPOT.COM
Audio link : Balakrishnaprasad Audio link :SPB Archive link : ప|| భాలనేత్రానల ప్రబల విద్యుల్లతా | కేళీ విహార లక్ష్మీనారసింహా || చ|| ...

Wednesday, May 15, 2019

అందరికి హ్యాపి ' మదర్స్ డే ' - 2019 - మాతృదేవోభవ ... :)

శ్రీమాత కు ప్రతిరూపమై ప్రపంచంలో తమ తమ పిల్లలందరికి ప్రత్యక్ష దైవంగా నిరంతరం రక్షణగా ఉండేది అమ్మ... ఆ మాతృమూర్తికి గౌరవవందన సూచకంగా సంవత్సరకాలంలో ఒక రోజుని ప్రత్యేకంగా జరుపుకోవడమే ' మదర్స్ డే ' అయితే, అందరికి హ్యాపి ' మదర్స్ డే '... 
గ్లోబలైజేషన్ వల్ల ఈ యావద్ ప్రపంచం నేడు ఒక కుగ్రామంగా మారి, "ఇందులో లేనిది లోకంలో లేదు....లోకంలో ఉన్నవన్నీ ఇందులో ఉన్నాయి..." అనే మహాభారత ఇతిహాసం గురించిన సామెత ఒకటి, ఈనాటి భారత దేశ వర్తమాన వాస్తవికతకు కూడా వర్తిస్తుందన్నది అందరికి తెలిసిన విషయమే....
కాబట్టి భూగోళ ఆవలివైపున్న అప్రాచ్య ఆర్భాటాలన్నీ కూడా మన ప్రాచ్య దైనందిన జీవనవిధానంలో అంతర్భగామై, అక్కడి ఉత్సవాలు ఇక్కడ కూడా జరుపుకోవడం అన్నది ట్రెండ్ గా మారిన ఈ రోజుల్లో, వాటికి మన ఘన సంప్రదాయపు జోడింపుతో అవి సహేతుకంగా అందరికి ఒక సత్సందేశం ఇచ్చేలా మార్చి మాత్రమే వాటిని జరుపుకోవాలి అన్నది ఈనాటి పెద్దల మాట. అప్పుడే వాటివల్ల ఇంటికి, సమాజానికి కూడా ఒక సుహృద్భావ మేళవింపు కలిగి, ఈ నవయుగ జీవనశైలిలోని మన మరజీవన విధానానికి ఎంతో కొంత సార్ధకత...
పూర్తిగా వాటిని త్రోసిరాజని మనదైన సనాతనజీవనవిధానంలోనే జీవించాలనుకుంటే, ఈ నిత్య పరుగులపందెమైన మోడర్న్ వల్డ్ లో అభివృద్ధికి ఆమడ దూరంలోనే ఉండి వెనకపడిపోతామని భావించడం కన్నా,
పూర్తిగా వాటినే ' దిగుమతి ' చేసుకొని, మనదైన సనాతనజీవనవిధానాన్ని కోల్పోతున్నాం అని భావించడంకన్నా,
"తానొవ్వక ఇతరులనొప్పింపక తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతి..." అని మన సుమతీ శతక కర్త సెలవిచ్చినట్టుగా, అటు మనదైన భారతీయ జీవనవిధానాన్ని దృఢంగా అనుసరిస్తూనే,
లోకంపోకడలకు అనువుగా కొంతమేర ఆధునికతను కూడా ఆహ్వానిస్తూ, ఆ అప్రాచ్యాచారాలను భోజనానంతర విస్తరిగా పరిగణించి వాటిని ఎంతవరకో అంతవరకే పరిమితంగా ఆదరించి, మధ్యేమార్గంగా, ఉభయకుశలోపరిగా జీవించడంలోనే జీవనసార్ధకత ఉందని నా భావన...
సద్గురు శ్రీచాగంటి వారి ప్రవచనాలు వినేవారికి,
"He who thanks his mother and his wife is the biggest fool on the planet...",
అని గురువుగారు చెప్పే ఒక ప్రోవర్బ్ బాగా జ్ఞ్యాపకంలోనే ఉండి ఉంటుంది....
ఎవ్వరి జీవితంలోనైనా, ఆ ఇరువురి ప్రాధాన్యత అటువంటిది..... వారివల్లే జీవితపుబండి ఆటుపోట్లకు తట్టుకొని నిలబడి మనగలిదేది....
ఆఖరికి కన్న తండ్రి కూడా, నా జీవితం, నా డబ్బులు, నా ఇల్లు, నా జల్సాలు, నా ఇష్టం, అనే సంకుచిత స్వార్ధవైఖరితో కుటుంబాన్ని, తన కర్తవ్యాన్ని పక్కనపడేసి బలాదూర్ గా జీవించగలడేమో.... కాని కేవలం అమ్మ మాత్రమే ఎంతటి పరిస్థితుల్లో సైతం యావద్ కుటుంబానికై తన కర్తవ్యాన్ని బాధ్యతగా స్వీకరించి శ్రమించి జీవించగలదు....
అందుకే యావద్ చరాచర విశ్వాన్ని తన క్రీగంటి చూపులతోనే సమ్రక్షించే ఆ పరాశక్తిని, వశిన్యాది వాగ్దేవతలు ఎన్నెన్నో శక్తివంతమైన పేర్లున్నాసరే,
" శ్రీమాతా " అని సంబోధిస్తూనే తమ లలితాసహస్రాన్ని మొదలుపెట్టారు... మతృమూర్తికి ఉన్న గొప్పదనం అటువంటిదని సకల శాస్త్రాల సారాంశం.....
లోకశ్రేయస్సుకై శ్రీ శివగురు ఆర్యాంబల తనయుడిగా అవతారాన్ని స్వీకరించిన శ్రీఆదిశంకరభగవద్పాదులు,
తమకోసం అంటూ ఎనాడూ ప్రత్యేకంగా ఏది సమకూర్చుకోకుండా, సమస్త మానవాళి శ్రేయస్సుకైమాత్రమే తమ తపశ్శక్తిని వినియోగించారు....
కాని వారి మాతృమూర్తికి కలిగిన కష్టాలకు, ఎన్నో సార్లు వారు ప్రత్యక్షంగా ఉద్యుక్తులయ్యారు.... నీటి కోసం శ్రమించే తల్లి కష్టాలకు చలించి ఏకంగా పూర్ణానది యొక్క గమనాన్నే తమ ఇంటివైపునకు మళ్ళించారు....! వారి మాతృమూర్తి యొక్క అవసానదశలో ప్రత్యేకంగా శ్రీకృష్ణుణ్ణి ప్రార్ధించి శ్రీమద్భాగవతలీలాసందర్శనా భాగ్యాన్ని కలిగించి మోక్షాన్ని సిద్ధింపజేసారు...!!
గోకుల గారాలబిడ్డడిగా తనను ఎంతో గారాబంగా పెంచి పోషించిన యశోదమ్మ, శ్రీకృష్ణుడి పెళ్ళిని స్వయంగా తాను జరిపించలేకపోయానని బాధపడినందుకు, ఏకంగా ఈ కలియుగ ప్రత్యక్ష దైవంగా, " శ్రీవేంకటేశ్వరస్వామి " అనే అవాతరాన్నే స్వీకరించాడు ఆ గోవిందుడు...!
ఈరోజుల్లో ఎవరింట్లో స్వచ్చమైన గోక్షీరాన్ని కాచి తీసిన వెన్నకుండలుంటున్నాయి గనక, ఆ పరమాత్మ ఆకలికి ఆగక ఇంట్లోజొరబడి నవనీతచోరలీలలు గావించడానికి.....
ఎంతైనా తిండిమెండయ్య కదా, కాబట్టి కన్నయ్యకి ఈ కలియుగవాసులు సరిగ్గా పెట్టకుంటే ఎలా అని,
వకుళమాతగా ఇప్పటికీ స్వామివారి ఆలయ ఆగ్నేయభాగాన ఉన్న శ్రీవారిపోటులో కొలువై, ఎదురుగా చిన్న బిలం నుండి,
బాలభోగాలనుండి, రాజభోగాలవరకు తన శ్రీవేంకటకృష్ణుడికి అన్నీ సరిగ్గా వండిపెడుతున్నారా లేదా అని నిత్యం పర్యవేక్షిస్తూ ఉంది ఆ పరమాత్మ యొక్క మాతృమూర్తి సైతం....! 
పుట్టి బుద్ధి గడించిన పిదప 23 సంవత్సరముల వరకు అంటే 2010 వరకు, కనీసం ఒక్కసారైనా తిరుమల యాత్ర / స్వామి దర్శనానికి నోచుకోకుండా బ్రతికిన దౌర్భాగ్యపు జీవితానికి స్వస్తి పలికి, నా జీవితంలోని అత్యంత క్లిష్టపరిస్థితులను సైతం నిలదొక్కుని జీవించేందుకు గోవిందుడి రక్షణను ఆనాటినుండి నా జీవితాంతర్భాగం గా చేసేందుకు కారణమైన తిరుమల యాత్రలో,
ఆ శ్రీవేంకటేశ్వరస్వామి వారి సన్నిధికి జీవితంలో మొట్టమొదటిసారి ( కుటుంబసమేతంగా కూడా ) ఏప్రిల్ 2010 లో తిరుమల వెళ్ళినప్పటి పిక్ లో అమ్మా / నేను..... 🙂