శ్రీభారతావనికి స్వాతంత్ర్యంసిద్ధించిన రోజుని పురస్కరించుకొని జరుపుకునే పంద్రాగస్ట్ జెండావందనం చిన్నప్పుడు స్కూల్లో బడిపిల్లలందరికి ఒక పెద్ద పండగే.....!
ముందు రోజు సాయంత్రం నుండే వలంటీర్లు గా ఎంపిక చేయబడిన ఔత్సాహిక పిల్లలందరు కలిసి మా రాజధాని స్కూల్ ఆఫీస్ దెగ్గరికి చేరి రంగురంగుల రిబ్బన్లు, కాగితాలు, ఇత్యాదులతో " సుతిల్ దారానికి " గోధుమపిండితో తయార్ చేసిన ' లై ' పూసి వాటిని ఒక వరుసలో అంటే గ్రీన్, రెడ్, బ్లూ, ఆరెంజ్, యెల్లో, ఇలా వివిధ కలర్స్ లో త్రికోణాకారంలో కట్ చేయబడిన కాగితపు ముక్కలను అతికించి వాటిని తోరణాలుగా అన్నివైపులా కట్టేపనిలో నిమగ్నులమైయ్యేవాళ్ళం...
మాకు టీచర్లు సార్లు కూడా బాగా సహాయంచేసేవారు.....
మాకు టీచర్లు సార్లు కూడా బాగా సహాయంచేసేవారు.....
అనురాధా టీచర్, లక్ష్మీ టీచర్, నాగసూర్యకళా టీచర్, మా స్కూల్ జీవితాన్ని శాసించిన తెలుగు అధ్యాపక సరస్వతీత్రయం ఈ తెలుగు ఫ్యాకల్టి మెంబర్స్......
1 నుండి 4 వ తరగతి వరకు మాకు ఓనమాలు నేర్పిన తొలి తెలుగు అధ్యాపకులు అనురాధా టీచర్ మరియు లక్ష్మీ టీచర్ కాగా...
( కాలని లాస్ట్ బస్టాప్ కి దెగ్గర్లో ఉండే లక్ష్మీ టీచర్ వాళ్ళింట్లో వైణికురాలైన వాళ్ళ అమ్మాయి వాయించే వీణని చూడ్డానికై టీచర్ వాళ్ళ ఇంటికి చాలాసార్లు వెళ్ళడం బాగా గుర్తు.... )
5 నుండి 10 వరకు నాగసూర్యకళా టీచర్ మరియు ప్రసాద్ సార్, ఆ స్థానంలో మాకు లిఖిత మాతృభాష ని నేర్పిన ఆరాధ్య గురువులు.....
ప్రత్యేకంగా శ్రీమతి నాగసూర్యకళ టీచర్ గారి తెలుగు ప్రభావం మాజీవితం పై అధికంగా ఉండేది...
ఎందుకంటే చిన్నప్పుడు నేర్చిన ఓనమాలకు సార్ధకత ఆ తరువాతి పైతరగతుల్లో తెలుగు బోధించే వారివల్లే సమకూరేది....
ఒక భవనానికి పునాది కోసం తవ్విన తరువాత కట్టే బేస్మెంట్ లాంటిది 5 నుండి 8 వ తరగతి వరకు ఉండే తెలుగు విద్యాభ్యాసం.....
అది ఎంత ధృఢంగా ఉంటే జీవితంలోని తరువాతి విద్యాభ్యాసం అంత ఘనంగా ఉంటుంది అని బోధించే వారు ఎన్.ఎస్.కె టీచర్....
అది ఎంత ధృఢంగా ఉంటే జీవితంలోని తరువాతి విద్యాభ్యాసం అంత ఘనంగా ఉంటుంది అని బోధించే వారు ఎన్.ఎస్.కె టీచర్....
మాతృభాషపై గట్టి పట్టుని సాధించినవారికి ఇతర భాషలు మరియు ఇతర విద్యలపై అవలీలగా
పట్టు లభిస్తుందని బోధించేవారు....
పట్టు లభిస్తుందని బోధించేవారు....
వ్యక్తిగతంగా ఎంతో సౌమ్యులు మృదుస్వభావులు అయిన వారు, తమ సనాతన ఆర్యవైశ్య జీవితాన్ని తీర్చిదిద్దుకోవడానికి తెలుగు భాష ఎంతగా ఉపకరించిందో తెలుపుతూ మమ్మల్ని కూడా తెలుగుపై మమకారాం పెంచుకొని కేవలం ఒక సబ్జెక్ట్ గా మాత్రమే కాకుండా అదొక జీవనోద్ధారకమైన ఆధారంగా అభ్యసించండని నిరంతరం బోధించేవారు మా ఎన్.ఎస్.కే టీచర్....
వ్యక్తిగతంగా క్లాస్ లో ఇంకొందరితో పాటుగా నేను కూడా ఎన్.ఎస్.కే టీచర్ కి ఒక ఫేవరేట్ స్టూడెంట్ని....
మా అమ్మ కి కూడా ఎన్.ఎస్.కే టీచర్ వ్యక్తిగతంగా బాగా పరిచయం ఉండడంతో నాకు మార్కులు బాగా వేసేవారు.....అంటే నాకు కొందరు టీచర్లు హ్యాండ్
రైటింగ్ బావుండదని మార్కులు తగ్గించేవారు.....
కంటెంట్ ఎంత బాగారాసినా నా కోడి బరుకుడువల్ల కొన్ని మార్కులు కోల్పోయేవాణ్ణి....
మా అమ్మ కి కూడా ఎన్.ఎస్.కే టీచర్ వ్యక్తిగతంగా బాగా పరిచయం ఉండడంతో నాకు మార్కులు బాగా వేసేవారు.....అంటే నాకు కొందరు టీచర్లు హ్యాండ్
రైటింగ్ బావుండదని మార్కులు తగ్గించేవారు.....
కంటెంట్ ఎంత బాగారాసినా నా కోడి బరుకుడువల్ల కొన్ని మార్కులు కోల్పోయేవాణ్ణి....
కాని ఎన్.ఎస్.కె టీచర్ మాత్రం నా బాధను అర్ధంచేస్కొని ఇంకొంచెం బాగా రాయడానికి ప్రయత్నించు వినై అని సున్నితంగా వారించేవారు కాని మార్కులు మాత్రం ఫుల్లుగా వేసేవారు....
ఓంకారాన్ని స్మరించి ఎన్.ఎస్.కే టీచర్ బ్లాక్బోర్డ్ పై వ్రాయడం మొదలుపెట్టారంటే, ఆ తెలుగు అక్షరావళి ఎంతో హృద్యంగా, చూడచక్కని ముత్యాల వరుసల్లా
ఉండేది.....
ఉండేది.....
సుద్దముక్కను చేబట్టి ఎన్.ఎస్.కె టీచర్ టక టక రాసే శైలిని వర్నించాలంటే, అస్మద్ గురుదేవులు,
శ్రీ చాగంటి సద్గురువుల శ్రీమద్భాగవతంలో ఉటంకించబడే జనమేజయ సర్పయాగ వృత్తాంతం గుర్తున్నవారికి తెలిసినట్టుగా,
అక్కడి మహర్షుల సారస్వతశక్తికి ముల్లోకాల్లో ఉన్న సర్పాలన్నీ టకటక మంటూ ఏవిధంగా వచ్చి వాలేవో, అచ్చం అదేవిధంగా అచ్చులు హల్లులు ఒత్తులు దీర్ఘాలు అన్నీ టకటక మంటూ బ్లాక్బోర్డ్ పై అమరిపోయేవి.......
శ్రీ చాగంటి సద్గురువుల శ్రీమద్భాగవతంలో ఉటంకించబడే జనమేజయ సర్పయాగ వృత్తాంతం గుర్తున్నవారికి తెలిసినట్టుగా,
అక్కడి మహర్షుల సారస్వతశక్తికి ముల్లోకాల్లో ఉన్న సర్పాలన్నీ టకటక మంటూ ఏవిధంగా వచ్చి వాలేవో, అచ్చం అదేవిధంగా అచ్చులు హల్లులు ఒత్తులు దీర్ఘాలు అన్నీ టకటక మంటూ బ్లాక్బోర్డ్ పై అమరిపోయేవి.......
"ఓం తం తక్షకాయస్వాహా...."
అనగానే ఇంద్రుడి సిమ్హాసనాన్ని చుట్టుకొని అక్కడే ఉండిపోదామనుకున్న తక్షకునితో పాటుగా సిమ్హాసనాన్ని కూడా ఈడ్చివేసిన వైనంలా,
అనగానే ఇంద్రుడి సిమ్హాసనాన్ని చుట్టుకొని అక్కడే ఉండిపోదామనుకున్న తక్షకునితో పాటుగా సిమ్హాసనాన్ని కూడా ఈడ్చివేసిన వైనంలా,
మా టీచర్ వ్రాసే వేగానికి అక్షరాలన్నీ కూడా గోడకు అతుక్కొనిపోదామని అనుకున్నా, ఆ వేగానికి మామీదికి వచ్చేస్తాయోఏమో అన్నట్టుగా జాలువారేవి వారి హస్తఝరియందు.....!
మొత్తం బ్లాక్ బోర్డ్ అంతా నిండిపోయాక
ఆ అక్షరాల అమరికను చూసిన ఎవ్వరికైనా సరే,
ఆ అక్షరాల అమరికను చూసిన ఎవ్వరికైనా సరే,
తెల్లని ఆదిశేషుని సహస్రఫణములు ఊగిసలాడుతుండగా వాటికింద సేదతీరిన శేషపర్యంకశయనుడి నీలమేనిపై అలంకరించబడిన ముత్యాలసరములవోలే ఉండేది ఆ దృశ్యమంజరి.....!!
ఇక మా టీచర్ బ్లాక్బోర్డ్ పై వ్రాసింది విశదీకరించడం, ఆ కమలనాభుడి నాభికమలంలో కొలువైన విరించి శ్రీవాణి వల్లె వేసే సామవేదంలా ఉండేది ఆ తరగతిబోధ.....
అలా మా జీవితాలకు వారి తెలుగు బోధను ఎనలేని పెన్నిధిగా అందించి
వారు మాత్రం అందరాని లోకాలకు తరలివెళ్ళిపోయారు.....😔
వారు మాత్రం అందరాని లోకాలకు తరలివెళ్ళిపోయారు.....😔
ఈ క్రింద వీడియోలో నా క్లాస్మేట్ / ఫ్రెండ్ నాగరాజు పాడదామనుకున్న, మా ఎన్.ఎస్.కె టీచర్ గారు మాకు అందించిన ఆ దేశభక్తి కీర్తన అప్పుడు నేను పాడి ఒక చిన్న ప్రైజ్ కూడా అందుకున్నాను....😊
నా తెలుగు కవనాలు రాసేది నేనైనా రాయించేది మాత్రం మా నాగసూర్యకళ టీచర్ గారే అనిభావిస్తుంటాను ఇప్పటికీ నేను కొన్నిసార్లు.....అంతగా వారి అనుగ్రహం మా స్కూల్ జీవితాలను సఫలీకృతంచేసింది.....!
No comments:
Post a Comment