Friday, July 30, 2021

శ్రీ ప్లవ నామ సంవత్సర భరణి నక్షత్ర ప్రయుక్త ఆషాఢ బహుళ అష్టమ్యోపరినవమి భానువాసర ఆషాఢ బోనాల జాతర శుభాభినందనలు.....🍕💐😊🍨( మా కూకట్పల్లి ఏరియాలో ఆగస్ట్-01-2021 కి బోనాలు )

శ్రీ ప్లవ నామ సంవత్సర భరణి నక్షత్ర ప్రయుక్త ఆషాఢ బహుళ అష్టమ్యోపరినవమి భానువాసర ఆషాఢ బోనాల జాతర శుభాభినందనలు.....🍕💐😊🍨

( మా కూకట్పల్లి ఏరియాలో ఆగస్ట్-01-2021 కి బోనాలు )

శ్రీ ఆషాఢ జాతర గా అన్ని చోట్లా జరుపబడుతూ,
బోనాల ఉత్సవం గా యావద్ రాష్ట్రంలో వినుతికెక్కి అమ్మవారి ఆషాఢ నివేదనోత్సవం
అంగరంగవైభవంగా నిర్వహింపబడుతూ
మొదటి బోనం గోల్కొండ/గొల్లకొండ జగదాంబిక అమ్మవారికి...,
రెండో బోనం సికింద్రాబాద్ ఉజ్జైని మహంకాళికి అమ్మవారికి...,
మూడో బోనం ఓల్డ్ సిటి లాల్దర్వాజ సిమ్హవాహిని మహంకాళి అమ్మవారికి....
ఆ తరువాత ఇతర అన్ని అమ్మవారి ఆలయాల్లో సమర్పింపబడడం అనే నైసర్గికాచారవైభవంతో హైదరాబాద్ / భాగ్యనగరం ఎన్నో వందల సంవత్సరాలుగా పరిఢవిల్లే అధ్యాత్మ నగరంగా జదగ్విఖ్యాతమైన కీర్తిని గడించడం ఎల్లరికీ తెలిసిందే....

ఒక్కో నగరానికి ఒక్కో నగర అధిదేవత, ప్రత్యధిదేవత, ఉపాలయ దేవతలు, ఉండి ఒక్కో విధమైన వైభవంతో వర్ధిల్లడం అనేది అనాదిగా ఉన్న సంప్రదాయం...

గ్రామాలకు గ్రామ దేవతల లాగ, నగరాలకు నగరాధిదేవతలు ఉండి వారి అనుగ్రహంతోనే ఆ నగర ప్రజలు  సుఖశాంతులతో జీవించడం అనేది ఎప్పటినుండొ మన దేవభూమి పై ఎల్లరూ గమనించే సత్యం...

శ్రీచాగంటి సద్గురువుల శ్రీమద్రామాయణ ప్రవచనాల్లో ఉటంకించబడినట్టుగా,

ఆనాటి రాజులకు / పాలకులకు గల ఉపాసనాబలం, శౌచసిద్ధి, వల్ల ఆయా నగరదేవతలు వారితో సంభాషించడం గురించి మన పురాణాల్లో తెలపడినట్టుగా ఇప్పటికీ ఆ సంప్రదాయం అట్లే ఉంటుందనడం అతిశయోక్తి కానేరదు....

ఆనాడు భరతుడు కోసల మహాసామ్రాజ్యానికి రాజధానిగా ఎప్పటినుండో ఉన్న అయోధ్యా నగరాన్ని కాదని వేరే నగరానికి పరిపాలనను మార్చినప్పుడు, అయోధ్యా నగర అధిష్ఠాన దేవత తనతో నేరుగా మాట్లాడి, తరతరాలుగా వస్తున్న సంప్రదాయాన్ని మార్చకూడదు...అని వారించి అయోధ్యకే రాజధాని మరలా మార్చబడడం....

ఒక వైపు ఎంతో అస్తవ్యస్తమైన స్లం ఏరియాలతో, మరో వైపు ఆకాశహర్మ్యాలతో అలరారే బాంబే / ముంబై నగరాధిదేవత శ్రీముంబామాతా అనుగ్రహం వల్లే ఇప్పటికీ ముంబైలో రోజుకు అంతమందికి అన్నం లభించి, దేశ ఆర్ధిక రాజధానిగా ముంబై వినుతికెక్కడం ...

గురించి శ్రీచాగంటి సద్గురువులు మనకు తెలిపిఉన్నారు...

అట్లే హైదర్ అలి నిజాం రాజు యొక్క హయాంలో తనపేరు మీద, మరియు తన ప్రేయసి భాగమతి పేరుమీద
హైదరాబాద్ / భాగ్యనరం
అనే సువిశాల నగరంగా విస్తరింపబడిన నాటి నుండి ఈనాటి వరకు కూడా, ఈ నగరంలోని దైవత్వ వైభవం ఎంతో విశేషమైనది...

సాక్షాత్ శ్రీ ఆదిశేషుడు / శ్రీ మహావిష్ణువులే ఈ కలియుగంలో ఆనాటి శ్రీరామలక్ష్మణ యోద్ధులుగా
నడయాడి తానీషా రాజు యొక్క అంతహ్పురానికి వచ్చి త్రేతాయుగం నాటి రామమాడలతో పైకాన్ని కట్టి శ్రీరామదాసు గారిని చెర నుండి విడిపించిన ఘటన ఎల్లరికీ విదితమే కద...

భాగ్యలక్ష్మి అమ్మవారిగా చార్మినార్
వద్దే ఇప్పటికీ ఈ భాగ్యనగర అధిదేవత కొలువై ఉందనే సంగతి ఎంత మందికి తెలుసు..?
నగరం నలువైపులా విస్తరింపబడి
మహానగరంగా రూపుదిద్దుకోవడంతో
ఆయా గ్రామాల్లో / పురాల్లో గ్రామదేవతలుగా వెలసి అనాదిగా కొలవబడుతున్న దేవతలందరూ కూడా
ఈ మహానగరాన్ని సమిష్టిగా అనుగ్రహిస్తూ, కాపాడుతూ, ఉండడంతో ఒక్కో ప్రముఖ ఆలయంలో కొలువైన నగరపాలక శక్తికి ఒక్కో వారం ఆషాఢ జాతరగా బోనాల ఉత్సవంగా ఈ ఉత్తరాయణ / దక్షిణాయణ సంధి సమయమైన ఆషాఢమాసంలో విశేష ఆరాధనను నిర్వహించి ప్రీతిని కలిగించి అనుగ్రహాన్ని బడసి తరించడంలో ఎన్నో ఎన్నెన్నో నిగూఢ విశేషాలు ఉండడమనేది వాటియొక్క ప్రాభవాన్ని తెలపకనే తెలుపుతూ మనకు అధ్యాత్మ పరిపుష్టితో జీవించే అనుగ్రహాన్ని ప్రసాదిస్తున్నాయి.....

శ్రీ చాగంటి సద్గురువులు బోధించినట్టుగా,
మనం ఎవరు, ఏం చదువుకున్నాం, ఎంత సంపన్నులం, ఎంత ఉన్నతాధికారులం,
అనే దానితో నిమిత్తం లేకుండా
విధి అనే వింత ఎవరిని ఎప్పుడు ఏవిధంగా " ఆపద " రూపంలో బాధిస్తుందనేది ఆ దైవానికి తప్ప ఎవ్వరికీ తెలియనిది...

మన బుద్ధికి అందని రీతిలో ఎదురయ్యే
కష్టమే ఆపద ...

పక్కింటి వారు పరాకుగా ఉండి ఒక చెట్టు కొమ్మలను కొట్టేయడంలో అక్కడే  ఆడుకుంటున్న తన పిల్లలపై ఆ కొమ్మ విరిగి పడి గాయాన్ని కలిగించబోతోందని గ్రహించిన మరుక్షణం ఆ తండ్రి తన ప్రాణాలను కూడా అడ్డు పెట్టి తనపై ఆ చెట్టు కొమ్మ పడేలా అడ్డుపడి తన పిల్లలను సమ్రక్షించుకుంటాడు....

ఇది లౌకికమైన ఇతరుల పరాకుతో / తప్పిదంతో కంటికి కనిపించేలా కలిగిన ఆపద కాబట్టి ఆ తండ్రి తనపైకి ఆ ఆపదను ఆపాదించుకొని
తన సంతానన్ని కాపాడుకోగలిగేలా వ్యవహరించాడు....

మరి అలౌకికమైన, కొన్ని లైట్ ఇయర్ల దూరంలో ఉండి రాబోవు సమయంలో దురితంగా ఎదురయ్యే ఆపదను జ్యోతిష శాస్త్ర వైదుష్యంతో ముందుగానే గ్రహించి ఆ ఆపద తనకు సంభవించి తన సంతానం సురక్షితంగా ఉండగలిగేంతటి యోగ్యతతో సదరు తండ్రి ఉండగలగాలి అంటే అది దైవానుగ్రహం వినా ఎలా సాధ్యం..??

అందుకే మన సనాతన పెద్దలు, ఋషులు కాల ద్రష్టలై ఈశ్వరానుగ్రహం కోసం అహర్నిశలు ఉపాసన / సాధన గావించిన మహర్షులై జీవించి ఎన్నో శాస్త్రాలను వారు దర్శించి మనకు అందించి జీవించి తరించారు....

పంచాగ వ్యవస్థానుగుణంగా శూన్య మాసంగా పరిగణింపబడే ఆషాఢ మాసం తో ప్రారంభమయ్యే దక్షిణాయణ కాలం విశేషమైన ఉపాసనా కాలం...మరియు చీడ పీడలు కూడా ఒకింత అధికంగా ఉండే సమయం...

కాబట్టి ఈ మాసంలో దేవతారాధన
అనేది ఎన్నో రకాలుగా చాలా ఆవశ్యకమైన అంశం..

బాగా ఖర్చుతో, వ్యయప్రయాసలతో కాకుండా,
ఎల్లరికీ అందుబాటులో ఉండే పసుపు, కుంకుమ, వేపాకు, నీళ్ళు, పువ్వులు, బెల్లమన్నం / పసుపన్నం / పులిహోర (హరిద్రాన్నం), నువ్వుల నూనే / వేప నూనే / నెయ్యి దీపం తో ప్రీతి చెంది విశేషంగా భక్తులను అనుగ్రహించే స్వరూపంగా అమ్మవారిగా / ఆదిపరాశక్తిగా ఈశ్వరారాధనను ఈ ఆషాఢ మాసంలో విశేష గ్రామ దేవత జాతరగా ఏర్పాటుగావించి,  గ్రామ / పుర ప్రజలెల్లరూ ఆయురారోగ్యైశ్వర్యాలతో వర్ధిల్లే విధంగా ఉండేలా సంప్రదాయన్ని మన పెద్దలు మనకు అనుగ్రహించినారు....

అమ్మవారు ఎంతటి కారుణ్యమూర్తో, కాస్త పసుపుకుంకుమతో గావించిన పూజలతో ఎంతో ప్రీతిచెంది అనుగ్రహించే వైచిత్రి శ్రీచాగంటి సద్గురువులు మనకు తెలిపిఉన్నారు...

అలంకారప్రియః విష్ణుః
అభిషేకప్రియః శివః
హరిద్రాప్రియః శక్తిః
నమస్కారప్రియః సూర్యః

అని అనాదిగా మన పెద్దలు,గురువులు మనకు నేర్పించి మనం తరించేలా మన జీవితాల్లో వివిధ సంప్రదాయార్చారాధనలను / నైసర్గికాచారకట్టుబాట్లను నెలకొల్పి ఉన్నారు...

క్రిమిసమ్హారక / రోగనాశక / యాంటిసెప్టిక్ ఎలిమెంట్ గా ఉండే అమ్మవారికి అత్యంత ఇష్టమైన పసుపును, వేపాకులను ఎక్కువగా ఈ బోనాల జాతరలో వాడడం గమనించే ఉంటారు....

దక్షిణాయణం మొదలవ్వడంతో సూర్యుడికి దూరంగా జరుగుతూ భూమి దీర్ఘ వృత్తాకార కక్ష్య ( ఎలిప్టికల్ ఆర్బిట్ ) లో తన భ్రమణం సాగించడం తో అటు అధ్యాత్మ పరంగా జీవులకు అత్మశక్తి ఇటు లౌకికంగా రోగనిరోధక శక్తి సన్నగిల్లడంతో,
ప్రాణులకు ఆంతర బాహిర శ్రేయస్సును ఒనరించడంలో పసుపుది, వేపాకులది కీలకపాత్ర...

అటువంటి పసుపును, వేపాకును తన పూజా ద్రవ్యంగా భక్తులు ఉపయోగించేలా చేసి,
(పసుపు రాయనిదే, వేపాకు కట్టనిదే అమ్మవారికి బోనం ముట్టదు...)
ఎల్లరికీ అధ్యాత్మ / లౌకిక ఆరోగ్యాన్ని ప్రసాదించే ఈ బోనాల పండుగలో ఇంకా ఎన్నో ఎన్నెన్నో అధ్యాత్మ ఆంతర్యములు కలవు....

ఇప్పుడంటే స్టైల్ గా ఉంటాయని, గ్యాస్ పొయ్యిపై వంటకు వాడడానికి, బాసాన్లు తోమడానికి ఈజిగా ఉంటాయని వివిధ లోహ పాత్రల్లో బోనాలు సమర్పిస్తున్నారు కాని,
మన పూర్వులు అందరికి అందుబాటులో ఉండే మట్టి కుండల్లో, పాత్రల్లో, బోనాలను సమర్పించేవారు....

నా రుద్రో రుద్రమర్చయేత్.....
నా దేవో దేవమర్చయేత్.....
అన్నరీతిగా...

అమ్మవారికి ప్రీతిగ బోనం ఎత్తే మహిళామణి, తను శుచిస్మితయై, చక్కని అలంకారవైభవంతో అమ్మవారిగా మారి అమ్మవారికి బోనం సమర్పించడంలో...

ఎత్తబడిన బోనానికి...ఎత్తుకున్న వ్యక్తికి /జీవుడికి, సమర్పింపబడే దైవానికి అభేద భావనతో సాగే బోనం సమర్పణలో...

ద్వైత --> అద్వైత --> విశిష్టాద్వైతంగా
వ్యవహరింపబడే త్రిమతసంప్రదాయములు క్రమముగా ఆదేశమగుచు తుదకు అర్చింపబడే అమ్మవారు ఆవేశించడం తో సంభవించే పూనకం అనబడే జీవజీవేశ్వర అభేద స్థితిలో జీవుడు దేవుడై నిలిచి శ్రీఆదిశంకరాచార్యులచే ప్రబోధింపబడిన అద్వైతతత్త్వంలో తన స్వస్వరూపానుసంధాన స్థితిని గ్రహించి...

ఆ విశిష్టమైన పరతత్త్వాన్ని విశేషంగా ఎల్లప్పుడూ అరాధిస్తూ శ్రీభగవద్రామానుజాచార్యులచే ప్రబోధింపబడిన విశిష్టాద్వైతసంప్రయాదాన్ని నిత్యం ఆరాధిస్తూ ఎల్లప్పుడూ దైవానుగ్రహాన్ని బడసి తరించేది...

బెల్లమన్నం, పసుపన్నం, నీరు, వేప కొమ్మలు, పసుపు, కుంకుమ, ఇత్యాది సాత్విక పదార్థాలతో తయారుచేయబడిన నివేదన / భోజనం / బోనం అనే వ్యవస్థలో..

పెద్దమట్టికుండను ఆధారంగా గావించి ఉండే చిన్నమట్టికుండ పై ప్లేట్లోని దీపం తో కలుపుకొని...

పరమాత్మ యొక్క వైశ్విక అష్టమూర్తితత్త్వం మొత్తం ఈ బోనాల సమర్పణలో దాగుంది...

చక్కని మట్టికుండలతో తయారుకావింపబడిన బోనాన్ని నెత్తిపైకి ఎత్తిన తదుపరి గమనిస్తే
పెద్దకుండపైన ఉండే చిన్న కుండ పైన వెలిగే దీపం
8 అనే సంఖ్య యొక్క ఆకారం పై వెలిగే పరంజ్యోతిగా భాసిస్తుంది.....

1. ఆకాశం ( కుండలోని ఘటాకాశం )

2. గాలి ( వెలిగే దీపానికి ఆధారం గాలి)

3. అగ్ని ( వెలిగే దీపం అగ్ని)

4. నీరు ( ఉపయోగింపబడిన నీరు )

5. పృథ్వీ ( మట్టి కుండ / పాత్ర) 

6. సూర్యుడు (  సూర్య శక్తి / సూర్య కారక ఆత్మశక్తి అజరత్వానికి ప్రతీక... వేపకొమ్మల్లోని అమ్మవారి శక్తి అజరత్వానికి ప్రతీక...)

7. చంద్రుడు ( చంద్ర శక్తి / చంద్ర కారక మనో శక్తి  అమరత్వానికి ప్రతీక... పసుపుతో కలిసిన వేపనీరు ఒక సూక్ష్మ స్థాయిలో అమృత తత్త్వానికి ప్రతీక )

8. జీవుడు ( బోనాన్ని ఎత్తుకున్న వ్యక్తిలో ఉన్నది జీవుడు...ఎత్తబడిన బోనంలో గల నైవేద్యంలో ఉన్నది జీవశక్తి )

ఈ 8 తత్త్వముల సమ్మిళిత సమాహారంగా ఉండే అష్టవిధ ప్రకృతిలో అంతర్భాగమైన పరమాత్మ తత్త్వం మనకు బోనంలో ప్రస్ఫుటంగా దర్శనీయము....

శ్రీ చాగంటి సద్గురువులు చమత్కరించిన ఒక విషయం గుర్తుండిఉంటే...

ఇంట్లోని ఈశ్వర పూజానుగ్రహం 5 మార్కులకు బరాబర్...
ఆలయంలోని ఈశ్వర పూజానుగ్రహం 95 మార్కులకు బరాబర్...

కాబట్టి మొత్తం కలిపి 100 మార్కులు అవుతాయ్...

అదేవిధంగా

ఇంట్లోని ఈశ్వరి పూజామందిరంలో ఎత్తబడిన బోనం 5 మార్కులకు బరాబర్...
ఆలయంలోని ఈశ్వరి పూజగా సమర్పింపబడిన బోనం 95 మార్కులకు బరాబర్...

కాబట్టి మొత్తం కలిపి 100 మార్కులు అవుతాయ్...

ఇవ్విధంగా జీవితాన్ని నూటికి నూరుపాళ్ళు దైవానుగ్రహంతో పరిపుష్టంగావించే ఈ బోనాల ఉత్సవం అమ్మవారి అమేయానుగ్రహానికి బాటలు పరిచి మన జీవితాలు తరించేందుకు కారణమై వర్ధిల్లడంలో ఇంతటి ఆధ్యాత్మిక సందేశం కూడా దాగుందన్నమాట....

భక్తి ప్రపత్తులతో ఒక సువాసిని సమర్పించిన  3 సంవత్సరాల ఆషాఢ బోనాలను స్వీకరించిన ఆ శ్రీకరి నాలుగో బోనాల పండుగ వచ్చేసరికి....
నిత్యం కాదంబరిగా కళ్ళెదుటే భాసించే  కారుణ్యమూర్తియైన ఆ కదంబవనవాసిని...
ఆ సువాసిని ఇంట వారి పుణ్యాలపంటైన సిరుల చిన్నారి తల్లిగా, వారి కన్నకూతురుగా తరలి వచ్చి అనుగ్రహిస్తుంది....
శ్రీభువనేశ్వరిగా చతుర్దశభువనాలను తన క్రీగంటి చూపులతో శాసించే ఆ ఆదిపరాశక్తి....!

ఇంతటి ఉత్కృష్టమైన ఆషాఢ బోనాల జాతర భక్తులెల్లరిని ఘనంగా అనుగ్రహించి సమ్రక్షించుగాక.....

( బోనాల ఉత్సవ వైభవం గురించిన మరింత సమాచారాన్ని ఈ క్రింది నా పాత పస్టుల్లో రాసాను..
https://m.facebook.com/story.php?story_fbid=10222907250163120&id=1033694038 )

ప్రగతినగర్ గ్రామదేవత శ్రీపోచమ్మ తల్లి...

అస్బెస్టాస్ కాలని గ్రామదేవతలు
శ్రీఎల్లమ్మ తల్లి / శ్రీనల్లపోచమ్మ తల్లి....

కూకట్పల్లి గ్రామ దేవత శ్రీచిత్తారమ్మ తల్లి...

అమ్మవార్లకు నమస్కరిస్తూ

సర్వం శ్రీ బల్కంపేట రేణుకా హేమలాంబ ( ఎల్లమ్మతల్లి ) శ్రీచరణారవిందార్పణమస్తు.....
🙏🙏🙏🙏🙏


Tuesday, July 27, 2021

Remembering Shree Abdul Kalaam ji, the "Missile man of India"...💐🙏

Shree Adbul Kalaam Ji, HH "BharataRatna,"

[ Avul Pakir Jainulabdeen Abdul Kalam, an Indian aerospace scientist, and the 11th President of India from 2002 to 2007 ] departed this KarmaBhoomi 6 years ago by leaving an unparalleled legacy via leading a life that has set an example of exceptionally high patriotic fervor enriched with a tinge of spiritual affability in all of his executions all along his life...

He was a great believer and a follower of BhagawadGeeta and was a great Veena artist too apart from being the very well known "Missile Man of India" and one of the most admired faculty of Space Engineering discipline so much so that he breathed his last while teaching the subject to his students....

While its true that there are many such other stalwarts in the Space Engineering and polity that he had his stint in, only a few have had that zeal and zest to be a true Indian to live their life for the well being of their Nation and that of it's citizens though they had red carpet welcome from many countries to become their citizen and to strengthen their country's Technological Ammunition in the fields of Missile Engineering and Space Technology.

Of the many great innovative services offered to the Nation his immaculate intelligence in making the Pokhran Nuclear Tests highly successful by maintaining a strategic military grade operational acumen in securing it's executions from the hawk eyes of the other nation's satellites that kept a constant vigilant watch on all the Indian Space and Nuclear explorative executions to hinder their executions in every possible way citing some global issues etc....

When an X Nation can conduct umpteen Nuclear & Space exploratory executions on and underneath their land without providing any of it's details to others and can call it their right to do so, then why can't some other Y nation do the same to strengthen it's supremacy to make a bold statement that we too are second to none in our very own created native Technological and Scientific strength to advance our Nation's presence and preparedness to shield ourselves from any and every kind of Nuclear hostility and then, if required, to annihilate the opponents' inappropriate executions in order to protect and sustain the peace of it's citizens...?

Dr. Abdul Kalaam ji was significantly simple in following the above latter point to make India a supreme nation that is prudent enough to respect the technological advancements and the greatness of other nations by whole heartedly congratulating them and at the same time is intelligent enough to provide a befitting response should it be undermined and disrespected by anyone for whatsoever absurd reasons, by being equally, if not much more, stronger and sharper to take up appropriate retaliatory measures to secure it's supremacy and status quo in preaching
" Jeeyo aur Jeenay do... "...
agar doosro ka Shaanti ko chot pahunchaatayho tho
" sahi waqt mei sahi jawaab diyaajaayeya..." so that the opponents, if any, can learn being humble and sober enough to keep up the respect being given.

It was another equally strong patriotic good Samaritan, Shree P.V.NarasimhaaRao gaaru, the then hon'ble PM of India, who went hand in glove with Kalaam ji to make an indelible global impact by successfully establishing India's supremacy in the Nuclear Arena by making sure that all the in-house preparations and executions were perfectly shielded under the military cover to make sure that they aren't an eye sour for a few cunning crooks who don't withstand others' well being and success in their respective paths.

My Guruji, Shree ChaaganTi sathguru gaaru, has explained how great his executions and messages to the world are from the latter's work named
" The Wings of Fire".

It was indeed a great honor to have him seen and listen to his golden words directly on the dias of my college BVRIT's annual cultural fest during our engineering days to which he was invited as the chief guest for the event...

May his spirit reverberate across every Indian to make them much stronger from inside out so that India as a nation becomes much more stronger to strengthen it's global supremacy in every given field....

Om Shaantih..Om Shaantih..Om Shaantih...🙏💐...🙏💐


Saturday, July 24, 2021

శ్రీ ప్లవ నామ సంవత్సర ఆషాఢ పౌర్ణమి / వ్యాస పౌర్ణమి / గురుపౌర్ణమి పర్వదిన శుభాభినందనలు.....😊💐

శ్రీ ప్లవ నామ సంవత్సర ఆషాఢ పౌర్ణమి / వ్యాస పౌర్ణమి / గురుపౌర్ణమి పర్వదిన శుభాభినందనలు.....😊💐

మన చాంద్రమానం ప్రకారంగా సూర్యోదయానికి,
కలియుగ ప్రత్యక్ష శ్రీమహాలక్ష్మీ అమ్మవారైన
శ్రీ పద్మావతీ దేవి అలర్మేల్ మంగమ్మ జన్మ నక్షత్రమైన ఉత్తరాషాఢ నక్షత్రం తో ఉన్న పౌర్ణమి తిథి తో వెలుగొందే ఆషాఢ పౌర్ణమి శుభదిన శుభాభినందనలు...

శ్రీఆంజనేయ స్వామి వారి మహాభక్తులైన శ్రీ పరాశర మహర్షి వారి పుత్రులైన శ్రీ వ్యాస మహర్షి వారిని సద్గురువులుగా మరియు సకల గురుపరంపరాగతమైన సద్గురువులను విశేషంగా అర్చించే ఈ ఆషాఢ పౌర్ణమి శుభ తిథి
వ్యాసపౌర్ణమి / గురుపౌర్ణమి గా వినుతికెక్కడం ఎల్లరికీ విదితమే...

కాకినాడ ( కోకనదా పట్టనం ) లో ఉండే చాలామంది అధ్యాత్మ జిజ్ఞ్యాసువులకు తెలిసినట్టుగా,

భానుగుడి జంక్షన్ లోని, శ్రీహరిహరసుత అయ్యప్ప స్వామివారి ఆలయ ప్రాంగణంలో
ఇవ్వాళ్టి ఉదయం గురుమండల పూజామహోత్సవంలో యావద్ గురుపరంపరను అక్కడి తండూల ( బియ్యం ) రాశి పైన గల
బిల్వ దళాలు, పువ్వులు, నిమ్మకాయలు,
తమలపాకులు, అరటి, దానిమ్మ, కొబ్బరి, యాపిల్లు, సంత్రాలు, ఇత్యాది వివిధ ఫలాలు మరియు ఇతర శాస్త్రోక్త పూజాద్రవ్యములపైకి సవైదిక మంత్రోచ్ఛారణ / స్వరంతో ఆవహింపజేసి.,

వారికి ప్రదక్షిణ నమస్కారాలు అర్పించిన తదుపరి ఆ బియ్యాన్ని ప్రసాదంగా అక్కడికి విచ్చేసిన భక్తుల్లెల్లరికి శ్రీ సుబ్రహ్మణ్యశర్మగారు పంచిపెట్టడం చాలా మందికి తెలిసే ఉంటుంది....

తదనంతరం, సాయంత్రం ఒక మహోన్నతమైన వ్యక్తిత్వాన్ని గురుపూజను స్వీకరించేందుకు ఆహ్వానించి ఆ గురుదంపతులకు గురుసేవ గా

పుష్పమాలికా అలంకరణ,
చందన లేపనం,
సుగంధపరిమళ ద్రవ్య సమర్పణం,
ఇత్యాది సశాస్త్రీయ ఉపచారాలను సమర్పించి,
వారు సలిపిన అధ్యాత్మ కృషిని / ఉపాసనను కొనియాడి వారికి నమస్కరించడం అనే సత్సంప్రదాయాన్ని శ్రీ చాగంటి సద్గురువులు ఎన్నో సంవత్సరాలుగా అక్కడ నిర్వహింపజేయడం అనేది చాలామందికి ఎరుకలో ఉన్న విషయమే..

గురువులకే సద్గురువులై భాసిల్లే శ్రీ చాగంటి సద్గురువులే ప్రతి సంవత్సరం ఒక్కో మహనుభావులను అక్కడికి గురుస్వరూపంగా ఆహ్వానించి సత్కరించి గౌరవించడం అంటే ఈ గురుపూజామహోత్సవం ఎంతటి మహోన్నతమైనదో ఇట్టే మనం తెలుసుకోవచ్చు....

"ముఖే ముఖే సరస్వతీ...." అన్నట్టుగా ఆ శ్రీవాణి ఒక్కో మనిషికి వారి వారి పూర్వజన్మ సుకృతంగా ఒక్కో విద్వత్తును కటాక్షించి ఈ లోకానికి జ్ఞ్యానప్రభలను వారిచే వెదజల్లబడేలా అనుగ్రహించి తన ప్రత్యేకతను తెలియజేస్తుంది....

ఒక్కో పువ్వుది ఒక్కో పరిమళం...
ఒక్కో రంగు...ఒక్కో ప్రత్యేకత....ఒక్కో విచిత్రం....
ఒక్కో మకరంద రుచి...

అది ఈ సృష్టిలోని పరమాత్మ వైచిత్రి...

అట్లే ఒక్కో మహానుభావుడిది ఒక్కో విద్వత్తు....

ఒక పిల్లనగ్రోవి ఎదుట ఉన్నప్పుడు....

ఒక మహానుభావుడు అవే 7 కన్నాల నుండి సమ్మేళనాత్మకంగా హృదయం మైమరచే విధంగా అంతులేని స్వరాలను ఆలపించి ఔరా అనిపించడం...

ఇంకొక సామాన్య వ్యక్తి అవే 7 కన్నాల నుండి కనీసం
సా పా సా కూడా సరిగ్గా ఆలపించలేకపోవడం...

ఒక మనిషికి ఉండే వేళ్లు, నోరు, మూతి, పిల్లన గ్రోవిని పట్టుకొని ఊదడం, ఇలా అన్నీ కూడా ఈ ఇరువురికి కామన్ గా ఉన్నవే...

మరి ఒకరేమో వారి మూతి నుండి వదిలే గాలినుండి అనన్యసామాన్యమైన గాంధర్వశక్తిని సృజించి
ప్రకృతి తత్వం నుండి పరమాత్మ తత్త్వాన్ని ఆవిష్కరించి ఔరా అనిపించడం....

ఇంకొకరేమో అదే ప్రకృతి నుండి ప్రకృతిగా, అనగా లోపల ఉన్న మన శరీరం నుండి వదలబడే గాలి బయట వాతావరణం లోని గాలి లోకి కలపడం.....

అనగా సామాన్య పిండాండ బ్రహ్మాండ సమన్వయంగా ప్రకృతిలో ప్రకృతిగా ఉండిపోవడం.....

ఒకరు అలా ఒక లలితకళావాద్య పరికరం అందుకోగానే కళామయి గా / నాదమయి గా
ఆ సరస్వతీ వచ్చి కొలువై ఉండడం...

ఒకరు మైకు అందుకోగానే
రాగమయి గా / స్వరమయి గా / వేదమయి గా / వాగ్దేవి గా
ఆ సరస్వతీ వచ్చి కొలువై ఉండడం...

ఒకరు ఘంటం అందుకోగానే అక్షరమయి గా
ఆ సరస్వతీ వచ్చి కొలువై ఉండడం...

ఒకరు కళ్ళు మూసుకుని వివిధ యోగభూమికలను స్మరించగానే యోగమయి గా
ఆ సరస్వతీ వచ్చి కొలువై ఉండడం

ఒకరు నీళ్ళు అందుకొని ఆచమనం గావించి మంత్రపఠనం గావించగానే మంత్రమయి గా
ఆ సరస్వతీ వచ్చి కొలువై ఉండడం..

ఇలా ఒక్కో మహానుభావుల వద్ద గల పరమాత్మ అనుగ్రహ సంపాకంతో ఒక్కో విధంగా ఆ ఆదిపరాశక్తి,
వారు సంకల్పించి స్మరించగానే ఒక్కో నామ రూపాత్మక ఈశ్వర చైతన్య శక్తిగా వారి వద్దకు వచ్చి ప్రకృతిని పరతత్త్వంగా మార్చి ఎల్లరినీ అనుగ్రహిస్తున్నది కదా...

పూర్వజన్మ సుకృతం తో అబ్బిందా..
పుట్టుకతో అబ్బిందా....
సాధనతో / ఉపాసనతో అబ్బిందా...

అనేదానికంటే.....వారికి గల గురుకాటాక్షమే వారి యావద్ విద్వత్ వైదుష్య వైభవానికి మూల కారణం...

"హుం....ఆ మంద బుద్ధి మనిషి రావడం కోసం గురువుగారు మనకు ఇంకా పాఠం మొదలు పెట్టకుండా ఎదురుచూస్తున్నారు....ఆయన వచ్చినా అంత గొప్పగా నేర్చేదేముంది..."

అంటూ ఏదో నసుగుతూ కూర్చున్న తమ ముగ్గురు శిష్యుల అంతరంగాన్ని అర్ధంచేసుకున్న శ్రీ ఆదిశంకరాచార్యుల వారు గంగా నదికి ఆవలి వైపున గురుసేవగా శ్రీఆదిశంకరుల వస్త్రాన్ని ఉతకడం / శుభ్రపరచడంలో నిమగ్నమై ఉన్న తోటకాచార్యుల వారిని ఒక్క సారిగ పిలవగానే....
గురువుగారు వెంటనే రమ్మని ఆజ్ఞ్యాపించారు అనే తొందరలో అది నదీ అనే విషయాన్ని మరిచి నీటిపైనే అడుగులను మోపుతూ త్వరత్వరగా తరలివచ్చిన ఆ సందర్భంలో వారి ప్రతీ పాదస్పర్శకు ఒక పద్మాన్ని వికసింపజేసి అందులో వారి పాదం మోపబడేలా గంగమ్మ అనుగ్రహించి ఆవలి తీరానికి చేర్చడం,

గురువుల ఎదుట తక్షణం ఏతెంచగా....

"నా శిష్యునకు సకల వాంజ్ఞ్మయం సద్యో కటాక్షంగా భాసించుగాక..."

అని శ్రీఆదిశంకరులు ఒక్క సంకల్పంతో
తోటకులను పద్మపాదాచార్యుల గా అనన్యసామాన్యమైన పాండిత్యంతో వర్ధిల్లే విధంగా అనుగ్రహించిన ఆ సందర్భంలో శ్రీతోటకాచార్యులచే
లోకానికి అందివ్వబడిన " తోటకాష్టకం " తోనే కదా ఇన్ని శతాబ్దాలు గడిచినా ఆ శక్తివంతమైన స్తోత్రంతోనే ఇప్పటికీ మరియు ఎప్పటికీ గురుపౌర్ణమి రోజున గురువందనం ఆచరించి ఎల్లరూ తరించేది.....

ఇంతకంటే గురువైభవం గురించిన ఉదాహరణ ఇంకేముంటుంది...

గురువులు ప్రసన్న హృదయంతో తమ తపోశక్తిని శిష్యులకు ధారపోసిన నాడు....
గులక రాయి వంటి వారైనను గుణించలేనంతటి జ్ఞ్యాన రత్నమై శాశ్వత వైభవాన్ని గడించి తరించడం ఈ తపో భూమి పై ఎందరెందరో మహానుభావుల జీవితాల్లో తేటతెల్లమైన గురువైభవం....

శ్రీ చాగంటి సద్గురువుల మాటల్లో...

" గురువులు ఏమి ఇవ్వగలరు...?
అని అడిగితే
" గురువులు ఏమైనా ఇవ్వగలరు...!"
అనేది సమాధానం...

గురుకృప అంతటి ఉత్కృష్టమైనది కనుకనే

యుగయుగాలుగా ఈ దేవభూమి పై
గురుకులాల్లో / పాఠశాలల్లో విద్యార్థులందరికి తప్పకుండా నేర్పింపబడే శ్లోకం...

"
గురుర్ బ్రహ్మా..
గురుర్ విష్ణుః...
గురుర్ దేవో మహేశ్వరహః....
గురుర్ సాక్షాత్త్ పరబ్రహ్మ.....
తస్మై శ్రీ గురవే నమః......"

ఆతరువాతే...

"సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణీ...
విద్యారంభం కరిష్యామి సిద్దిర్భవతుమే సదా...."

అంటూ వివిధ ప్రార్ధనా శ్లోకాలు నేర్పించారు మన చిన్నప్పుడు స్కూల్లో...

మనం ప్రయాణించే మార్గంలోని అజ్ఞ్యానమనే అంధకారన్ని రూపుమాపే జ్యోతీస్వరూపాలే గురువులు...
( గు కారః అంధకారశ్చ....
రు కారన్ తన్నిరోధకహః...
అనే శృతివాక్యానుగుణంగా...)

పలకా బలపం చేబట్టి

ఓనమాలు / ABCD లు దిద్దిన ఆ నాటి నుండి

కంప్యుటర్ / మొబైల్ కీ బోర్డ్ పై నిరంతర అక్షర సేద్యాన్ని గావిస్తూ బ్రతికే ఈనాటి వరకు...

నా విద్యా / ఉద్యోగ / అధ్యాత్మ మార్గాల్లో నాకు దిక్సూచియై ఉండి నడిపించిన ప్రతి ఒక్క గురుస్వరూపులను నా అధ్యాత్మ సద్గురువులైన శ్రీ చాగంటి సద్గురువుల శ్రీ చరణాల్లో దర్శించి స్మరించి నమస్కరిస్తూ...

సహృదయులైన వారందరికీ ఇదే నా గురువందనం...
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏💐😊

विदिताखिल शास्त्र सुधा जलधे
महितोपनिषत्-कथितार्थ निधे ।
हृदये कलये विमलं चरणं
भव शङ्कर देशिक मे शरणम् ॥ 1 ॥

करुणा वरुणालय पालय मां
भवसागर दुःख विदून हृदम् ।
रचयाखिल दर्शन तत्त्वविदं
भव शङ्कर देशिक मे शरणम् ॥ 2 ॥

भवता जनता सुहिता भविता
निजबोध विचारण चारुमते ।
कलयेश्वर जीव विवेक विदं
भव शङ्कर देशिक मे शरणम् ॥ 3 ॥

भव एव भवानिति मे नितरां
समजायत चेतसि कौतुकिता ।
मम वारय मोह महाजलधिं
भव शङ्कर देशिक मे शरणम् ॥ 4 ॥

सुकृते‌உधिकृते बहुधा भवतो
भविता समदर्शन लालसता ।
अति दीनमिमं परिपालय मां
भव शङ्कर देशिक मे शरणम् ॥ 5 ॥

जगतीमवितुं कलिताकृतयो
विचरन्ति महामाह सच्छलतः ।
अहिमांशुरिवात्र विभासि गुरो
भव शङ्कर देशिक मे शरणम् ॥ 6 ॥

गुरुपुङ्गव पुङ्गवकेतन ते
समतामयतां न हि को‌உपि सुधीः ।
शरणागत वत्सल तत्त्वनिधे
भव शङ्कर देशिक मे शरणम् ॥ 7 ॥

विदिता न मया विशदैक कला
न च किञ्चन काञ्चनमस्ति गुरो ।
दृतमेव विधेहि कृपां सहजां
भव शङ्कर देशिक मे शरणम् ॥ 8 ॥


Sunday, July 18, 2021

శ్రీ ప్లవ నామ సంవత్సర ఆషాఢ శుద్ధ నవమి ( 1959 జులై 14 నాటి తిథి ప్రామాణికంగా ), శ్రీ చాగంటి సద్గురువుల 62 వసంతాల జన్మదినోత్సవ శుభాభినందనానమస్సులు....😊🍨🍕💐

శ్రీ ప్లవ నామ సంవత్సర ఆషాఢ శుద్ధ నవమి
( 1959 జులై 14 నాటి తిథి ప్రామాణికంగా ),
శ్రీ చాగంటి సద్గురువుల 62 వసంతాల జన్మదినోత్సవ శుభాభినందనానమస్సులు....😊🍨🍕💐

శ్రీ చాగంటి గారు...

ఒక మంచి మనసుగల వ్యక్తి అని కొందరు....
ఒక చక్కని భాగవతోత్తములు అని కొందరు...
ఒక గొప్ప ప్రవచనకర్తలు అని కొందరు...
ఒక అద్వితీయమైన సద్గురువులు అని కొందరు...
ఒక అనన్యసామాన్యమైన అధ్యాత్మ శాస్త్రవేత్త అని కొందరు...

ఇలా ఒక్కొక్కరూ ఒక్కోలా
తమ తమ భక్తి కొలది, జ్ఞ్యాన సముపార్జనాసక్తి కొలది,
అభిమానం కొలది వారిని భావిస్తూ సేవిస్తూ తరిస్తుంటారు...

అది వారి వారి వ్యక్తిగత జీవితాలకు ఆ సద్గురువుల సద్వాక్కులు ఆపాదించబడి ఒసగబడిన అనుగ్రహానికి అనుగుణంగా సమకూరిన భావమంజరుల లహరి గా అభివర్ణించడం అతిసయోక్తి కానేరదు...

అప్పటివరకు అది వాగులో పడిఉన్న ఒక సామాన్య బండరాయి...

ఎండకు ఎండి...
వానకు తడిసి..
అట్ల పడిఉన్న ఆ రాయి ఒక చక్కని శిల్పశాస్త్ర కోవిదుడి వద్దకు చేరిన, చేర్చబడిన నాడు...

ఆ రాయి ఒక చక్కని ఆగమోక్త భగవణ్మూర్తిగా మలచబడి ఒక ఆలయంలో కొలువైన నాడు...

ఆహా... ఓహో... ఎంత చక్కని మూర్తి...
అని ఎందరినుండో నమస్కారాలు పూజలు అభిషేకాలు అందుకుంటూ తరించి ఎల్లరినీ తరింపజేస్తుంది...

ఎవరో కొద్ది మంది మాత్రమే ఆ శిల్పి యొక్క గొప్పదనం గురించి కూడా మాట్లాడతారు....
ఆ గొప్ప శిల్పి మాత్రం వారి విహిత ధర్మంగా అలాంటి ఎన్నో ఎన్నెన్మో శిల్పాలు చెక్కుతూ ఎందరెందరో తరించడానికి వారి జీవితాన్ని వెచ్చించి బ్రతికేస్తుంటారు...

ఆ శిల్పి వారి జీవితపర్యంతంలో కొన్ని వందల వేల శిల్పాలు చెక్కడం తో, ఏ ఏ గుడిలో తనచే మూర్తిగా మలచబడిన శిల్పం దేవతామూర్తిగా మారి ఏ వైభవం అమరి తరిస్తూందో అనే విషయం గురించి పెద్దగా పట్టించుకోకపోయినా దేవతా మూర్తిగా మారిన ఆ శిల్పం మాత్రం నిత్యం ఆ అమరశిల్పికి తన కృతజ్ఞ్యతను తెలియజేస్తూనే ఉంటుంది...
ఎందుకంటే అది గౌరవం, ప్రేమాభిమానం, మరియాద, బంధం, బాంధవ్యం, ఇత్యాది ఏ భావానికి కూడా అందని ఒక అపురూపమైన అవ్యక్త ఆదర భావన..

ఈశ్వరానుగ్రహం తో కొంత విద్వత్తు, అధికారం, ఐశ్వర్యం, లభించగానే ఒక్కొక్కరూ ఒక్కోలా వారికి అనుగ్రహింపబడిన సంపత్తును వినియోగించి లౌకిక ప్రయోజనాలను ఈప్సితములను ఈడేర్చుకోవడానికి మాత్రమే ఉపయోగించుకొని వారి పిల్లలకు, మనవలు మనవారాళ్ళకు, ఆ యావద్ లౌకిక సంపత్తును వదిలేసి గతిస్తారు....

కోట్లు కూడబెట్టి ఇచ్చినా సరే,
గతించిన తరువాత వారి పిల్లలు, మనవలు,
గోదానం కాకపోయినా కనీసం ప్రతిసంవత్సరం పద్ధతిగా, శ్రద్ధగా ఆబ్దీకములను నిర్వహించి నమస్కరించి గౌరవించేంతటి సంస్కారంగా జీవించగలరని చెప్పడం ఈ కలియుగంలో ఎల్లవేళలా కుదరదు...అంతటి కేవల భౌతికవాదానికి బంధీలై బ్రతికే జీవనం ఈ కలియుగ వాసులది...

అసలు గోదానం అనేది ఒకటి ఉంటుందని..
అది నిర్వహించి పితరులకు వైతరణీ యాతన లేకుండా చేయడం విహిత ధర్మం అనే విషయం కూడా తెలియని అధ్యాత్మరాహిత్యతతో బ్రతికే జీవితం ఈ కలియుగవాసులది...

పురోహితులు ఆ ప్రస్తావన తెస్తే 5 రూపాయలిచ్చి గోదానం అయిపోయిందని ' మమ ' అనిపించే వారికోసం జీవితాంతం కూడబెట్టినది వదిలేసి పోవడం అనేది అసలు అర్ధమేలేని జీవితం...

ఇటువంటి ముఖ్యమైన విషయాల దెగ్గరినుండి ఎన్నో ఎన్నెన్నో శాస్త్రోక్త / పురాణోక్త గొప్ప గొప్ప విషయాలవరకు, అవన్నీ ఎల్లరికీ అందించేందుకే వారి యావద్ జీవితంలోని సిమ్హభాగం వెచ్చించిన శ్రీ చాగంటి సద్గురువులు ఈ కలియుగ ప్రజలకు లభించిన ఒక అనన్యసామాన్యమైన "ఆత్మోద్ధరణ " అనే అధ్యాత్మ శిల్పశాస్త్ర కోవిదులు...

ఇవ్వాళ్టి మన ఉరుకుల పరుగుల దైనందిన జీవితానికి వారి అమృతప్రవచనాలు కొన్ని వందల వేల పుస్తకాల పఠనంతో సమానం...

ఒక పుస్తకం చదివినతదుపరి మనమే ఆ పుస్తకమైపోవడానికి చాలా సమయం పట్టొచ్చు...

అది అవగాహన చేసుకొని ఆకళింపుచేసుకొనేంతటి మేధో పటిమ అందరికీ ఉండొచ్చు ఉండకపోవచ్చు....

కాని శ్రీచాగంటి సద్గురువుల ప్రవచనం శ్రద్ధగా ఆలకించడం అనేది ఒక ప్రత్యేకమైన పుస్తక పఠనం వంటిది..

దేశవాళి ఆవునేతిలో దోరగా వేయించిన క్యారెట్ హల్వా ని ఆరగించిన వారికి మాత్రమే ఆ వంటకం యొక్క గొప్పదనం అవగతమైనట్టుగా....

వారి ప్రవచనం ఎంతటి సాటిలేని ధీటైన మేటి విధంగా సదరు శ్రోతను తన అధీనంలోకి తీసుకొని తన అనుగ్రహాన్ని సమకూర్చుతుందనేది వాటిని శ్రద్ధగా ఆలకించిన వారికి మాత్రమే ఎరుకలో ఉండే విషయం...

ఐ.డి.పీ.ఎల్ బస్టాప్ లో ఎక్కిన పల్లె వెలుగు బస్ నర్సాపూర్ లో దిగి, విష్ణుపూర్ లోని మా బీ.వీ.ఆర్.ఐ.టి కాలేజ్ కి వెళ్ళడానికి ఇంకో బస్సు కోసం ఎదురుచూస్తూ ఒళ్ళు హూనమై ఉండే ఆ ప్రయాణబడలిక నుండి కాస్త ఉపశమనం పొందడం కోసం

( ప్రతీరోజు షేర్ ఆటోలో వెళ్ళగలిగేంతటి ఆర్థిక స్థోమత లేక, నెలకు 500 రూపాయల బడ్జెట్లో, 360 రూపాయలు రూట్ బస్పాస్ కి పోను మిగతా 140 రుపీస్ లో ఇంజనీరింగ్ విద్యాభ్యాస సంబంధిత ఇతర ఖర్చులన్నీ నెట్టుకొస్తున్న రోజులవి... )

ఏదో క్యాజువల్ గా వారి ప్రవచనాలను అడపా దడపా వినడం మొదలుపెట్టిన 2007:2008 నాటి నుండి ఈనాటి వరకు....

అంతంతమాత్రంగా ఉన్న ఇంటి ఆర్ధిక పరిస్థితితో
లౌకికంగా ఎన్నో ఈతిబాధల మధ్యన కష్టపడుతూ,
కాలేజ్లో ప్రభుత్వం వారిచ్చే ఫీస్ రీఇంబర్స్మెంట్ స్కాలర్షిప్ సహాయం తో చదివి బి.టెక్ చదువుల బండిని ఒక గట్టెక్కించి, మా కాలేజ్ లోని విద్యాగణపతి అనుగ్రహంగా ఆనాడు టీ.సీ.యస్ / అక్క్సెంచర్ / కంప్యూటర్ అసోసియేట్స్ అనే 3 బహుళజాతీయసంస్థల కంపెనీల ఆఫర్లను సాధించడానికి కావలసిన పర్సనాలిటి డెవెలప్మెంట్ స్కిల్ల్స్ ని అనుగ్రహించినదిమొదలు 2008 నుండి నా 21వ పడిలో మొదలైన ఉద్యోగ / లౌకిక జీవిత ప్రయాణంలో ఎప్పుడు ఎక్కడ ఏవిధంగా ఉండి ఎవరిని నమ్మాలో, ఎవరిని నమ్మకూడదో, ఎవరితో ఎప్పుడు ఎక్కడ ఎందుకు ఎలా వ్యవహరించాలో ఇత్యాది కార్యసాధక దీక్షాదక్షతతో మనగలిగే మానసిక / మేధో సమర్ధతను కటాక్షిస్తూ,
ఇప్పుడున్న 2021 వరకు నాకు లభించిన
ఒక దైవిక మితృలుగా
( స్నేహితులు ఎందరో ఉంటారు...
కాని మితము నుండి ఋతమునకు నడిపించే నిస్వార్ధమైన మితృలు చాలా అరుదుగా ఉంటారని బోధించిన వారి సద్వాక్కే ) నాకు నిజ నేస్తమై నిలిచి నన్ను అడుగడుగునా గెలిపించే జ్ఞ్యానాలంబనై నిలిచింది వారి ప్రవచనా సద్వాక్కు...

వారి శ్రీవేంకటేశ్వర వైభవం ప్రవచానాల్లో ఉదహరింపబడిన
" ఉన్నాడయా...దేవుడున్నాడయా...."
అనే జానపద గేయంలో బోధింపబడిన రీతిలో

ఇనచంద్రులున్నంతవరకు జగత్తులో శాశ్వతంగా మహత్తును ప్రసరింపజేస్తూ ఎల్లరినీ అనుగ్రహించే రీతిలో ఈశ్వర మాహాత్మ్యాన్ని ఆనాడు శ్రీమద్రామాయణంగా శ్రీవాల్మీకి మహర్షి ఎవ్విధంగ లోకానికి అందించి అనుగ్రహించినారో...

ఈ నేలపై తెలుగు భాష వాడుకలో ఉన్నంతవరకు శ్రీ చాగంటి సద్గురువుల అమృతప్రవచనాలు శ్రీమద్రామాయణ సుజ్ఞ్యాన మంత్రమహార్ణవమువోలే,
అధ్యాత్మ ప్రవచనామంత్రమహార్ణవమై అవధరించిన వారెల్లరినీ తరింపజేస్తూ ఉంటాయనడం ఏమాత్రం అతిశయోక్తి కానేరదు...

వారి అమృతప్రవచనాల అనుగ్రహంగా మా మూడేళ్ళ వైవాహిక జీవితానికి పరిపూర్ణతను కటాక్షిస్తూ, శ్రీభువనేశ్వరి అమ్మవారి అనుగ్రహంగా ప్రభవించిన నా కూతురుకి ఇక రాబోయే రోజుల్లో నేనే గురువై వారి ప్రవచనా విశేషాలను బోధించడంలో
( మరీ ముఖ్యంగా వారి  " రుక్మిణీ కల్యాణం " ప్రవచనం / తత్సంబంధ శ్రీమద్భాగవత పద్యాలు నా కూతురికి కంఠస్థమైతే నాకు కాస్త మనఃశాంతి గా ఉంటుంది కద...😊 )
వారి ప్రవచనాలన్నీ కూడా మళ్ళీ మళ్ళీ వినే భాగ్యం తో ఉండే,
నా జీవిత నౌకకు చుక్కానివలె అమరిన వారి అమర ప్రవచనాల యొక్క మహత్తు గూర్చి ఒక చక్కని సినిమా పాటలో ​చెప్పాలంటే....
ఈ క్రింది పాట నాకు స్ఫురించింది...

********************
Movie : Santosham
Song : Nuvvante naakishtamani
Singers : Rajesh, Usha
Lyrics : Sirivennela
Music : RP Patnayak

అ:నువ్వంటే నాకిష్టమని అన్నది నాప్రతి శ్వాస
ఆ:నువ్వేలే నా లోకమని అన్నది నాప్రతి ఆశ
అ: నీ నవ్వులో శృతి కలిపి పాడగా
ఆ:నీ  నీడలో అణువణువు ఆడగా
ఇ: అనురాగం పలికింది సంతోషం స్వరాలుగా      అ:||నువ్వంటే||
అ:చ: నువ్వునా వెంట ఉంటే అడుగడుగునా నడుపుతుంటే
ఎదురయే నా ప్రతి కలా నిజమల్లే.... కనిపించదా
ఆ: నిన్నలా చూస్తూఉంటే మైమరపు నన్నల్లుతుంటే
కనపడే నిజమే ఇలా కలలాగ అన్పించదా
అ:వరాలన్ని సూటిగా యిలా నన్ను చేరగా
ఆ: సుదూరాల తారక ....సమీపాన వాలగా
అ: లేనేలేదు.... యింకే కోరిక......                        ఆ:||నువ్వంటే||
ఆ:చ ఆగిపోవాలి కాలం ,మన సొంతమై ఎల్లకాలం
నిన్నగా సనసన్నగా చేజారి పోనీయకా
అ: చూడునా యింద్రజాలం వెనుతిరిగి వస్తుంది కాలం
రేపుగా మనపాపగా పుడుతుంది సరికొత్తగా
ఆ: నువ్వు నాకు తోడుగా నేను నీకు నీడగా
అ:ప్రతీ రేయి తీయగా పిలుస్తోంది హయిగా
ఆ: ఇలా ఉండిపోతే చాలుగా.....                   
అ:||నువ్వంటే||

********************

వారి ప్రవచానాలను త్రికరణశుద్ధిగ నమ్మి ఆరాధించే ఎందరెందరో శిష్యులను వారు మరింతగా అనుగ్రహిస్తూ వారి అజారమరమైన ప్రవచనా ప్రస్థానం నిరంతర గంగాప్రవాహమై ఆచంద్రతారార్కం
యశోచంద్రికలతో ఎల్లరి జీవితాలు వర్ధిల్లే విధంగా అనుగ్రహిస్తూ ఉండాలని అభిలషిస్తూ...

వారి శ్రీచరణాలకు ఒక వినేయుడి చిరుకవనకుసుమాంజలి ప్రయుక్త వారి 62 వ జన్మదినోత్సవ మరియు రాబోయే గురుపౌర్ణమి ఉత్సవ శుభాభినందనాపూర్వక సాష్టాంగ నమస్సుమాంజలులు.....
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏😊💐🍕🍨


Tuesday, July 13, 2021

శ్రీ (ప్లవనామ సంవత్సర) ఆషాఢ జాతర గా వినుతికెక్కిన ఆదిపరాశక్తి యొక్క వైభవవర్నన.... 😊💐🍕🍨


శ్రీ చాగంటి సద్గురువుల ప్రవచనాల్లోని అమృత గుళికల వంటి అధ్యాత్మ విశేషాలను,
" భద్రంకర్ణేభిః శృణుయామదేవాః " అనే శృతివాక్యానుగుణంగా తమ తమ మస్తిష్కాలలో పదిలంగా పొదివిపట్టి భద్రపరుచుకున్న శిష్యులకు అవతగతమైనట్టుగా....

ఆ ఆదిపరాశక్తి ఒకానొక సందర్భంలో దేవతలకు సైతం కలిగిన అతిశయాన్ని నిర్మూలించి వారి యందు భక్తి భావన, మరియాద/వినమ్రత, ఇత్యాది సద్గుణసంపదను ప్రోది చేసి కరుణించేందుకు గాను ఒక గడ్డి పరకను అడ్డుగా పెట్టి దేవతలను వారికి గల సర్వ శక్తులతో ఆ గడ్డిపరను అక్కడినుండి కదిలించమని  చెప్పినప్పుడు, ఒక్కరు కూడా ఆ గడ్డిపరకను కదిలించలేని తమ అశక్తతను గుర్తించి 

అనగా వాయుదేవుడు ఎంతగా విజృంభించినా ఆ గడ్డిపరకను రవ్వంతైనను జరపలేకపోవడం...

అగ్ని దేవుడు ఎంతగా తన ప్రతపాన్ని చూపినా ఆ గడ్డిపరకను రవ్వంతైనను కాల్చలేకపోవడం.. 

వరుణ దేవుడు ఎంతగా హోరెత్తించినా ఆ గడ్డిపరకను రవ్వంతైనను తడపలేకపోవడం....

ఇత్యాదిగా సకలదేవతలు కూడా తమకు ఒసగబడిన  విహిత శక్తులన్నీ కూడా ఆ ఆదిపరాశక్తి యొక్క అనుగ్రహమే అని తెలుసుకొని భక్తితో
అమ్మవారికి నమస్కరించిన ఆ వృత్తాంతంలో జ్యోతకమైన విధంగా....

"సహస్రాపరమాదేవి శతమూలాశతాంకురా సర్వగుమ్హరతుమేపాపం దూర్వాదుస్స్వప్ననాశినీం...."

అనే శాస్త్రోక్త శ్లోకంలో నుతించబడినట్టుగ ఆ ఆదిపరాశక్తి  గడ్డిపరకను సైతం గగనసదృశమైన గంభీర తత్త్వ పదార్ధంగా మనగలిగేలా అనుగ్రహించే ఆద్యంతరహితమైన శక్తి...

సైన్స్ చెప్పినట్టుగానే
"Energy can neither be created nor can be destroyed but can only be transformed from one form to the other...."

ఆధ్యాత్మికత కూడా అదే సూత్రానుగుణంగా 

" ఆది పరాశక్తి అను తత్త్వం ఆద్యంతరహితమై...
అణువుకన్ననూ చిన్నగా ఉండగల...
ఆకాశంకన్ననూ పెద్దగా ఉండగల...
లెక్కింపశక్యంకానంతటి వివిధ నామరూపాత్మక గ్రాహ్య అగ్రాహ్య శక్తికేంద్రక వ్యవస్థగా యావద్ విశ్వంలో నిండి నిబిడీకృతమై ఉండే సకలాధార చైతన్య శక్తి....

ఒక నామం, రూపం, తత్త్వం నుండి
మరో నామం, రూపం, తత్త్వం లోకి
దేశకాల ఆవశ్యకతానుగుణంగా నిత్యం రూపాంతరం చెందుతూ ఈ విశ్వపరిపాలనను సర్వదా సర్వజీవకోటికి అనుగ్రహదాయక రీతిలో కొనసాగించడమే ఆ శక్తి యొక్క నిరంతర కార్యాచరణాత్మక ఉనికికి గల విశేషం..

" గురుమండలరూపిణి "
" గురుమూర్తి "

అనే నామాలతో శ్రీలలితాసహస్రంలో 
అమ్మవారు ఆరాధింపబడడం గమనించేఉంటారు....

న గురోరధికం తత్త్వం...న గురోరధికం తపః...

అనే వాక్యం గురించిన వ్యాఖ్యానం శ్రీచాగంటి సద్గురువుల సద్వాక్కులో విన్నవారికి గుర్తున్నట్టుగా...

గురువుగారి ముందు ఎల్లరూ లఘువులే...

కాబట్టి ఆవిడ 
"గురుమూర్తిగా కూడా ఉన్నది నేనే..."
" యావద్ గురుమండలాన్ని అధివసించి ఉండే బృహత్ వ్యక్తావ్యక్త అమేయ తత్త్వ సంచయం కూడా నేనే..."

అంటూ

" ఓం గురుమూర్త్యై నమః... "
" ఓం గురుమండలరూపిణ్యై నమః... "

అంటూ పూజలు అందుకొని అనుగ్రహిస్తూన్నది...

ఈ కరోనా కారణంగా ఈసారి కూడా కుదరదేమో కాని,
కాకినాడ భానుగుడి జంక్షన్ లోని 
అయ్యప్పస్వామి వారి ఆలయంలో 
శ్రీచాగంటి సద్గురుదంపతుల ప్రత్యక్ష పర్యవేక్షణలో,
శ్రీ సుబ్రహ్మణ్యశర్మ గారి గళసీమలో కొలువైన వేదమయి, వారు చదివే నామావళికి ప్రసన్నురాలై అక్కడి గురుమండల పూజ అందుకోవడానికి వివిధ సూక్ష్మ తలాల్లో వచ్చి కొలువైఉండే ఆ ఆదిపరాశక్తి యొక్క వైభవం అక్కడుండే ఎందరో నమ్మికొలిచే భక్తులకు / శిష్యులకు సుగ్రాహ్యమే....

నేను ఇదివరకే ఒక పాత పోస్ట్లో,
 
శూన్యమాసం గా పిలువబడే ఆషాఢ మాసంలో విశేష గురుపూజ / వ్యాసపూజ నిర్వహింపబడే గురుపౌర్ణమిని ఆషాఢ పౌర్ణమి ఉత్సవం గా జరుపుకోవడంతో ఏ విధంగా పంచాంగ వ్యవస్థకు ఒక విధమైన  
" cosmic balance to adjust the almanac drift due to the void caused by the AashaaDha maasam..." 
సమకూరుతుందో ఆయా విశేషాలను క్లుప్తంగా వివరిస్తూ రాసినట్టుగా...

దేవశయన ఏకాదశి కి శ్రీమన్నారాయణుడు యోగనిద్రలోకి జారుకోవడం మరియు ఆషాఢ శక్తిగా ఆదిపరాశక్తి నారాయణి మేల్కోవడం లోని ఆంతర్యం అధ్యాత్మ లోకానికి అందివ్వబడే అనుగ్రహవిశేషం....

అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ
చాలపెద్దమ్మ ఆ దుర్గమ్మ,
మా ఇంటి బాలగా వచ్చి కొలువైనందుకు
ఈ సంవత్సరం యొక్క ఆషాఢ జాతర 
నాకు మరింత విశేషమైనదే...

ఎందుకంటే అప్పుడెప్పుడో 2009 లో అనుకుంటా...

శ్రీచాగంటి సద్గురువుల అనుగ్రహమైన ఈ క్రింది శ్లోక మంత్రాన్ని నిత్యం స్మరణ మనన నిధిధ్యాసన గావించడంతో...

" సర్వదా సర్వదేశేశు పాతుః త్వాం భువనేశ్వరి...
మహామాయా జగ్గధాత్రి సత్ చిత్ ఆనంద రూపిణీం..."

ఆ హ్రీం బీజాక్షర అధిదేవత శ్రీభువనేశ్వరి అమ్మవారి అనుగ్రహంగా మా జీవనజ్యోతిగా ఆ పరంజ్యోతి ఈ ఆషాఢ జాతరకు మా ఇంట బాలగా వచ్చి కొలువయ్యింది....😊

కూకట్పల్లిలోని మా శ్రీచైతన్య కాలేజ్ పక్కన ఉండే శ్రీద్వాదశజ్యోతిర్లింగేశ్వర స్వామివారి శక్తిగా స్వామివారి వామభాగాన శ్రీచక్రాభిముఖియై కొలువైన స్థిర శ్రీభువనేశ్వరి అమ్మవారే ఇప్పుడు మా ఇంట తిరుగాడే చిన్నారి గా వచ్చి కొలువై మమ్ము అనుగ్రహించింది...

శ్రీవాణి గా, శ్రీ గౌరి గా, శ్రీ లక్ష్మి గా...
త్రిశక్తి సంఘాతమై యావద్ భూమండలానికి నాభి స్థానంలో ఉండే, దక్షిణ భారత ఎకైక మోక్షపురి, కాంచీపురానికి అధిదేవతయై ఎల్లరినీ అనుగ్రహించే ఆ శ్రీకంచికామాక్షి పరదేవత,

పంచభూతాత్మక ప్రతీకలుగా చెప్పబడే 5 లింగాల్లో ఒకటైన కంచి పృథ్వీ లింగంగా ఉండే
ఏకామ్రేశ్వరుడి శక్తిగా కొలువై ఉండి,
తన సన్నిధిలోని బిలాకాశం / బిలాహాసం ద్వారా యావద్ విశ్వంలోని శక్తికేంద్రాలకు తానే అధిదేవతగా భాసిల్లుతూ, అసంఖ్యాక నామా రూపాలతో భక్తుల్లెలరిచే అర్చింపబడే ఆ ఆది పరాశక్తిని ఆషాఢ శక్తిగా అర్చిస్తూ విశేష ఉత్సవం జరపడంలో మనం గమనించగలిగితే...

1. పంచభూతాల్లో పృథ్వికి / పృథ్వి తత్త్వ పదార్థాలకు మాత్రమే ఇతర పంచభూతాల సమ్మేళనంతో వివిధ నామరూప ధారక శక్తి కలదు...

అప్పటివరకు చెరువులో ఎండిన మట్టి దిబ్బ గా ఉన్న బంక మన్నుకి వర్షం రూపంలో నీరు జతైన తదుపరి 
గణేష ప్రతిమగా మారి మృణ్మయం
చిన్మయమౌతుంది....

ఆతదుపరి అగ్ని,.వాయు, ఆకాశం అనే ఇతర పంచభూత తత్త్వ సమాగ్రితో జతై ఒక చూడచక్కని సశాస్త్రీయ గణేష మూర్తిగా మారి పూజ గదిలో 
ఈశ్వరుడిగా మారి పూజలు అందుకొని అర్చించిన భక్తులను అనుహ్రహిస్తున్నది.....

పృథ్వి వినా,
ఆకాశం, వాయు, అగ్ని, ఆపః ( నీరు ) ,
ఈ నాలుగు సమ్మిళితమైనను ఈ ప్రక్రియ సాధ్యపడదు...

12 మాసాల నిరంతర కాలచక్రాన్ని
5 భాగాలుగా విభాగిస్తే
అనగా గాయత్రి మహామంత్ర బీజాక్షర సంఖ్య 24 కు ప్రతీకగా

24 × 5 భాగాలు = 12 మాసాలు...

అనగా రమారమి 72 రోజుల కాలాన్ని ఒక భాగంగా భావిస్తే 

72 రోజులు × 5 భాగాలు = 360 రోజుల సంవత్సర కాలం...

అనగా రమారమి 5 పక్షాల కాలం ఒక భాగంగా భావిస్తే... 

అటువంటి 5 భాగాల్లోకి కుదురుకునే ఒక సంవత్సరకాలం లో 

ఆకాశం
వాయువు
అగ్ని
ఆపః ( నీరు ) 
పృథ్వి

తమ తమ శక్తిని ప్రస్ఫుటంగా పరివ్యాప్తి గావించే విధంగా కాలం ఉండడం మనం గమనించవచ్చు...

చైత్రం
వైశాఖం
జ్యేష్టం
ఆషాఢం
శ్రావణం
భాద్రపదం
ఆశ్వయుజం
మార్గశీర్షం
కార్తీకం
పుష్యం
మాఘం
ఫాల్గుణం

అగ్ని, నీరు, పృథ్వి, తమ తమ శక్తిని పరివ్యాప్తం గావించే

చైత్రం, వైశాఖం, జ్యేష్ఠం, ఆషాఢ ప్రారంభం, వచ్చేసరికి
పృథ్వి తత్వం కాలం పై తన పట్టును కలిగి ఉండే సమయం...

అందుకే ఆషాఢ మాసం వచ్చిందనగానే వివిధ ప్రాంతాల్లో వివిధ రీతుల ఆయా ప్రాంతీయ ఆచారానుగుణంగా అమ్మవారికి విశేష నైవెద్యాలతో జాతర / ఉత్సవాలు జరపడం మనం గమనించవచ్చు.....

నైవేద్యంలో అమ్మవారికి ఏ తత్త్వ పదార్థలు సమర్పిస్తాం...??

ఆకాశం..?
వాయు..?
అగ్ని..?

కాదు...
జలం మరియు పృథ్వి తత్త్వ భరిత పదార్థాలు...

ఎందుకంటే మన శరీరం కూడా సిమ్హభాగం జల మరియు పృథ్వీ తత్త్వ భరితం కాబట్టి...

నిలవదోషం లేని బెల్లం ముక్కని ఈశ్వరుడి నైవేద్యానికి వాడడంలో గల ఆంతర్యం..??

శ్రీరాజరాజేశ్వరి గా, శ్రీలలితాంబిక గా, చెరుకు విల్లును అమ్మవారు ధరించి ఉండడంలో గల ఆంతర్యం..??

ఎటువంటి పృథ్వి నుండైనా ఒక సాధారణ మొక్కను తియ్యని చెరుకు గడగా మార్చి అందునుండి మధురమైన  బెల్లము, చక్కెర ని మనకు అందించే చెరుకు మొక్క మనకు ఈ పృథ్వీ తత్త్వం యొక్క విశేషం తెలియచెప్తుంది....

అనగా మన శరీరం అనే మృణ్మయం నుండే అధ్యాత్మ సాధన ద్వారా చిన్మయ వీచికలను ప్రభవింపజేసుకొని మధురమైన బెల్లము వంటి పరమాత్మ తత్త్వానుభూతిని మనలోనే ఉద్భవింపజేసుకోవడంతో ఈ కేవల పృథ్వీ ఘటం.... అమేయమైన చిదాకాశమై సర్వేసర్వత్రా పరివ్యాప్తమై ఉండే పరత్తత్వ పదార్థం గా పరిణమిస్తుంది...

అప్పుడు " తత్ త్వం అసి "  అనే శృతివాక్యానికి నిదర్శనంగా మన పాంచ భౌతిక శరీరమే, ఒక దివ్య అప్రాకృత పరమాత్మ పదార్ధానికి నెలవుగా మారి అప్పుడు " సోహం " అనే స్థితిలో జీవుడు జీవేశ్వరుడితో ఓలలాడుతూ ఉండే ఆ తురీయావస్థలో
ని తత్త్వానుభూతినే  " అద్వైత స్థితి " గా శ్రీఆదిశంకరాచార్యుల వారు ప్రబోధించినారు....

అంతటి ఉత్కృష్టమైన ఈ పృథ్వీ తత్వ మహాత్మ్యాన్ని
శర్వ శర్వాని గా ఉండి ఆ ఆదిదంపతులు ఎవ్విధంగా విశ్వపరిపాలనను గావిస్తుంటారో శ్రీ చగాంటి సద్గురువులు మనకు వారి ప్రవచనాల్లో బోధించి ఉన్నారు....

ఆ శర్వాని తన సకల శక్తులను మరింత ప్రస్ఫుటంగా ఉద్దీపన గావించి దక్షిణాయణానికి నాయకిగా కాలచక్రం యొక్క పగ్గాలను శ్రీమన్నారాయణుడి నుండి తన అధీనంలోకి తీసుకొని ఎల్లరినీ ప్రత్యక్షంగా పరిపాలించే పరాశక్తిగా సిమ్హాసనారూఢురాలై ఉండే కాలం కనుక ఈ ఆషాఢ జాతర ను అమ్మవారికి ప్రీతికరంగా ఒక్కో చోట ఒక్కో విధంగా జరుపుకోవడం ఎల్లరికీ విదితమే...

యావద్ తెలంగాణ లో "బోనాల జాతర" గా
ఈ ఆషాఢ జాతర వినుతికెక్కడంలో గల ఆంతర్యం ఇదివరకే నా ఈ క్రింది పాత పోస్ట్లలో వివరించాను....

https://shreeguravenamah-aithavk.blogspot.com/2020/07/blog-post_12.html?m=1

https://shreeguravenamah-aithavk.blogspot.com/2018/09/blog-post_16.html?m=1

https://shreeguravenamah-aithavk.blogspot.com/2019/07/2019-bonaalu.html?m=1

https://shreeguravenamah-aithavk.blogspot.com/2019/06/blog-post_20.html?m=1

ఉజ్జైని నుండి భాగ్యనగరానికి తరలి వచ్చిన సికింద్రాబాద్ శ్రీ ఉజ్జైని మహంకాళి,

స్వయంభువై కొలువైన బల్కంపేట శ్రీ రేణుకా హేమలాంబ (ఎల్లమ్మ),

మంచి హృదయంగల ప్రజానేతగా చిరకీర్తిని గడించిన పీ.జే.ఆర్ గారు నెలకొల్పిన జూబ్లీ హిల్ల్స్ పెద్దమ్మతల్లి,

ఇత్యాదిగా హైదరాబాద్ లోని వివిధ
ప్రాంతాల్లో కొలువైన మహాశక్తిగా ఆ ఆదిపరాశక్తి, బెల్లమన్నం బోనాలతో పాటుగా భక్తుల మనోప్రార్థనలను కూడా స్వీకరించి, ఎల్లరినీ చల్లగా అనుగ్రహించుగాక....

శ్రీమచ్ఛఙ్కరసద్గురుర్గణపతిర్వాతాత్మజః క్షేత్రపః
ప్రాసాదే విలసన్తి భూరి సదయే నిత్యస్థితే హ్రీంమయి ।
యుష్మత్స్నేహకటాక్షసౌమ్యకిరణా రక్షన్తి దోగ్ధ్రీకులం
శ్రీవల్లీం భువనేశ్వరీం శివమయీమైశ్వర్యదాం తాం భజే || ౫ ||