Thursday, December 22, 2022

దేశకాలములను, ఉచితానుచితములను, మనస్తత్త్వాలను, ఎంతో క్షుణ్ణంగా బేరీజు వేసుకుంటూ స్వాభిమానంతో బ్రతికే వారికి గౌరవమరియాదలు ఎల్లప్పుడు రెండాకులు ఎక్కువే లభిస్తాయి అని అనడం అతిసయోక్తి కానేరదు.....

నువ్వు అందరినీ బానే గౌరవిస్తావ్ కాని ఎవరితో నువ్వు ఉండాలని అనుకుంటావ్ తాతా అని ఎవరైన అడిగితే.....
ఆ జ్ఞ్యానవృద్ధుడు ఏమని సమాధానం ఇవ్వాలి......?

"నా సొమ్ము తింటూ నా కాలర్ పట్టుకొని నన్ను ఓర్వని వారితో కలిసి నాపైకే నోరూ, చెయ్యి లేపేంతటి బాధ్యతారాహిత్యం తో బ్రతికే కృతఘ్నులతో"....
అని అంటాడా.....?
లేక.....
"నా ఆరోగ్యాన్ని చక్కదిద్ది నాకు మంచి ఆహారాన్ని అందిచే వారితో.... " అని అంటాడా....?
అనేది లోకవిదితమైన అంశం.....

అదే విధంగా నువ్వు ఎటువంటి చదువులను చదివి ఉన్నతిని సాధించాలనుకుంటున్నావు......?
అని ఏవరైనా ఒక కోవిదుడిని అడిగితే.....
ఏ చదువు చదివితే అన్ని చదువుల్లోని సారమంతా కూడా చదివిన ఫలితం లభించి, మరే చదువు కూడా చదవవలసిన ఆవశ్యకత ఉండదో అట్టి చదువును చదివెద.... అని అంటారు.....

శ్రీతాళ్ళపాక అన్నమాచార్యుల వారి మాటల్లో చెప్పాలంటే..... 
" చదివి బ్రతుకరో సర్వజనులు మీరు....
కదిసి నారాయణాష్టాక్షరమిదియే...."
అనే వారి సంకీర్తన యొక్క సారం అన్నమాట...... 

పరమాత్మ తో అనుబంధం అనేది చాలా విచిత్రమైన విశేషానుగ్రహం........

ఒక 25 సంవత్సరాలవరకు, పిల్లలకు ఏ కష్టం కూడా కలగకుండా వారికి ఉపయుక్తమైన అన్నిటిని సమకూర్చి వారిని ప్రయోజకులుగా తీర్చిదిద్దినప్పుడు, ఆ తరువాత ఓ 75 సంవత్సరాల వరకు తల్లితండ్రులకు వారి ప్రశాంత విశ్రాంత జీవితానికి ఎటువంటి ఇబ్బంది కూడా లేకుండా వారి నిర్యాణం వరకూ కూడా పిల్లలు వారిని సమ్రక్షిస్తారు......

ఫర్ ఎగ్సాంపుల్...,
20 సంవత్సరాలుగా, పన్నుకు తగిలిన గాయం మెల్లమెల్లగా ముదురుతూ  "అప్పర్ జా ఆల్వియోలార్  బోన్ క్యాన్సర్" గా పరిణమించే దశకు చేరుకొని పిల్లగాడు రోజురోజుకి పీక్కపోతున్నా సరే అది గుర్తించి చక్కని వైద్యం అందించాలనే స్పృహకూడా లేనంతటి బాధ్యతారాహిత్యంతో బ్రతికే ఔలగాడిని పెద్దయ్యాక వారి పిల్లలు మనస్పూర్తిగా ఎట్లు గౌరవించగలరు.....?

పెద్దలు కష్టపడి చదివించినప్పుడు చక్కగా చదువుకొని, ఆర్ధిక స్వావలంబన సాధించని బాధ్యతారాహిత్యంతో బ్రతికే పిల్లలను, విజ్ఞ్యులు 
మనస్పూర్తిగా ఎట్లు గౌరవించగలరు.....?

అదే విధంగా, భగవద్ భక్తి అనే ఆలంబనతో ఈశ్వరుడుకి దెగ్గరై, అనగా " దేవుడు మెచ్చి....లోకం మెచ్చే...." రీతిలో బ్రతకగలిగే జీవితం ఆశించే వారు, 
మొదట్లో ఈశ్వరుడి కోసం భక్తభాగవతుల సహాయసహకారంతో శ్రమిస్తే, ఆ తరువాత వారి జీవితం ఈశ్వరుడి పరికరంగా మారి ఎంతో మంది భాగవతులకు ఆలంబనను అందించే రీతిలో ఆ భగవంతుడే తీర్చిదిద్దుతాడు అనేది భక్తలోకానికి విదితమయ్యే అంశం.......

ఈశ్వరుడికి శ్రీగంధం, విభూతి విలేపనం యొక్క గొప్పదనం గురించి తెలుసుకోవాలంటే ఒక భగవద్ భక్తుడిని అడిగితే తెలుస్తుందేమో కాని ఒక తాగుబోతు బాడ్ఖావ్ కి అది తెలుస్తుందని అనుకొని వాడిని అడగడం మన మూర్ఖత్వమే అవుతుంది......

అదే విధంగా, బాధ్యత అనే చాలా గొప్ప పదానికి నిజమైన నిర్వచనం కావాలంటే, అది జీవితంలో ఒక  అంతర్భాగమైన వారిని అడిగితే బావుంటుందేమో కాని, బాధ్యతాయుతమైన వ్యక్తులపైకే బరితెగించి బ్రతికే బాడ్ఖావ్లను అడిగితే ఏం బావుంటది......

కాబట్టి దేశకాలములను, ఉచితానుచితములను, మనస్తత్త్వాలను, ఎంతో క్షుణ్ణంగా బేరీజు వేసుకుంటూ స్వాభిమానంతో బ్రతికే వారికి గౌరవమరియాదలు ఎల్లప్పుడు రెండాకులు ఎక్కువే లభిస్తాయి అని అనడం అతిసయోక్తి కానేరదు.....

No comments:

Post a Comment