Tuesday, October 7, 2025

శ్రీ 2025 విశ్వావసు ఆశ్వయుజ అమావాస్య / దీపావళి పర్వసమయ శుభాభినందనలు


శ్రీచాగంటి సద్గురువుల ప్రవచనాల్లో ఆలకించిన విజ్ఞ్యులకు తెలిసినట్టుగా, దీపావళి అంటే దివ్వెల సమూహం / వరుస అని పదార్ధం...

ఆరావళి, వింధ్యావళి పర్వత సమూహం / వరుస....
ఇత్యాదిగా మనకు తెలిసినపదాలను ఉదాహరణగా తీసుకుంటే....
ఎర్రని అరుణారుణ తత్త్వంతో ప్రకాశించే భూభాగపర్వతాలు కాబట్టి ఆరావళి, శ్రీవింధ్యవాసిని మాత శ్రీచరణాలంకృత భూభాగపర్వతాలు కాబట్టి వింధ్యావళి.....

దివ్వెల వరుస...
అంటే లైన్ గా దీపాలను పెట్టడం...
అలా లైనా గా దీపాలు మనం మన ఇంట్లో సంవత్సరంలో ఎప్పుడైనా పెట్టుకోవచ్చుకద...
మరి ఆశ్వయుజ అమావాస్య నాడే దీపాల వరుసను వెలిగించి దీపావళి పండగ అని ఉత్సవం నిర్వహింపబడడంలో గల ఆంతర్యమేమి...?

జలే గంగా తైలే లక్ష్మీ దీపావళి తిథౌవసేత్
అలక్ష్మీపరిహారార్ధం తైలాభ్యంగోవిధీయతే

అనే శ్లోకాన్ని అనుసరించి దీపావళి నాటి తైలాభ్యంగనస్నానంతో, మన జీవితాల్లో అలక్ష్మీ తొలగి శ్రీలక్ష్మి వరించడంలో ఆంతర్యమేమి...?

సనాతనధర్మప్రతిపాదిత ప్రతీ ఉత్సవంలో కూడా ఎంతో లోతైన గంభీరమైన లోకశ్రేయస్కర తత్త్వసమన్వయం ఉండును అనే విషయం విజ్ఞ్యులకు ఎరుకే...

శరన్నవరాత్ర / దుర్గాష్టమి నాడు
ఉపాసకులను సకలశక్తిస్వరూపిణి, 
సకలచరాచరభువనపాలిని,
ఆబ్రహ్మకీటజనని,
అనాధినిధనా హరిబ్రహ్మేంద్రసేవిత, గా అనుగ్రహించే ఆదిపరాశక్తి.....,
ఆ తదుపరి 21 రోజులకు 
ఆశ్వయుజ అమావాస్య / దీపావళి
పర్వసమయంలో సకల సంపదలను వర్షించే శ్రీలక్ష్మీదేవి గా 
అనుగ్రహించే పరాశక్తి......,
ఆ తదుపరి రమారమి 120 రోజులకు
మాఘపంచమి / శ్రీపంచమి పర్వసమయంలో సకల విద్యలను వర్షించే శ్రీవాణి గా అనుగ్రహించే పరాశక్తి.......,
యొక్క అనుగ్రహపరంపరావైచిత్రికి మధ్యపర్వమైన సమయాన్నే దీపావళి అని పెద్దలు వచించారు........!

మీరు (విజ్ఞ్యులైన ఉపాసకులు, బ్రహ్మవేత్తలు, ఆర్షవిజ్ఞ్యానకోవిదులు) జాగ్రత్తగా గమనిస్తే, 
పంచకర్మేంద్రియాలు,
పంచజ్ఞ్యానేంద్రియాలు,
పంచతన్మాత్రలు,
పంచకోశాలు,
మరియు వీటన్నిటిని తన అధీనంలోకి తీసుకొని మనిషిని
శాసించే అగోచర సర్వేంద్రియాధిష్టిత సకలేంద్రియసంచారిని అయిన మన మనసు...
వెరసి 21 తత్త్వాల్లో అలరారే ఉపాసకుల / సాధకుల స్వానుభవ దేవభూమికాతత్త్వం, సంచిత జనిత ప్రారబ్ధ సూచికానుగుణంగా శ్రీలక్ష్మీకటాక్షానికి పాత్రతను, అనుగ్రహాన్ని
సంతరించుకొని తత్ శ్రియానుగ్రహవైభవంతో తరించును...

ఈ లోకంలో
సిద్ధలక్ష్మి, మోక్షలక్ష్మి, జయలక్ష్మి, సరస్వతి, శ్రీలక్ష్మి, వరలక్ష్మి, అనే 6 విధాలుగా లక్ష్మీతత్త్వం శ్రీలక్ష్మీనారాయణ ఉపాసకులకు ప్రసన్నమై పరిఢవిల్లితూ ఉండును అని అత్యంత మహిమోపేతమైన శ్రీసూక్త ఉవాచ....

పైనపేర్కొనబడిన 21 గహనమైన అధ్యాత్మ తత్త్వసమన్వయభరిత ఉపాసన, దీపావళి నుండి మొదలై ఒక్కో లక్ష్మీతత్త్వానికి మీరు ఆపాదిస్తే, రమారమి 120 రోజులకు శ్రీసూక్త ప్రోక్త షణ్విధ లక్ష్మీతత్త్వారాధన సంపూర్ణమైనట్టు ఒక అధ్యాత్మదీక్షాతత్త్వమంజరి...

అనగా సదరు సాధకుడు తనలోనే 3.5 చుట్టలుచుట్టుకొని కొలువైఉండే కుండలినీయోగశక్తి కేంద్రీకృతమై ఉండే
మూలాధారచక్రానికి అధిపతి అయిన శ్రీశక్తిగణపతితత్త్వాన్ని మేల్కొలిపి, శ్రీశక్తిగణపతి అనుగ్రహాన్ని దుర్గాష్టమి నాడు అందుకొని ఉపాసనను కొనసాగించే క్రమములో, 21 గహనమైన అధ్యాత్మతత్త్వ సంచయం యొక్క మొదటి ఆవృతం పూర్తయ్యేసరికి దీపావళి పర్వసమయం ఏతెంచి శ్రీలక్ష్మీ అనుగ్రహాన్ని అందుకొని, 
6 పర్యాయాలు అనగా ఇంకో 6 ఆవృతాలు పూర్తైనతదుపరి మాఘపంచమి అనే అత్యంతశక్తివంతమైన తిథి, మాసం, సమ్మిళితసమయంలో "షట్చక్రోపరిసంస్థిత" గా యోగులచే నుతింపడే ఆ "సహస్రారాంభుజారూఢాసుధాసారాభివర్షిణ్యై నమః" అని ఆ పరదేవత పాదముల చెంత తన యోగశక్తిసుమాన్ని సమర్పించి సకలవైశ్వికదైవికవిజ్ఞ్యానతత్త్వసంచయానుగ్రహంతో వర్ధిల్లడం అనే అత్యంత మహిమోపేతమైన అధ్యాత్మతత్త్వసంపూర్ణత సిద్ధించును...

బాహ్యంలో దివ్వెల ఆవళి అనగా దీపముల వరుస యొక్క ఆరాధన సదరు ఉపాసకునకు,
A for Apple, B for Ball, అనే స్థాయిని సూచించును....

అట్టి బాహ్యారాధన, క్రమక్రమంగా ఆంతరదేవతారాధనగా పరిణతిచెందుతూ ఈశ్వరానుగ్రహంతో కాలాక్రమంలో
ఆంతరమున యోగచక్రావళి యొక్క ఆరాధనగా పరిఢవిల్లును.....

తన్మూలంగా,
A for Avalnche effect, B for Buoyancy 
అనే స్థాయిలో సదరు ఉపాసకుడి చిత్తవైభవం పరిఢవిల్లుతూ ఉండును.....

ఇట్టి అత్యంత గహనమైన శక్తి ఆరాధనవైచిత్రి గురించి చెప్పడానికి ఒక చక్కని సినిమా స్టోరీలా అనిపించినా, హిమాలయ పర్వతాన్ని అధిరోహించడం లాంటి అత్యంత కఠోరమైన సాధనానుగ్రహం ఇట్టి ఆంతర అధ్యాత్మపయనం...

రమారమి పుష్కరకాలపౌర్ణమి (అనగా 12 సంవత్సరాల పౌర్ణమి ఆరాధనా మంజరి) యొక్క ఆదిపరాశక్తి ఆరాధనాఫలితంగా ఒక సామాన్య భక్తుడు, అసామాన్యస్థాయిలో ప్రకాశించే చిత్తవైభవం, అనగా
"సహస్రారాంభుజారూఢా గా వర్ధిల్లే యోగి యొక్క చిత్తంపై ఆ ఆదిపరాశక్తి నిత్యం వర్షిస్తూ ఉండే యోగసుధాసారాన్ని దర్శిస్తూ యావద్ విశ్వదృశ్యమంజరిని దర్శించే ఆవళికి చేరుకున్న సాధనావైభవమే నిజమైన భక్తులకు, ఉపాసకులకు, సాధకులకు, యోగులకు ఘనమైన దీపావళి ఉత్సవ వైభవం.....

షడూర్ములకు లోబడి కేవలం నిద్రాహారభయామైథునాలతో బ్రతుకుతూ ఉండడానికి సర్వోన్నతమైన మనిషిజన్మే ఎందుకు....ఏ మృగత్వం లభించినా కూడా సరిపోతది కద....

భగవద్భక్తి అనే అత్యంత సుందరమైన వ్యాపకాన్ని అలవర్చుకొని, భగవద్ నామస్మరణ అనే ప్రారంభస్థాయి నుండి మొదలుకొని బాహ్యాంతర భగవద్దర్శనం అనే సర్వోన్నతస్థాయిలో ప్రకాశించే చిత్తవైభవంతో ధర్మబద్ధమైన జీవితాభ్యున్నతితో తరించగల ప్రజ్ఞ్యయే విజ్ఞ్యులెల్లరికీ నిజమైన దీపావళి ఉత్సవం....

శ్లోకం 10 - శివానందలహరి

నరత్వం దేవత్వం నగవనమృగత్వం మశకతా పశుత్వం కీటత్వం భవతు విహగత్వాది జననమ్ | సదా త్వత్పాదాబ్జ స్మరణ పరమానంద లహరీ విహారాసక్తం చేద్ధృదయమిహ కిం తేన వపుషా || 

అర్థం: 

నరత్వం: (మానవ జన్మ), దేవత్వం (దేవతగా ప్రభవించడం), నగ, వన, మృగత్వం (కొండలు, అడవి, జంతువులుగా పుట్టడం), మశకతా (దోమగా), పశుత్వం (పశువుగా), కీటత్వం (పురుగుగా), విహగత్వాది (పక్షి మొదలైనవిగా) - ఇలా ఏ జన్మలోనైనా జన్మించుగాక.
కానీ నా హృదయం ఎప్పుడూ నీ పాదాలపైన ధ్యానంలోనే మునిగి ఉంటే, ఆ పరమానందంలో విహరిస్తుంటే, ఏ శరీరం కలిగితేనేమి?

అని అన్నారు శ్రీఆదిశంకరాచార్యులంతటి వారే.....!

ఏ జన్మైతే ఏంటి భక్తిభరిత జన్మైతే చాలు అని అంటే...
ఏ జన్మైనా భక్తిలేనిదే సార్ధక్యం చెందదు అనే కదా అర్ధం...

భక్తి
జ్జ్యానం
ఆరోగ్యం
శాంతి
ఐశ్వర్యం
సౌఖ్యం
వర్చస్సు

ఇత్యాదిగా వెలిగే దీపానికి ఎన్నో తాత్పర్యాలు ఉన్నవి...
అందులో జ్ఞ్యానానికి ప్రతీకగా దీపాన్ని, దీపాల వరుసను, భావించి, దీపలక్ష్మిని ఆరాధిస్తే, జ్ఞ్యానానుగ్రహంవల్ల ఇతర అన్ని విభూతులు కూడా క్రమముగా అనుగ్రహింపబడును అని విజ్ఞ్యులైన పెద్దల ఉవాచ...

ఈ క్రింది రమణీయమైన సంకీర్తనలో శ్రీతాళ్ళపాక అన్నమాచార్యులవారు, 
"కనుగొను చూపులే ఘన దీపములట" 
అని వచించడంలోని ఆంతర్యం, 
"మనలోనే కొలువై ఉన్న పరమాత్మను దర్శించి తరించడానికి భక్తిజ్ఞ్యానదివిటీల వెలుగుల్లో ఆ పరమాత్మ యొక్క దేదీప్య అగ్నిశిఖను కనుక్కొని తరించాలి అని విజ్ఞ్యుల భావన..

ప్రాజ్ఞ్యులెల్లరూ కనుక్కోవలసిన ఆ ఆంతర అగ్నిశిఖను, శ్రీనారాయణసూక్తం ఈ క్రింది విధంగా ఎంతో గొప్పగా స్తుతించడం విజ్ఞ్యులకు విదితమైన అంశమే....

****** ****** ****** ****** ****** ******

ప॒ద్మ॒కో॒శ-ప్ర॑తీకా॒శ॒గ్ం॒ హృ॒దయం॑ చాప్య॒ధోము॑ఖమ్ ।
అధో॑ ని॒ష్ట్యా వి॑తస్యాం॒తే॒ నా॒భ్యాము॑పరి॒ తిష్ఠ॑తి ।

జ్వా॒ల॒మా॒లాకు॑లం భా॒తీ॒ వి॒శ్వస్యా॑యత॒నం మ॑హత్ ।
సంత॑తగ్ం శి॒లాభి॑స్తు॒ లంబ॑త్యాకోశ॒సన్ని॑భమ్ ।

తస్యాంతే॑ సుషి॒రగ్ం సూ॒క్ష్మం తస్మిన్᳚ స॒ర్వం ప్రతి॑ష్ఠితమ్ ।
తస్య॒ మధ్యే॑ మ॒హాన॑గ్ని-ర్వి॒శ్వార్చి॑-ర్వి॒శ్వతో॑ముఖః ।

సోఽగ్ర॑భు॒గ్విభ॑జంతి॒ష్ఠ॒-న్నాహా॑రమజ॒రః క॒విః ।
తి॒ర్య॒గూ॒ర్ధ్వమ॑ధశ్శా॒యీ॒ ర॒శ్మయ॑స్తస్య॒ సంత॑తా ।

సం॒తా॒పయ॑తి స్వం దే॒హమాపా॑దతల॒మస్త॑కః ।
తస్య॒ మధ్యే॒ వహ్ని॑శిఖా అ॒ణీయో᳚ర్ధ్వా వ్య॒వస్థి॑తః ।

నీ॒లతో॑-యద॑మధ్య॒స్థా॒-ద్వి॒ధ్యుల్లే॑ఖేవ॒ భాస్వ॑రా ।
నీ॒వార॒శూక॑వత్త॒న్వీ॒ పీ॒తా భా᳚స్వత్య॒ణూప॑మా ।

తస్యాః᳚ శిఖా॒యా మ॑ధ్యే ప॒రమా᳚త్మా వ్య॒వస్థి॑తః ।
స బ్రహ్మ॒ స శివః॒ స హరిః॒ సేంద్రః॒ సోఽక్ష॑రః పర॒మః స్వ॒రాట్ ॥

****** ****** ****** ****** ****** ******

****** ****** ****** ****** ****** ******

నిత్య పూజలివిగో నెరిచిన నోహో ప్రత్యక్షమైనట్టి
పరమాత్మునికి నిత్య పూజలివిగో

తనువే గుడియట తలయె శిఖరమట
పెను హృదయమే హరి పీఠమట
కనుగొను చూపులే ఘన దీపములట
తన లోపలి అంతర్యామికినినిత్య ౨

పలుకే మంత్రమట పాదయిన నాలుకే
కలకల మను పిడి ఘంటయట
నలువైన రుచులే నైవేద్యములట
తలపులోపలనున్న దైవమునకునిత్య ౨

గమన చేష్టలే అంగరంగ గతియట
తమి గల జీవుడే దాసుడట
అమరిన ఊర్పులే ఆలవట్టములట
క్రమముతో శ్రీ వేంకటరాయునికి

https://annamacharya-lyrics.blogspot.com/2006/10/43nityapoojalivigo.html?m=1

****** ****** ****** ****** ****** ******

ఒక హెవి ఏర్ బస్ యొక్క టేక్ ఆఫ్ మరియు ల్యాండింగ్ ఎంతటి శక్తియుక్తి సమన్వయభరిత సంక్లిష్ట ప్రక్రియో...
షట్చక్రాన్వితధ్యానయోగసమాధి కూడా అట్టి శక్తియుక్తి సమన్వయభరిత సంక్లిష్ట ప్రక్రియ...

కాబట్టి "ఆజ్ఞాచక్రాంతరాళస్థా రుద్రగ్రంథివిభేదిని" యొక్క స్థాయిలో ఆదిపరాశక్తిని యోగసమాధిలో దర్శించగల విజ్ఞ్యులకు మాత్రమే నా ఈ కావ్యోల్లేఖనా / కావ్యాలాపనాసుమాంజలి సంబంధించినది అని విజ్ఞ్యులుగుర్తించవలెను....
ఇతరులకు ఈ కవనం ఇతర సాధారణ అంశాల సమన్వయసుమాంజలి అని భావించవలెను...

భక్తి జ్జ్యాన సంపద అనే ఆజన్మాంతర అత్యంత విలువైన శ్రీలక్ష్మీవైభవం విజ్ఞ్యులెల్లరికీ అమరి, తన్మూలంగా ఇతర అన్ని శ్రియానుగ్రహాలు అనుగ్రహింపబడి,
శ్రీవిద్యాలక్ష్మీ యొక్క అనుగ్రహంతో ఈ దీపావళి పర్వసమయం విజ్ఞ్యులెల్లరి జీవితాలను దేదీప్యమానంగా పరిఢవిల్లజేయుగాక అని ఆకాంక్షిస్తూ....
శ్రేయోభిలాషులెల్లరికీ దీపావళి పండగ శుభాభినందనలు...😊💐🌟☀️✨🌈
🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔

సర్వం కొండగట్టు శ్రీలక్ష్మీవేంకటేశ్వర సహిత శ్రీవీరాంజనేయస్వామి శ్రీచరణారవిందార్పణమస్తు...💐🙏

సర్వే సుజనాః సుఖినోభవంతు...💐

Note : All the pictures, colors, symbols, and any other representations in the pictures of my posts are randomly copied from the typical google searched images pertaining to the context being discussed and thus aren't to be misunderstood by anyone for any assumptions / hypothetical references to any otherwise.
Thanks for your broad-minded understanding and prudence.


లౌక్యాన్ని పాటించే వారికే ఈ లోకంలో గౌరవం, అభివృద్ధి, మరియాద, కీర్తి, ఇత్యాదివి సంప్రాప్తించేది....గౌరవప్రదంగా పరిధిదాటకుండా చెప్పే మంచి మాటలు వినడంలోనే ఎల్లరి జీవితాలకు అభివృద్ధి కలిగేది...

పరిమళసంపంగి చెట్లను ఎప్పుడైనా మీరు గమనించి ఉండి ఉంటే, ఆకుపచ్చని చిన్న పువ్వుగా ప్రారంభమై కనిపించి కనిపించకుండా ఆకుల్లో ఆకులా ఒదిగిఉండి,
పసుపచ్చని అరవిరిసిన సంపంగిపుష్పంగా రూపాంతరం చెందే ఆ అరుదైన పుష్పసోయగం ఎంతో వైభవోపేతమైనది...

ఆ ఘుమఘుమలాడే పసుపచ్చని అరవిరిసిన 
పరిమళసంపంగిపుష్పాలను అమ్మవారికి అలంకరించి శ్రీలలితసహస్రనామావళిని పారాయణం గావించే భక్తులకు అమ్మవారు ప్రసాదించే అనుగ్రహం ఎంతో మెండైనది
అని హయగ్రీవ, అగస్త్య మహర్షి వారి ఉవాచ ....
చాలా సంవత్సరాలు పాటు వీధిచివర్లో ఒకరి ఇంటిముందు ఉండే సంపంగి చెట్టుకు పూసిన పరిమళసంపంగిపుష్పాలను అడిగి తెంపుకొని ఆరాధించినవాడిగా వాటి మహిమ ఎంతటిదో తెలిసే ఇలా వచిస్తున్నా....

ఆ పరిమళసంపంగిపుష్పాలు ఎంత గొప్పవో అంతే సౌకుమార్యమైనవి కూడా..
అనగా తెంపడంలో ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా అవి నేలకురాలి పూజకు అనర్హమౌతాయ్...

జీవితంలో కొన్ని సమయాలు కూడా ఇటువంటివే...
అజాగ్రత్తగా ఉంటే, కడిగిన ముత్యాలలా దేవుడి పూజకు ఈశ్వరసిమ్హాసనం చేరవలసిన పుష్పాలు...,
రేకుల అమరిక లుప్తమై నేలకు రాలగలవు...
కొన్నికొన్ని సార్లు చెట్టు కొమ్మలకు బుద్ధిలేకున్నా,
తోటమాలికైనా బుద్ధిఉండాలి....

ఫర్ ఎగ్సాంపుల్.....
ఇప్పుడున్న సందర్భంలో,
ఫలాన ఆహారం స్వీకరిస్తే ఆరోగ్యానికి ఇబ్బంది....
ఫలాన వ్యాయామం చేస్తే ఆరోగ్యానికి ఇబ్బంది....
ఫలాన పండ్లను ఆరగిస్తే ఆరోగ్యానికి ఇబ్బంది.
అని విజ్ఞ్యులు చెప్పినప్పుడు.....
తత్ విరుద్ధంగా "ఎవ్వరు" చెప్పినా కూడా, సున్నితంగా అట్టి పెడద్రోవపట్టించే సలహాలను తిరస్కరించవలెను అనునది లౌక్యం అనబడును...

లౌక్యాన్ని పాటించే వారికే ఈ లోకంలో గౌరవం, అభివృద్ధి, మరియాద, కీర్తి, ఇత్యాదివి సంప్రాప్తించేది....
గౌరవప్రదంగా పరిధిదాటకుండా చెప్పే మంచి మాటలు వినడంలోనే ఎల్లరి జీవితాలకు అభివృద్ధి కలిగేది...

శ్రీ విశ్వావసు 2025 సంవత్సర అనూరాధ ప్రయుక్త ఆశ్వయుజ శుద్ధ పంచమి, దేవి శరన్నవరాత్రోత్సవాంతర్గత షష్ఠమదివస నైమిత్తికారాధన సమయే ఆచరిత శ్రీచండీహవన విశేషవైభవం..

శ్రీ విశ్వావసు 2025 సంవత్సర అనూరాధ ప్రయుక్త ఆశ్వయుజ శుద్ధ పంచమి, దేవి శరన్నవరాత్రోత్సవాంతర్గత షష్ఠమదివస నైమిత్తికారాధన సమయే ఆచరిత శ్రీచండీహవన విశేషవైభవం..

కలౌ వేంకటనాయకః
కలౌ చండి 
కలౌ కపికుంజరః

అనే ఆర్షవాక్కులను విజ్ఞ్యులు ఎప్పుడో ఒకప్పుడు వినేఉంటారు కద...
శ్రీచాగంటి సద్గురువుల ప్రవచనాలను శ్రద్ధాభక్తితో ఆలకించిన వారికి గుర్తున్నట్టుగా, 
సాక్షాత్తు ఈ కలియుగప్రత్యక్షవరదైవమైన శ్రీవేంకటేశ్వరస్వామివారు తిరుమలకు తరలివచ్చిన సర్వదేవతాసమూహం యొక్క సమక్షంలో, శ్రీఆకాశరాజు గారి 
పుత్రిక అయిన శ్రీపద్మావతీదేవితో నారాయణవనంలో జరిగిన
వారి కళ్యాణమహోత్సవంలో ఆరాధించిన పరదైవం కంచి కామాక్షి పరదేవత....
కంచికామాక్షి పరదేవత యొక్క అసంఖ్యాకస్వరూపాలే ఈ యావద్ భూమండలంలో కొలువైన సకల దేవి ఆలయాలు / మందిరాలు....
అందుకే "కథ కంచికి...మనం ఇంటికి..." అనే ఒక పాతకాలం మాట వినేఉంటారు...
శ్రీవారి పరిణయోత్సవంలో పసుపుకొమ్ములు దంచబడిన పేద్ద రాతి రోలు ఇప్పటికీ నారాయణవనంలోని శ్రీవారి ఆలయంలో భక్తులు దర్శనీయమై ఉండడం మన సౌభాగ్యం...

మీరు ఎప్పుడైనా మన పెద్దలు రోలులో పసుపు కొమ్ములు మరియు ఇతర పదార్థాలు దంచడం దర్శించినా....లేక మీరే దంచినా..., 
ఒక విధమైన సెంట్రి పెటల్ టు సెంట్రి ఫ్యూగల్ ఫోర్స్ ఫీల్డ్ ని గమనించడం లేదా అనుభవం చెంది ఉండడం గురించి పరికించి ఉంటారు....

నేను శ్రీచాగంటి సద్గురువుల పర్యవేక్షణలో నిర్వహించబడ్డ శ్రీవేంకటేశ్వరవైభవోత్సవాల్లో అట్టి పసుపు దంచే రోళ్ళను, వాటి వద్ద అట్టి ఒక విధమైన సెంట్రి పెటల్ టు సెంట్రి ఫ్యూగల్ ఫోర్స్ ఫీల్డ్ ని దర్శించాను...

ఒక యజ్ఞ్యవేదిలో ప్రజ్వలించే స్వాహకార జనిత అగ్నిహోత్రం కూడా ఆ పరిసరాల్లో అట్టి ఒక విధమైన సూక్ష్మ సెంట్రి పెటల్ టు సెంట్రి ఫ్యూగల్ ఫోర్స్ ఫీల్డ్ ని విస్తరింపజేసి తద్వారా తత్ ఆరాధిత దేవతానుగ్రహాన్ని ఆయా భక్తులకు అనుగ్రహింపజేయును అనే అధ్యాత్మ సైన్స్ హైయర్ స్ట్రాటా సైంటిస్ట్లకు విదితమైన అంశమే.....

ఒక ఆరాధిత అధ్యాత్మ వస్తువుకు సమకూరిన దేవతాశక్తి కూడా ఇట్టి ఒకానొక సూక్ష్మ సెంట్రి పెటల్ టు సెంట్రి ఫ్యూగల్ ఫోర్స్ ఫీల్డ్ ని విస్తరింపజేసి తద్వారా తత్ అధ్యాత్మ వస్తువునుండి వినిర్ముక్తమయ్యే దేవతానుగ్రహాన్ని ఆయా భక్తులకు అనుగ్రహింపజేయును అనే అధ్యాత్మ సైన్స్ హైయర్ స్ట్రాటా సైంటిస్ట్లకు విదితమయ్యే అంశం...

కాత్యాయన మహర్షి యొక్క కూతురిగా అవతరించిన కాత్యాయనిదేవిని దుర్గాదేవిగా కీర్తించే....
"కాత్యాయనాయ విద్మహే
కన్యకుమారి ధీమహి
తన్నః దుర్గిః ప్రచోదయాత్..."
అనే గాయత్రి శక్తి తరంగవలయం గురించి వ్యఖ్యానించాలంటే...,
ఇట్టి సూక్ష్మరూప తైజసికదేవతాశక్తివలయానికి తగిన ప్రామాణిక ఈక్వేషన్స్ ఉండునా అని అడగాలని అనుకునేవారు.....
వాండర్వాల్స్ ఫోర్స్ ని ఏ సైంటిఫిక్ ఈక్వేషన్స్ తో సప్రామాణికంగా పరిగణించి సైన్స్ ఎన్నో చోట్ల అప్ప్లై చేస్తూ ఎన్నో థియరీస్ ని ప్రతిపాదిస్తున్నదో, అని కూడా అడగవలసి ఉంటుంది...

The Van der Waals (vdW) forces that are named after the Dutch physicist who first described them in the late 19th century to explain the properties of real gases, form the cardinal principle of the nano technology that has revolutionized the modern age scientific invention saga....

Quite similarly,

The "Adhyaatma yagya taranga Shakti" (Micro spiritual forces created by a peculiar combination of the centri petal and centri fugal forces exerted by the fire element present in the yagna ritual, forms the cardinal principle of the spritual science that has revolutionized the modern age spiritual discovery saga....

విశ్వసించే వారికి అది 
భగవంతుడి / భగవతి ఆలయం,
భగవంతుడి / భగవతి శక్తి,
భగవంతుడి / భగవతి ప్రసాదం,
భగవంతుడి / భగవతి శాస్త్రం,
భగవంతుడి / భగవతి అనుగ్రహం,

విశ్వసించని వారికి అది వారి సాధారణ స్థాయికి ఇంకా అందని సదరు తెలియని సైన్స్ కి సంబంధించిన అంశం...

ఎవ్వరు విశ్వసించినా, విశ్వసించకున్నా ఆకాశతత్త్వం అనేది ఎవ్వరికీ ఎప్పటికీ పూర్తిగా అందనటువంటి అమరతత్త్వం....
అవ్విధంగానే 
ఎవ్వరు విశ్వసించినా, విశ్వసించకున్నా భగవద్ తత్త్వం అనేది ఎవ్వరికీ ఎప్పటికీ పూర్తిగా అందనటువంటి అమరేశ్వరతత్త్వం.....

అట్టి గహనమైన ఆకాశతత్త్వం గురించి ఎంతో కొంత తెలుసుకొని తరించాలంటే రాకెట్ సైన్స్ అనే ఒకానొక కాంప్లెక్స్ సబ్జెక్ట్ ని అధ్యయనం గావించి, వీలైనంత పైకి నింగిలోకి రాకెట్స్ లో ప్రయాణించి, తెలుసుకొని తరించవలసి ఉంటుంది...
అవ్విధంగానే....
గహనమైన భగవద్ తత్త్వం గురించి ఎంతో కొంత తెలుసుకొని తరించాలంటే అధ్యాత్మశాస్త్రం అనే ఒకానొక కాంప్లెక్స్ సబ్జెక్ట్ ని అధ్యయనం గావించి, వీలైనంత శాస్త్రోక్త అలౌకిక భావవీచిక లో విహరించి, తెలుసుకొని తరించవలసి ఉంటుంది...

అట్టి గహనమైన అధ్యాత్మశాస్త్ర కోవిదులు, మాన్యులైన విద్వణ్మూర్తులు, గురువులు, ఆచార్యుల వాక్కుల్లో అధ్యాత్మశాస్త్రవిజ్ఞ్యానాన్ని అందుకొని స్వోద్ధరణతో ఎవరికివారు వారివారి జీవితాల్లో తరించవలసి ఉంటుంది....
ఎందుకంటే, ఇది ఆధునికత అనే ముసుగులో పూర్తిగా భౌతికవాదం అలుముకుంటున్న కలియుగసమయం...
కాబట్టి దేశకాలానుగుణంగా వర్తించే లౌక్యాన్ని, ఆచరిత విహితధర్మాన్ని, ఆచారవైభవాన్ని కలిగిఉండి ఎవరి పరిశ్రమకు తగ్గట్టుగా వారికి భగవంతుడు ప్రసాదించే అనుగ్రహంతో, వర్ధిల్లడం విజ్ఞ్యత అనబడును....

అధ్యాత్మశాస్త్ర కోవిదుల ఆర్షవాక్కుల్లో అనాదిగా దేవి శరన్నవరాత్రోత్సవ వైభవం అనన్యసామాన్యమైనది...
అది ఆచరించి అందుకునే తత్త్వమాహాత్మ్యం...

భూమిలో అడ్డంగా పాతిన చెరుకువిల్లు నుండి నిలువుగా ఉద్భవించే చెరుకునుండి లభించే చెరుకురసం కొద్దిసేపుమాత్రమే త్రాగడానికి యోగ్యమైన రీతిలో బావుంటుంది....
సమయం గడిచేకొద్ది అది స్వీకరించయోగ్యం కాని రీతిలోకి మారిపోతూ ఉంటుంది...
కాని అదే చెరుకురసం నుండి సాధింపబడిన నిలవదోషం లేని బెల్లం మాత్రం ఎప్పటికీ అమృతసమమైన రీతిలో వర్ధిల్లుతూఉంటుంది...
అందుకే బెల్లం నిత్యనైవేద్యార్హతను కలిగిఉండే ఎకైక భోజ్యపదార్ధం...

అవ్విధంగానే ఎంతో మధురంగా అనిపించే ఈ ప్రపంచం యొక్క నిజతత్త్వం ఎండమావిలో నీటిరుచి లాంటిది...
అది ఎప్పటికీ మనిషిని తరింపజేయజాలని కేవల మృణ్మయత్వం...
కాని ఇదే ప్రపంచంలో ఉంటూనే, ఈ ప్రపంచంకంటే ఎంతో ఉన్నతమైన దేవతాతత్త్వం గురించి సాధనగావించి తత్ ప్రజ్ఞ్యానసిరులను అందుకుంటే, అవి మధురాతిమధురమైన బెల్లం ఉండలలాగా ఎప్పటికీ ఆజన్మాంతర శాశ్వతమైన ఆనందహేతువులై మనిషిని తరింపజేసే సాధనములై ఒప్పారును...

అందుకే ఆ పరదేవత ఎన్నో అవతారాలు, అలంకారములు దాల్చినా / ధరించినా, అన్నిటికీ మకుటాయమానమైన రీతిలో విజయదశమినాడు ధరించే అత్యంతశక్తివంతమైన అవతారం
శ్రీరాజరాజేశ్వరిదేవి..!
అనగా రాజాధిరాజులపైన కూడా ఆధిపత్యం కలిగిఉండే పరదేవతాస్వరూపం అని అర్ధం...
ఆవిడ చేతిలో ధరించి ఉండే ఇక్షుఖండం / చెరుకువిల్లు బోధించే పై అధ్యాత్మసత్యాన్ని ఎవరు సాధనద్వారా గ్రహిస్తూఉంటారో, వారికి ఆవిడ ప్రసాదించే అనుగ్రహం కూడా అనన్యసామాన్యమైన రీతిలో వర్ధిల్లే భూమికలుగా అధ్యాత్మవిజ్ఞ్యులు వచింతురు....
అట్టి సర్వోన్నతమైన శ్రీరాజరాజేశ్వరిదేవికి మరో రూపమే శ్రీలలితాపరాభట్టారికా స్వరూపం...

కూకట్పల్లి గ్రామదేవతగా బహువిశేషమైన వైభవంతో వర్ధిల్లుతూ, నేడు శ్రీలలితాదేవి అలంకరణ / స్వరూపంలో అలరారిన శ్రీచిత్తారమ్మతల్లి అమ్మవారి ఆలయప్రాకారంలో, శ్రీచండిహవనంలో కైంకర్యపరులుగా పాల్గొని అమ్మలగన్నయమ్మ అనుగ్రహంతో తరించిన సందర్భంగా, పరాంబిక శ్రీచరణాలచెంత చిరు కావ్యోల్లేఖనాకైంకర్యసుమాంజలిని సమర్పిస్తూ
శ్రీమాత్రేనమః...🙏😊💐

అమ్మలఁ గన్నయమ్మ, ముగురమ్మలమూలపుటమ్మ, చాలఁ బె
ద్దమ్మ, సురారులమ్మ కడు పాఱడి వుచ్చిన యమ్మ, తన్ను లో
నమ్మిన వేల్పుటమ్మల మనమ్ముల నుండెడి యమ్మ, దుర్గ, మా
యమ్మ, కృపాబ్ధి యిచ్చుత మహత్త్వకవిత్వ పటుత్వ సంపదల్

ఓం గోవిందరూపిణ్యై నమః...🙏
ఓం సచామరరమావాణిసవ్యదక్షిణసేవితాయై నమః...🙏
ఓం శ్రీలలితాత్రిపురసుందరీదేవ్యైనమః...🙏

సర్వం శ్రీ వేములవాడ శ్రీరాజరాజేశ్వరి సమేత శ్రీరాజరాజేశ్వర శ్రీచరణారవిందార్పణమస్తు...🙏

గౌ || ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు, శ్రీ నారా చంద్రబాబునాయుడు గారు, రాజ్యప్రభువుల హోదాలో, సర్వభూపాలపాలుడైన శ్రీశ్రీనివాసప్రభువులకు,శ్రద్ధాభక్తితో పరివట్టాన్ని ధరించి ఆచరించిన అట్టి నూతనవస్త్రద్వయసమర్పణాకైంకర్యాన్ని దర్శించి నమస్కరించడం కూడా భక్తుల్లెల్లరికీ పుణ్యదాయక విశేషం...!

ఎన్నో రోజులుగా భుజించిన ఆహారం సమకూర్చిన బలంతో మాత్రమే ఒక వ్యక్తి కొబ్బరి చెట్టును ఎక్కి కొబ్బరిబోండాలను స్వీకరించి స్వఛ్చమైన కొబ్బరినీళ్ళు, తియ్యని కొబ్బరిని ఆరగించి ఆ అనుగ్రహఫలంతో మరెంతో బలం సమకూర్చుకోవడం అనే ప్రక్రియ సంభవించును...

అట్లే, ఎన్నో జన్మల పుణ్యకార్యాలు ఒనరించిన పుణ్యబలంతో మాత్రమే సదరు మాన్యులు తిరుమల మహాద్వారప్రవేశంగావించి, కలియుగ ప్రత్యక్షదైవమైన శ్రీశ్రీనివాసపరదైవానికి బ్రహ్మోత్సవ సమయంలో నూతనవస్త్రద్వయసమర్పణ గావించే భాగ్యానుగ్రహం లభించి, ఆ అనుగ్రహఫలంతో మరెంతో పుణ్యబలం సమకూర్చుకోవడం అనే ప్రక్రియ సంభవించును...

గౌ || ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు, 
శ్రీ నారా చంద్రబాబునాయుడు గారు, రాజ్యప్రభువుల హోదాలో, సర్వభూపాలపాలుడైన శ్రీశ్రీనివాసప్రభువులకు,
శ్రద్ధాభక్తితో పరివట్టాన్ని ధరించి ఆచరించిన అట్టి నూతనవస్త్రద్వయసమర్పణాకైంకర్యాన్ని దర్శించి నమస్కరించడం కూడా భక్తుల్లెల్లరికీ పుణ్యదాయక విశేషం...!

ప్రతి శుక్రవారం ఎందరో భక్తులు శ్రీవారికి మేల్సాత్తువస్త్రద్వయసమర్పణాకైంకర్యాన్ని నిర్వహిస్తూనే ఉన్నాకూడా..
మీనలగ్నంలో శ్రీ వైఖానస ఆగమశాస్త్రోక్తవిధివిధానాలతో ధ్వజస్తంభమంటప ప్రాకారంలోగావింపబడిన గరుడధ్వజ ఆరోహణతో విచ్చేసిన సకలదేవతలు వారివారి సూక్ష్మరూపతైజసిక దేహాలతో ఆలయప్రాకారంలో   ప్రబలవైశ్వికశక్తిసమూహాలుగా కొలువై ఉన్న శుభసమయంలో,
గావింపబడే కైంకర్యాలన్నిటికీ కూడా సంప్రాప్తించే భగవదనుగ్రహఫలం మెండైన జన్మాంతర పుణ్యబలవిశేషం..!

సాధారణ మానుషకార్యాల్లో ధనుర్మీనలగ్నములకు అంతగా ప్రాధాన్యత లేకున్నా.....,
దేవకార్యాల్లో కొన్ని అధ్యాత్మ కారణాలరీత్యా, మీనలగ్నానికి గల ప్రాధాన్యత బహువిశేషమైనది...!
ఎందుకంటే, ఏ దేవతాతత్త్వమైనా ప్రస్ఫుటంగా భక్తులకు అనుగ్రహరూపంలో గ్రాహ్యమయ్యేది మీనతత్త్వం ద్వారానే...
వేదాలను అపహరించిన సోమకాసురుణ్ణి సమ్హరించడానికి శ్రీమహావిష్ణువు మత్స్యావతారాన్ని ధరించి వేదములను తిరిగి బ్రహ్మగారి స్వాధీనం గావించారు అనేది స్థూల బాహ్య అధ్యాత్మ ఇతిహస విశేషం....
అందలి సూక్ష్మ ఆంతర అధ్యాత్మ తత్త్వ విశేషం ఏమనగా, మనుష్యులకు వారి జన్మలక్ష్యం సాధింపబడే దిశగా ఆవశ్యకమైన సకలవిధమైన జ్ఞ్యానసముపార్జనకు అవరోధంగా ఉండే సహజమైన ప్రాకృతిక అజ్ఞ్యానగ్రంథిని లయింపజేసే భగవద్ తత్త్వానికే మీనతత్త్వం అని పేరు....

" ఓం జ్ఞానపంజరాయ నమః "
అని అష్టోత్తరశతనామావళి లో శ్రీవారికి ఒక విశేషమైన గౌణము కలదు....

మన సాధారణ పరిభాషలో చెప్పాలంటే,,
పంజరంలో రామచిలుక ఎప్పుడు ఉంటుంది...?
ఆ పంజరప్రవేశద్వారానికి తాళం వేస్తేనే రామచిలుక పంజరం లోపల ఉంటుంది....
లేకపోతే క్షణాల్లో తుర్రుమని పంజరం నుండి ఆకాశంలోకి ఎగిరిపోతుంది...
అవునాకాదా...?

మన దేహమే ఒక ప్రాకృతిక పాంచభౌతిక ఈశ్వరనిర్మిత పంజరం...
అట్టి పాంచభౌతిక పంజరంలో, పరమాత్మతత్త్వం స్థిరంగా ఉండాలంటే, 
ఎవ్విధంగా ఒక వీణియకు తంత్రులు బిగుతుగా ఉన్నప్పుడే స్వరరాగం అద్భుతంగా ధ్వనించునో....,
అవ్విధంగా...
సుజ్ఞ్యానసిరులు నిరంతరం ఈ మృణ్మయాన్ని చిన్మయంగావిస్తూ ఉండాలంటే, 
దేహంలో జ్ఞ్యానకవాటం ఎల్లప్పుడూ బిగింపబడి ఉండాలి....
అనగా అజ్ఞ్యానగ్రంథి లయించి ఉండాలి....
అందుకు ఆవశ్యకమైనదే భగవంతుడి మీనతత్త్వానుగ్రహం...
అట్టి గోధూళి సమయ మీనలగ్నానికి ఉండే విశేషమైన ఈశ్వరానుగ్రహసంపాతలక్షణం కారణంగా, దేవకార్యాలకు మీనలగ్నం బహువిశేషమైన సమయం...

"ఒరెయ్...సాయంత్రం సమయంలో నిద్రపోతున్నావేంట్రా దున్నపోతా...లె..." 
అనే పాతతరం పెద్దల మాట చాలామంది విజ్ఞ్యులకు ఎరుకే...
అనగా 
"ఈ గోధూళి సమయంలో విశేషంగా ఈశ్వరచైతన్యశక్తి విశ్వవ్యాప్తమై పరిఢవిల్లుతుంటే, ఏమి పట్టని దున్నపోతులా తమస్సుతో నిద్రపోవడం ఏంటిరా శుంఠా..." అని వాచ్యార్ధం...
(పసిపిల్లలు, వృద్ధులు, రోగులు మినహా)

శ్రీశైలంలో అయితే గోధూళి సమయంలో శ్రీభ్రమరాంబాసమేతశ్రీమల్లికార్జునస్వామివారు శ్వేతవృషభవాహనారూఢమై ప్రత్యక్షంగా విహరించడం గురించి శ్రీచాగంటి సద్గురువుల ప్రవచనాల్లో వినడం కొందరు విజ్ఞ్యులకైనా గుర్తుండే ఉంటుంది...
"తిరు మలై" అంటే "శ్రీ శైలం" అని కూడా అర్ధం కదా....😊

"శివాయ విష్ణు రూపాయ శివ రూపాయ విష్ణవే 
శివస్య హృదయం విష్ణుః విష్ణోశ్చ హృదయగుం శివః "

"వేంకటాద్రిసమంస్థానం
బ్రహ్మాండేనాస్తికించన
వేంకటేశసమోదేవో
నభూతోనభవిష్యతి"

"శ్రీవేంకటాచలాధీశం శ్రియాధ్యాసితవక్షసం
శ్రితచేతనమందరాం శ్రీనివాసంభజేదనిశం"

ఓం నమో వేంకటేశాయ.... 💐😊🙏

https://m.youtube.com/watch?v=wZOLxIQVYPc&fbclid=IwVERDUANSKUxleHRuA2FlbQIxMAABHso7jn2BE3Bfas8SDTZiHDxHnb3bsaUYU0D4N_T613gLLvCTswqelWiaC99F_aem_S3DEsQeNQLqzMVhKPIODQQ