శ్రీఆదిశంకరాచార్య స్థాపిత చతురామ్నాయ పీఠాల్లో గురుస్థానాన్ని వహించే దక్షిణామ్నాయ శ్రీశృంగేరి శారదాంబాపీఠ ఉత్తరాధికారులు, జగద్గురువులు శ్రీశ్రీశ్రీ విధుశేఖరభారతీ స్వామి వారు, వారి విజయయాత్రలో భాగంగా, భాగ్యనగరానికి విచ్చేసిన శుభసమయంలో, మోతి నగర్ శ్రీశంకరమఠంలో వారి దర్శనానుగ్రహంతో, ఆశీస్సులతో,
శ్రీఆదిశంకరాచార్యమందిరం మరియు శ్రీశారదాంబామందిరం యొక్క కుంభాభిషేక సందర్శనంతో తరించిన పర్వసమయ విశేషాలు....💐🙂
సదాశివసమారంభాం
వ్యాసశంకరమధ్యమాం
అస్మదాచార్యపర్యంతాం
వందేగురుపరంపరాం
సదాశివుడితో ప్రారంభమై, శ్రీవేదవ్యాసులవారు, శ్రీఆదిశంకరాచార్యులవారు, మధ్యలో కొలువై ఉండగా,
వారి అనుగ్రహంగా మా యొక్క ఆచార్యులవరకు పరిఢవిల్లే శ్రీగురుపరంపరకు వందనములు...
అనే ప్రాజ్ఞ్యుల నిత్య గురుప్రార్థనల్లో వచింపబడినట్టుగా,
మనం మాన్యులైన ఏ శ్రీగురుస్వరూపం యొక్క సన్నిధిలో కొలువై ఉన్నామో, ఆ గురువులను శ్రీశంకరాచార్యులకు ప్రతిరూపంగా భావిస్తూ ఆరాధించడంలోని ఆంతర్యమేమనగా....
అమేయమైన ప్రాచీన దైవిక సంపద అనేది,
(అధ్యాత్మశాస్త్రవిజ్ఞ్యానం మొదలుకొని అరుదైన అధ్యాత్మ ఆరాధనా సంపత్తి వరకు) పరంపరాగతంగా ఈ భారతదేశంలో పరిరక్షింపడుతూ, ప్రజలకు, భక్తులకు, విజ్ఞ్యులకు అభివృద్ధిని అనుగ్రహింపబడుతూ వస్తున్నది....
ఫర్ ఎగ్సాంపుల్, మనం శ్రీవేదవ్యాసమహర్షి వారి శ్రీమద్భాగవతం అనే పౌరాణికవాజ్ఞ్మయ వైభవాన్ని
శ్రీచాగంటి సద్గురువుల నుండి వారి ప్రవచనాల ద్వారా అందుకొని తరిస్తున్నామంటే...
వారి సన్నిధిలో ఉండే భక్తులెల్లరికీ...,
శ్రీ మల్లంపల్లి అమరేశ్వరప్రసాద్ గారి శిష్యులైన శ్రీచాగంటి గారు శ్రీగురుస్వరూపులై అనుగ్రహిస్తున్నారు అని అర్ధం...
ఫర్ ఎగ్సాంపుల్,
మనం శ్రీఆదిశంకరాచర్యుల వారే స్వయంగా కైలాసం నుండి భూలోకానికి అనుగ్రహంగా అందించిన
శ్రీచంద్రమౌళీశ్వరస్ఫటికశివలింగం యొక్క అభిషేక తీర్థాన్ని సేవిస్తూ తరిస్తున్నప్పుడు,
వారి సన్నిధిలో ఉండే భక్తులెల్లరికీ...,
శ్రీభారతీతీర్థస్వామి వారి శిష్యులుగా కొలువైన శ్రీవిధుశేఖరభారతీస్వామి వారు శ్రీగురుస్వరూపులై, జగద్గురువులై అనుగ్రహిస్తున్నారు అని అర్ధం...
నాడు శ్రీఆదిశంకరాచార్యులచే వ్యవస్థీకరింపబడి నేటి వరకు కొనసాగుతున్న శ్రీ దక్షిణామ్నాయ శృంగేరి శారదాంబా పీఠాలంకృత శ్రీగురుపరంపర యొక్క వరుసక్రమం ఈ క్రింది అంతర్జాల పట్టికలో పేర్కొనబడి ఉన్నది...
https://www.sringeri.net/jagadgurus?fbclid=IwdGRjcANxgnljbGNrA3GCcGV4dG4DYWVtAjExAAEe5zab1EijeQqcb67tzO_5tmaNhFCEbi2Zv44w0ZvgpxbcWI5qMf6lY8ATJKU_aem_vHkiSbCtm785ihnAbhM0Cg
శ్రీచాగంటి సద్గురువుల ప్రహృష్ట వచనాల్లో "కలియుగంలో ఆధ్యాత్మికత" అనే అంశం గురించి ఆలకించి క్షుణ్ణమైన అవగాహనను కలిగిఉన్న వారికి తెలిసినట్టుగా...
కృతయుగం : 17280000 సంవత్సరముల నిడివి గల కాలప్రవాహ మేయం
త్రేతాయుగం : 8640000 సంవత్సరముల నిడివి గల కాలప్రవాహ మేయం
ద్వాపరయుగం : 12960000 సంవత్సరముల నిడివి గల కాలప్రవాహ మేయం
కలియుగం : 4320000 సంవత్సరముల నిడివి గల కాలప్రవాహ మేయం
అనే నాలుగు యుగాల్లో విస్తరించి ఉండే మన అధ్యాత్మ విజ్ఞ్యానం అనేది, యుగలక్షణానికి అనుగుణంగా మారుతూ ఉండును....
కృతయుగంలో భక్తి యొక్క ప్రాథమిక
అస్తిత్వం నిత్య కఠోర తపస్సులో....
త్రేతయుగంలో భక్తి యొక్క ప్రాథమిక
అస్తిత్వం నిత్య యజ్ఞ్యయాగాది క్రతువుల్లో....
ద్వాపరయుగంలో భక్తి యొక్క ప్రాథమిక అస్తిత్వం నిత్యాగ్నిహోత్ర క్రతువుల్లో....
కలియుగంలో భక్తి యొక్క ప్రాథమిక అస్తిత్వం నిత్య భగవన్నామ స్మరణలో....
అని విజ్ఞ్యుల ఉవాచ...
ప్రభావాది 60 సంవత్సరముల చాంద్రమాన కాలచక్రం 1000 సార్లు పూర్తి అయినచో ఒక యుగం.
అటువంటి 72 యుగాల (72 × 60000 = 4320000) సంవత్సరాల) నిడివి గల "మహాయుగం" / కాలప్రవాహ మేయం నిత్యం పునరావృతం అవుతూ ఉండును....
అలా ఇప్పటివరకు ఈ మహాయుగ కాలచక్ర ప్రయాణంలో ఎన్నెన్ని కృత, త్రేతా, ద్వాపర, కలి యుగాలు సంభవించాయో ఆ పరమాత్మమకు మాత్రమే ఎరుక ...
ఇప్పుడు మనం ఉన్నది....,
శ్రీ శ్వేతవరాహకల్పంలోని వైవస్వతమన్వంతరంలోని 28వ మహాయుగంలోని కలియుగంలోని 5126 వ సంవత్సరంలో....
తిరుమల, శ్రీశైలం, అరుణాచలం, కాశి, ఇత్యాది పుణ్యక్షేత్రాల్లో కొన్ని కోట్ల సంవత్సరాల క్రితం నాటి పూర్వీకుల తపోస్థలానవాళ్ళు ఉండడానికి గల కారణం ఈ నిరంతర మహాయుగచక్ర భ్రమణం....
ఇట్టి అమేయకాలచక్రంలో ప్రభవించే దేవతల గురించిన వివరాలు, దైవికాంశముల వర్ణనలు, ఆయా కాలంలో సంచరించిన గురుస్వరూపులకు మాత్రమే ఎరుకలో ఉండే అంశాలు.....
అవన్నీ కూడా సమీకరింపబడి, పరిష్కరింపబడి, క్రోడీకరింపబడి, భవిష్యద్ తరాలకు అనుగ్రహంగా అందివ్వబడి లోకం చల్లగా అభివృద్ధి చెందేదుకు కారణం నిర్హేతుకమైన శ్రీగురుకృప....
అట్టి శ్రీగురుకృపగా అందివచ్చే అనుగ్రహం ఆజన్మాంతర సౌభాగ్యమై వర్ధిల్లును....
అందుకే ఆనాడు శ్రీఆదిశంకరాచార్యులు స్థాపించి అధివసించిన శ్రీశంకరపీఠాల్లో ఎందరో మహానుభావులు ఆనాటి శ్రీఆదిశంకరజ్ఞ్యానదీప్తిని వారి అనుగ్రహంగా నేటికీ ఆస్తికసమాజవిజ్ఞ్యులకు అనుగ్రహిస్తూ లోకాన్ని, లోకుల్లో దైవత్వాన్ని, లోకంలో దేవతారాధనను, పరిరక్షిస్తూ పరిఢవిల్లుతున్నారు....
రమారమి 1200 సంవత్సరాల క్రితం వర్ధిల్లిన,
రాజులు, రాజ్యాలు, పరిపాలకసంస్థానాలు, మాన్యాలు, ధనకనకవస్తువాహనాది భౌతిక సిరిసంపదలు, ఇతరత్రా ఏవి కూడా నేటి సమాజానికి అందుబాటులోలేవు....
కాని ఆనాడు శ్రీపార్వతీపరమేశ్వరుల అనుగ్రహంగా శ్రీకాలటిశంకరులకు అనుగ్రహింపబడిన శ్రీ చంద్రమౌళీశ్వరస్ఫటికలింగాభిషేకానుగ్రహం ఇప్పటికీ సమాజానికి లభిస్తూ ఉన్నది...
ఆనాడు శ్రీఆదిశంకరాచార్యులు వ్యవస్థీకరించి అందించిన పంచాయతన ఆరాధనావ్యవస్థ యొక్క అనుగ్రహం ఇప్పటికీ సమాజానికి లభిస్తూ ఉన్నది...
ఆనాడు శ్రీఆదిశంకరాచార్యులు వారి అనిర్వచనీయ తపఃశక్తితో సృజించిన ఉష్ణకుండముల అనుగ్రహం ఇప్పటికీ సమాజానికి లభిస్తూ ఉన్నది...
ఆనాడు శ్రీఆదిశంకరాచార్యులు వారు దర్శించి రచించి అందించిన అసంఖ్యాక దేవిదేవతాశ్లోకసారస్వతానుగ్రహం ఇప్పటికీ సమాజానికి లభిస్తూ ఉన్నది..
శ్రీగురుస్వరూపం సాక్షాత్తు సకలదేవతల సన్నిధిగా ఒప్పారును...
అందుకే దైవం మానుషరూపేన....
దైవం శ్రీగురురూపేన....
అని విజ్ఞ్యులు వచించేది.....
శ్రీతోటకాచార్యులు ఈ క్రిందివిధంగా వారి గురుదేవులను, శ్రీఆదిశంకరాచార్యులను స్తుతించడంలోని ఆంతర్యం శ్రీగురుస్వరూపం యొక్క సర్వేసర్వత్రా పరివ్యాప్తమై పరిఢవిల్లే అంతర్యామిత్వం...
"జగతీమవితుం కలితాకృతయో విచరన్తి మహామహసశ్ఛలతః
అహిమాంశురివాత్ర విభాసి గురో భవ శంకర దేశిక మే శరణం"
తాత్పర్యము :
" ఈ జగత్తును రక్షించుటకు మీవంటి మహాత్ములు వేర్వేరు రూపములలో, మారు వేషములలో తిరుగుచుంటారు. వారిలో మీరు సూర్యదేవులవంటి వారు. ఓ శంకర దేశికా! నాకు శరణు నిమ్ము."
అందుకే...
ఈ కలియుగంలో శ్రీజగద్గురువులెల్లరూ వచించేది..
"మా నారాయణనామస్మరణానుగ్రహాన్ని మీ అందరికీ అందిస్తూ,
సర్వేషాం శాంతిర్భవతు...
సర్వేషాం స్వస్తిర్భవతు...
సర్వేషాం పూర్ణంభవతు...
సర్వేషాం మంగళంభవతు..."
శ్రీవిధుశేఖరభారతి స్వామివారు స్వయంగా నిర్వహించిన శ్రీచంద్రమౌళీశ్వరస్ఫటికలింగాభిషేక వైభవం గురించి ఈశ్వరానుగ్రహంగా కొంత వివేచనగావిద్దాము...
శ్రీచాగంటి సద్గురువుల శ్రీశైలవైభవం, శ్రీఉమామహేశ్వరవైభవం, ఇత్యాది ప్రవచనాలు భక్తిశ్రద్ధలతో ఆలకించిన వారికి గుర్తున్నట్టుగా...
ఈశ్వరాభిషేకంలో పాల్గొని తరించడం ఎంత పుణ్యప్రదమో...,
ఈశ్వరాభిషేకాన్ని దర్శించడం కూడా అంతే పుణ్యప్రదం....
మీలో బి.టెక్ బడ్డీస్ కి స్పెక్ట్రం ఆల్-ఇన్-1 గురించి బాగా తెలిసిన అంశమే...
ఎంజినీరింగ్ ఫైనల్ / ఎక్స్టర్నల్ ఎగ్సాంస్ అనగానే,
అన్ని సబ్జెక్ట్లకు సంబంధిన ముఖ్యమైన ప్రశ్నోత్తరమంజరి గా వర్ధిల్లుతూ,
స్పెక్ట్రం ఆల్-ఇన్-1 పుస్తకం దాదాపుగా అందరి విద్యార్ధుల చేతుల్లో దర్శనం ఇచ్చే ముఖ్యసాధనం.....
అచ్చం అదే విధంగా సకలదేవతానుగ్రహసముపార్జనకు ఆల్-ఇన్-1 లాంటి సాధనం శ్రీరుద్రాభిషేకం....
శ్రీసరస్వతీ అనుగ్రహం...
శ్రీలక్ష్మీ అనుగ్రహం....
శ్రీగౌరి అనుగ్రహం...
ఏకకాలంలో భక్తులకు లభింపజేసి తరింపజేసే సాధనం శ్రీరుద్రాభిషేకం....
భగవంతుడికి నివేదింపబడిన గుడాన్నం ఎంత మధురంగా ఉంటుందో తెలియాలంటే, ఆ పరమాన్నప్రసాదం స్వీకరించిన వారికి తెలియును...
అట్లే....
ఈశ్వరునకు గావించే శ్రీరుద్రాభిషేకం ఎంత మధురానుగ్రహంగా ఉంటుందో తెలియాలంటే, ఆ రుద్రాభిషేకంలో పాల్గొనే వారికి తెలియును...
అని అనవలసి ఉంటుంది...
కృత్తికా నక్షత్రాధిపతి అగ్నిదేవుడైన కారణంగా,
ఈ కార్తీక మాసం మొత్తం అగ్నిదేవుని అధీనమై ఉండే కారణంగా,
సాక్షాత్తు పరమశివుడికే ప్రణవోపదేశరహస్యాలను బోధించిన
శ్రీసుబ్రహ్మణ్యస్వామి వారికి ప్రతిరూపంగా దేవతారాధనలో కొలువై ఉండే అగ్ని సాక్షాత్తు శ్రీకార్తికేయ స్వరూపమైన కారణంగా,
ఈ కార్తీక మాసంలో నిర్వహింపబడే
శ్రీరుద్రాభిషేకం యొక్క వైభవం ఎనలేనిది అని అనాదిగా మన ఆర్షవిజ్ఞ్యానకోవిదుల ఉవాచ....
శ్రీరుద్రాభిషేకంతో శివలింగం చల్లగా ఉండడం, తన్మూలంగా భక్తుల మనసు మరియు మన చుట్టూ ఉండే ప్రపంచం చల్లగా వర్ధిల్లడంలోని ఆంతర్యం,
"మయస్కరాయచ" అని పరమశివుణ్ణి శ్రీగురుస్వరూపంగా శ్రీరుద్రవైభవం స్తుతించడంలోని ఆంతర్యం...
"శివా విశ్వాః భేషజీ..."
"శివా రుద్రస్య భేషజీ..."
అని శ్రీరుద్రవైభవం శివశక్తిని స్తుతించడంలోని ఆంతర్యం...,
శ్రీచాగంటి సద్గురువుల ప్రవచనాలను ఆలకించిన విజ్ఞ్యులకు ఎరుకలో ఉన్న వైభవమే...
ఈ పరమపావనమైన పుణ్యదాయక కార్తీక మాసంలో,
అట్టి మూర్తీభవించిన శివస్వరూపులైన శ్రీ విధుశేఖరభారతీ జదగ్గురువుల దర్శనానుగ్రహం మరియు అనుగ్రహభాషణం, సనాతనధర్మదీప్తిని, ఆర్షవిజ్ఞ్యానవైభవాన్ని బహుశోభాయమానంగా ధర్మప్రచారసేవగా సమాజానికి అందించే విజ్ఞ్యుల్లో ఒకరైన శ్రీ పసర్లపాటి శ్రీనివాస బంగారయ్య శర్మ గారి దర్శనం, అనుగ్రహాశీస్సులు లభించడం ఈశ్వరానుగ్రహంగా సమకూరిన వైభవం...
రాతిలింగం మొదలుకొని రౌప్యలింగం, హిరణ్యలింగం, వజ్రలింగం, వరకు ఎన్నో ప్రాకృతిక పదార్ధాలతో వర్ధిలే శివలింగాలు ఉన్నా...,
స్వచ్ఛమైన స్ఫటికలింగం యొక్క వైభవమే వేరు....
సప్తవర్ణవినిర్ముక్త సర్వోన్నత సాత్విక సద్వస్తువైన
అట్టి స్ఫటికశివలింగం సాక్షాత్తు పరమశివుడే లోకానికి అనుగ్రహంగా ప్రసాదించగా, అట్టి శ్రీచంద్రమౌళీశ్వర స్ఫటికలింగం యొక్క వైభవమే వేరు....
అగ్రశ్రేణి శృంగేరి పండితవర్యుల ముక్తకంఠాలాపనలో సాగిన
శ్రీరుద్రనమకచమకపఠనం, శ్రీసూక్తపురుషసూక్తదుర్గాసూక్తమంత్రపుష్పాది వేదఘోషను శ్రవణానందకరంగా ఆలకిస్తూ....,
శ్రీవిధుశేఖరభారతీ జగద్గురువులచే, 2025 శ్రీ విశ్వావసు కార్తీక శుద్ధ నవమి ప్రయుక్త భృగువాసర చంద్రోదయ సమయంలో, భక్తులందరి సమక్షంలో నిర్వహింపబడిన అత్యంత అపురూపమైన శ్రీచంద్రమౌళీశ్వరస్ఫటికశివలింగాభిషేకాన్ని దర్శించి తరించిన ఈనాటి మధురఘట్టం ఆజన్మాంతర సుకృతం...!
జన్మజన్మలకు వర్ధిల్లే సౌభాగ్యం.....!!
సర్వం శ్రీఆదిశంకర స్వరూప శ్రీభారతీతీర్థ జగద్గురువరేణ్య
కరకమలసంజాత శ్రీవిధుశేఖరభారతి జగద్గురువరేణ్య ఆరాధిత శ్రీశారదాంబాశ్రీచరణారవిందార్పణమస్తు...
💐🙏🙂
చంద్రచూడాలంకృతచారుహాసచంద్రికాం
సకలసారససుజ్ఞ్యానచంద్రామృతవర్షిణీం
తుంగాతీరశ్రీఋష్యశృంగతపోస్థలవాసినీం
వందేవాణీస్వరూపశ్రీశారదాంసర్వజ్ఞ్యానదాం