Sunday, November 2, 2025

శ్రీఆదిశంకరాచార్య స్థాపిత చతురామ్నాయ పీఠాల్లో గురుస్థానాన్ని వహించే దక్షిణామ్నాయ శ్రీశృంగేరి శారదాంబాపీఠ ఉత్తరాధికారులు, జగద్గురువులు శ్రీశ్రీశ్రీ విధుశేఖరభారతీ స్వామి వారు, వారి విజయయాత్రలో భాగంగా, భాగ్యనగరానికి విచ్చేసిన శుభసమయంలో, మోతి నగర్ శ్రీశంకరమఠంలో వారి దర్శనానుగ్రహంతో, ఆశీస్సులతో,శ్రీఆదిశంకరాచార్యమందిరం మరియు శ్రీశారదాంబామందిరం యొక్క కుంభాభిషేక సందర్శనంతో తరించిన పర్వసమయ విశేషాలు....💐🙂

శ్రీఆదిశంకరాచార్య స్థాపిత చతురామ్నాయ పీఠాల్లో గురుస్థానాన్ని వహించే దక్షిణామ్నాయ శ్రీశృంగేరి శారదాంబాపీఠ ఉత్తరాధికారులు, జగద్గురువులు శ్రీశ్రీశ్రీ విధుశేఖరభారతీ స్వామి వారు, వారి విజయయాత్రలో భాగంగా, భాగ్యనగరానికి విచ్చేసిన శుభసమయంలో, మోతి నగర్ శ్రీశంకరమఠంలో వారి దర్శనానుగ్రహంతో, ఆశీస్సులతో,
శ్రీఆదిశంకరాచార్యమందిరం మరియు శ్రీశారదాంబామందిరం యొక్క కుంభాభిషేక సందర్శనంతో తరించిన పర్వసమయ విశేషాలు....💐🙂

సదాశివసమారంభాం
వ్యాసశంకరమధ్యమాం
అస్మదాచార్యపర్యంతాం
వందేగురుపరంపరాం

సదాశివుడితో ప్రారంభమై, శ్రీవేదవ్యాసులవారు, శ్రీఆదిశంకరాచార్యులవారు, మధ్యలో కొలువై ఉండగా,
వారి అనుగ్రహంగా మా యొక్క ఆచార్యులవరకు పరిఢవిల్లే శ్రీగురుపరంపరకు వందనములు... 
అనే ప్రాజ్ఞ్యుల నిత్య గురుప్రార్థనల్లో వచింపబడినట్టుగా,
మనం మాన్యులైన ఏ శ్రీగురుస్వరూపం యొక్క సన్నిధిలో కొలువై ఉన్నామో, ఆ గురువులను శ్రీశంకరాచార్యులకు ప్రతిరూపంగా భావిస్తూ ఆరాధించడంలోని ఆంతర్యమేమనగా....

అమేయమైన ప్రాచీన దైవిక సంపద అనేది,
(అధ్యాత్మశాస్త్రవిజ్ఞ్యానం మొదలుకొని అరుదైన అధ్యాత్మ ఆరాధనా సంపత్తి వరకు) పరంపరాగతంగా ఈ భారతదేశంలో పరిరక్షింపడుతూ, ప్రజలకు, భక్తులకు, విజ్ఞ్యులకు అభివృద్ధిని అనుగ్రహింపబడుతూ వస్తున్నది....

ఫర్ ఎగ్సాంపుల్, మనం శ్రీవేదవ్యాసమహర్షి వారి శ్రీమద్భాగవతం అనే పౌరాణికవాజ్ఞ్మయ వైభవాన్ని 
శ్రీచాగంటి సద్గురువుల నుండి వారి ప్రవచనాల ద్వారా అందుకొని తరిస్తున్నామంటే...
వారి సన్నిధిలో ఉండే భక్తులెల్లరికీ...,
శ్రీ మల్లంపల్లి అమరేశ్వరప్రసాద్ గారి శిష్యులైన శ్రీచాగంటి గారు శ్రీగురుస్వరూపులై అనుగ్రహిస్తున్నారు అని అర్ధం...

ఫర్ ఎగ్సాంపుల్, 
మనం శ్రీఆదిశంకరాచర్యుల వారే స్వయంగా కైలాసం నుండి భూలోకానికి అనుగ్రహంగా అందించిన 
శ్రీచంద్రమౌళీశ్వరస్ఫటికశివలింగం యొక్క అభిషేక తీర్థాన్ని సేవిస్తూ తరిస్తున్నప్పుడు,
వారి సన్నిధిలో ఉండే భక్తులెల్లరికీ...,
శ్రీభారతీతీర్థస్వామి వారి శిష్యులుగా కొలువైన శ్రీవిధుశేఖరభారతీస్వామి వారు శ్రీగురుస్వరూపులై, జగద్గురువులై అనుగ్రహిస్తున్నారు అని అర్ధం...

నాడు శ్రీఆదిశంకరాచార్యులచే వ్యవస్థీకరింపబడి నేటి వరకు కొనసాగుతున్న శ్రీ దక్షిణామ్నాయ శృంగేరి శారదాంబా పీఠాలంకృత శ్రీగురుపరంపర యొక్క వరుసక్రమం ఈ క్రింది అంతర్జాల పట్టికలో పేర్కొనబడి ఉన్నది...

https://www.sringeri.net/jagadgurus?fbclid=IwdGRjcANxgnljbGNrA3GCcGV4dG4DYWVtAjExAAEe5zab1EijeQqcb67tzO_5tmaNhFCEbi2Zv44w0ZvgpxbcWI5qMf6lY8ATJKU_aem_vHkiSbCtm785ihnAbhM0Cg

శ్రీచాగంటి సద్గురువుల ప్రహృష్ట వచనాల్లో "కలియుగంలో ఆధ్యాత్మికత" అనే అంశం గురించి ఆలకించి క్షుణ్ణమైన అవగాహనను కలిగిఉన్న వారికి తెలిసినట్టుగా...

కృతయుగం : 17280000 సంవత్సరముల నిడివి గల కాలప్రవాహ మేయం
త్రేతాయుగం : 8640000 సంవత్సరముల నిడివి గల కాలప్రవాహ మేయం
ద్వాపరయుగం : 12960000 సంవత్సరముల నిడివి గల కాలప్రవాహ మేయం
కలియుగం : 4320000 సంవత్సరముల నిడివి గల కాలప్రవాహ మేయం

అనే నాలుగు యుగాల్లో విస్తరించి ఉండే మన అధ్యాత్మ విజ్ఞ్యానం అనేది, యుగలక్షణానికి అనుగుణంగా మారుతూ ఉండును....

కృతయుగంలో భక్తి యొక్క ప్రాథమిక 
అస్తిత్వం నిత్య కఠోర తపస్సులో....
త్రేతయుగంలో భక్తి యొక్క ప్రాథమిక 
అస్తిత్వం నిత్య యజ్ఞ్యయాగాది క్రతువుల్లో....
ద్వాపరయుగంలో భక్తి యొక్క ప్రాథమిక అస్తిత్వం నిత్యాగ్నిహోత్ర క్రతువుల్లో....
కలియుగంలో భక్తి యొక్క ప్రాథమిక అస్తిత్వం నిత్య భగవన్నామ స్మరణలో....
అని విజ్ఞ్యుల ఉవాచ...

ప్రభావాది 60 సంవత్సరముల చాంద్రమాన కాలచక్రం 1000 సార్లు పూర్తి అయినచో ఒక యుగం.
అటువంటి 72 యుగాల (72 × 60000 = 4320000) సంవత్సరాల)  నిడివి గల "మహాయుగం" / కాలప్రవాహ మేయం నిత్యం పునరావృతం అవుతూ ఉండును....

అలా ఇప్పటివరకు ఈ మహాయుగ కాలచక్ర ప్రయాణంలో ఎన్నెన్ని కృత, త్రేతా, ద్వాపర, కలి యుగాలు సంభవించాయో ఆ పరమాత్మమకు మాత్రమే ఎరుక ...

ఇప్పుడు మనం ఉన్నది....,
శ్రీ శ్వేతవరాహకల్పంలోని వైవస్వతమన్వంతరంలోని 28వ మహాయుగంలోని కలియుగంలోని 5126 వ సంవత్సరంలో....

తిరుమల, శ్రీశైలం, అరుణాచలం, కాశి, ఇత్యాది పుణ్యక్షేత్రాల్లో కొన్ని కోట్ల సంవత్సరాల క్రితం నాటి పూర్వీకుల తపోస్థలానవాళ్ళు ఉండడానికి గల కారణం ఈ నిరంతర మహాయుగచక్ర భ్రమణం....

ఇట్టి అమేయకాలచక్రంలో ప్రభవించే దేవతల గురించిన వివరాలు, దైవికాంశముల వర్ణనలు, ఆయా కాలంలో సంచరించిన గురుస్వరూపులకు మాత్రమే ఎరుకలో ఉండే అంశాలు.....
అవన్నీ కూడా సమీకరింపబడి, పరిష్కరింపబడి, క్రోడీకరింపబడి, భవిష్యద్ తరాలకు అనుగ్రహంగా అందివ్వబడి లోకం చల్లగా అభివృద్ధి చెందేదుకు కారణం నిర్హేతుకమైన శ్రీగురుకృప....

అట్టి శ్రీగురుకృపగా అందివచ్చే అనుగ్రహం ఆజన్మాంతర సౌభాగ్యమై వర్ధిల్లును....
అందుకే ఆనాడు శ్రీఆదిశంకరాచార్యులు స్థాపించి అధివసించిన శ్రీశంకరపీఠాల్లో ఎందరో మహానుభావులు ఆనాటి శ్రీఆదిశంకరజ్ఞ్యానదీప్తిని వారి అనుగ్రహంగా నేటికీ ఆస్తికసమాజవిజ్ఞ్యులకు అనుగ్రహిస్తూ లోకాన్ని, లోకుల్లో దైవత్వాన్ని, లోకంలో దేవతారాధనను, పరిరక్షిస్తూ పరిఢవిల్లుతున్నారు....

రమారమి 1200 సంవత్సరాల క్రితం వర్ధిల్లిన,

రాజులు, రాజ్యాలు, పరిపాలకసంస్థానాలు, మాన్యాలు, ధనకనకవస్తువాహనాది భౌతిక సిరిసంపదలు, ఇతరత్రా ఏవి కూడా నేటి సమాజానికి అందుబాటులోలేవు....

కాని ఆనాడు శ్రీపార్వతీపరమేశ్వరుల అనుగ్రహంగా శ్రీకాలటిశంకరులకు అనుగ్రహింపబడిన శ్రీ చంద్రమౌళీశ్వరస్ఫటికలింగాభిషేకానుగ్రహం ఇప్పటికీ సమాజానికి లభిస్తూ ఉన్నది...

ఆనాడు శ్రీఆదిశంకరాచార్యులు వ్యవస్థీకరించి అందించిన పంచాయతన ఆరాధనావ్యవస్థ యొక్క అనుగ్రహం ఇప్పటికీ సమాజానికి లభిస్తూ ఉన్నది...

ఆనాడు శ్రీఆదిశంకరాచార్యులు వారి అనిర్వచనీయ తపఃశక్తితో సృజించిన ఉష్ణకుండముల అనుగ్రహం ఇప్పటికీ సమాజానికి లభిస్తూ ఉన్నది...

ఆనాడు శ్రీఆదిశంకరాచార్యులు వారు దర్శించి రచించి అందించిన అసంఖ్యాక దేవిదేవతాశ్లోకసారస్వతానుగ్రహం ఇప్పటికీ సమాజానికి లభిస్తూ ఉన్నది..

శ్రీగురుస్వరూపం సాక్షాత్తు సకలదేవతల సన్నిధిగా ఒప్పారును...
అందుకే దైవం మానుషరూపేన....
దైవం శ్రీగురురూపేన....
అని విజ్ఞ్యులు వచించేది.....

శ్రీతోటకాచార్యులు ఈ క్రిందివిధంగా వారి గురుదేవులను, శ్రీఆదిశంకరాచార్యులను స్తుతించడంలోని ఆంతర్యం శ్రీగురుస్వరూపం యొక్క సర్వేసర్వత్రా పరివ్యాప్తమై పరిఢవిల్లే అంతర్యామిత్వం...

"జగతీమవితుం కలితాకృతయో విచరన్తి మహామహసశ్ఛలతః
అహిమాంశురివాత్ర విభాసి గురో భవ శంకర దేశిక మే శరణం"
తాత్పర్యము :
" ఈ జగత్తును రక్షించుటకు మీవంటి మహాత్ములు వేర్వేరు రూపములలో, మారు వేషములలో తిరుగుచుంటారు. వారిలో మీరు సూర్యదేవులవంటి వారు. ఓ శంకర దేశికా! నాకు శరణు నిమ్ము."

అందుకే...
ఈ కలియుగంలో శ్రీజగద్గురువులెల్లరూ వచించేది..

"మా నారాయణనామస్మరణానుగ్రహాన్ని మీ అందరికీ అందిస్తూ,

సర్వేషాం శాంతిర్భవతు...
సర్వేషాం స్వస్తిర్భవతు...
సర్వేషాం పూర్ణంభవతు...
సర్వేషాం మంగళంభవతు..."

శ్రీవిధుశేఖరభారతి స్వామివారు స్వయంగా నిర్వహించిన శ్రీచంద్రమౌళీశ్వరస్ఫటికలింగాభిషేక వైభవం గురించి ఈశ్వరానుగ్రహంగా కొంత వివేచనగావిద్దాము...

శ్రీచాగంటి సద్గురువుల శ్రీశైలవైభవం, శ్రీఉమామహేశ్వరవైభవం, ఇత్యాది ప్రవచనాలు భక్తిశ్రద్ధలతో ఆలకించిన వారికి గుర్తున్నట్టుగా...
ఈశ్వరాభిషేకంలో పాల్గొని తరించడం ఎంత పుణ్యప్రదమో...,
ఈశ్వరాభిషేకాన్ని దర్శించడం కూడా అంతే పుణ్యప్రదం....

మీలో బి.టెక్ బడ్డీస్ కి స్పెక్ట్రం ఆల్-ఇన్-1 గురించి బాగా తెలిసిన అంశమే...
ఎంజినీరింగ్ ఫైనల్ / ఎక్స్టర్నల్ ఎగ్సాంస్ అనగానే, 
అన్ని సబ్జెక్ట్లకు సంబంధిన ముఖ్యమైన ప్రశ్నోత్తరమంజరి గా వర్ధిల్లుతూ,
స్పెక్ట్రం ఆల్-ఇన్-1 పుస్తకం దాదాపుగా అందరి విద్యార్ధుల చేతుల్లో దర్శనం ఇచ్చే ముఖ్యసాధనం.....

అచ్చం అదే విధంగా సకలదేవతానుగ్రహసముపార్జనకు ఆల్-ఇన్-1 లాంటి సాధనం శ్రీరుద్రాభిషేకం....
శ్రీసరస్వతీ అనుగ్రహం...
శ్రీలక్ష్మీ అనుగ్రహం....
శ్రీగౌరి అనుగ్రహం...
ఏకకాలంలో భక్తులకు లభింపజేసి తరింపజేసే సాధనం శ్రీరుద్రాభిషేకం....

భగవంతుడికి నివేదింపబడిన గుడాన్నం ఎంత మధురంగా ఉంటుందో తెలియాలంటే, ఆ పరమాన్నప్రసాదం స్వీకరించిన వారికి తెలియును...
అట్లే....
ఈశ్వరునకు గావించే శ్రీరుద్రాభిషేకం ఎంత మధురానుగ్రహంగా ఉంటుందో తెలియాలంటే, ఆ రుద్రాభిషేకంలో పాల్గొనే వారికి తెలియును...
అని అనవలసి ఉంటుంది...

కృత్తికా నక్షత్రాధిపతి అగ్నిదేవుడైన కారణంగా,
ఈ కార్తీక మాసం మొత్తం అగ్నిదేవుని అధీనమై ఉండే కారణంగా, 
సాక్షాత్తు పరమశివుడికే ప్రణవోపదేశరహస్యాలను బోధించిన 
శ్రీసుబ్రహ్మణ్యస్వామి వారికి ప్రతిరూపంగా దేవతారాధనలో కొలువై ఉండే అగ్ని సాక్షాత్తు శ్రీకార్తికేయ స్వరూపమైన కారణంగా,
ఈ కార్తీక మాసంలో నిర్వహింపబడే
శ్రీరుద్రాభిషేకం యొక్క వైభవం ఎనలేనిది అని అనాదిగా మన ఆర్షవిజ్ఞ్యానకోవిదుల ఉవాచ....

శ్రీరుద్రాభిషేకంతో శివలింగం చల్లగా ఉండడం, తన్మూలంగా భక్తుల మనసు మరియు మన చుట్టూ ఉండే ప్రపంచం చల్లగా వర్ధిల్లడంలోని ఆంతర్యం,

"మయస్కరాయచ" అని పరమశివుణ్ణి శ్రీగురుస్వరూపంగా శ్రీరుద్రవైభవం స్తుతించడంలోని ఆంతర్యం...

"శివా విశ్వాః భేషజీ..."
"శివా రుద్రస్య భేషజీ..."
అని శ్రీరుద్రవైభవం శివశక్తిని స్తుతించడంలోని ఆంతర్యం...,

శ్రీచాగంటి సద్గురువుల ప్రవచనాలను ఆలకించిన విజ్ఞ్యులకు ఎరుకలో ఉన్న వైభవమే...

ఈ పరమపావనమైన పుణ్యదాయక కార్తీక మాసంలో,
అట్టి మూర్తీభవించిన శివస్వరూపులైన శ్రీ విధుశేఖరభారతీ జదగ్గురువుల దర్శనానుగ్రహం మరియు అనుగ్రహభాషణం, సనాతనధర్మదీప్తిని, ఆర్షవిజ్ఞ్యానవైభవాన్ని బహుశోభాయమానంగా ధర్మప్రచారసేవగా సమాజానికి అందించే విజ్ఞ్యుల్లో ఒకరైన శ్రీ పసర్లపాటి శ్రీనివాస బంగారయ్య శర్మ గారి దర్శనం, అనుగ్రహాశీస్సులు లభించడం ఈశ్వరానుగ్రహంగా సమకూరిన వైభవం...

రాతిలింగం మొదలుకొని రౌప్యలింగం, హిరణ్యలింగం, వజ్రలింగం, వరకు ఎన్నో ప్రాకృతిక పదార్ధాలతో వర్ధిలే శివలింగాలు ఉన్నా...,
స్వచ్ఛమైన స్ఫటికలింగం యొక్క వైభవమే వేరు....
సప్తవర్ణవినిర్ముక్త సర్వోన్నత సాత్విక సద్వస్తువైన
అట్టి స్ఫటికశివలింగం సాక్షాత్తు పరమశివుడే లోకానికి అనుగ్రహంగా ప్రసాదించగా, అట్టి శ్రీచంద్రమౌళీశ్వర స్ఫటికలింగం యొక్క వైభవమే వేరు....

అగ్రశ్రేణి శృంగేరి పండితవర్యుల ముక్తకంఠాలాపనలో సాగిన
శ్రీరుద్రనమకచమకపఠనం, శ్రీసూక్తపురుషసూక్తదుర్గాసూక్తమంత్రపుష్పాది వేదఘోషను శ్రవణానందకరంగా ఆలకిస్తూ....,
శ్రీవిధుశేఖరభారతీ జగద్గురువులచే, 2025 శ్రీ విశ్వావసు కార్తీక శుద్ధ నవమి ప్రయుక్త భృగువాసర చంద్రోదయ సమయంలో, భక్తులందరి సమక్షంలో నిర్వహింపబడిన అత్యంత అపురూపమైన శ్రీచంద్రమౌళీశ్వరస్ఫటికశివలింగాభిషేకాన్ని దర్శించి తరించిన ఈనాటి మధురఘట్టం ఆజన్మాంతర సుకృతం...!
జన్మజన్మలకు వర్ధిల్లే సౌభాగ్యం.....!!

సర్వం శ్రీఆదిశంకర స్వరూప శ్రీభారతీతీర్థ జగద్గురువరేణ్య 
కరకమలసంజాత శ్రీవిధుశేఖరభారతి జగద్గురువరేణ్య ఆరాధిత శ్రీశారదాంబాశ్రీచరణారవిందార్పణమస్తు...
💐🙏🙂

చంద్రచూడాలంకృతచారుహాసచంద్రికాం
సకలసారససుజ్ఞ్యానచంద్రామృతవర్షిణీం
తుంగాతీరశ్రీఋష్యశృంగతపోస్థలవాసినీం
వందేవాణీస్వరూపశ్రీశారదాంసర్వజ్ఞ్యానదాం


శ్రీకరమైన 2025 విశ్వావసు కార్తీకమాస పర్వసమయ శుభాభినందనలు...🙂💐


కార్తీకమాసేకృతంపుణ్యం సహస్రగంగాస్నానఫలదం
కార్తీకదామోదరప్రీతికరం కార్తీకత్రయంబకతోషకరం

అని ఆర్యోక్తి....

అనగా..

కార్తీక మాసంలో గావించే పుణ్యం....
సహస్ర (అనంతం అని అర్ధం) గంగాస్నాన ఫలితాన్ని ఒనరించునని అర్ధం...
కార్తీకమాస పుణ్యకార్యం ఒనరించే పుణ్యఫలం
కార్తీక దామోదరునకు ప్రీతికరం మరియు కార్తీక త్రయంబకునకు ఆనందకరం.....
అని వాక్యార్ధం....

ఈ లోకంలోని ప్రతీ విజ్ఞ్యులకు కూడా ఏదో ఒక సద్గుణం, ఏదో ఒక విభూతి, ఏదో ఒక ప్రత్యేకత, ఏదో ఒక వ్యాపకం, ఏదో ఒక కళానైపుణ్యం, ఉండడం ఈశ్వరానుగ్రహం....

అట్టి ఈశ్వరప్రసాదిత
సద్గుణం, విభూతి, ప్రత్యేకత, వ్యాపకం, కళానైపుణ్యం,
ఈశ్వరసేవలో వినియోగింపబడి విశేషమైన పుణ్యార్జనతో తరించగలగడం కూడా ఈశ్వరానుగ్రహమే...

శ్రీ చాగంటి సద్గురువుల వంటి అగ్రశ్రేణిపుణ్యాత్ములచే, వాగధీశ్వరి గా వారి రసనపై ఆ పరేశ్వరి నిలిచి ప్రవచింపజేసిన 
అనంతమైన పౌరాణికవాజ్ఞ్మయార్ణవలహరుల్లో విహరిస్తూ
గంగాస్నానపుణ్యదాయకమైన వారి సద్వాక్కులను భక్తిశ్రద్ధలతో ఆలకించిన విజ్ఞ్యులకు తెలిసినట్టుగా.....,

"కురుపుణ్యం అహోరాత్రం....." అని శాస్త్ర ఉవాచ....

ఎందుకంటే, సంచితం నుండి మోసుకొచ్చిన ప్రారబ్ధంలోని పాపపుణ్యాల సమ్మిళిత సమాహారంగా ఎల్లరి జీవితం నిత్య సూర్యోదయసూర్యాస్తమయాలతో పాటుగా గడిచిపోతూ ఉన్నది....

ఇట్టి చిరంతన జీవితకాలప్రవాహంలో పాపం అనేది మనకు తెలియని కారణంగా, మన వశంలో మనం లేని  
కారణంగా, మన రజోగుణ ఉద్ధతి / విస్ఫోటనం
కారణంగా, పోగౌతూ ఉండును....
పుణ్యం మాత్రం మన ప్రయత్నపూర్వక సత్త్వగుణ సాంద్రత / నడవడి కారణంగా, పరిశ్రమతో మాత్రమే 
సమకూరును.....

ఫర్ ఎగ్సాంపుల్ మీరు గమనించండి....

ఒకరేమో....
"అసలే కార్తీక మాసం...అలా ఆలయానికి వెళ్ళి.... లేక ఇంట్లో తులసి మొక్క సన్నిధిలో అయినా దీపారాధన గావించి....,దేవుడా మంచి ఆరోగ్యాన్ని, విద్యాబుద్ధులను, ఐశ్వర్యాన్ని, శ్రేయస్కర సంపత్తును, నిరంతర భగవద్భక్తిని, జీవితకార్యాచరణబాటలో విజయాన్ని అనుగ్రహించు స్వామి....."
అని ప్రార్ధించి పుణ్యాన్ని గడించి తరిస్తున్నారు.....

మరొకరేమో...
"ఊరవరాహంలా తిని ఊరిమీదపడితిరగడానికి ఏమాసం అయితే ఏముందిలే..." అని అనుకుంటూ..
అలా రోడ్డుమీదకి వెళ్ళి.... 
ఏదో ఒక చెత్తను కొనుక్కొని నమిలి ఊసి
రోడ్లను ఎరుపెక్కించి...హమ్మో అప్పుడే మధ్యాహ్నమయ్యిందా అని బాగా తిని కాసేపు నిద్రించి....లేచి...హమ్మో అప్పుడే సాయంత్రమయ్యిందా.....అని మళ్ళీ రోడ్లెక్కి అదే పనిగా రొడ్లకు రంగును, వారి కర్మసంచితానికి పాపాన్ని రంగరిస్తూ, రాత్రి అవ్వగానే మళ్ళీ బాగా తిని కనీసం ఒక్కసారైనా శివనామస్మరణ అయినా చేయకుండా
నిద్రించడం.....
తెలవారగానే.....హుం మళ్ళీ తెల్లారిందా...అని అనుకుంటూ కనీసం ఒక్కసారైనా శ్రీహరి అని కూడా స్మరించకుండా మేల్కొని.....
జీవితం షరామామూలే కదా అని అనుకుంటూ రోడ్లమీద తిరుగుతూ...
తెల్లారిపోతున్న వారి బ్రతుకుబండి దౌర్బల్యానికి వారి చుట్టూ ఉండే వారిపై అనవసరంగా కసురుతూ, మరో పూట, మరో రోజు, మరో వారం, మరో నెల, మరో సంవత్సరం, అని అనుకుంటూ ఏ పుణ్యకార్యమూ చేయకుండా పతనమై పోతుంటారు...

ఈ రెండురకాల వ్యక్తిత్వాలకు భేదం ఎక్కడో తెలుసా....?

వారివారి మనసుకి పట్టిన జాఢ్యం అనేది
క్రమక్రమంగా వారి జీవితానికి పట్టిన అలక్ష్మి గా రూపాంతరం చెంది, ఈశ్వరస్మరణ పట్ల విస్మరణ, విహితకర్తవ్యం పట్ల నిర్లక్ష్యం, పుణ్యకర్మాచరణ పట్ల అలసత్వం...
వెరసి వారి జీవితం ఒక నూతిలో జన్మించి, నూతిలోనే బ్రతికి, నూతిలోనే తెల్లారిపోయే మండూక (కప్ప) జన్మలా వారి జీవితం వారికి వచ్చే జన్మలో ఊరికే బెకబెక అరిచే కప్ప లా జన్మించేందుకు కావలసిన కర్మను కూడబెడుతున్నది అని అర్ధం......

ఎట్టి వస్తువులనైనా సమూలంగా దహించివేసే శక్తి అగ్నిది....
ఎట్టి జాఢ్యాన్నైనా, పాపాన్నైనా సమూలంగా దహించివేసే శక్తి అగ్ని అధిదేవతగా ఉండే కార్తీక మాసానిది...
(కృత్తికా నక్షత్రానికి అధిపతి అగ్ని...కాబట్టి కార్తీకమాసం మొత్తం అగ్నిదేవుడి అధీనమై వర్ధిల్లే పరమపావనసమయం...)

అందుకే మీరు గమనించి ఉండి ఉంటే...
"ఏంటి...మొత్తం కార్తీక మాసంలో ఒక్కసారైనా దీపం వెలిగించలేదా..... ఓరినీ బత్కు***.."
అనే నిష్టూర వాక్యాలు పాతకాలం నాటి పెద్దలు అనే వారు.....
అంటే కార్తీక మాసంలో దీపారాధనకు ఎంత ప్రాధాన్యమో అనేది మన పాత తరం పెద్దలు అలా ఏవో క్యాజువల్ మాటల్లో కూడా చెప్పారన్నమాట....

బాహ్యంలో రాత్రులు అత్యంత చీకటితో ఉండే మాసం కార్తీక మాసం.....
గాలిలో చలి తీవ్రత పెరగడంతో, శరీరాంతర్గత నాడివ్యవస్థ ఇబ్బందులు పడే మాసం ఈ కార్తీక మాసం....

దీపారాధన సాధారణంగా నువ్వులనూనే, లేక ఆవునెయ్యి తో గావిస్తారు.....
తిలల (నువ్వులు) నుండి సంగ్రహమైన తైలం (నువ్వులనూనే),
గంగిగోవు క్షీరము తప్తమవ్వగా లభించే నవనీతం / దధిమథనం నుండి సంగ్రహింపబడిన నవనీతం, తప్తమవ్వగా లభించే స్వచ్ఛమైన శుభ్రమైన గోఘృతం (ఆవునెయ్యి)..,
అధ్యాత్మపరంగా దీపారాధనకు శ్రేష్ఠమైన ఇంధనం అని శాస్త్ర ఉవాచ....

నువ్వులనూనేతో మసాజ్ చేసుకునేవారికి దేహదారుఢ్యం,
ఆవునెయ్యితో భోజనం ఆభిగారం చేసుకొనే వారికి మేధోదారుఢ్యం,
చాలా విశేషంగా ఉండునని ఆయుర్వేదశాస్త్ర ఉవాచ....
అందుకే విజయనగరమహాసామ్రాజ్య వైభవానికి మకుటాయమానమైన కీర్తితో వర్ధిల్లిన ప్రజారంజకపరిపాలకులు,
శ్రీకృష్ణదేవరాయలవారికి బుద్ధిబలం మరియు కండబలం అమితంగా ఉండేవని ఆనాటి పెద్దల మాట....

ఆయుర్వృద్ధిని అనుగ్రహించే ఆయుర్వేదశాస్త్ర వైభవాన్ని నమ్మినవారు మరియు శ్రీహరి దాసులు ఏ పురాణాల్లో ఎంత వెదికినా చెడరెన్నడును.....

నువ్వులనూనెలో ఉండే ఆరోగ్యకరమైన లిగ్నన్స్ మరియు టొకొఫెరాల్స్ అనే ధాతువులు దీపారాధన ద్వారా డైరెక్ట్ గా ఆ ఆరాధకుడి నాడివ్యవస్థ పై ప్రసరించి సద్యోఆరోగ్యకారకశక్తిని కలిగించును....అని ఆయుర్వేదశాస్త్ర ఉవాచ...

నువ్వుల నూనే గురించి గూగుల్ చేసి ఈ క్రింది సమాచారాన్ని ఎవ్వరైనా చదవచ్చు...

***********************************************

Lignans: A group of compounds that includes SESAMIN, SESAMOLIN, AND SESAMOL.
Tocopherols: A form of Vitamin E, with gamma-tocopherol being the most abundant.

Sesamin, sesamolin, and sesamol benefit heart health by reducing cholesterol and blood pressure, and by combating inflammation and oxidative stress, which are major factors in cardiovascular disease. These compounds can help regulate lipid metabolism, prevent the buildup of arterial plaque, and improve overall heart function. 

***********************************************

శరీరానికి కాల్షియం ని గ్రాహ్య పరిచి దృఢత్వాన్ని ప్రసాదించే శక్తి నువ్వులనూనేతో కావించే దీపారాధనకు ఉన్నది అని సైన్స్ కూడా నిర్ధారించింది....

ఏ సైడ్ ఎఫ్ఫెక్ట్స్ లేకుండా శరీరాంతర్గత జవసత్త్వాలను మెరుగుపరిచే శక్తి, వేయించిన నువ్వులు మరియు బెల్లం కలిపి తయారు చేసే లడ్లకు ఉన్నదనే సత్యం ఎల్లరికీ తెలిసిందే...
(మితంగా మాత్రమే స్వీకరించవలెను సుమా..లేనిచో అతిఉష్ణత్వం కలుగును)

కార్తీక త్రయంబక దేవతాభ్యో నమః, కార్తీక దామోదర దేవతాభ్యో నమః, అని ప్రత్యేకంగా శివకేశవ నామాలను ఈ కార్తీకమాసంలో ఆరాధించడంలో గల ఆంతర్యమేమి అని తెలుసుకోవాలంటే....,

అసలు దామోదరుడు అనే గౌణానికి అర్ధం ఏంటి...?
త్రయంబకుడు అనే గౌణానికి అర్ధం ఏంటి...?

అనే అధ్యాత్మవిజ్ఞ్యానాంశాలను శ్రీచాగంటి సద్గురువుల శ్రీమద్భాగవతాంతర్గత శ్రీకృష్ణలీలామృత ప్రవచనాల్లో
దామోదరలీల / ఉలూకలబంధనం....,
శ్రీఉమామహేశ్వరవైభవం ప్రవచనాల్లో 'త్రయంబకాయ', 'త్రయంబకేదేవి' అనే అధ్యాత్మ అంశాలను శ్రద్ధగా ఆలకించిన వారికి విదితమౌను...

వందే శంభుముమాపతిం సురగురుం వందే జగత్కారణం
వందే పన్నగ భూషణం మృగధరం వందే పశూనాం పతిమ్,
వందే సూర్య శశాంక వహ్నినయనం వందే ముకుంద ప్రియం
వందే భక్త జనాశ్రయం చ వరదం వందే శివం శంకరమ్. ...

"వందే సూర్య శశాంక వహ్నినయనం వందే ముకుంద ప్రియం"
అనగా
సూర్యుడు, చంద్రుడు, అగ్ని అనే మువ్వురు దేవతా తత్త్వాలు 3 నేత్రాలుగా గల ఓ ముక్కంటి, ఓ ముకుంద ప్రియా నీకు వందనం...

శ్రీమహావిష్ణుస్వరూపంగా ఆరాధింపబడే ఉశిరిచెట్టు అమేయమైన మహిమోపేతవైభవంతో అలరారే ఔషధీఅమృత ఫలాలైన ఉశిరికాయలను అనుగ్రహించడం ప్రారంభమయ్యే మాసం కూడా కార్తీకమాసమే....

కమ్మని చింతపండురసం / పచ్చిపులుసు లో 
జిలకర, ఆవాలు, ఎండుమిరప, కలగలిపి ఘుమఘుమలాడే పోపుపెట్టడం ఎట్లాగో....,
ఈ కార్తీక మాస ఆరాధనల్లో,

ధాత్రీదేవి నమస్తుభ్యం సర్వపాపక్షయంకరి 
పుత్రాందేహి మహాప్రాజ్ఞ్యే యశోదేహి బలంచమే
మేధాంప్రజ్ఞ్యాంచసౌభాగ్యం విష్ణుభక్తించ శాశ్వతీం
నిర్రోగం కురుమామ్నిత్యం నిష్పాపం కురు సర్వదా

అనే శ్లోకంతో ఉసిరిచెట్టుకి ప్రార్ధనా నమస్కారం గావించడం..
మరియు

కీటాః పతంగాః మశకాశ్చ వృక్షాః,
జలే స్థలే యే నివసంతి జీవాః |
దృష్ట్వా ప్రదీపం నచ జన్మ భాగినః,
భవన్తి త్వం శ్వపచాహి విప్రాః || 

అనే శ్లోకంతో కార్తీక దీపానికి ప్రార్ధనా నమస్కారం గావించడం

కూడా అట్లే అమోఘమైన ఫలితాలను ఒనరించును అని సద్గురువాక్కులను ఆలకించిన విజ్ఞ్యులకు ఎరుకే కదా..

ఇక కార్తీకమాసంలో నదీతీర్థస్నానం కూడా గొప్ప పుణ్యాన్ని అనుగ్రహించే క్రతువు....
ఎందుకంటే......

"హే అగ్ని దేవా...
నీవు సర్వకాలసర్వావస్థల్లోనూ పరమపవిత్రుడవై వర్ధిల్లెదవు...
నీలో తప్తమవ్వని తత్త్వముండజాలదు....
దేవతలకు స్వాహాకారంతో ,
పితృదేవతలకు స్వధాకారంతో,
నీద్వారా సమర్పింపబడే హవ్యకవ్యములు ఈ లోకానికి నిత్యశ్రేయస్సును ఒనరిస్తూ ఉండును....
నిత్యం అగ్ని ఆరాధన గావించే విజ్ఞ్యులు పరమపవిత్రమైన అగ్నిహోత్రులుగా వర్ధిల్లెదరు.....
వారి రసనపై వాగ్దేవతలు కొలువై ఉందురు....అస్తు....."
అని అగ్నిదేవునకు పరమశివుడు వరాన్ని ప్రసాదించారు...

మరియు....

"హే క్షీరసాగరోద్భవ చంద్రదేవ...
మా శిరోభూషణంగా మిమ్మల్ని / మీ యొక్క శుక్లపక్ష తృతీయ చంద్రరేఖను అలంకరించుకొని మేము చంద్రశేఖరుడిగా,
చంద్రమౌళీశ్వరుడిగా వర్ధిల్లెదము....
శుద్ధ ప్రతిపత్ మొదలు శుద్ధ చతుర్దశి పర్యంతం ప్రవర్ధమానమౌతూ పౌర్ణమి నాడు షోడశకళలతో వర్ధిల్లే మిమ్మల్ని ఆరాధించినవారికి, శ్రీచక్రనవావరణదేవతానుగ్రహం లభించి తరించెదరు....
పౌర్ణమిచంద్రుణ్ణి పార్వతీపరమేశ్వరుల సమ్మిళిత పరిపూర్ణశోడషకళాత్మక స్వరూపంగా ఆరాధించే విజ్ఞ్యులకు సకల సిద్ధౌషధీతత్త్వము అనుగ్రహింపబడును....
యజ్ఞ్యవేదిలో సమర్పింపబడే సోమరసం యొక్క అనుగ్రహఫలమే అట్టి భక్తుల కరకమలకృత అగ్నిక్రతువు
యొక్క అనుగ్రహఫలంగా ఒప్పారును...అస్తు...."

అని చంద్రదేవునకు పరమశివుడు వరాన్ని ప్రసాదించారు...

పౌర్ణమి తిథికి అధిపతి చంద్రుడు షోడశకళాప్రపూర్ణుడిగా అలరారుతూ,
కార్తీక పౌర్ణమి కి కారకమై ఉండే కృత్తికా నక్షత్రాధిదేవతగా అగ్నిదేవుడు అలరారుతూ,
ఉండే కార్తీక పౌర్ణమి తిధి నాడు పరమేశ్వర జటాజూటంలో బంధింపబడిన గంగాదేవికి ఎంతటి మాహాత్మ్యం అమరునో కదా....!

ఈ భరతభూమిపై ప్రవహించే అన్ని నదులకూ కూడా గంగ యొక్క శక్తి అంతర్వాహినియై లభ్యమౌతూ ఉన్న కారణంగా, కార్తీక మాసంలో నదీ తీర్థ స్నానం గొప్ప పుణ్యఫలదాయక
అధ్యాత్మకృతువుగా భాసిల్లుచున్నది.....

చంద్రసహోదరిగా శ్రీమహలక్ష్మి
గంగాజనకుడిగా శ్రీమహవిష్ణువు
గంగాధరుడిగా, సోమేశ్వరుడిగా
శ్రీకంఠుడు, చంద్రమౌళీశ్వరుడు
ఆరాధింపబడుచున్న కారణంగా 
హరిహరప్రీతికరమైన ఈ కార్తీకమాసమాహాత్మ్యం అమరులుకొనియాడే అమేయపుణ్యార్ణవం....

కలియుగ ప్రత్యక్ష పరమాత్మ,
శ్రీమదలర్మేల్మంగాపద్మావతీ సమేత శ్రీవేంకటేశ్వర స్వామి వారి అనుగ్రహంతో,
వారివారి భక్తిశక్తియుక్తికొలది, భక్తులెల్లరూ ఈ పరమపావనమైన కార్తీక మాసంలో విశేషమైన భగవదారాధనతో, 
విశిష్ఠమైన పుణ్యసంచయంతో, తరించెదరని ఆకాంక్షిస్తూ,
కార్తీక మాస మొదటి సోమవార పర్వసమయ శుభాభినందనలు...💐🙂

తామ్రోదరద్యుతి పరాజిత పద్మరాగౌ
బాహ్యైర్ మహోభి రభూత మహేంద్ర నీలౌ !
ఉద్యాన్నఖాంశుభి రుదస్త శశాంక భాసౌ
శ్రీ వేంకటేశ చరణౌ శరణం ప్రపద్యే !!

సర్వం వేములవాడ శ్రీరాజరాజేశ్వరీ సమేత శ్రీరాజరాజేశ్వర సన్నిధి స్థిత శ్రీభూసమేత శ్రీవేంకటేశ్వరస్వామి శ్రీచరణారవిందార్పణమస్తు...💐🙂🙏