Friday, November 7, 2025

శ్రీ విశ్వావసు 2025 కార్తీక శుద్ధ ఏకాదశి, ద్వాదశి / దేవోత్థాన ఏకాదశి, చిలుకు / క్షీరాబ్ధి / కైశిక ద్వాదశి పర్వసమయ శుభాభినందనలు...💐🙂


108 శ్రీవైష్ణవక్షేత్రాల్లో పుష్పమండపం గా విశేషమైన ఖ్యాతిని, మహిమ్నతను, వైభవాన్ని, గడించిన తిరుమల / శ్రీవేంకటాచల పుణ్యక్షేత్రంలో, ఇవ్వాళ్టి శ్రీకార్తీకశుద్ధద్వాదశి / శ్రీకైశికద్వాదశి నాడు, ఉదయభానుడి మయూఖస్పర్శ భూలోకానికి సోకని ఉషోదయపూర్వసంధ్యలో, సంవత్సరంలో ఒక్కరోజు మాత్రమే తిరువీధి ఉత్సవంలో (తిరుమల పంచబేర తిరువారాధనా సంప్రదాయ పరిభాషలో స్నపనబేరం గా ఆరాధనలు అందుకునే) శ్రీభూసమేతశ్రీఉగ్రశ్రీనివాస పరమాత్మ,
భక్తులకు ప్రసన్నుడై ఊరెరిగింపులో విహరించెదరు అని తిరుమల ఆలయాచారం తెలిసిన విజ్ఞ్యులకు విదితమే....

అమృతంకోసం దేవదానవులు వాసుకి యొక్క వాలమును, శిరస్సును అల్లెత్రాడుగా గావించి పట్టుకొని, మేరుగిరి పర్వతాన్ని కవ్వంగా గావించి సాగించిన క్షీరసాగరమథనంలో ఉద్భవించిన

0. హాలాహలం : శ్రీమహావిష్ణువు యొక్క ప్రార్ధనమేరకు పరమేశ్వరుడు స్వీకరించి నీలకంఠుడైనాడు.

ఆ తదుపరి దేవతల ప్రార్ధన మేరకు మహాకూర్మమై క్షీరసాగరానికి అడుగున కొలువై మేరుపర్వతం అనే కవ్వానికి స్థిరమైన ఆలంబనగా శ్రీమహాకూర్మావతారాన్ని దాల్చిన శ్రీమహావిష్ణువు యొక్క అనుగ్రహంగా ఆవిర్భవించిన అనేక దైవిక వస్తువుల్లో....

1.కల్పవృక్షము : స్వర్గ లోక వాసులకు
2.కామధేనువు : బ్రహ్మగారిచే మహర్షులకు / వశిష్ఠ మహర్షివారికి
3.ఉఛ్చైశ్రవము : దేవేంద్రునకు
4.ఐరావతము : దేవేంద్రునకు
5.చంద్రుడు : పరమేశ్వరునకు
6.శ్రీలక్ష్మీదేవి : శ్రీమన్నారాయణుడికి
7.శ్రీధన్వంతరి భగవానుడు తెచ్చిన అమృతం మోహిని ద్వారా సురలకు..
చెంది వారెల్లరూ అనుగ్రహింపబడిరి...
అని పురాణవచనం....

క్షీరసాగరతనయగా శ్రీమహాలక్ష్మి ప్రభవించి ఆసమయంలో అక్కడున్న దేవదానవులందరినీ పరికించి, శంఖచక్రధారిగా మందస్మితుడై ఉన్న దేవతాసార్వభౌముడైన శ్రీమహావిష్ణువును వరించెను...
అక్కడున్న దేవతలందరూ కూడా క్షీరాబ్ధికన్యకను కడు రమ్యమైన స్తోత్రముతో (ఈ క్రింది సర్వదేవకృత శ్రీలక్ష్మీస్తోత్రం) స్తుతించి అనుగ్రహింపబడినారు....
https://vignanam.org/telugu/sarvadeva-kruta-sri-lakshmi-stotram.html
అనే ఇతిహాసా వృత్తాంతాన్ని శ్రీచాగంటి సద్గురువుల సంపూర్ణ శ్రీమద్భాగవత ప్రవచనాలు ఆలకించిన విజ్ఞులకు విదితమే.....

ఎంతో విశేషమైన శ్రీలక్ష్మీఅనుగ్రహాన్ని వర్షించే ఈ శ్రీమద్భాగవతాఖ్యానంలో ఉన్న దేవతాతత్వాన్ని కొంత ఆలకిద్దాం...

హరిని ఆహ్వానించని ప్రయాస మొత్తం లోకకంటకమైన హాలాహలాన్ని తెచ్చిపెట్టింది...
హరి వచ్చి కొలువైన తదుపరి కొనసాగిన ప్రయాస అమృతంతో పాటుగా ఇతర మహిమాన్వితమైన సామాగ్రిని కూడా సమకూర్చిపెట్టింది....
అనగా, విష్ణు స్మరణ లేని జీవితంలో ఎంత ప్రయాస గావించినా పెద్దగా ఫలితం ఉండదు....
విష్ణు స్మరణతో సాగే జీవితంలో గావించే ప్రయాస, ఆపేక్షిత ఫలం తో పాటుగా ఇతర ఎన్నో మహిమాన్వితానుగ్రహాలను కూడా ప్రసాదించును....

హరిని ఆలంబనగా గావించి సాగించిన జీవిత ప్రయాసలో ప్రభవించే సర్వోన్నతమైన అనుగ్రహం ఎల్లప్పుడూ ఆ హరిని, అనగా హరిభక్తులను వరించును...

ఎందుకంటే హరిభక్తులున్న చోటే హరి కూడా ఉండేది...

నాహంవసామివైకుంఠే
నయోగిహృదయేరవౌ
యత్రమద్భక్తాఃమమగాయంతి
తత్రస్తిష్ఠ్యామ్యహం నారదా

అని కదా శ్రీహరి నారదమహర్షి వారికి సెలవిచ్చింది....

క్షీరసాగరతనయగా శ్రీమహాలక్ష్మి ప్రభవించి ఆసమయంలో అక్కడున్న దేవదానవులందరినీ పరికించి, శంఖచక్రధారిగా మందస్మితుడై ఉన్న దేవతాసార్వభౌముడైన శ్రీమహావిష్ణువును వరించెను...
అనగా
హరిభక్తిని ఆలంబనగా గావించి సాగే మన జీవితప్రయాసలో ప్రభవించే అనుగ్రహాలు ఇతరులు తీసుకున్నా,
కార్యసాఫల్యలక్ష్మి / సిద్ధలక్ష్మి మాత్రం హరిభక్తులనే వరించును....

ఎందుకంటే, శ్రీచాగంటి సద్గురువుల వివరణ మొత్తం విన్నవారికి తెలిసినట్టుగా...,
దేవదానవులు ఎంతో కష్టపడి సాధించుకున్న అమృతకలశం దేవేంద్రుడు తీసుకెళ్ళి స్వర్గలోకంలో అగ్నిదుర్గాన్ని సృజించి
(ఒక అడ్వాన్స్డ్ లేసర్ ప్రొటెక్టెడ్ సెక్యూరిటి సిస్టం అనుకోండి...
అటువంటి సెక్యూరిటి సిస్టం మధ్యలో కొలువైన ఒక డైమండ్ ని ధూం మూవి లో హీరో హ్రిత్తీక్ రోషన్ తస్కరించడం చాల మందికి గుర్తుండే ఉంటుంది కద...)
అందులో మధ్యలో కొలువుతీర్చినా కూడా, గరుత్మంతులవారు వారి మాతృదాస్యవిముక్తికై కద్రువ కు ఆ అమృతకలశం ఇవ్వడానికి స్వర్గానికి చేరుకొని ఆ అగ్నిదుర్గాన్ని భేదించి,
దేవేంద్రుడి గర్వానికి సమాధానంగా, తన బంగారు ఈకను ఒకటి అక్కడ విదిల్చిన సంఘటన విదితమే....

ఆ సంఘటనతో అచ్చెరువొందిన, దేవేంద్రుడు, దేవతల శ్రేయస్సుకై, తద్వారా లోకాల శ్రేయస్సుకై, అమృతాన్ని అన్యులకు ఇవ్వడం శ్రేయస్కరం కాదు అని గరుత్మంతులవారిని ప్రార్ధించగా....,
శ్రీహరిని స్మరించి అనుమతిని తీసుకున్న గరుత్మంతులవారు ఇట్లు నుడివినారు....

"నా మాతృదాస్యవిముక్తికై స్వర్గలోకంలోని ఈ అమృతకుంభాన్ని నేను తీసుకొని వెళ్ళడం తథ్యం....
కాని, దేవకార్యనిమిత్తమై మీరు ప్రార్ధిస్తున్నారు కాబట్టి, నేను అలా ఈ అమృతకలశాన్ని కదృవకు ఇచ్చినట్టే ఇచ్చి, నా మాతృదాస్యాన్ని విముక్తిగావించిన మరుక్షణం మీరు
ఈ అమృతకలాశాన్ని సద్యోక్షణంలో గైకొని స్వర్గలోకానికి కొనిపోవుడి....అవ్విధముగా మన ఇరువురి సంకల్పాలు కూడా నెరవేరును...." అనే పరస్పర అంగీకార సమ్మతితో దివిజలోకంలోని అమృతకలశం / అమృతభాండం / అమృతకుంభం గరుత్మంతులవారు భువికి తీసుకొచ్చే సందర్భంలో ఆ గరుడవేగానికి తొటృపాటులో ఓ నాలుగు చుక్కలు రాలిన ప్రదేశాల్లో ఇప్పటికీ అమృతోత్సవాలుగా కుంభమేళా ఉత్సవాలు నిర్వహింపబడడం విజ్ఞ్యులకు విదితమే...

దేవేంద్రుడిచే మరలా స్వర్గలోకానికి తీసుకురాబడిన ఆ అమృతకుంభం కోసం దేవదానవులు కొట్లాడుకుంటూ ఉండగా, మరలా శ్రీహరి కల్పించుకొని లోకోత్తరమైనసౌందర్యంతో అందరినీ మోహింపజేసి, ఆ అమృతకలశాన్ని గైకొని గజగమనంతో ముందుకుసాగుతూ, కుడివైపు వరుసలో కూర్చున్న దేవతలకు అమృతాన్ని పోస్తూ, ఎడమవైపు వరుసలో కూర్చున్న దానవులకు అమృతంలా కనిపించే పానకం పోస్తూ ఉన్న సందర్భంలో, శ్రీహరియొక్క ఈ లీలను గమనించి దానవులవరుసలో నుండి మెల్లగా దేవతల వరుసలోకి స్వర్భాను అనే దానవుడు వచ్చి కూర్చోగా,
కామరూపాన్ని ధరించి మా ప్రక్కన వచ్చి కూర్చున్న ఈ దానవుడికి అమృతం పోయకు మోహినీ అని సైగలు చేసిన సూర్యచంద్రులను కోపంతో ఇప్పటికీ రాహుగ్రస్త, కేతుగ్రస్త సూర్యచంద్రగ్రహణాల రూపంలో అప్పుడప్పుడూ వారి క్రోధాన్ని రాహుకేతువులుగా, ఛాయాగ్రహలుగా రూపాంతరం చెందిన ఆ స్వర్భానుడు ప్రదర్శిస్తూనే ఉన్నాడు....
అమృతం తాగిన కారణంగా, శ్రీహరి సుదర్షనచక్రస్పర్శ కారణంగా, రాహుకేతువులు నవగ్రహాల్లో భాగమై విశ్వపరిపాలనలో వారికి నిర్దేశింపబడిన విహితకర్తవ్యాన్ని నిర్వహిస్తున్నారు...

చూడండి ఒక దానవుడి దేహభాగలైనా కూడా శ్రీహరి అనుగ్రహం కారణంగా......

జ్యోతిషశాస్త్రానుసారంగా....

[
ఓం త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ....
గా నుతింపబడే రుద్రుడి నక్షత్రమైన ఆర్ద్ర...,

ఉగ్రంవీరం మహావిష్ణుం 
జ్వలంతం సర్వతోముఖం
నృసిమ్హంభీషణంభద్రం
మృత్యోర్మృత్యం నమామ్యహం
గా నుతింపబడే నారసిమ్హుడి నక్షత్రమైన స్వాతి..,

శతభిష : నక్షత్రాలకు అధిదేవతగా రాహువు..
]

[
శ్రీవాణీం హంసారూఢ వీణాపాణీం
సకలసారస్వతానుగ్రహసిద్ధిదాయినీం

గా స్తుతింపబడే శ్రీసరస్వతీదేవి నక్షత్రమైన మూలా,

అశ్విని, మఖ : నక్షత్రాలకు అధిదేవతగా కేతువు
]

కొలువై చతుర్దశభువనాలనూ ప్రభావింపజేయగల వైశ్వికమూర్తులుగా రాహుకేతువులు పేర్గాంచినారు....

శ్రీచాగంటి సద్గురువుల ఉవాచలో విన్నట్టుగా, నవగ్రహాలకు ఈశ్వరత్వం లేదు....ఈశ్వరుడు విహించే కర్తవ్యాన్ని పాటించడం వరకు మాత్రమే ఆయా నవగ్రహాల ప్రభావ పరిధి....

ఫర్ ఎగ్సాంపుల్,
"హే రాహు..... నా సదరు భక్తుడు నన్ను ఆరాధిస్తున్న కారణంగా,..వారికి నీయొక్క ఖగోళగ్రహరూప సంచారప్రభావం
కారణంగా కలిగే వారం పాటు జ్వరం, ఒక్కరోజు మాత్రమే ఉండుగాక..." అని ఈశ్వరుడు శాసిస్తే అది అట్లే అగును....

అట్టి దేవతాసార్వభౌముడైన శ్రీహరికి ఎంతో ప్రీతిపాత్రమైన కార్తీక శుద్ధ ఏకాదశి, ద్వాదశి, దేవోత్థాన ఏకాదశి, చిలుకు / క్షీరాబ్ధి / కైశిక ద్వాదశి పర్వసమయాల్లో గావించే జప,తప,దాన,ఆరాధనలు, మిక్కుటమైన పుణ్యాన్ని ప్రసాదించును అని ఆర్షవిజ్ఞ్యాన విజ్ఞ్యుల ఉవాచ....

సర్వే సుజనాః సుఖినోభవంతు...💐

"విష్ణోః పదే పరమ" ఇత్యుదిత ప్రశంసౌ
యౌ "మధ్వ ఉత్స" ఇతి భోగ్య తయాఽప్యుపాత్తౌ ।
భూయస్తథేతి తవ పాణితల ప్రదిష్టౌ
శ్రీవేంకటేశ చరణౌ శరణం ప్రపద్యే ॥ 10 ॥


No comments:

Post a Comment