Friday, July 29, 2022

My humble Namaskaaram to, PadmaBhooshan, Shree K S Chithra gaaru,and wishing her many more years of successful singing spree with many more birthday celebrations ahead....🙏😊🍨💐🍧🍦🍕🎇

ChitraChechi by the cine industry) 60th birthday celebration is certainly a great festive occasion for the entire music fraternity spread across the globe and especially for the south of India, it is indeed a great festivel for one and all....
"A legendary singer with an evergreen charisma of a great impact on many a listener / audience that has been creating an unparalleled reputed history with her each and every rendition since the past 35 years, so much so that even a novice would get enthralled beyond any explanation by merely listening to her music to forget all the heaviness in the mind....."
would be an apt definition of our Chitra Chechi.... 

A fool / idiot would resort to all sorts of carcinogenic stuff to relieve their mind's heaviness and there by destroys oneself and all the others surrounding them....
( As long as someone's smoking & drinking, doesn't bother the folks around, they may call it their constitutional right to buy and consume anything from the market...
However, as everyone knows, they are just 'purchasing' cancer and all sorts of other physical ailments besides mental ailments as  their side effects, only to lessen their life span by a few decades and are certainly bothering others when done in public, which is anyways an act of offense as per the applicable govt GOs) 

A mediocre person engages in gossip with the folks around only to get burdened with more and more irrelevant stuff...

An elite person would read/write good books or listen to some good soothing music, for all the mind power they impart the reader / listener with....
( various scientific studies have proved that the amplitudes of a human brain's
beta waves are much stronger in those who read/write books, listen to/practice great soothing music renditions than that of in those who don't...)

For such a great unparalleled science of music / musicology, singers all around the world are the life source who create / propagate / sustain the power of music via their renditions in their chosen albums/movies...

While the supreme segment of musicology, the traditional Carnatik/Hindustani, is approached only by the intellectual group, the generic cine/movie/album music has been the most common form of music embraced by one and all for all casual purposes and thus it has been a widely talked about profession / field / across the globe  to which many an established personnel have made their foray in to and have won many accolades by one and all who relish the power of music....

Singers / Musicians are professionals akin to  any other field...However, it takes the merit of several lives to be born as or to become an established singer or a musician for the intricate penance involved in it to captivate millions and millions of folks...because music is a global language that is devoid of all sorts of barriers and is an exquisite art that is mastered only by a few blessed souls...
and is thus embraced by one and all for all that it gives them to remain happy and blissful....

Chitra chechi is one such revered, established, erudite music professionals / singers of India, who took up music as a profession and spread the greatness of singing / music to every nook and corner of the world by enthralling the audience in multiple languages / multiple countries / multiple genres across hundreds and hundreds of her great renditions.....

The fact that, it is none other than Shree S.Jaanakamma, the most versatile singer ever known to the world, that has praised Chitra Chechi and has asked the music world to go and explore her music finesse, marks the heights of Chitra Chaychi's elite status in her singing spree....

Right from the evergreen songs in the "Bombay" to many a latest one,
I have always found her renditions as a great stressbuster.....
And personally, my most favourite bits from a few movie songs of her are.....

"Nenu purivippi parugetti gaalalle vacchaa...nee venu gaanaaniki....arere...arere...neaDu kanneeTa taynaykalisay...."
in the "Urikay Chiluka..." song....

Taara sthaayi rendition at
" Telupumaaa..aaaaa......." in the 
"Chiluka Ksheamama..." song...

"KuhuKuhu swaraagaalay Shrutulugaa......" rendition in the 
"Jaamuraatiri....Jaabilamma... " song....

"NivaaLigaa naa madi...nivedinchu nimishamidi...."
to the completion of the song via a mellifluous jantaswaraalaapana that culminates at "ee geetaanjali"....
in the "A Shwaasaloa chearitay...
gaaligaandharvamautunnadoa...." song....

"Urikinavaagallay..tolakarikavitallay...
talapulu kadilaynay....chelimadi virisaynay...ravikularaghuraamaa...
anudinamu "
in the "ninnu koray varnam....." song.... 

and so on and so forth.....

My humble Namaskaaram to, PadmaBhooshan, Shree K S Chithra gaaru,
and wishing her many more years of successful singing spree with many more birthday celebrations ahead....
🙏😊🍨💐🍧🍦🍕🎇

Saturday, July 23, 2022

శ్రీశుభకృత్ నామ సంవత్సర ఆషాఢ మాస 3వ ఆదివారం బాలానగర్ / కూకట్పల్లి / శేరిలింగంపల్లి పరిసర ప్రాంతాల్లో 2022 బోనాల జాతర శుభాభినందనలు.....🍕🎇💐🍧🎂🍦🍨😊


ఆషాఢ బోనాల జాతర అనాదిగా 
తెలుంగు / తెలంగాణ నైసర్గికాచార వైభవానికి ఉనికిపట్టుగా పరిఢవిల్లుతున్న ప్రాంతీయ పండుగ.... 

శివసత్తులతో / శక్తి పూనకాలతో  శిగమూగే భక్తబృందాల నడుమ దేదీప్యమానంగా వెలిగే దివ్వెలు బోనం కుండలపై కొలువుదీరి ఉండగా, అమ్మవారికి తరలి వచే అసంఖ్యాక బోనాలతో ఉండే జాతరలోని అర్ధాలు / అంతరార్ధాలు ఎన్నో ఎన్నెన్నో..... 

ఇంట్లో చిన్న పిల్లలు ఆడుకునే బొమ్మలను గమనించే ఉంటారు.... 
ఈ ప్రపంచంలోని అన్ని వస్తువులు / ప్రాణుల యొక్క ప్రతిరూపాలుగా ఏనుగులు / టెడ్డిబేర్లు లాంటి జంతువులు, కార్, బస్, ట్రైన్, లాంటి పెద్ద పెద్ద వాహనాలు ఇత్యాదివన్నీ కూడా చిన్న చిన్న రూపాలను సంతరించుకొని మన ఇంట్లోని చిన్న పిల్లలు ఆడుకోవడానికి ఆటబొమ్మలుగా వచ్చి కొలువై ఉండడం..... 

అనగా ఒక స్థూల స్థాయిలోని ప్రపంచాన్ని సంక్షిప్తం గావించి చిన్న పిల్లలకు వాటిని ప్రపంచం గా పరిచయం గావించడంలో....

1. ఆయా వస్తువుల వాస్తవ ఉనికి గురించి చిన్న పిల్లలకు వారి వారి " చిన్న స్థాయిలో " ఎరుక పరచడం....

2. వారు పెరిగి పెద్దవారయ్యాక వాస్తవిక ప్రపంచంలోని ఆయా స్థూల వస్తు ప్రాణి సముదాయాన్ని అత్యంత శీఘ్రంగా గుర్తించి సామ్యమును ఏర్పరచుకొని వాటి గురించిన అవగాహన అనునది ఎంతో వేగంగా లభింపజేసుకోవడం... 

3. తద్వారా ఎంతో ఉన్నతమైన రీతిలో వివిధ వస్తువిషయగ్రాహ్య శక్తి పెంపొందింపబడడం..... 

ఇత్యాదిగా ఉండే లౌకికమైన సాధరణమైన అంశాలను మనం గమనించవచ్చు.....

ఇదే విధంగా.....

ఎక్కడెక్కడో దూరతీరాల్లో పుణ్యక్షేత్రాల్లో కొలువుదీరి ఉండే స్వయంభూ దైవాలను వ్యయప్రయాసలకోర్చి దర్శించి / సేవించే భాగ్యం అందరు గృహస్తులకు వారి వారి నిత్య జీవన గార్హస్త్య ఉద్యోగ / వ్యాపార / వ్యవహార / కర్తవ్యాల రీత్య  కుదరకపోవచ్చు....

" అమ్మవారు మరియు హనుమంతుడు....
ఈ ఇద్దరు దేవతా స్వరూపాలు కూడా భక్తులకు అత్యంత శీఘ్రంగా పలికే దైవిక తత్త్వములు...." అనే విషయం గురించి శ్రీచగంటి సద్గురువులు వారి ప్రవచనాల్లో చెప్పడం చాలా మందికి గుర్తుండే ఉంటుంది......

అందుకే గ్రామగ్రామాన ఎన్నెన్నో పేర్లతో గ్రామదేవతలుగా కొలువై ఉండే అమ్మవారు / శిలలకు సిందూరం పూసి హనుమంతులవారి గుడిగా కొలువుదీరి ఉండే ఆంజనేయ మందిరాలు దైవిక రక్షక వ్యవస్థలుగా ఊరురా ఉండడం ఎల్లరూ వారి వారి ప్రయాణాల్లో గమనించే ఉంటారు.....

"క్షేమంగా వెళ్ళి లాభంగా రండి..." అని మన పెద్దలు అనడం వినేఉంటారు.... 
క్షేమం అనగా ఉన్నది ఉన్నట్టు ఉండుట....
లాభం అనగా కొత్తవి సమకూరుట...

భారి వర్షాలు / వరదలు / అంటువ్యాధులు / ఇత్యాది వాటిని కాలంతర్గతంగా తీసుకువచ్చే 
ఈ ఆషాఢ మాసం నుండి క్షేమం / లాభం అనేవి ప్రశ్నలుగా మారే సమయం..... 

న్యూస్లో చూస్తూనే ఉన్నాం...
నిలిపి ఉన్న బైకులను / కార్లను / నడుస్తున్న మనుషులను వరదలు వాటి ప్రవాహంలో ఏవిధంగా లాక్కొనిపోతున్నయో.....
అనగా క్షేమం మరియు లాభం ఒకానొక సమయంలో ప్రశ్నార్ధకమైనవి అని అర్ధం.... 

వివిధ అంటువ్యాధులు ప్రబలి...
శ్రావణం, భాద్రపదం గడిచి 
ఆశ్వయుజ మాసం వచ్చే సరికి యమదమ్ష్ట్ర బయలుదేరేకాలం... 
అనగా సమవర్తి భూమి యొక్క భారాన్ని / పాపాత్ములను అధిక సంఖ్యలో తనతో పాటు తీస్కెళ్ళిపోయే సమయం.....

ఇలాంటి సమయంలో దూరతీరాలకు వెళ్ళకుండానే,
పెద్ద పెద్ద వ్యయప్రయాసలకు లోనుకాకుండా......
ఎవరికి వారు..వారి వారి స్థోమతకు తగ్గట్టుగా వారి వారి ఇళ్ళ వద్దే కొలువైఉండే అమ్మవారి ఆలయాల్లో / గ్రామదేవతల మందిరాల్లో....
ఆషాఢ బోనం / ఆషాఢ జాతర ఆరాధన / పేరిట అమ్మవారిని సేవించి తరించడమనే సంప్రదాయమే ఆషాఢ బోనాల జాతర..... 

మట్టినుండి జనించి మట్టి యొక్క మృత్తికా తత్త్వాన్ని కలిగిఉండే పదార్ధాలైన 
హరిద్ర / పసుపు, గుడము / బెల్లం,
తో తయారు గావింపడిన బెల్లమన్నం / పసుపన్నం నివేదనలను....మన జీవాంతర్గతమైన శుద్ధ సత్త్వ / సత్త్వ గుణాలకు ప్రతీకలుగా గావించి,
మట్టికుండను శరీరం అనే తొడుగుకు ప్రతీకగా గావించి,
అజరత్వానికి ప్రతీకగా ఉండే వేపాకులను / వేపనీటిని గైకొని,
హృదయకోశంలో దేదీప్యమానంగా వెలిగే పరమాత్మను బోనంపై వెలిగే పరంజ్యోతికి ప్రతీకగా గావించి,
ధగధగమెరుస్తూ హరిద్రావర్ణంలో తణుకులీనే బోనమే మన...
జీవ జీవేశ్వర జీవధారక వ్యవస్థకు సామ్యముగా స్థిరీకరించి....,

శివప్రియా, శివపరా, శిష్టేష్టా, శిష్టపూజితా ।
అప్రమేయా, స్వప్రకాశా, మనోవాచామ గోచరా ॥ 89 ॥

చిచ్ఛక్తి, శ్చేతనారూపా, జడశక్తి, ర్జడాత్మికా ।
గాయత్రీ, వ్యాహృతి, స్సంధ్యా, ద్విజబృంద నిషేవితా ॥ 90 ॥

తత్త్వాసనా, తత్త్వమయీ, పంచకోశాంతరస్థితా ।
నిస్సీమమహిమా, నిత్యయవ్వనా, మదశాలినీ ॥ 91 ॥

" నిత్యయవ్వనా " గా వెలిగే ఆ పరమాత్మికను
పృథ్వీశక్తి, జీవశక్తి, చైతన్యశక్తి, అజరాశక్తి,
ద్యుశక్తి యొక్క సమ్మిళిత సమాహార స్వరూపంగా వెలిగే " బోనం " అనే సాంప్రదాయిక నివేదనతో ఆరాధించి నమస్కరించి సేవించడంతో....
ఈ 5 శక్తులను కూడా ఆరాధించిన భక్తులకు అనుగ్రహంగా అందించి దీవించమనే తత్త్వ సందేశం బోనం సమర్పణలో ఇమిడిఉంది....

ఈ 5 శక్తులు పరిపుష్ఠమై ఉండడమే ఒక వ్యక్తికి సంపూర్ణ ఆరోగ్యం తద్వరా క్షేమం / లాభం అనునవి కాలాంతర్గతంగా సమకూరడం....

ఒక డ్రోన్ కి గల 5 టర్బైన్స్ / ప్రొపెల్లర్స్ సరిగ్గా సంతులనాత్మకంగా ఉండి నిర్దేశిత ఎత్తులో స్థిరంగా ఎగురుతున్నప్పుడు యావద్ ప్రపంచం కూడా ఒక విహంగ వీక్షణంలా తనకు ( కెమెరాకు ) కనిపిస్తుంది...
తద్వారా మనకు కనిపిచ్చేలా చేస్తుంది......

అదే విధంగా.... 

పృథ్వీశక్తి : శరీరాంతర్గత 
సకల పాంచభౌతిక వ్యవస్థా పరిపుష్ఠి....

జీవశక్తి : సత్ అసత్ స్పృహ తో సదా అంతర్నిహితమై ఉండే ఆత్మ శక్తి 

చైతన్యశక్తి : చిత్తము యొక్క నిత్య వికసిత గుణము

అజరాశక్తి : సకలేంద్రియ పటుత్వం

ద్యుశక్తి : వివిధ దైవిక లోకాలతో / తత్త్వాలతో అనుసంధానాత్మక మేధాశక్తి.... 

ఈ 5 సరిగ్గా సంతులనాత్మకంగా ఉండి ఒకానొక ఉన్నతమైన భావస్థాయిలో స్థిరంగా మనసు లయించినప్పుడు యావద్ ప్రపంచం కూడా ఒక విహంగ వీక్షణంలా తనకు ( అంతర్నేత్రానికి /మనోనేత్రానికి )  కనిపిస్తుంది...

తద్వారా లోకాన్ని / లోకులను / లోకరీతులను క్షుణ్ణంగా అధ్యయనం గావించి వడపోసే ప్రజ్ఞ్య అనునది భక్తునకు భాసిస్తుంది.....

" అంటే...గిట్ల ఒక బోనాల పండ్గకు నమస్కరించి ఆరాధించగానే...గట్ల గొప్ప గొప్ప యోగాలు ఒస్తయా...."
అనే పెడసరి వాదన కాకుండా.....

అట్లు విశ్వసించి పరాశక్తిని ఆరాధించేవారికి ఆయా యోగములు ఆ 

మహాభోగా, మహైశ్వర్యా, మహావీర్యా, మహాబలా ।
మహాబుద్ధి, ర్మహాసిద్ధి, ర్మహాయోగేశ్వరేశ్వరీ ॥ 55 ॥

యొక్క అనుగ్రహంగా లభించితీరుతాయి
అని అనడం అనాదిగా పరిఢవిల్లే సనాతన సంప్రదాయం యొక్క వైభవం.... 

యా దేవీ సర్వభూతేషు శక్తిరూపేణ సంస్థితా |
నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః ||

ప్రగతినగర్ బస్తి గ్రామదేవత శ్రీపోచమ్మ అమ్మవారికి.....
అస్బెస్టాస్ కాలని గ్రామదేవతలు..
శ్రీనల్లపోచమ్మ, శ్రీరేణుకా ఎల్లమ్మ అమ్మవార్లకు.....
కూకట్పల్లి గ్రామ దేవత శ్రీ చిత్తరామ్మ తల్లికి,
ఆషాఢ బోనాల జాతర నమస్సులను అర్పిస్తూ....
సర్వం బల్కంపేట శ్రీరేణుకాహేమలాంబ / ఎల్లమ్మ శ్రీచరణారవిందార్పణమస్తు... 

🙏🙏🙏🙏🙏

😊🍨🍦🎂🍧💐🎇🍕

( బోనాల వౌభవం పై మరింత విస్తృత సమాచారం నా పోత పోస్టుల్లో కలదు...

https://m.facebook.com/story.php?story_fbid=10224663296743187&id=1033694038 )

Tuesday, July 19, 2022

శ్రీకరమైన శుభకృత్ నామ సంవత్సర 2022 ఆషాఢ పౌర్ణమి / గురుపౌర్ణమి పర్వదిన సందర్భంగా శ్రీచాగంటి సద్గురువుల దర్శనానుగ్రహం / మరియు శ్రీ ఆకుండి లక్ష్మీ స్మారక గోశాల ప్రాంగణమందు చాతుర్మాస్య దీక్షకై వేంచేసిఉన్న కంచికామకోటి పీఠ 70వ జగద్గురువరేణ్యులు, శ్రీ శంకరవిజయేంద్రసరస్వతీ స్వామి వారి దర్శనానుగ్రహ స్మృతులు.....💐🍕😊🍨🍦

శ్రీకరమైన శుభకృత్ నామ సంవత్సర 2022 ఆషాఢ పౌర్ణమి / గురుపౌర్ణమి పర్వదిన సందర్భంగా శ్రీచాగంటి సద్గురువుల దర్శనానుగ్రహం / మరియు శ్రీ ఆకుండి లక్ష్మీ స్మారక గోశాల ప్రాంగణమందు చాతుర్మాస్య దీక్షకై వేంచేసిఉన్న  కంచికామకోటి పీఠ 70వ జగద్గురువరేణ్యులు, శ్రీ శంకరవిజయేంద్రసరస్వతీ స్వామి వారి దర్శనానుగ్రహ స్మృతులు.....
💐🍕😊🍨🍕

{
మరియు 

1. కోటిపల్లి శ్రీ రాజరాజేశ్వరి సమేత సోమేశ్వరాలయం / శ్రీకోటిఫలీశ్వరాలయం...

2. దక్షారామ శ్రీమాణిక్యాంబా శక్తి పీఠం + శ్రీభీమేశ్వరాలయం...

3. భానుగుడి జంక్షన్ దెగ్గరి అయ్యప్ప స్వామి వారి ఆలయ ప్రాంగణంలో కొలువుదీరిన అన్ని మందిరాలు / ఆలయాలు....

4. అన్నవరం శ్రీ అనంతలక్ష్మీ సమేత సత్యనారాయణ స్వామి వారి ఆలయం / వనదుర్గా అమ్మవారి ఆలయం....

5. పిఠాపురం శ్రీపురుహూతిక శక్తి పీఠం + శ్రీకుక్కుటేశ్వరాలయం,

6. పిఠాపురం శ్రీపాద శ్రీవల్లభ శ్రీక్షేత్రం,

7. తొలి తిరుపతి (దివిలి) శ్రీ శృంగారవల్లభస్వామి వారి ఆలయం,

8. సామర్లకోట కుమారారామ శ్రీభీమేశ్వరాలయం...
(పంచారామం)

9. సర్పవరం, శ్రీ భావనారాయణస్వామి వారి ఆలయం 

దర్శనానుగ్రహ  స్మృతులు.....
}

" ఒక్క గురుపౌర్ణమి / వ్యాసపౌర్ణమి నాడు మాత్రమే, గురువులు ప్రత్యక్షంగా పిలవకున్నా సరే, శిష్యులు వారి వారి గురువుల సందర్శనార్ధమై, అనుగ్రహాశీస్సులకై, గురువుగారి నివాసానికి తరలిరావొచ్చును....."
అనే విషయం గురించి శ్రీచాగంటి సద్గురువులు వారి ప్రవచనాల్లో చెప్పడం కొందరికైనా గుర్తుండే ఉంటుంది.....

కరోణా కారణంగా గత 4 సంవత్సరాలుగా పరోక్ష దర్శనానికే పరిమితమై,
ఈసారి గురువుగారి ప్రత్యక్ష దర్శనం లభించడం చాలా ఆనందకరమైన విషయం....

ఎందుకంటే శిష్యులకు అత్యంత సంతోషకరమైనది గురువుల సందర్శనాభాగ్యం..... 
గురువాక్కుల స్మరణ మనన నిధిధ్యాసనం అనే ప్రక్రియలకు దిటవైన ఆలంబన అనునది గురుసందర్శనంతో సంప్రాప్తిస్తుంది... 

త్రిమూర్త్ర్యాత్మక పరబ్రహ్మం గా గురువులను ఆరాధించడం ఒకెత్తైతే,
గురుపౌర్ణమి / వ్యాసపౌర్ణమి నాడు వారిని అలా దర్శించి తరించడం ఒకెత్తు...

ఎన్నెన్నో గొప్ప అధునాతన ఫీఛర్లతో / యాప్స్ తో  ఉండే లేటెస్ట్ ఐఫోన్ ఉన్నాసరే, సరైన సెల్ టవర్ సిగ్నల్ / వైఫై ఉన్నప్పుడు మాత్రమే వాటిని పరిపూర్ణంగా ఉపయుక్తంగావించుకోవడం సంభవమయ్యేది.....

అదే విధంగా ఒక వ్యక్తి ఎన్నెన్నో శాస్త్రములందలి విద్యను సంగ్రహించి 
" విద్యావంతుడు " అని అనిపించుకున్నాసరే.....
ఒక గురుస్వరూపాన్ని ఆ విద్యార్జనకు మూలంగా భావించి సేవించిననాడే " జ్ఞ్యానవంతుడు " గా రూపాంతరం గావింపబడడం అనేది మన సనాతనధర్మ సంప్రదాయం లోని విశేషం.....

ఎంతో కష్టపడి ఆర్జించిన విద్యలన్నీ కూడా పొలం నుండి ఇంటికి లభించిన ధాన్యము వంటివి.....
ఆ ధాన్యము అన్నముగా / భోజ్య పదార్ధం గా రూపాంతరం అయినప్పుడే ఆ ధాన్యానికి, ఆ సేద్యానికి, ఆ కృషికి సార్ధకత లభిస్తుంది....

విద్యార్జన గా మాత్రమే వివిధ వస్తువిషయ సముపార్జన ఉండిపోతే, 
అది కేవల విద్య గా ఉండే సమాచారం.....
విద్వత్తు గా ఆ విద్యార్జన రూపాంతరం గావింపబడడమే సమకూరవలసిన అనుగ్రహ విశేషం.....

ఈ " విద్యార్జన --> విద్వత్తు " అనే ప్రయత్న పూర్వక ప్రక్రియ / ప్రయాసలో, 
గురుకటాక్షం అనునది ఒక క్యటలిస్ట్ లా దోహదమై సదరు విద్యార్థి యొక్క కృషిని సద్యో సఫలీకృతం గావించి తరింపజేస్తుంది.....

అనగా ఆ జ్ఞ్యానం వారి వారి ఈప్సితములను ఈడేర్చే సాధనమై ఒప్పారుతుంది అనేది ఇందలి అధ్యాత్మ విశేషం..... 

విద్య కంటే కూడా ఎందుకు జ్ఞ్యానం అనునది అంతగా ముఖ్యమైనది అని అంటే....

జ్ఞ్యానరాహిత్యం అనునది మనిషిని అన్ని విధాలా కట్టిపడేసే ఒక బంధనం లాంటిది....
అది వీడనంతవరకు మనిషికి ప్రశాంతత / సుఖం అనేవి దుర్లభం...మరియు ఇతరులను / ఇతరుల్లోని ఉన్నతమైన విద్వత్తును గౌరవించి గౌరవింపబడడం అనేది మనుషులకు అంత సులంభంగా జనించని స్పృహ..... 

హృదయపూర్వకంగా నమస్కరించడం / గౌరవించడం అనేది ఇరు వర్గాల గౌరవాన్ని కూడా ఇనుమడింపజేసే సాధనం.....

ఒక వ్యక్తి ఎంతో అద్భుతంగా గానాన్ని ఆలపించగలడు ... 
" ఆ ఏముందిలే.... ఎవరైనా  పాడతారు...." అని
అనడమే ఈ కలియుగంలో చాలా మంది యొక్క స్పందన...
" అవును....చాలా బాగా ఆలపించాడు...ఎంతటి కృషితో అలా అవలీలగా పాడే స్థాయికి చేరుకున్నాడో...."
అని సదరు వ్యక్తిలోని విద్వత్తును గౌరవించే సంస్కారం చాలా మందికి ఉండదు.....
" నువ్వూ అట్ల అంత బాగా ఒకసారి పాట పాడు చూద్దాం....."
అని ఎవరైనా అంటే...మొహం ఎక్కడ పెట్టుకోవాలో తెలవనట్టుగా ఉండడమే ఇక్కడ సదరు మనిషి యొక్క అజ్ఞ్యానానికి కొలమానం.....

ఒక వ్యక్తి ఎంతో అద్భుతంగా వ్యాసాలను వ్రాయగలడు ...  ... 
" ఆ ఏముందిలే.... ఎవరైనా రాస్తారు...."/
" ఆయనకు అంత సీన్ ఉందంటావ..." /
" ఇవ్వి నిజంగా నువ్వు రాసిన వ్యాసాలేనా...." 
అంటూ వివిధ రీతుల అనడమే ఈ కలియుగంలో చాలా మంది యొక్క స్పందన.......
" అవును....చాలా బాగా వ్రాస్తాడు...ఎంతటి కృషితో
అలా అవలీలగా వ్రాసే స్థాయికి చేరుకున్నాడో...."
అని సదరు వ్యక్తిలోని విద్వత్తును గౌరవించే సంస్కారం చాలా మందికి ఉండదు.....
" నువ్వూ అట్ల అంత బాగా ఒకసారి వ్రాయి చూద్దాం....."
అని ఎవరైనా అంటే...మొహం ఎక్కడ పెట్టుకోవాలో తెలవనట్టుగా ఉండడమే ఇక్కడ సదరు మనిషి యొక్క అజ్ఞ్యానానికి కొలమానం.....

ఇతరులకు ఒనగూరిన ఈశ్వరానుగ్రహాన్ని గుర్తించి గౌరవించలేని మూర్ఖులకు ఈశ్వరానుగ్రహం గురించి ఎంత చెప్పినా అది బూడిదలో పోసిన పన్నీరు లాంటి ప్రయాస...... 

అదే విధంగా ఇతరులకు ఒనగూరిన జ్ఞ్యాన వైభవాన్ని గుర్తించి గౌరవించలేని మూర్ఖులకు, జ్ఞ్యానం గురించి ఎంత చెప్పినా అది బూడిదలో పోసిన పన్నీరు లాంటి ప్రయాస.....

జ్ఞ్యాన తృష్ణ అనునది మాత్రమే ఒక మనిషికి మరో మనిషికి ఉండే అసలైన భేదం.....
మిగతా లౌకిక భేదాలన్నీ కూడా కేవలం శరీరం అనే పాంచభౌతిక తొడుగుకు ఉండే భేదాలే...

అందుకే గీతాచార్యుడు అంటాడు....
" ఎక్కడ ఎవరిలో ఏ విభూతి ప్రకాశించినా సరే అది నా అంశే..." అని.....

ఒక 3 ఉద్ధరిణల (స్పూన్ల) భగవద్ తీర్థం ప్రసాదింపబడినప్పుడు....
అది లౌకిక కొలమానాలకు మేయము / గ్రాహ్యము / నిర్వచనీయము అయ్యే పదార్ధము.....

గురుర్బ్రహ్మ...గురుర్విష్ణుః...గురుర్దేవో మహేశ్వరః....
గురుర్సాక్షాత్ పరబ్రహ్మ....తస్మై శ్రీ గురవే నమః.....

అని ముగ్గురు ఈశ్వరస్వరూపముల కలయిక గా ఆరాధింపబడే గురు స్వరూపుల నుండి ప్రసాదింపబడే
భగవద్ జ్ఞ్యానం అనేది ఏ లౌకిక కొలమానాలకు మేయము / గ్రాహ్యము / నిర్వచనీయము కాజాలని పరతత్త్వ పదార్ధము.....ఎందుకంటే అది మహాసముద్రం లా అనంతమైనది....!

ఒక ఏరొప్లేన్ ప్రయాణంలో అత్యంత ముఖ్యమైన ఘట్టాలు.... ఆ విమానం యొక్క టేకాఫ్ & ల్యాడింగ్..... 

ఒకసారి టేకాఫ్ అయిన విమానం ఆకాశంలో ఒక నిర్ణీత ఎత్తులో, నిర్ణీత వేగంతో ప్రయాణం సాగించి గమ్యం చేరుకోగానే ల్యాడింగ్ తో మరలా ప్రయాణికులందరు కూడా భూమిపైకే చేరుకుంటారు....కాని కొన్ని వేల కిలోమీటర్ల దూరంలో ఉండే ఇతర ప్రాంతాల్లో.....

అదే విధంగా, జ్ఞ్యాన సంచయం / వినిమయం అనునవి మనిషి యొక్క ఐహిక జీవన ప్రయాణంలో అత్యంత ముఖ్యమైన ఘట్టాలు..... 

ఒకసారి ప్రారంభమైన జ్ఞ్యాన సంచయ ప్రయాసతో బౌద్ధిక పరిణతిలో ఎంతో ఉన్నతంగా పయనించి ఒక తత్వం యొక్క తీరం చేరుకోగానే 
( అనగా సదరు అంశం యొక్క జ్ఞ్యాన సముపార్జనలో పరిపూర్ణతను సాధించిన తదుపరి ),
మరలా జ్ఞానులందరు కూడా ఇతరులందరు ఉన్నట్టుగానే ఉంటారు / కనిపిస్తారు / జీవిస్తారు....

కాని ఎంతో పరిపక్వమైన బౌద్ధిక పరిణతగల వారి జీవిత పయనంలో ఆ జ్ఞ్యాన వైభవం అనునది ప్రకాశిస్తుంది.....

ఫరెగ్సాంపుల్.....
ఒక వేద శాఖలో ఆరితేరిన ఘనాపాటి, 
ఒక బహుళజాతీయ సంస్థలో సమున్నత 
స్థాయిలోని సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్, 
ఒక పెద్ద ప్రభుత్వాధికారి,
ఒక గొప్ప గాయకుడు, 
మందిని ముంచి బ్రతికే ఒక మూర్ఖుడు / రౌడీ, 
ఈ 5 గురు కూడా దాదాపుగా ఒకేలాంటి దుస్తులు ధరించి ఒకే బస్ / ట్రైన్లో ప్రయాణం గావిస్తున్నప్పుడు......

వారి గురించి ఏమి తెలియని వ్యక్తికి ఈ 5 గురిని చూపించి..... 
వీరిలో ఎవరు ఎవరో అనేది చెప్పమంటే అది సాధ్యంకానిది....

ఎందుకంటే ఇక్కడ ఒకేలా కనిపించే మనుషుల్లోని వివిధ విద్వత్ వైభవం అనునది పొటెన్షియల్ ఎనర్జి గా అంతర్నిహితమై ఉన్నది..... 
( మూర్ఖత్వం / మౌఢ్యం కూడా ....)

వారి వారి నిర్దేశిత కార్యనిర్వహణలో విద్వత్ ప్రకటనము గావింపబడినప్పుడు,
ఆ విద్వత్ వైభవం అనునది కైనెటిక్ ఎనర్జి గా బహిర్గతమై తద్వారా వారి వారి జ్ఞ్యాన ప్రకటనం అనునది లోకానికి గ్రాహ్యమయ్యే అంశమౌతుంది....

శ్రీశైలం రిసర్వాయర్ లో నీరు ఉన్నప్పుడు ఆ జలం తనయందు స్థాణువు గా ఉన్న పొటెన్షియల్ ఎనర్జితో మామూలుగానే కనిపిస్తుంది.....
డ్యాం ను పర్యవేక్షించే అధికారులు తగు సమయంలో గేట్లు తెరిచి నీరు కిందికి వదలగానే,
స్పిల్ల్వే పై ఎంతో వేగంతో ఉరకలు వేస్తు ఉవ్వెత్తున ఎగిసిపడే కృష్ణమ్మ జలప్రవాహఝరులకు డ్యాం పరిసరప్రాంతమంతా నీటి తుంపరలతో ఆవరించి ఉన్నప్పుడు ఆ జలం తనలో ఎంతటి శక్తిని గర్భితమైన సూక్ష్మ రూపంలో ఓడిసిపట్టిందో అనేది కానవచ్చి ఔరా ఎంతటి శక్తి కదా అని ఆ జలశక్తి దృగ్గోచరమయ్యే అంశమౌతుంది......

అచ్చం అదే విధంగా, గురువుల అనుగ్రహం అనునది పొటెన్షియల్ ఎనర్జిగా శిష్యులకు అందినప్పుడు అది కనిపించని బార్హస్పత్య శక్తిగా అందివస్తుంది..... 

సదరు శిష్యుడిచే గురువానుగ్రహంగా ఆ అధ్యాత్మ శక్తి యొక్క ప్రకటనం వివిధ రీతుల్లో గావింపబడినప్పుడు,
ఆధ్యాత్మికత యొక్క శక్తి అంటే ఏంటో లోకానికి గ్రాహ్యమయ్యే అంశం గా ప్రభవిస్తుంది.....

అప్పటివరకు అది అంతర్నిహితమై ఉండే ఒక సూక్ష్మ రూప అణుశక్తి వంటిది....
అది సంకల్ప సహితంగా ట్రిగర్ చేయబడినప్పుడు ఎంతటి శక్తి విస్ఫోటనమైనా సృష్టించగలదు....
ఇది అనాదిగా సనాతనధర్మభూమిపై మాత్రమే
పరిఢవిల్లే ఆధ్యాత్మికత యొక్క కానరాని మహత్తు.....

అందుకే సద్గురువులను బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులుగా, త్రిమూర్త్యాత్మక
శక్తిగా సనాతనధర్మసంప్రదాయం అనాదిగా గౌరవించి నమస్కరించి తరిస్తున్నది....

గురువుగారి సందర్శనార్ధమై వారింటికి ఏతెంచిన ఎందరో శిష్యులను, అక్షతలతో ఆశీర్వదించి,
వివిధ ఫలాలను జ్ఞ్యాన ప్రసాదంగా కూడా అందించి అనుగ్రహఫలాన్ని ఒనరించిన శ్రీచాగంటి సద్గురువుల శ్రీచరణాలకు ప్రణమిల్లిన మధురక్షణాల స్మృతిగా ఈ చిరుకవనకుసుమాంజలిని వారి శ్రీచరణాలకు నమస్సుమాంజలి గా సమర్పిస్తూ.... 
శ్రీగురుభ్యో నమః....

మౌనవ్యాఖ్యా ప్రకటితపరబ్రహ్మతత్వంయువానం
వర్శిష్ఠాంతేవసదృషిగణైరావృతం బ్రహ్మనిష్ఠైః ।
ఆచార్యేంద్రం కరకలిత చిన్ముద్రమానందమూర్తిం
స్వాత్మరామం ముదితవదనం దక్షిణామూర్తిమీడే ॥

🙏🙏🙏🙏🙏🙏🙏🙏
🙏🙏🙏🙏🙏🙏🙏🙏
😊🍦🎂🎇💐🍨🍧😊



Sree AkunDi Lakshmi smaaraka GoShaala loni mahimaanvita Navadala Bilva Vruksham...!!

Saturday, July 9, 2022

శ్రీ శుభకృత్ నామ సంవత్సర 2022 ఆషాఢ పౌర్ణమి / గురుపౌర్ణమి / వ్యాసపౌర్ణమి మరియు ఆషాఢ శుద్ధ నవమి, శ్రీ చాగంటి సద్గురువుల చాంద్రమాన జన్మదినోత్సవ శుభాభినందనలు...🍦🍕🍧💐😊


గురువు అనగా 

లఘువు / గురువు అనే అర్ధంలో 
బరువు అనే అర్ధం.....

గురు వాచకం అనే అర్ధంలో ఉపాధ్యాయులు / ఆచార్యులు / బోధకులు / ఇత్యాది గా అర్ధం....

వ్యుత్పత్తి ప్రకారంగా
గు కారశ్చ అంధకారశ్చ.....
రు కారంతన్నిరోధకః....
ఇతి గురుః....

అనే అర్ధంలో 
"అంధకారాన్ని రూపుమాపే వారు 
గురువులు.... "

ఇక్కడ అంధకారం అనగా అజ్ఞ్యానం.....

అనగా మనకు తెలియని విషయాలను తెలిపి మనకు జ్ఞ్యానం ప్రసాదించువారు గురువులు అని వాక్యార్ధం..... 

ఈ లోకంలో మనకు తెలియని విషయాలు అంటే ఎన్నో ఎన్నెన్నో.....

శ్రీచాగంటి సద్గురువులు వివరించినట్టుగా,
అనంతమైన వేదరాశిని ఈ కలియుగ వాసులు అధ్యయనం గావించడం యుగ లక్షణం రీత్య వీలుకాదు కాబట్టి,
ఋగ్వేదం, సామవేదం,
యజుర్వేదం ( కృష్ణ యజుర్వేదం / శుక్ల యజుర్వేదం )
అథర్వవేదం గా 
వేదవిభాగం గావించి వారి నలుగురు శిష్యులకు వాటిని అందించి లోకాన్ని అనుగ్రహించిన వారిగా,
18 పురాణాలను రచించినవారిగా,
యావద్ వైదిక వాంజ్మయ కర్తగా, 
వ్యాస మహర్షి వారు ఆస్తికులెల్లరిచే ఆరాధింపబడే మహనీయులుగా పూజింపబడుతున్నారు....

ఈ అధ్యాత్మ గురువారాధన అనే సత్సంప్రదాయాన్ని ఒక అవిచ్ఛిన్న పరంపరగా, శ్రీమన్నారాయణుడు/శ్రీదక్షిణామూర్తి ఆద్యులుగా....
బ్రహ్మగారి మొదలు మన గురువుల వరకు గల గురుపరంపరను .....

సదాశివసమారంభాం....
వ్యాసశంకరమధ్యమాం....
అస్మదాచార్యపర్యంతాం....
వందే గురుపరంపరాం....

అని ఎల్లవేళలా నమస్కరిస్తూ, 
విశేషంగా ఆషాఢ పౌర్ణమి రోజున ఈ క్రింది శ్లోకం తో శ్రీవ్యాసమహర్షి వారిని నమస్కరించడం గురించి శ్రీచాగంటి సద్గురువులు తెలిపిఉన్నారు....

ఓం నమోస్తుతే వ్యాస విశాల బుద్దే
ఫుల్లారవిన్దాయత పత్ర నేత్ర
యేనత్వయా భారత తైల పూర్ణ :
ప్రజ్వాలితో జ్ఞానమయ ప్రదీపః

వ్యాసం వశిష్ఠనప్తారం  శక్తే: పౌత్రమకల్మషం
పరాశరాత్మజం వందే  శుకతాతం తపోనిధిం

మరియు వ్యాసుల వారిది ఒక పోస్ట్ / పదవి అని.....
ప్రతి యుగంలోను ఆ పోస్టులో ఉన్న వ్యక్తి ద్వారా లోకానికి జ్ఞ్యానానుగ్రహం లభించడం గురించి కూడా తెలిపిఉన్నారు....

గురువులందు సద్గురువులు వేరయా.....
అని అనడంలోని ఆంతర్యం ఏమనగా....

మిగతా గురువులందరు కూడా ఒక సబ్జెక్ట్ / అంశం / పాఠం / విషయం / తెలిపి / నేర్పి / మనకు జ్ఞ్యానానుగ్రహాన్ని ప్రసాదిస్తే.....
సద్గురువులు అనువారు వారి సరళమైన అధ్యాత్మ బోధలతో.....
" ఆత్మ జ్ఞ్యానం " అనే సర్వోత్కృష్టమైన జ్ఞ్యానాన్ని కటాక్షిస్తారు..... 

ఐ.ఎస్.బి లాంటి ప్రతిష్టాత్మక  సంస్థల్లో జాయిన్ అయినా కూడా " ఆత్మ జ్ఞ్యానం " అనునది చదువుకొనే విద్యగా  లభించదు....

ఎందుకంటే అది లౌకిక విద్య కాదు కాబట్టి....

ఈ " ఆత్మ జ్ఞ్యానం " అనునది ఎందుకు అన్నిట్లోకి సర్వోత్కృష్టమైనది  అంటే....

నిత్యానిత్య వస్తువివేచనతో.....
సదసత్ స్పృహతో.....
ఆత్మానాత్మ వివేకం తో....
ప్రాపంచిక పాంచభౌతిక జగత్తులో ఉంటూనే.....
మనలోనే దాగుండే మరో అలౌకికమైన లోకాన్ని దర్శింపజేయిస్తూ....

మన శరీరమే మనకు, అనగా మనలో ఉండే జీవ జీవేశ్వర భావానికి / తత్త్వానికి, ఒక దర్పణం గా ఉండి....

శరీరాన్ని ఒక ప్రాకృత పాంచభౌతిక పదార్ధంగా దర్శిస్తూ....

శరీరాంతర్గతమైన జీవుణ్ణి అప్రాకృతమైన శాశ్వతమైన నిత్య సత్య పారమార్ధిక పదార్ధం గా 
దర్శింపగలిగే స్థితిని అనుగ్రహిస్తూ...

"మననుండే మనము విడివడి మనతో సహా ఈ యావద్ లోకాన్ని ఒక వేదికపై సాగే నాటకంలా  దర్శించుట....." అనే అసాధారణమైన ప్రజ్ఞ్యను కటాక్షించునదే ఆత్మ జ్ఞ్యానము....

" జ్ఞ్యానాత్ ఏవతు కైవల్యం " అని అందుకే అన్నారు...

అనడానికి ఏదో ఒక చక్కని సినిమా స్టోరీలా, సూర్య నటించిన "ప్రాజెక్ట్ 24" మూవి లా ఉంది కాని అదెలా సాధ్యం.....అనే సందేహం రావడం సహజమే......

గురుబోధాంతర్గతంగా ఆ స్థాయిని ఆర్జించి, ఆ స్థాయిలో బౌద్ధిక చైతన్యాన్ని స్థిరీకరించి......
చిత్త వృత్తులను ఏకోణ్ముఖం గావించి...
నిశ్చల తత్త్వంలో నిర్మలమైన రీతిలో మనుష్యుడి మనసు లయం అయిననాడు ఆ దర్శనం సాధ్యమే....

ఒక సామాన్య వ్యక్తికి తన బైక్ అనేది తనను మోసుకొని తిప్పే ఒక ద్విచక్ర వాహనం......
ఎల్లప్పుడు " ఒక వాహనం " అనే వ్యవస్థగానే తనకి తన బైక్ కనిపిస్తుంది...అనిపిస్తుంది....వినిపిస్తుంది...

కాని ఒక బైక్ మెకానిక్ కి అది 
ఒక హ్యాండిల్, రెండు టైర్లు, కొన్ని లైట్లు, ఒక ఇంజన్, ఇంకొన్ని ఐరన్ పార్ట్స్, ఇత్యాది వాటి సమూహం గా దర్శనీయమై ఉంటుంది....

" ఒక వాహనం" అనే అత్యంత స్థూల స్థాయి నుండి, ఇంజన్ ప్లగ్ లోని ఒక స్పార్క్ ను దర్శించడం అనే ఒక సూక్ష్మ స్థాయి వరకు, అన్నీ కూడా సదరు మెకానిక్ కి వివిధ విడి భాగాలా సమాహారం గా కనిపిస్తుంది...అనిపిస్తుంది....వినిపిస్తుంది...

అచ్చం ఇదే విధంగా...

" ఆత్మ విద్య " / " ఆత్మ జ్ఞ్యానం "
అనే స్వోద్ధరణాత్మక ప్రయాసలో కృషించే వారికి.....
లోకాన్ని అలా విడివడి చూసే దక్షత, ప్రజ్ఞ్య, అనునవి ఈశ్వరానుగ్రహంగా భాసించును....

తద్వారా.....లోకులను...లోకరీతిని....
మనుష్యులను.... మనస్తత్త్వాలను.... 
చాలా నేర్పుతో ఎంతో సూక్ష్మ స్థాయివరకు బేరీజు వేసే పరిణతితో ఉండడం అనే విభూతిని
" ఆత్మ జ్ఞ్యానం " ప్రసాదిస్తుంది......

అందుకే అన్ని విద్యలలో కెల్లా ఆత్మవిద్య సర్వోత్కృష్టమైనది.....

శ్రీమద్ భాగవతప్రవచనాల్లో గురువుగారు ఉటంకించినట్టుగా......
గొల్లవారు అమృతతుల్యమైన ఆవుపాలను ఒక్క చుక్క కూడా క్రిందపడకుండా కుండలోకి ఒద్దికగా పిండుకొని ఏవిధంగా తరిస్తారో.....

అవ్విధంగా సద్గురువులు ప్రసన్నమనస్కులై నిర్హేతుక దయాస్వరూపులై జ్ఞ్యాన గంగను అనుగ్రహిస్తున్నప్పుడు ఒక్క అక్షరం కూడా తప్పకుండా అమృతతుల్యమైన ఆ జ్ఞ్యానప్రసాదాన్ని  శిష్యుడు ఎక్కడున్నాసరే శ్రవణంతో ఒడిసిపట్టాలి.....

గొల్లవారు గోవు నుండి జాగ్రత్తగా సంగ్రహించిన పాలను కాచి.....
పెరుగు, వెన్న, నెయ్యి, గా రూపాంతరం గావించి వివిధ ప్రయోజనాలను సిద్ధింపజేసుకున్నట్టు.....

ఒక శిష్యుడు కూడా తను ఎంతో శ్రద్ధగా విని ఒడిసిపట్టిన సద్గురువాక్కులు అనే అధ్యాత్మ విద్యను, మననం, నిధిధ్యాసనం, అన్వయం, అనుభవ పూర్వక పరిశీలన, పరిశోధన, ఆత్మోద్ధరణ, అనే వివిధ రీతుల వాటిని జీవితానికి ఆపాదించుకొని తరించవలే....

ఏ విధంగా అయితే ఆవునెయ్యితో రోజు తినే ఆహారాన్ని అమృతతుల్యం గావించి స్వీకరించడంతో మేధస్సు ఎంతో శక్తివంతంగా అవుతుందో.....

అదే విధంగా గురువాక్కుల శ్రవణానంతరం సాగే స్వాధ్యాయం తో జనించే అమేయమైన ఆత్మజ్ఞ్యానం మనిషిని దైవత్వం వైపునకు కొనిపోవు మార్గమై పరిఢవిల్లుతుంది....

2009 నుండి ఇప్పటివరకు కూడా నేను శ్రద్ధగా ఒక తపో యజ్ఞ్యం లా అవధరించిన శ్రీచగంటి సద్గురువుల ఎన్నెన్నో ప్రవచనాలను అధ్యాత్మ సిలబస్ గా భావించినట్లైతే.....
జీవితం అనే పరీక్షలో నాకు (515.0025/600) మార్కులు వస్తాయి...

అంతటి మహత్త్వాన్ని కలిగి, శిష్యులకు ఆ మహత్తును భ్రమరకీటక న్యాయంతో ఆపాదించే ఆ ప్రహృష్టవచనాలు ఎందరెందరో జీవితాలను ఘనంగా తీర్చిదిద్దే దైవానుగ్రహదాయక భక్తిజ్ఞ్యాన దివిటీలు.....

గురువుగారు ప్రవచనాల్లో ఒకచోట చెప్పినట్టుగా......

పంచుకుంటే తరిగిపోయే లౌకికమైన సంపద అనేది వారి వారి కుటుంబసభ్యులకు మాత్రమే చెందవచ్చేమో.....

కాని, పంచేకొలది పెరిగే గురువులు సృజించే అధ్యాత్మ జ్ఞ్యాన సంపద అనేది శిష్యులు ఎక్కడున్నా సరే వారికి శ్రీగురుకటాక్షం గా అందుతుంది......

ఒక్క వాక్యంలో సద్గురుబోధ యొక్క మహత్తును వర్ణించాలంటే......

" ఒకరియందు సద్గురుభావనతో శరణాగతి గావించిననాడు,
వారియొక్క ప్రత్యక్ష లేదా పరోక్ష అనుగ్రహం బార్హస్పత్య అనుగ్రహంగా రూపాంతరం చెంది విశేషమైన అనుగ్రహాన్ని ప్రసాదిస్తుంది.....

వంద పుస్తకాలు చదివి ఆర్జించే జ్ఞ్యానం 100 అంతస్తుల భవనంపైకి మెట్ట్లెక్కి వెళ్ళడమనే ప్రయాస అయితే.....
ఒక సద్గురుబోధాంతర్గతంగా వాటిని అందుకోవడం అనేది ఎలివేటర్ / ఎస్కలేటర్ లో ఆ 100 అంతస్తులపైకి చేరుకోవడం వంటిది... 

మొదటి ప్రయాసలో మన ఇచ్ఛాపూర్వక జ్ఞానపూర్వక క్రియాపూర్వక ప్రమేయం నిత్యం మనల్ని నడపవలసి ఉంటుంది గంటల కొలది పయనంలా.....

రెండవ ప్రయాసలో ఒక్కసారి ఎలివేటర్ ఎక్కగానే అది ఆన్ చేయగానే తనంతతానుగా మనల్ని 100 అంతస్తులపైకి కొద్ది నిమిషాల్లోనే తీసుకుపోతుంది...

100 అంతస్తుల పైకి చేరుకోవడం అనేది రెండుమార్గాల్లోను ఉండే తుది ఫలితమే.....

కేవల మన ప్రయాసలో మనకు మనమే జ్ఞ్యానాన్ని సముపార్జించుకోవడం అనేది సుదీర్ఘమైన యాత్ర....

గురువానుగ్రహంగా జ్ఞ్యానం ఒనగూరడం అనేది ఈశ్వరానుగ్రహంగా ప్రభవించే సద్యో విశేషం.....

సద్గురువాక్కుల ఆలంబన లేనినాడు జీవితం ఒక బరువు......
సద్గురువాక్కుల ఆలంబన లభించిననాడు జీవితం కల్పతరువు....

అందుకే అన్నారు.....

"న గురోరధికం..న గురోరధికం.." అని..... 

అనంతసంసార సముద్రతార నౌకాయితాభ్యాం గురుభక్తిదాభ్యామ్...
వైరాగ్యసామ్రాజ్యదపూజనాభ్యాం నమో నమః శ్రీగురుపాదుకాభ్యామ్ .....🙏

శ్రీ శుభకృత్ నామ సంవత్సర 2022 ఆషాఢ శుద్ధ నవమితో శ్రీ చాగంటి సద్గురువులు 63 వసంతాలను పూర్తిచేసుకొని 64వ పడిలోకి అడుగిడిన పర్వసమయంలో, వారికి వారి యొక్క చాంద్రమాన జన్మదినోత్సవ శుభాభినందనా నమస్సులను అర్పిస్తూ వారి శ్రీపాదములచెంత చిరు కవనకుసుమాంజలి ప్రయుక్త సాష్టాంగ ప్రణామములు గావించడం ఒక తెలుగు వాడిగా జన్మించినందుకు నా జన్మాంతర సుకృతం....

వారి గురువుగారైన శ్రీ అమరేశ్వరప్రసాద్ గారికి నమస్కరిస్తూ... 
ఆ శ్రీవరభద్రగిరీషుడైన పావన గౌతమీ తటస్థిత
శ్రీ సీతారామచంద్రస్వామి వారి అనుగ్రహంతో శ్రీచాగంటి సద్గురుదంపతులు మరియు వారి యావద్ కుటుంబం కూడా నిండునూరేళ్ళు నమస్కరించిన శిష్యులెల్లరిని ఘనంగా అనుగ్రహిస్తూ ఉండాలని ఆకాంక్షిస్తూ.....
శ్రీగురవేనమః...
🙏🙏🙏🙏🙏🙏
💐💐💐💐💐💐💐💐💐💐💐
🍦🍕🍧💐🎂😊
 

Thursday, July 7, 2022

శ్రీ శుభకృత్ నామ సంవత్సర 2022 ఆషాఢ బోనాల జాతర శుభాభినందనలు.....🍦🍕🍧💐🎂😊


ఒక 550 గ్రాముల బోనం అమ్మవారికి సమర్పింపబడితే, అందులో 
279.6 గ్రాముల గుడాన్నం/బెల్లమన్నం మరియు
(205.04 గ్రాముల హరిద్రాన్నం/పసుపన్నం + 
65.36 మిల్లి లీటర్ల వేపనీరు = 270.4 కిలోల నైవేద్యం) వెరసి 550 గ్రాములు ఉండే బోనం / భోజన నివేదనలో....మనం గమనిస్తే....

తీపి + ఘాటు + వగరు అనే మిశ్రమాల కలబోతగా ఉండే నైవేద్య సమర్పణే ఆషాఢ బోనం.....

ఒకే మూర్తిగా కొలువై ఉండే ఆదిపరాశక్తి లోని ఏ అంశకు ఏ నివేదన అందివ్వబడుతున్నది అనేది వేరే సబ్జెక్ట్....
శాక్తేయ సంప్రదాయంలోని ఆదిపరాశక్తి  ఆరాధనలో సకల వైశ్విక శక్తులు ఒకే సమ్మిళిత సమాహార స్వరూపంగా కొలువైఉండడం అనేది శ్రీవిద్యా సంప్రదాయంలోని విశేషం....

అందుకే అమ్మవారిని ఈ క్రింది నామాలతో వాగ్దేవతలు స్తుతించినారు.....
( ఒకే విరాట్ స్వరూపంలో సకల విధమైన శక్తి తత్త్వములు వివిధ కూటములుగా కొలువైఉండడం / ఆరాధింపబడడం ) 

హరనేత్రాగ్ని సందగ్ధ కామ సంజీవనౌషధిః ।
శ్రీమద్వాగ్భవ కూటైక స్వరూప ముఖపంకజా॥34॥

కంఠాధః కటిపర్యంత మధ్యకూట స్వరూపిణీ ।
శక్తికూటైక తాపన్న కట్యథోభాగ ధారిణీ ॥ 35 ॥

మూలమంత్రాత్మికా, మూలకూట త్రయ కళేబరా ।
కుళామృతైక రసికా, కుళసంకేత పాలినీ ॥ 36 ॥

కుళాంగనా, కుళాంతఃస్థా, కౌళినీ, కుళయోగినీ ।
అకుళా, సమయాంతఃస్థా, సమయాచార తత్పరా ॥ 37 ॥

(నామపారాయణ గా స్తుతించడం / అర్చించడం అనే శ్రేయస్కర పరిధిని దాటి వివిధ శాక్తేయ సైద్ధాంతిక తత్త్వోపాసనల గురించి అందు నిక్షిప్తంగావింపబడి ఉండే శక్తివిస్ఫొటక బీజాక్షరాల గురంచి నేను చర్చింపజాలను.....
అవి కేవలం గురుముఖతః గ్రాహ్యమయ్యే లేదా ఆదిపరాశక్తి అనుగ్రహం తో సదరు ఉపాసకుడికి భాసించే శ్రీవిద్యా తత్త్వసందేశములు......
In simpler words, not every one who boards a flight is a pilot and thus only authorized trained personnel shall be allowed in to a plane's cockpit and its intricacies' discussions... )

ఒక సంవత్సర కాలంలో, 
ఉత్తరాయణం, దక్షిణాయణం అనే 2 అయనాల్లో
6 ఋతువులు, 12 మాసాలు, 24 పక్షములు, గా ఉండే కాలవిభాగంలో మన శరీరం ఒక్కో సమయంలో ఒక్కో విధమైన ప్రాకృతిక మార్పులకు / ప్రభావాలకు లోనై తత్ ఫలితాలతో నిరంతర మార్పును సంతరించుకుంటూ ఉంటుంది......

" ప్రపంచం " అనగా ప్రతి వస్తువు / ప్రాణి కూడా....

1. పుట్టుట.... 
2. పెరుగుట.... 
3. మార్పుచెందుట....
4. తరుగుట....
5. గిట్టుట...

అనే పంచ (5) విధమైన లక్షణాలతో ఉండునది....

మన శరీరం పై ఒక దోమకుడితే....
ఒక ఎర్రని సెగగడ్డలా పుట్టే వ్రణం....
క్రమంగా పెరగడం..... 
రంగు / పరిమాణం లో మార్పుచెందడం..... 
కొంత సమయానికి తగ్గడం... 
ఆతర్వాత కొంతసమయానికి మానిపోవడం..... 

గమనించే ఉంటారు కద.....

"తాత్కాలికంగా వచ్చి పోయిన ఆ వ్రణానికి శరీరము సాక్షి గా ఉండి ఆ మార్పును గమనించినది......"
అనేది ఒక స్థాయిలోని అధ్యయనం.....

పుట్టడం , పెరగడం..... 

10 వాయువులు / ప్రాణాల్లో ఒకటైన సమాన వాయువు యొక్క విశేషమైన వ్యవస్థాంతర్గతంగా శరీరం సాగడం / మార్పుచెందడం.....

50/60 దాటిన తదుపరి చైతన్యం/ఓపిక/సత్తువ/ తగ్గడం....

60 నుండి 100 సంవత్సరాల లోపు ఎప్పుడు ఈశ్వరుడి ఆనతిగా అనుగ్రహింపబడిన ఆయుః ప్రమాణం యొక్క లెక్కలు సరిపోయినవో అప్పుడు శరీరం తనంత తానుగా శరీరాంతర్గత జీవశక్తిని కోల్పోయి దేహం పార్థివదేహం గా తుది మజిలీకి చేరుకోవడం...... 

అనే 5 పరిణామక్రమాలను అందరూ గమనించే ఉంటారు.....

మనుష్య జన్మలో....

తీపి అనే మధురం 1. 2 పరిణామములను సూచిస్తుంది..... 
(పుట్టుట, పెరుగుట.... )

ఘాటు 3 వ దైన మార్పును సూచిస్తుంది..... 

వగరు 4. 5 వ పరిణామములను సూచిస్తుంది..... 
(తరుగుట , గిట్టుట...)

1.2.3 అనే పరిణామక్రమాలు ఎల్లరికీ అమోదయోగ్యమై ఉండేవే......
కాని 4. 5 అనే పరిణామక్రమాలు చాలామంది స్వాగతించనివి..... 

ఓ 10 సంవత్సరాల బాలుడుకి నీకు ఇంకో 60 సంవత్సరాల జీవితం ఉంది బాబు అని బర్త్డే స్వీట్ తినిపిస్తే అది మధురంగా ఉంటుందేమో కాని....

ఓ 60 దాటిన వ్యక్తికి నీకు ఇంకో 15 సంవత్సరాలు మాత్రమే జీవితం మిగిలి ఉంది అని బర్త్డే స్వీట్ తినిపిస్తే అది వగరుగానే ఉంటుంది.....

అది మానుష స్వాభావిక లక్షణం....

మనం స్వాగతించినా.....స్వాగతించకున్నా....
" ప్రపంచం " లోని ప్రతి వస్తువు / ప్రతి ప్రాణి కూడా ఈ 5 పరిణామక్రమాల్లో ఉనికిని స్థిరీకరించుకుంటూ ముందుకు సాగుతూ ఒకనాడు శైధిల్యం చెంది విశ్వంలోని పంచభూతాల్లోకి.....
దేహం లోని పంచభూతాలు లయించిపోవడం....
అనేది అవశ్యమైన ప్రక్రియ.....

అది ఎవ్వరైనా.....ఎంతటి వారికైనా సరే ఒకేవిధంగా సాగే ప్రకృతి యొక్క శాసనం......

అటువంటి పరిణామక్రమాన్ని పరిపూర్ణమైన ఎరుకతో,
పరిణతిచెందిన భావవైశాల్యంతో,
పరిపక్వమైన బౌద్ధిక ఆకళింపుతో స్వాగతించడం అనేది కేవలం ఈశ్వరానుగ్రహంగా సంభవించే అంశం.....

శ్రీ చాగంటి సద్గురువులు, సకల అధ్యాత్మ ఉపాసన యొక్క సారాన్ని ఒకే ఒక్క వాక్యంలోకి ఎంతో గొప్పగా ఒదిగేల ఒకచోట ప్రవచించడం కొందరికైనా గుర్తుండి ఉండాలి......

నిరంతర ఈశ్వరోపాసనతో మనుష్యుడు ఏ స్థాయికి వెళ్ళగలగాలి అంటే.....

" దాహం....పొయ్ నీరు......
ఆకలి.....వెయ్ కబళం..... "

అనే స్థాయిలో శరీరాన్ని సాక్షిగా దర్శించేంతవరకు......

అనడానికి ఏదో అరటిపండు ఒలిచి నోట్లో వేసినంత తేలికగా అనిపించినా.......
ఈ స్థాయిలో మనుష్యుడు చరించగలగడం అనేది ఏ స్థాయిలో సాధన సాగితే సమకూరే విద్వత్తో ఎవరికి వారు వారి వారి వివేచనతో బేరీజు వేసుకునే అంశం.....

అమ్మవారికి ఈ విధంగా 
మధురం+ఘాటు+వగరు సమ్మిళితమై ఉండే బోనం సమర్పణంతో.....
మన నిత్య ప్రాపంచిక  జీవితాంతర్భాగమైన పయనంలో మనకు ఆ పరాశక్తి అనుగ్రహంగా ఆ స్థాయిలో విద్వత్తు సమకూరుతుంది అనేది ఇందలి అధ్యాత్మ తత్త్వ సందేశం....

అంటే ఇట్ల బోనం సమర్పించగానే అట్ల అంతటి విద్వత్తు సమకూరుతుందా అని అనడం కాకుండా.....
అట్ల ఎన్నో సంవత్సరాలుగా సమర్పింపబడిన ఆషాఢ బోనానికి ప్రతిఫలంగా ఆ విద్వత్తు ఒకనాడు సమకూరుతుంది అనేది ఇందలి విశ్లేషణ.....

మామిడి పిక్క ఇట్ల భూమిలో పాతగానే అట్ల కాయలు కాసి పండ్లైతయా.....?

పిక్క నుండి మొలకెత్తిన అంకురం,
మొక్కై, చెట్టై, పూత దాల్చి, వేలాదిగా పిందెలు కాసి, వందలాదిగా కాయలు నిలిచి, వాటిలో చెట్టుపైనే ఉండి పండ్లుగా రూపాంతరం చెందినప్పుడు.....
ఒకనాడు భూమిలో పాతిన మామిడి పిక్క ఇన్నాళ్ళకు ఇంతమందికి మధురసభరితమైన సాటిలేని మేటి ఆమ్రఫలములను అందిస్తున్నది అనేది సత్యం......

అదే విధంగా ఈనాడు ఆషాఢ శక్తికి సమర్పింపబడిన బోనం / నమస్కారం అనేది ఏదో ఒకనాటికి భక్తులకు ఆ విద్వత్తును కటాక్షిస్తుంది అనేది భగవతి అనుగ్రహ విశేషం.....

జడానికి కూడా శక్తి ఉంటుంది అనే ఈనాటి శాస్త్రవేత్తల సైన్స్ ని ఆనాడే వాగ్దేవతలు నుడివినారు....

పంచాంగ పరంగా శూన్యమాసం అయిన ఈ ఆషాఢంలో విశేషమైన శక్తిస్వరూపిణి గా మేల్కొనే ఆ ఆదిపరాశక్తి....., 
ఆషాఢ శక్తిగా ఊరూరా, గ్రామగ్రామానా, పల్లెపల్లెలో, పట్నాల్లో, ఆరాధింపబడుతూ సమర్పింపబడే విశేషమైన బోనం / నైవేద్యంతో శాంతించి భక్తులెల్లరిని శాంతమూర్తిగా ఉండి చల్లగా సమ్రక్షించుగాక అని కోరుకుంటూ....

భవానీ, భావనాగమ్యా, భవారణ్య కుఠారికా ।
భద్రప్రియా, భద్రమూర్తి, ర్భక్తసౌభాగ్య దాయినీ ॥ 41 ॥

భక్తిప్రియా, భక్తిగమ్యా, భక్తివశ్యా, భయాపహా ।
శాంభవీ, శారదారాధ్యా, శర్వాణీ, శర్మదాయినీ ॥ 42 ॥

శాంకరీ, శ్రీకరీ, సాధ్వీ, శరచ్చంద్రనిభాననా ।
శాతోదరీ, శాంతిమతీ, నిరాధారా, నిరంజనా ॥ 43 ॥

నిర్లేపా, నిర్మలా, నిత్యా, నిరాకారా, నిరాకులా ।
నిర్గుణా, నిష్కళా, శాంతా, నిష్కామా, నిరుపప్లవా ॥ 44 ॥

నిత్యముక్తా, నిర్వికారా, నిష్ప్రపంచా, నిరాశ్రయా ।
నిత్యశుద్ధా, నిత్యబుద్ధా, నిరవద్యా, నిరంతరా ॥ 45

ఓం భావనాగమ్యాయై నమః

ఓం శ్రీభద్రకాళ్యై నమః

ఓం శాంతిః...శాంతిః...శాంతిః....
🙏🙏🙏🙏🙏😊🎂💐🍧🍕🍦

చిచ్ఛక్తి, శ్చేతనారూపా, జడశక్తి, ర్జడాత్మికా ।
గాయత్రీ, వ్యాహృతి, స్సంధ్యా, ద్విజబృంద నిషేవితా ॥ 90 ॥

తత్త్వాసనా, తత్త్వమయీ, పంచకోశాంతరస్థితా ।
నిస్సీమమహిమా, నిత్యయౌవనా, మదశాలినీ ॥ 91 ॥

మదఘూర్ణిత రక్తాక్షీ, మదపాటల గండభూః ।
చందన ద్రవదిగ్ధాంగీ, చాంపేయ కుసుమ ప్రియా ॥ 92 ॥

కుశలా, కోమలాకారా, కురుకుళ్ళా, కులేశ్వరీ ।
కుళకుండాలయా, కౌళ మార్గతత్పర సేవితా ॥ 93 ॥

కుమార గణనాథాంబా, తుష్టిః, పుష్టి, ర్మతి, ర్ధృతిః ।
శాంతిః, స్వస్తిమతీ, కాంతి, ర్నందినీ, విఘ్ననాశినీ ॥ 94 ॥

(
నా గత సంవత్సర బోనాల విశేషాల పోస్ట్లు ఈ క్రింది లింకుల్లో లభించును....

https://shreeguravenamah-aithavk.blogspot.com/2021/07/01-2021.html?m=1

https://shreeguravenamah-aithavk.blogspot.com/2020/07/blog-post_12.html?m=1

https://shreeguravenamah-aithavk.blogspot.com/2018/09/blog-post_16.html?m=1

https://shreeguravenamah-aithavk.blogspot.com/2019/06/blog-post_20.html?m=1

https://shreeguravenamah-aithavk.blogspot.com/2019/07/2019-bonaalu.html?m=1
)

Tuesday, July 5, 2022

శ్రీశుభకృత్ నామసంవత్సర రాబోయే ఆషాఢ శుద్ధ ఏకాదశి / తొలి ఏకాదశి పర్వ సమయ శుభాభినందనలు.....(July-10-2022) 🍦🍕🍧🎂💐😊


శ్రీవేంకటాచలాధీశం శ్రియాధ్యాసితవక్షసం
శ్రితచేతనమందారం శ్రీనివాసమహంభజేత్

శ్రీశుభకృత్ నామసంవత్సర దక్షిణాయణ పుణ్యకాల ప్రారంభ పర్వసమయ ఆగమనాన్ని సూచించే ఆషాఢ శుద్ధ ఏకాదశి ని తొలి ఏకాదశి పండుగ గా ఎల్లరూ జరుపుకోవడం విదితమే....

" చిత్తా నక్షత్రంతో చంద్రుడు కూడి ఉండే చైత్రమాస శుద్ధ ఏకాదశి....లేనిచో....
అశ్విని నక్షత్రంతో చంద్రుడు కూడి ఉండే ఆశ్వయుజ మాస శుద్ధ ఏకాదశి...
తొలి ఏకాదశి అవ్వాలి కద.....
మరి ఆషాఢ మాసంలోని శుద్ధ ఏకాదశి తొలి ఏకాదశి ఎట్లైంది..? "

అనే సందేహం కొందరికైనా వచ్చి ఉండాలి....

అనగా ఇక్కడ మాస క్రమం లేదా నక్షత్ర క్రమం కాకుండా......
అయన క్రమాన్ని ప్రాతిపదికన గావించి తొలి ఏకాదశి గా భావించడం అనే అంశంలో మనం గమనించగల అధ్యాత్మ వస్తువిషయాలేంటో చూద్దాం......

ఏకాదశి అనగా ఆదేశమగుట.....
( సవర్ణదీర్ఘ సంధి / గుణసంధి / ఇత్యాదిగా గల సంధి సూత్రాలను గమనిస్తే ఆదేశమగుట అంటే ఏంటో అనే దానిపై అవగాహన లభిస్తుంది.....)

"అ కారానికి ఇ  ఉ, రు, లు పరమైనచో క్రమమగా ఏ, ఓ, ఆర్, లు ఆదేశమగును......"
అనే గుణసంధి సూత్రంలో చెప్పబడినట్టుగా......

[ https://pratibha.eenadu.net/eligibilityexams/lesson/tet/andhra-pradesh/telugu-medium/education/2-3-25-47-730-1231-5126-6390-1182-20040007163 ]

ఒక పదవిభాగం లో ఉత్తర విభాగంలోని పూర్వాక్షరం, సంధి అనంతరం తన స్వస్వరూపానికి ఆహ్వానింపబడే  మార్పు ఇక్కడ  " సంధి " అనే ప్రక్రియ ద్వరా సూచింపబడుతుంది....

ఈ విధమైన  " ఆదేశమగుట " అనే ప్రక్రియ కాల విభాగంలో కూడా ఉండడం, మాఘ పంచక సమయానంతరం వచ్చే ఆషాఢ మాసం అందుకు నెలవు కావడం
( అనగా ఉత్తరాయణం పూర్తై దక్షిణాయణం లో కాలం / భూభ్రమణం సాగే సమయం )
ఎల్లరికి తెలిసిందే.....

తొలకరి జల్లులతో మొదలైన వర్షాకాలనికి స్వాగతం పలికిన అవని.....

తొలుత మహిళలకు, వృద్ధులకు, సీట్ల కేటాయింపుల్లో ప్రాధాన్యం ఇవ్వండి...,

ఇత్యాదిగా ఉండే వాక్యాలను....

'తొలిసంధ్య వేళలో....
తొలి పొద్దుపొడుపులో.....
తెలవారే తూరుపులో......
వినిపించే రాగం భూపాళం......"
అనే పాటను...

ఎప్పుడో ఒకప్పుడు వినే ఉంటారు......

కాబట్టి మొట్టమొదటి  అనే అర్ధంలో 
తొలి అనే పదాన్ని ప్రయోగించినప్పుడు....
ఆషాఢ శుద్ధ ఏకాదశి అనేది ఏవిధంగా తొలి ఏకాదశి అవుతుందో కొంత తర్కిద్దాం.....

సూర్యుణ్ణి ప్రత్యక్ష నారాయణుడిగా ఆరాధించే సత్సంప్రదాయం అనాదిగా భారతావనిలో సనాతనధర్మాంతర్గతమైన విశేషం.....

శ్రీమహావిష్ణువు శ్రీమన్నారాయణుడిగా సుదర్శనచక్రధారిగా.....
శ్రీకంఠుడు త్రిశూలధారిగా..
దేవేంద్రుడు వజ్రాయుధ ధారిగా.....
ఆరాధింపబడడం ఎల్లరికి విదితమే... 

ఈ దేవతా ఉపాధుల్లో ఉండే పుణ్యజీవులకు ఇంతటి శక్తివంతమైన ఆయుధాలు సూర్యనారాయణ మూర్తి యొక్క తేజస్సు నుండి దేవశిల్పి విశ్వకర్మచే తయారుచేయబడినవి అని శ్రీచగంటి సద్గురువుల ప్రవచనాల్లో వినే ఉంటారు.....

స్థితికారుడిగా శ్రీమహావిష్ణువు /  శ్రీమన్నారాయణుడు పేర్గాంచడం ఎల్లరికి విదితమే....

ఈ స్థితికారక తత్త్వాన్నే మనం సూర్యనారాయణుడిలో నిత్యం దర్శిస్తూ ప్రతిరోజు నమస్కరిస్తున్నాము.....
( వారివారికి నిర్దేశింపబడిన సంధ్యా ఉపాసన / గాయత్రి శ్లోకములతో / సవితృమండలమధ్యవర్తిని ఆరాధించడం అనే ప్రక్రియలో......)

సూర్యుడికి / సూర్య శక్తి జనిత సుదర్శనచక్రానికి / సూర్యనారాయణుడిగా ఆరాధింపబడే  శ్రీమన్నారాయణుడి కి అభేదం......

శ్రీమన్నారాయణుడు ఒకానొక సమయంలో రాక్షసులతో జరిగే యుద్ధంలో అలసి ఉండగా తన తిరుమేని నుండి ఒక స్త్రీ శక్తి ఆవిర్భవించి రాక్షస సమ్హారం గావించినందుకు ప్రతిగా......
దైవిక కాల గణన వ్యవస్థలో అనగా తిథి, వార, నక్షత్ర, యోగ, కరణమనబడే, పంచాంగ వ్యవస్థలో శాశ్వతమైన కీర్తిని గడించి.... 
శ్రీమన్నారాయణుడికి ఎంతో ప్రీతిపాత్రమైన తిథి గా,
సర్వశ్రేష్ఠమైన శాశ్వత స్థానాన్ని ఆర్జించిన వైభవం ఏకాదశిది..... 

మన శరీరం అనేది కేవలం అవి ఇవి తిండ్లు తినడానికి మాత్రమే లభించిన సాధనం కాదు.....
బాహ్య స్థూల శరీరానికి బిస్కెట్లు, బిర్యానీలు, అందించి బాగా దారుఢ్యాన్ని అందించడం ఎంత గొప్పో.......

ఆంతర సూక్ష్మశరీరానికి చక్కని దైవిక ఆలంబనను, 
అధ్యాత్మ వస్తువిషయసామాగ్రిని అందించిన నాడు మన కేవల మానుష శరీరమే ఎన్నెన్నో దైవిక భూమికలకు ఆవాసమై ఉండే యోగ శరీరాన్ని సిద్ధింపజేసుకోగలదు......

84 లక్షల జీవరాశుల్లో కేవలం మనుష్యుడుకి మాత్రమే ఈ వరం కలదు.....అది భగవద్ అనుగ్రహంగా ఎవరికి వారు సాధన / ఉపాసన గావించి అందుకోవాలి......

అటువంటి ఆధ్యాత్మిక ఉపాసనకు / యోగ సాధనకు దక్షిణాయణ పుణ్య కాలం నెలవు అని శ్రీ చాగంటి సద్గురువులు ఒక ఎగ్సాంపుల్ కూడా చెప్పడం కొందరికైనా గుర్తుండే ఉంటుంది....
( ఉత్తరాయణంలో కాకుండా దక్షిణాయాణం లో గతించడం గురించి వివరిస్తూ...)

ఆధ్యాత్మిక ఉపాసనకు నెలవైన ఈ దక్షిణాయణ పుణ్యకాలంలో, ఉపాసనా బలాన్ని బాగా వృద్ధి గావించుకోడానికి సంప్రదాయాన్ని పాటించే మాన్యులైన పీఠాధిపతులు కూడా చాతుర్మాస్య దీక్షను అవలంబించడం గమనించే ఉంటారు.......

ఉపాసన బలం అంటే ఏంటి....అది ఎట్లు విదితమగును.....

ఒక మనిషికి బాగా అర్ధ/ధన బలం ఉంటే....
" అబ్బో ఆయనకి ఏం తక్కువ.....
ఎక్కడ ఎన్ని ఆస్తులు ఉన్నాయో ఆయనకే గుర్తులేవు......"
అని అంటుంటారు..... 

ఒక మనిషికి బాగా అంగ బలం ఉంటే....
" అబ్బో ఆయనకి ఏం తక్కువ.....
ఎక్కడికి వెళ్ళినా ఆయన చుట్టూ ఓ వంద మంది రక్షణగా ఉంటారు..."
అని అంటుంటారు.....

ఇలా లౌకికమైన బలాలన్నీ కూడా సదరు వ్యక్తి యొక్క భౌతికమైన హోదా, సంపద, జనాభిమానం, ఇత్యాదిగా ప్రకటితమవ్వడం తో వాటి యొక్క ఉనికికి కచ్చితమైన కొలమానం అనేది సాధ్యమయ్యే అంశం......

కాని యోగశక్తికి / అధ్యాత్మ ఉపాసనా బలానికి అటువంటి భౌతికమైన కొలమనాలు ఉండవు.....
ఎందుకంటే అది భౌతిక విభూతి కాదుకాబట్టి.....

సదరు సాధకుడి సంకల్పానికి అనుగుణంగా ఆ యోగబలం / ఉపాసనా బలం అనేది చిరంతనమైన కాలప్రవాహంలో కాలగతికి అతీతంగా తనను తాను వ్యక్తపరుచుకునే దైవిక సంపద....

అది ఎవ్విధమైన భౌతిక విభూతులకు కూడా అందని / మేయము కాజాలని / గ్రాహ్యము కాని దైవిక సంపద......
అదే స్థాయిలో, లేదా అంతకంటే ఉన్నతమైన స్థాయిలో ఉండే యోగులకు మాత్రమే దర్శనీయమై ఉండే దైవిక స్థితి యొక్క అనుభూతి గా మాత్రమే వాటిని వర్ణించగలము......

అనగా " కేవల మానుష ఉపాధిలోకి దైవిక తత్త్వము అధ్యాత్మ సంకల్పంతో ఆదేశమగుచున్నది....."
అనే నిర్వచనము ఇక్కడ సరితూగుతుంది....

ఏకాదశి అనే తిథికి గల ప్రత్యేకత రీత్య, దక్షిణాయణ పుణ్యకాల ప్రారంభ సమయంలో "యోగ నిద్రకు" ఉపక్రమించే శ్రీమన్నారాయణుడి యోగ భూమికకు, అనగా తన దైవిక తిరుమేని నుండి జనించే వివిధ యోగ తత్త్వాలకు, మరియు ఈ కాలంలో వచ్చే ఏకాదశికి ఒక విధమైన సామ్యము ఏర్పడుతుంది.....

మామూలుగానే ఏకాదశి ఎంతో ప్రీతికరమై ఉండగా,
ఉపాసన రీత్యా ఎంతో విశేషమైన ఈ దక్షిణాయణ పుణ్యకాలం లో జాగ్రత్ స్థితి నుండి స్వప్న/సుషుప్తి స్థితుల్లోకి శ్రీమన్నారాయణుడి దైవిక చైతన్య శక్తి రూపాంతరం గావింపబడే సమయంలో తొట్టతొలి 
యోగప్రక్రియ జనిత శక్తిని ఆదేశపరుచుకునే తిథి కాబట్టి తొలి ఏకాదశిగా ఈ దేవశయన ఏకాదశి ఖ్యాతి గడించింది......

ఇదంతా చాలా కాంప్లెక్స్ గా ఉంది అని అనిపిస్తే......
ఒక సింపుల్ ఎగ్సాంపుల్లో వివరిస్తా.......

ఒక ముఖ్యమైన నేత 8 గంటల ముఖ్యమైన చర్చలకోసం అని ఒక క్యాంప్ సమావేశానికి / సదస్సుకు వెళ్ళేముందు,
( లోనికి మీడియాకు అనుమతి లేదు....కేవలం చాలా ముఖ్యమైన కొందరు వ్యక్తులకు మాత్రమే ప్రవేశం ఆ సదస్సు ప్రాంగణంలోకి.....)
ఇచ్చే స్టేట్మెంట్ అనేది ఆ 8 గంటలవరకు కూడ మీడియాలో పదే పదే రిపీటెడ్ ముఖ్యాంశాలుగా / న్యూస్ గా వినిపించడం గమనించే ఉంటారు........

ఆ నేత మళ్ళి తిరిగివచ్చి ఇంకో స్టేట్మెంట్ ఇచ్చే వరకు ఏ ఛానెల్ పెట్టినా కూడా ఆ ఒక్క న్యూసే రిపీటెడ్ బ్రోడ్కాస్ట్ గావించబడుతుంది......

అచ్చం అదే విధంగా ఒక 8 ఏకాదశుల పర్యంతం, యోగ నిద్రలోకి ఉపక్రమించే శ్రీమన్నారాయణుడి నుండి అందే ఒక విధమైన తొట్ట తొలి యోగ విభూతికి ఆవాసమై ఉండే తిథి కాబట్టి, ఈ ఆషాఢ శుద్ధ ఏకాదశిని / దేవశయన ఏకాదశిని
తొలి ఏకాదశిగా ఆస్తిక లోకం స్వాగతించడం అనాదిగా పరిఢవిల్లుతున్న సత్సంప్రదాయం.....

సదరు ఉపాసకుడు ఏ యోగమార్గాన్ని అనుసరిస్తూ, ఏ సాధనలో ఏ స్థాయిలో ఉన్నాడో అనే దానికి అనుగుణంగా ఆ శ్రీమన్నారాయణుడి నుండి అందే తొట్ట తొలి యోగ విభూతి వారి వారి దక్షిణాయణ పుణ్యకాల ఉపాసనకు దోహదం గావిస్తుందనేది వారి వారి వ్యక్తిగత ఆధ్యాత్మికతకు సంబంధించిన విషయం........

జ్యేష్ఠ మాసంలో స్వామి వారి దర్శనానికి గతవారం వెళ్ళినప్పుడు, ఆనందనిలయంలోని
కులశేఖరపడికి ఆవల వర్ణింపశక్యంకాని వైభవంతో అలరారే ఆ శ్రీవేంకటేశ్వరస్వామి వారి సజీవసాలిగ్రామావేశిత శ్రీవైష్ణవ తేజస్సును దర్శిస్తూ ఎంతగానో అనుగ్రహింపబడినాను.....
(మొట్టమొదటి సారి శ్రీకాణిపాక సిద్దివినాయక ఆలయం మరియు రెండవసారి శ్రీకాళహస్తి వాయులింగ క్షేత్ర దర్శనానుగ్రహం కూడా లభించింది)

ఈ దైవానుగ్రహంలోని అదేశమగుట అనే సిద్ధాంతం గురించి, ఏ విధంగా శ్రీహరిసంకీర్తనము దైవానుగ్రహాన్ని 
"ఆదేశపరుచుట" అనే ప్రక్రియలోకి 
అప్రయత్నంగానే భక్తులను నిమగ్నంగావించి తరింపజేస్తుందో....
శ్రీ తాళ్ళపాక అన్నమాచార్యుల వారు ఈ క్రింది రసరమ్యమైన సంకీర్తనలో నుడివినారు.......
😊💐🎂🍧🍕🍦🙏

https://pedia.desibantu.com/kaliyugambunaku-galadidiye