Sunday, March 3, 2019

మానవశరీరము పాలు - సంకీర్తన మజ్జిగ - సేవ వెన్న - సాధన నెయ్యి...!

Ashwin Kumar Dulluri to Sri chaganti koteswar rao gaaru (Sharada Jnana Puttra)
ఓ శిష్యుడు గురువును అడిగిన ప్రశ్న.
నాశనమయ్యే ఈ శరీరంలో నాశనంకాని ఆత్మ ఎలా ఉంటుంది?
గురువుగారు యిలా అన్నారు,
పాలు ఉపయేగపడేవేె, కాని ఒక్క రోజుకు మించితె పాడైపోతాయి.
పాలలొ మజ్జిగ చుక్క వేస్తె పెరుగు అవుతుంది.
పెరుగు మరొకరోజువరకు ఉపయోగపడతుంది.
కాని పెరగు వేరొకరోజుకి పాడైపోతుంది.
పెరుగును మదిస్తే వెన్న అవుతుంది.
వెన్న మరొకరోజు వరకే ఉంటుంది.
తరువాయి అదికూడా పాడైపోతుంది.
ఆ వెన్నను మరిగిస్తే నెయ్యి అవుతుంది.
ఈ నెయ్యి ఎన్నటికి పాడవ్వదు.
ఒక్కరోజులొ పాడైపోయే పాలలో ఎన్నటికి పాడవ్వని నెయ్యి దాగివుంది.
అలాగే అశాశ్వతమైన ఈశరీరమునందు శాశ్వితమైన ఆత్మ ఉంటుంది.
మానవశరీరము పాలు
సంకీర్తన మజ్జిగ
సేవ వెన్న
సాధన నెయ్యి

No comments:

Post a Comment