Wednesday, December 30, 2020

శ్రీ శార్వరి మార్గశిర పౌర్ణమి / శ్రీదత్తజయంతి శుభాభినందనలు.....😊🍕💐🍨🍟

శ్రీ శార్వరి మార్గశిర పౌర్ణమి / శ్రీదత్తజయంతి శుభాభినందనలు...😊🍕💐🍨🍟

మన సనాతన ధర్మంలో దాదాపుగా ప్రతినెల ఏదో ఒక పండుగ, ఉత్సవం వస్తూనే ఉంటాయి... ( శూన్యమాసం గా భావించబడే ఆషాఢంలో ఆదిపరాశక్తి యొక్క జాతరలు ( నైసర్గికప్రాంతీయాచారానుగుణంగా ) మరియు గురుపౌర్ణమి / వ్యాసపౌర్ణమి ఉత్సవాలు గా జరుపుకోవడం వల్ల ఆ నెలలో కూడా పంచాంగ వ్యవస్థ యొక్క పారమార్ధిక స్థిరత్వం ఎట్లు మన పెద్దలు సమకూర్చినారో ఇతహ్పూర్వం ఒక పోస్ట్లో వివరించాను )

ప్రతి పండుగ వెనక ఒక ఐతిహ్యం, ఒక పౌరణికప్రాశస్త్యం, ఒక దేవుడి అవతార వైశిష్ట్యం, ఒక చారిత్రక సంఘటన యొక్క సంస్మరణ, ఇలా ఏదో ఒక నేపథ్యం తో ఆ పండుగ జరుపబడి, మనుజానీకానికి ఒక చక్కని సందేశం / తత్సంబంధ దైవానుగ్రహం అందించి మనల్ని తరించేలా మన సనాతన ధర్మావలంబిత సదాచార సంపన్నులు అనుగ్రహించారు....

అనాదిగా ఉన్న దైవిక వ్యవస్థను ఒకసారి గమనిస్తే,

"పూర్వజాత్రిపురాంబిక" గా ఎప్పటినుండో చెప్పలేన్నప్పటినుండి ఉన్న ఆదిపరాశక్తి, ఆ ఆదిపరాశక్తి యొక్క విశ్వపరిపాలనావ్యవస్థ కొరకు సృజించబడిన త్రిమూర్తులు
బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు
మరియు వారి వారి శక్తి ఉద్దీపక స్త్రీసామ్యములు అనగా
సరస్వతి, లక్ష్మీ, సతీదేవి / పార్వతీ
గా నిత్యం త్రిమూర్తులతో ఉండే వారి శక్తికేంద్రములు....
అనగా వారి యొక్క శక్తి నిత్యం ప్రవర్ధమానమై ఉండడానికి కారణభూతులు గా ఉండే వారి వారి అర్ధాంగులు....

లౌకికంగా అర్ధాంగి అంటే జీవితభాగస్వామి అని అర్ధం...

దేవ పరిభాషలో వారి అర్ధాంగులు అనగా వారి వారి శక్తిప్రకటనకు కారణమై ఉండే వారు....

తన చతుర్వదనములపై ఆ సరస్వతి దేవిని ఆవహించుకొనే బ్రహ్మ గారు తన సృజన శక్తిని కొనసాగించేది....

తన వక్షస్థలమున లక్ష్మీ దేవిని కొలువైఉండేలా చేసుకొనే ఆ విష్ణుదేవుడు స్థితికర్తగా తన పరిపాలనను కొనసాగించేది....

తన వామభాగంలో శక్తిని కొలువైఉండేలా చేసి అర్థనారీశ్వరుడిగా ఉండి ఆ లయకారకుడు ప్రళయ ప్రక్రియను నిర్వహించేది...

వారి శక్తి స్థిరీకరణ లేనిచో ఆ స్థిరత్వం సంభవించదు....

అందుకే వారి వారి శక్తులు వారి నుండి దూరమైన సంఘటనల్లో వారు ఆల్మోస్ట్ పిచ్చివారిలా ఉగ్రులై, దశాదిశా తెలియని ఉన్మత్తులుగ అవ్వడం
మనం గమనించవచ్చు.....

దక్షప్రజాపతి అవమానం భరించలేక తనను తాను యోగాగ్నికి ఆహుతి చేసుకున్న సతీదేవి దేహన్ని భుజాన వేసుకొని ఉగ్రుడై, ఉన్మత్తుడై ఆ మహేశ్వరుడు సంచరించడం....
మరలా మేనకాహిమవత్ పుత్రికగా హైమవతిగా ప్రభవించి పార్వతీ కళ్యాణం తో
"శివవామభాగనిలయాం శ్రీచక్రసంచారిణీం..." గా శక్తిస్థిరీకరణ జరిగిన తదుపరి
శ్రీకంఠుడు సంతసించినాడు...

భృగుమహర్షి అవమానం భరించలేక తన నివాస స్థానమైన శ్రీహరివక్షసీమను వీడి భూలోకానికి పరిమితమైనప్పుడు, ఆ హరి పిచ్చివాడిలా కొండల్లో కోనల్లో తిరుగుతూ పుట్టలో తపస్సు గావిస్తు ఒక పసులకాపరి / గొల్ల చేతికర్రతో నెత్తికి గాయమై రక్తమోడే దయనీయ స్థితికి వచ్చి ఎన్నో కష్టాలు పడి, మళ్ళీ శ్రీపద్మావతీ దేవి / అలర్మేల్మంగై గా స్వర్ణకమలం నుండి ఉద్భవించి తన వక్షసీమను చేరగా, శ్రీవేంకటేశ్వరుడిగా స్వామి రూపాంతరం చెంది భూలోక వైకుంఠమైన తిరుమలలో కొలువైతే ఆవిడ వ్యూహలక్ష్మి గా శ్రీహరివక్షసీమను
అలంకరించి శ్రీశ్రీనివాసుడిగా స్వామి వారి శక్తిప్రకటనను అనుగ్రహాన్ని భక్తులకు అందించడం మనం గమనించే సత్యం...

ఇవ్విధంగా సాధారణ లౌకిక / పారలౌకిక చట్రం, అనగా భువరాది ఊర్ధ్వ లోకాల్లో నివసించే సదరు దేవతా ఉపాధికి ఆదిపరాశక్తిచే నిర్దేశించబడిన కర్తవ్యపాలన ఆ దేవతాస్థానంలో కొలువై ఉన్న ఉత్తమోత్తమ కేవల పుణ్యసంచయ జీవుడు నిర్వహించడం....

మరియు పుణ్యపాప సమ్మిళిత సంఘాతంతో భూలోకంలో జన్మమెత్తిన జీవులు తమ ప్రారబ్ధాన్ని అనుభవిస్తూ ఆగామిని కూడబెడుతూ మరలా మరలా సంచితాన్ని సవరిస్తూ తుది లేని జీవ చట్రంలో నిరంతర ప్రయాణం గావిస్తూ ఉండడం.....

ఇది సర్వసాధారణ వైశ్విక కర్మ వ్యవస్థ....

అది ఎవ్వరైనా సరే.....

రోడ్లను శుభ్రపరుస్తు జీవితాన్ని కొనసాగించే సదరు స్వీపర్ ఉపాధికైనా....

ఆ రోడ్డుపై రోల్స్ రాయిస్ కార్లో ప్రయాణించే ఒక సంపన్న వ్యక్తికైనా సరే.....

కర్మ సిద్ధాంతం అనేది ఎల్లరికీ ఒకేవిధంగా వర్తించే ప్రక్రియ....

మరి రంగులరాట్నంలా కర్మచక్రం తన పని తాను చేస్కుంటూ పోతే,
దేవుడు / ఈశ్వరుడు / దైవ కార్యాలు /
ఆధ్యాత్మికం, ఇవన్నీ ఏంటీ, ఎందుకు, అసలు ఎవరికోసం...?

ఇక్కడే ఉంది అసలైన కర్మసిద్ధాంత మౌళిక సూత్ర లోతుపాట్ల యొక్క ఉనికి పట్టు.....

దైవం / ఈశ్వరుడు / దేవతా సంబంధిత కార్యక్రమములు / ఆధ్యాత్మికత.....

ఇవన్నీ కూడా మనుష్యుల జీవితాలను తద్వారా ఆ మనుష్యోపాధి లో కొలువైన సదరు జీవుడి ఉత్తర జన్మ ప్రయాణాలను ఘనంగా ఉద్ధరించే పాసిటివ్ కెటలైటిక్ ఎలిమెంట్స్.....

చాలా సింపుల్ గా చెప్పాలంటే హైద్రబాద్ల మంచి పెద్ద పెద్ద యాపిల్లు కొనాలంటే 100 రూపాయలకు 5 వరకు బేరమాడి కొనుక్కొని తినొచ్చు....

అదే కశ్మీర్లోని యాపిల్ తోటలో ఐతే
అవే యాప్పిల్లు 100 రూపాయలకు కి 100 పండ్లు  కొనుక్కొని తినొచ్చు....కద...

అట్లే ఎండాకాలంలో ఎన్నో రకాల మామిడిపండ్లు కొనుక్కొని తినొచ్చు....

అదే చలికాలంలో అయితే ఎక్కడో తిరుమల లాంటి ప్రదేశాల్లో మాత్రమే కొన్ని రకాల మామిడి పండ్లను మాత్రమే కొనుక్కొని తినొచ్చు....కద...

మరి ఇక్కడ భేదం ఎక్కడున్నట్టు...??

దేశము మరియు కాలము....కద.....

అచ్చం అట్లే దేశకాలానుగుణంగా ఆచరింపబడిన కర్మ,
ప్రత్యేకించి ఈశ్వరప్రీత్యర్ధమై
ఆచరింపబడిన కర్మ, ఈశ్వరానుగ్రహంగా కోటి రెట్ల మేటి ఫలితాన్ని ప్రసాదిస్తుంది....

అన్యములైనవి సాధారణ కర్మసిద్ధాంతానుగుణంగా తమ ఫలితాలను తాము ఇవ్వడం కర్తవ్యం గా సాగిపోతుంటాయి.....

ఇది తిరుగులేని ఈశ్వర శాసనం....

తన అవతారాల ద్వారా,
తన ఉపాసకుల ద్వారా,
తన భక్తుల ద్వారా,

ఈశ్వరుడు వివిధ ఆధ్యాత్మిక విధివిధానాలను ఈ లోకానికి అందించాడు.....

వేదం...
ఉపనిషత్తు...
శాస్త్రం...
ఇతిహాసం....
పురాణం...
కావ్యం....
స్తోత్రం....
పద్యం....
శ్లోకం...
నామం...
అక్షరం...

ఇవ్విధంగా ఈశ్వరానుగ్రహంగా ఈ లోకంలోకి
వివిధ దేవతా ఉపాధుల ద్వారా....
మహర్షుల ద్వారా....
యతీంద్రుల / ఆచార్యుల / పీఠాధిపతుల  / జగద్గురువుల ద్వారా....
కవుల ద్వారా...

ఎంతో గొప్ప ఆధ్యాత్మిక వస్తువిషయ సామాగ్రి అనుగ్రహింపబడింది....

అందలి ప్రతిపాదిత ముఖ్యమైనవి, అన్నివిధాల హితకరమైనవి, లోకక్షేమకరమైనవి....
జీవనోద్ధారకమైనవి.....

సద్వర్తన గల పెద్దల ద్వారా,
సహృదయులైన గురువుల ద్వారా...
సదాచారసంపన్నులైన
ఆచార్యశిఖామణులద్వారా...
మరియు స్వాధ్యాయం తో తెలుసుకొని
ఆకళింపుచేస్కొని ఆచరించి తరించడంలో మానుష జన్మ యొక్క గొప్పదనం దాగున్నది.....

అవ్విధంగా

రోడ్లు శుభ్రపరిచే సదరు వ్యక్తి మరుజన్మలో ఆలయ పరిసరాలు శుభ్రపరిచే వ్యక్తిగా జన్మించినప్పుడు, దేశకాలానుగుణంగా ఆచరింపబడిన విహితకర్మమైనా సరే అది ఈశ్వర సంబంధంగా, ఈశ్వర ప్రీతికరంగా సాగింది కాబట్టి ఆ వచ్చే జన్మలో అటువంటి ఒక 100 ఆలయాలకు అన్నదాతగా తను, తన తరతరాల వారు జీవించేంతటి సౌభాగ్యహేతువుతో జన్మించి అదే రోడ్డుపై రోల్స్ రాయ్స్ కార్లో ప్రయాణిస్తూ వెళ్ళగలడు......

ఇదే కర్మ సిద్ధాంతంలో ఆధ్యాత్మికతకు గల గొప్పదనం....

మరలా అదే వ్యక్తి లేదా అతని తరంలోని వారు ఈశ్వరుడిని విస్మరించి, ఈశ్వర ప్రసాదిత భోగాసక్తులై మాత్రమే జీవిస్తే ఆ పుణ్యాలన్నీ క్షయమై మళ్ళీ రోడ్లు శుభ్రపరిచే జన్మలోకి ఆ జీవ ప్రయాణం యొక్క గతి వెళ్ళగలదు.....

అట్లు కాక, ఈశ్వర ప్రసాదిత భోగములను విహితప్రాప్తములుగా అనుభవిస్తూనే, తామరాకుమీద కొలువైన నీటిబిందువువలె వాటినుండి
ఉత్తరక్షణం నివృత్తి చెందగల సమర్ధతతో, ఈశ్వర ప్రీత్యర్ధమై, చిత్తశుద్ధి తో కర్మాచరణ గావిస్తూ ఉంటే అది క్రమక్రమంగా ఉన్నతమైన జన్మలకు జీవుడి ప్రయాణాన్ని సువ్యవస్థీకరిస్తూ ఏదో ఒక జన్మలో, ఒక మహానుభావుడి ప్రత్యక్ష సాన్నిధ్యంలో / సాన్నిధ్యంతో జీవితం తరించి అది మోక్షార్హతకు ఎంపికై ఈశ్వరుడి లీలలో ఒక భాగమైన ఉపాధిని గైకొని ఉత్తర జన్మలో ఈశ్వరుడినే చేరుతుంది....!

శ్రీ చాగంటి సద్గురువుల అత్యత్భుతమైన ఉదాహరణల్లో చెప్పాలంటే,
ఒక వేదవేదాంగ ఉపాసకులైన విద్వణ్మూర్తులకో,
ఒక పీఠాధిపతులకో, ఒక యతీంద్రులకో ఒక సిద్ధపురుషులకో, ఒక జగద్గురువులకో,
ఒక నాదోపాసకులకో,
సన్నిహితమైన జీవనం లభించి వారి
సమక్షంలో జీవనం దేశకాల ఆశ్రమధర్మానుగుణంగా పరిపూర్ణతను సంతరించుకొని ఈశ్వరుడిని చేరుతుంది....

సముద్రపు నీటి నుండి ప్రభవించి,
ఒక సముద్రం యొక్క లోతును కనిపెట్టాలని ప్రయాణం మొదలుపెట్టిన ఒక ఉప్పుబొమ్మ సముద్రంలో కరిగి సముద్రమే అయినట్టుగా...

ఈశ్వరానుగ్రహంగా జన్మించిన ఒకానొక జీవుడు, ఈశ్వర సంబంధంగా జీవిస్తూ, ఈశ్వర తత్త్వచింతనతో సాగే సుదీర్ఘజీవప్రయాణంలో ఒకానొక జన్మలో ఈశ్వరుడిలోకే లయించిపోయే అనుగ్రహం పొందడమే
ఆధ్యాత్మికత యొక్క గొప్పదనం....

ఆదిపరాశక్తి అమేయమైన సృజనలో...

నారాయణం ( శ్రీ మహావిష్ణువు )
పద్మభువం ( వారి నాభికమలజులైన బ్రహ్మగారు )
వశిష్ఠ మహర్షి
శక్తిమహర్షి
పరాశరమహర్షి
వ్యాసమహర్షి
శుకమహర్షి
గౌడపాదులు
గోవిందభగవద్పాదులు
శంకరభగవద్పాదులు మరియు వారి నలుగురి శిష్యులచే మొదలై కొనసాగే చతురామ్నాయ పీఠాధిపతుల వ్యవస్థ ద్వారా కొలువైఉండే జగద్గురువులు...

( అనగా ఇప్పటి శ్రీ దక్షిణామ్నాయ గురుపీఠాలంకృత శ్రీశృంగగిరి జగద్గురువరేణ్యులైన శ్రీ భారతీతీర్థమహాస్వామి వారు మరియు శ్రీ విదుశేఖరభారతీస్వామి వారి వరకు గల గురుపరంపర...)

మరియు

దక్షిణామూర్తి గా గురుస్వరూపమై కొలువైన సదాశివుని నలుగురు శిష్యులుగా సనక, సనందన, సనత్కుమార, సనత్సుజాతుల వరకు గల గురుపరంపర....

మరియు

శ్రీ అత్రి అనసూయాల కుమారులై త్రిమూర్త్యాత్మకంగా శ్రీదత్తాత్రేయ స్వామిగా ప్రభవించి
వారి పరంపరగా ఇప్పటి షిరిడీ సాయిబాబా వరకు గల గురుపరంపర....

( శ్రీపాదశ్రీవల్లభ స్వామిగా ఈ కలియుగంలో జన్మించి పిఠాపుర శ్రీక్షేత్రంలో కొలువైన వారి సన్నిధిలో ఇప్పటికీ శ్రీదత్తమహిమ ఈ లోకానికి అనుగ్రహన్ని ప్రసాదిస్తూనే ఉన్నది....)

ఇవ్విధంగా ఎందరో మహానుభావుల ద్వారా అనాదిగా ఆదిమధ్యాంతరహితమైన ఆ భగవద్ తత్త్వాన్ని, సందేశాన్ని, అనుగ్రహన్ని, ఈ మర్త్యలోకానికి అందించి జీవులను అమరత్వంవైపునకు మార్గనిర్దేశనం గావిస్తు సదా ఉద్ధరించే ఆ పరతత్త్వపు ప్రాపంచిక ప్రాశస్త్యం అప్పుడూ ఇప్పుడూ ఎల్లప్పుడూ తన ప్రాభవాన్ని ప్రదర్శిస్తూ భక్తులను పరిపరివిధాల పరిరక్షిస్తూ అనుగ్రహించడమే ఆ దైవానికి గల గొప్పదనం...

అలనాటి త్రిమూర్త్యాత్మక
శ్రీదత్తాత్రేయస్వామి వారే ఈనాటి శ్రీవేంకటేశ్వరస్వామి వారు కూడా....
అంటూ శ్రీ తాళ్ళపాక అన్నమాచార్యుల వారు, వారు కృతిపరిచిన ఒక చక్కని సంకీర్తనలో మనకు తెలిపి
అనుగ్రహించినారు కద.....😊

http://annamacharya-lyrics.blogspot.com/2007/09/306tane-tane-yimdari-gurudu.html?m=1

ప|| తానె తానే యిందరి గురుడు | సానబట్టిన భోగి జ్ఞాన యోగి ||

చ|| అపరిమితములైన యజ్ఞాల వడిజేయ | బ్రపన్నులకు బుద్ధి వచరించి|
తపముగా ఫలత్యాగము సేయించు | కపురుల గరిమల కర్మయోగి ||

చ|| అన్నిచేతలను బ్రహ్మార్పణవిధి జేయ | మన్నించు బుద్ధులను మరుగజెప్పి ||
ఉన్నతపదమున కొనరగ గరుణించు | పన్నగశయనుడే బ్రహ్మయోగి ||

చ|| తనరగ గపిలుడై దత్తాత్రేయుడై | ఘనమైన మహిమ శ్రీ వేంకటరాయడై |
వినరగ సంసార యోగము గృపసేయు | అనిమిషగతుల నభ్యాసయోగి ||


Saturday, December 26, 2020

శ్రీ శార్వరి ధనుర్మాసాంతర్గత వైకుంఠ ఏకాదశి / ముక్కోటి ఏకాదశి 2020 పర్వదిన శుభాభినందనలు....😊🍕💐🍨🍟

శ్రీ శార్వరి ధనుర్మాసాంతర్గత వైకుంఠ ఏకాదశి / శ్రీ శార్వరి ధనుర్మాసాంతర్గత వైకుంఠ ఏకాదశి / ముక్కోటి ఏకాదశి పర్వదిన శుభాభినందనలు....😊🍕💐🍨🍟

తెలుగు సంప్రదాయం లోని అన్ని పండుగలు చాంద్రమానాన్ని ఆధారంగా చేసుకొని జరుపబడే ఉత్సవములు....

అశ్విన్యాది 27 నక్షత్రములు మరియు ప్రతీ నక్షత్రానికి గల 4 పాదాలు వెరసి 27×4=108 నక్షత్రపాదముల్లోనే ఈ భూప్రపంచంపై ప్రభవించే సర్వజీవకోటి యొక్క గమనాన్ని మన పెద్దలు స్థిరీకరించారు.....

9 పాదాల చొప్పున యావద్ కాలాన్ని ఆ కాలగమనాన్ని శాసించే సూర్యచంద్రుల భ్రమనాన్ని మన సనాతన మహర్షులు మేషాది వివిధ పేర్లతో సూచించబడే 12 రాశులలోకి క్రోడీకరించారు....

శ్రీ చాగంటి సద్గురువులు ప్రవచనాల్లో పలుమారు వివరించినట్లుగా ఈ 108 నక్షత్రపాదాల్లోనే / 12 రాశుల్లోనే ఏ జీవైనా సరే ఈ భూమిపై జన్మించి జీవించి తన జీవయాత్ర ముగించి మరో జీవయాత్రకు పయనమయ్యేది....

108 సంఖ్యకు మన సంప్రదాయంలో గల ప్రాధాన్యత కూడా ఇందుకే...

అష్టోత్తరశతనామాలు....
108 పూసల జపమాలలు....
108 ప్రదక్షిణలు.....
108 దివ్యదేశాలు....
108 శక్తిపీఠాలు ( 18 ప్రముఖమైనవి మనం ఆరాధించే అష్టాదశ శక్తిపీఠాలు...)
దక్షారామ భీమమండలం లోని 108 శివాలయాలు...

ఇలా 108 గల ప్రాముఖ్యత మనకు బహుధా ప్రకటితము కద....

ఈ 27 నక్షత్రాల్లో చంద్రుడి గమనం, 12 రాశుల్లో సూర్యుడి గమనం విచారించి కాలాన్ని, కాలాంతర్భాగమైన వివిధ పండగలు, ఉత్సవాలు, ఇత్యాదివి అనాదిగా మన సనాతన మహర్షులు మనకు అందించినారు....

అన్నీ పండగలు చంద్రుడి గమనాన్ని ఆధారంగా చేస్కొని ఉండే చాంద్రమానాన్ని అనుసరించి ఉంటే,
కొన్ని ప్రత్యేకమైన పర్వదినాలు కేవలం సూర్యుడి గమనాన్ని ఆధారంగా చేస్కొని ఉండేవి....

రథసప్తమి, వైకుంఠ ఏకాదశి, మకర సంక్రాంతి, ఇవన్నీ కూడా సౌరసంబంధ పర్వములు....

మేషాది 12 రాశుల్లోని సూర్యుడి గమనం ధనూ రాశిలో ఉన్నప్పుడు వచ్చే శుద్ధ ఏకాదశినే ముక్కోటి ఏకాదశి / వైకుంఠ ఏకాదశి పర్వదినంగా మన పెద్దలు మనకు అందించి తరించమని దీవించినారు....

సూర్యుడు ధనస్సులో సంచరించే ఈ కాలాన్నే ధనుర్మాసంగా నిర్వచించి విశేషమైన శ్రీమహావిష్ణ్వారాధనకు శ్రీహరి అనుగ్రహపాత్రతకు మన పెద్దలు మనకు అందించినారు....

శ్రీవిళ్ళిపుత్తూర్లో తులసీ వనంలో భూదేవి అంశలో ప్రభవించి పెరియాళ్వారుల పుత్రికగా వినుతికెక్కిన ఆండాళ్ తల్లి తను రచించిన దైవిక పాశురాలను తిరుప్పావై / శ్రీవ్రతం పేరిట ధనుర్మాస ఉత్సవంగా మనకు అందించి, తన సర్వస్వం ఆ శ్రీరంగనాథుడే అని భావించి సేవించి తుదకు ఆ రంగడిలోకే ఐక్యమైన రోజుని శ్రీగోదాకళ్యాణంగా ధనుర్మాస ఆఖరిరోజున మనం జరుపుకోవడం ఎల్లరికీ ఎరుకలో ఉన్న విషయమే....

జీవుడు దేవుడిలోకి ఐక్యమవ్వడమే జీవాత్మ పరమాత్మల సమ్యోగమైన కైవల్యసిద్ధి.....

అలా ఐక్యమవ్వడం సంపూర్ణచేతనతో తాత్కాలికం అయినప్పుడు అది ధ్యాన స్థితిలో లభించే పరమాత్మసమ్యోగ సిద్ధి అని నిర్వచించారు మన పెద్దలు...

అలా ఐక్యమవ్వడం ఈశ్వరశాసనంగా/అనుగ్రహంగా శాశ్వతమైనప్పుడు అదే అద్వైత సంప్రదాయ ప్రతిపాదిత సర్వోత్కృష్ఠ ఈశ్వరానుహ్రమైన కైవల్యసిద్ధి అనబడుతుంది....

సరే ఇంతకీ ఈ కైవల్యసిద్ధికి, చాంద్రమాన, సౌరమాన, 27 నక్షత్రాలకు, 12 రాశులకు, ముక్కోటి/వైకుంఠ
ఏకాదశికి, ఏంటి సంబంధం అనేది ఇప్పుడు డిస్కస్ చేద్దాం..

మన సంప్రదాయం ప్రకారంగా ప్రత్యక్షపరమాత్మ గా ఆరాధింపబడే సూర్యుడు ఆత్మశక్తి కారకుడు.....సకల ఆరోగ్య ప్రదాత...సకల అనారోగ్య నాశకుడు...

సూర్య శక్తిని ఆధారంగా చేసుకొని భూమి చుట్టూ పరిభ్రమిస్తూ జీవులకు మనోశక్తిని ప్రసాదించడం చంద్రుడి పని.....

అందుకే కద
" చంద్రమామనసోజాతః " అని శృతివాక్యం....

ఆ మనసు అని పిలువబడే అగోచర శక్తి నిజానికి మన చేతనలో ఉద్భవించే అసంఖ్యాక సంకల్పవికల్పాల సమూహం...

ఆ సంకల్ప శక్తే మన మనోశక్తి....
ఆ సంకల్ప బలమే మన మనోబలం....

అందుకే కద సాధారణంగ మనం వినే డైలాగ్స్ లో,

" నా మనసు మనసులో లేదండి....నన్ను ఒంటరిగా కాసేపు ప్రశాంతగా ఉండనివ్వండి....."

" నా మనసుకు తెలుసండి....ఎవరు మంచివారో...ఎవరు ముంచే వారో....ఎవరో అయినవారో...ఎవరు కానివారో..."

" సంతలో కొన్న తియ్యని నాటు దోర జాంకాయలు కొన్నప్పటినుండి నా మనసంతా వాటిపైనే ఉంది....ఎప్పుడు తింటానో అని...."

" నా శారీరక బలం అంతగా గొప్పదేంకాదని నన్ను తక్కువ అంచనావేసి అవమానించారు.....చూసారా నా మనోబలంతో అన్ని మెట్లు ఎట్ల ఎక్కోచ్చానో ఈశ్వరానుగ్రహంగా...."

" గురోక్త సంకల్పశక్తికి నా సాటిలేని మనోశక్తిని జతపరిచానంటే ఈ విశ్వంలో నా ఎదురుగా నిలిచి గెలిచే మొనగాడే లేడు..."

" కొండలను సైతం పిండిచేసే మనోశక్తి హనుమంతులవారి అనుగ్రహంగా లభిస్తుంది...."

ఇవ్విధంగా అన్ని రకాల సినిమా డైలాగ్స్ లో చెప్పబడే మనసుయొక్క శక్తి నిజానికి మన చేతన యొక్క సంకల్పశక్తి....అది ఎంత దృఢమైనదో కొలిచేందుకు ఎవ్వరికీ సాధ్యపడని అంశం....

శ్రీ ఆదిశంకరాచార్యుల నుండి ఈనాటి ఆధునిక తత్త్వవేత్తలవరకు ఎందరెందరో మహానుభావుల తత్త్వపరిశోధన మొత్తం మనిషి మనసు గురించే, ఆ మనోశక్తిజనిత అసంఖ్యాక సంభ్రమాశ్చర్యకర కార్యక్రమాల గురించే....

ఇక లౌకిక ప్రాపంచిక పోకడల గూర్చి ఉండే లక్షలాది సినిమా పాటాల్లో సిమ్హభాగం మొత్తం మనసు మీద రచించినవే.....

"మనసంతానువ్వే...."
దెగ్గరినుండి
" పడి పడి లేచే నా మనసు...."
వరకు ఏ సినిమాలోని యుగళగీతాలను విన్నా అన్నీ మనిషి మనసు యొక్క ప్రత్యేకతను తెలుపుతూ రచింపబడి పాడబడినవే....

( ఆ " నువ్వే " ఈశ్వరుడైనప్పుడు ,
ఆ పడి పడి లేచే మనసు పడే తపన ఈశ్వరానుగ్రహం గూర్చి అయినప్పుడు ఆ మనసు విముక్తి పొందే దిశగా జీవుడి ప్రయాణాన్ని ఉన్నతంగా తీర్చిదిద్దుతోందని అర్ధం.....

అట్లు కాక ఈశ్వరుడిని విస్మరించి ఇతరత్రా గూర్చి మాత్రమే పరిభ్రమించడంలోనే ఉండి పోతే ఉన్న బంధనాలకు తోడుగా మరిన్ని బంధనాలను పెనవేసుకుంటూ విముక్తికి దూరంగా జీవుడి ప్రయాణాన్ని భ్రమింపజేస్తుందని అర్ధం....

"మహామాయావిశ్వంభ్రమయసిపరబ్రహ్మమహిషి..."

అనే వాక్యాన్ని ఉటంకించే శ్రీ చాగంటి సద్గురువుల ఆదిపరాశక్తి వైభవం గురించిన ప్రవచనాల్లో
" తిరోధానకరీశ్వరి...సదాశివానుగ్రహదా...." గా తనను ప్రార్ధించినవారికి ఆ మాయ అనే తెరను ఎవ్విధంగా తోలగించి జీవుడికి తన స్వస్వరూపానుసంధాన సిద్ధిని అనుగ్రహిస్తుందో సద్గురువులు తెలిపియున్నారు....

అత్యంత శక్తివంతమైన జ్యోతిష శాస్త్ర విజ్ఞ్యాన విషయాలను గూర్చి కాసేపు పక్కనపెడితే,

సూర్యుడు ధనూరాశిలో ఉన్నప్పుడే వైకుంఠ / ముక్కోటి ఏకాదశి పర్వదినం జరుపుకోవడంలో గల విశేషం పరికిద్దాం.....

ధనస్సు యొక్క గొప్పదనం గూర్చి మన శాస్త్రపురాణ వాజ్మయంలో ఎన్నో చోట్ల ఎంతో గొప్పగా అభివర్నించారు......

తన ధనస్సు శారంగం కోసం ఏకంగా ఒక అవతారమే ఎత్తి " కోదండ రాముడి " గా తన ధనస్సుకు చిరకీర్తిని ప్రసాదించాడు ఆ శ్రీమహావిష్ణువు...

" అయ్యా నీకో దండం.....నీ చేతిలో ఉన్న పినాకం అనే నీ ధనస్సుకోదండం....." అంటూ పలుమారు
ఈశ్వరుడుకి నమస్కరిస్తూ
" నమొస్తుధన్వనేబాహుభ్యాం...." అంటూ మొదలయ్యే శ్రీరుద్రం ఆ పరమేశ్వరుడి ధనస్సు యొక్క వైభవం మనకు తెలియచెప్తూనే ఉంది.....

శ్రీ చాగంటి సద్గురువులు వివరించిన ఈ "పినాకహస్తాయా సనాతనాయ...." వివరణ నాకు చాల ఆశ్చర్యకరమైన ధ్యానసిద్ధిదాయకమైనది.....

అర్జునుడి సాటిలేని గాండీవానికి శ్రీకృష్ణ పరమాత్మ వల్ల లభించిన ఖ్యాతి ఎట్టిదో మత్స్యయంత్రభేదనం మొదలుకొని పాశుపతాస్త్రప్రయోగం వరకు ఎన్నెన్నో సార్లు మహాభారతం మనకు తెలియజేస్తుంది....

గురుమూర్తిని ఎదుటనిలిపి
ద్రోణాచార్యులను తమ మానసిక గురువులుగా ఉపాసనగావిస్తూ ఏకంగా సవ్యసాచినే మించిన ధనుర్విద్యాకౌశలాన్ని గడించిన ఏకలవ్యుడి ధనుర్వేదోపాసన యొక్క గొప్పదనం,
కొత్తగా ధనుర్విద్యను అభ్యసిస్తూ అందులో ఎదురులేని వీరుడిగా ఎదగాలని తను ప్రాక్టీస్ చేస్కుంటుంటే అరిచి డిస్టర్బ్ చేసిందని ఒక అడవికుక్క నోట్లోకి ఏ ధనుర్ధారి సంధించలేనంతటి నైపుణ్యంతో ఆ కుక్క ఇంకెప్పుడు తనపైకి పొగరుతో నోరు తెరిచి అరవకుండా, ఆ తెరిచిన నోరు మూయలేనివిధంగా, బాణాలను సంధించి ఎక్కడికక్కడ ఆ కుక్కనోటిని కట్టిపడేసిన వైనంలో
ఆ బోయ యొక్క విలువిద్యాఘనత మనకు తేటతెల్లమౌతుంది.....

ఒకేసారి ఒకటికంటే ఎక్కువ బాణాలను
సంధించే " ద్వే...మణిబంధనం...." సీన్లో ప్రభాస్ సూపర్బ్ యాక్టింగ్ తో బాహుబలి సినిమా బద్దలుకొట్టిన రికార్డ్లు అందరికి తెలిసిందే.....

ఇవ్విధంగా ధనస్సు చాలా గొప్ప ఆయుధం.....

ఎంతో దూరంలో ఉన్న ఎంతటి శతృవునైనను మట్టికరిపించగల శక్తి ధనుర్వేదవిద్యది....

అది అమంత్రక శస్త్రంగా సంధించబడిన శరమైనాసరే.....
సమంత్రక అస్త్రంగా అభిమంత్రించబడి సంధించబడినా సరే....
ధనుర్వేదశక్తి అనన్యసామాన్యమైనది......

ఒక ధనస్సుకు గల లౌకిక, పారామార్ధిక శక్తి, ప్రత్యేకత,
ఎట్టిదో ధ్యానసిద్ధిగా ఒడిసిపట్టాలంటే, శ్రీభద్రాచల సీతారామచంద్రస్వామి వారి ఆలయంలో, స్వర్ణతులసీఅర్చన ఇత్యాది అంతరాలయ పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నప్పుడు స్వామివారు ధరించిన ధనుర్బాణాములపై ధ్యానం గావించండి.....

ఆత్మారాముడిగా ఆ అయోధ్యారాముడిని శాస్త్రములు కీర్తించడం, ఇనకులసంజాతుడై ఉత్తమ క్షత్రియుడిగా ఒక సాధారణ మనిషివలే భువిపై జన్మించి
కౌసల్యానందనుడిగా దశరథతనయుడిగా తన కీర్తిని ఆచంద్రతారాత్కం చతుర్దశభువనాలు శ్లాఘించేవిధంగా జీవించి తన జీవిత అయనం శ్రీమాద్రామాయణ ఇతిహాసమై, వేదోపబృహ్మణమై, పౌలస్త్యవధగా, సీతాయాశ్చరితమ్మహత్త్ గా శాశ్వతమై అప్పుడూ ఇప్పుడూ ఎలప్పుడూ
భక్తులను ఎంతో ఘనంగా ఉద్ధరించి అనుగ్రహించే
" శ్రీ వాల్మికీ కోకిల కూజిత శ్రీరామ తారక మంత్రమహిమార్ణవమై"
వెలుగొందే రామాయణ మహాకావ్యంలో ఆ కోడండరాముడి చేతిలో ఒదిగిన కోదండం యొక్క మహిమ ఎంత ఘనమైనదో ఇంతని అంతని వర్నించనలవి కానిది.....

సూర్యవంశతేజమై అవతారం దాల్చిన ఆ శ్రీరాముడు సకల జీవుల ఎదలోనే కొలువైఉండే ఆత్మారాముడు.....

శ్రీరాముడిని పరమాత్మ గా ఆరాధించే మన భక్తే ఆ ఆత్మారాముడిచే ధరింపబడిన కోదండం అనే ధనస్సు....

అసంఖ్యాక సంకల్పవికల్పాల సమూహమైన మన మనసనే ఆ అక్షయబాణతూణీరంలోని శరసమూహం, శ్రీరాముడి కోదండానికి సంధింపబడేలా చిత్తము పాత్రతను సమకూర్చుకున్నప్పుడు,

శ్రీరాముడి కరకమలముల
అమృత స్పర్శతో సంధించబడే మన మనసు దైవికాస్త్రంగా మారి, హనుమంతులవారి అనుగ్రహంగా సరాసరి రావణుడనే ప్రాపంచిక మాయలో కుంభకమైఉండే అజ్ఞ్యాన లంపటాన్ని భేదించి జీవుడు ముక్తిని బడయుట అనే విశిష్ట తత్త్వసామ్యమే
అద్వైత సంప్రదాయ ప్రతిపాదిత కైవల్య సిద్ధి....!

ఆ శ్రీకరమైన శాశ్వతదైవానుగ్రహసముపార్జనకు
జీవుడిని సంసిద్ధం గావించేలా భక్తిసంస్కారమును అలది వచ్చే మకర సంక్రమణంతో మొదలయ్యే ఉత్తరాయణ పుణ్యకాల విశేషబలంచేత సకల దైవిక శక్తిసంఘాతమై జీవుడికి ఎనలేని ఆత్మశక్తి సమకూరేలా ఈ వైకుంఠ ఏకాదశి పర్వదివసాన్ని మన పెద్దలు ఏర్పాటుచేసారు.....

అవ్విధంగా ఒక జీవితపర్యాయంలో వచ్చే 100 వైకుంఠ ఏకాదశుల్లో
( 'శతమితిశతందీర్ఘమాయుహు' అనే సాధారణ శృతి వాక్యానుగుణంగా )
ఎదో ఒక ఏకాదశి మనకు నిజంగా మోక్షద ఏకాదశిగా ప్రభవించి ఈశ్వరుడి ద్వాదశి పారణగా మన ఆత్మ ఆ పరమాత్మలోకి లయించి జీవుడుకి శాశ్వత ప్రశాంతత లభించడమనే గంభీరమైన తత్త్వసారాన్ని ప్రతిపాదించే ఈ వైకుంఠ ఏకాదశి పర్వం భక్తులెల్లరికి
ఆ శ్రీమదలర్మేల్మంగాపద్మావతీసమేతశ్రీవేంకటేశ్వరుడి అనుగ్రహాన్ని మరింత మెండుగా లభించేలా చేసి ఎల్లరూ సుఖశాంతులతో ఆయురారోగ్యైశ్వర్యాలతో జీవించాలని ఆకాంక్షిస్తూ అందరికి
వైకుంఠ ఏకాదశి / తిరుమల శ్రీస్వామిపుష్కరిణీ తీర్థముక్కోటి / వైకుంఠ ద్వాదశి పర్వదిన శుభాభినందనలు....☺🍨💐🍕

దక్షిణాన ఉండే యమపురికి కాకుండా, జీవుడి గమ్యం ఉత్తరాన ఉండే వివిధ ఊర్ధ్వలోకాలవైపుగా సాగి తుదకు 108వ దైన ఆఖరి దివ్యదేశమైన పరమపదం చేరుకోవడంతో మన జీవ తీర్థయాత్ర సంపూర్ణమైయ్యేలా విశేష దైవానుగ్రహ సంపాకకారకమైన శ్రీ వైకుంఠ ఏకాదశి / ద్వాదశి ఉత్తరద్వార దర్శనం భక్తుల్లెలరికి సంవత్సరంలో
ఒక్కసారి మాత్రమే సంప్రాప్తించే అరుదైన అనుగ్రహం....

తిరుమల ఉత్తరద్వార దర్శనంలో స్వామివారి గర్భాలయ ప్రాకారానికి మరింత దెగ్గరగా సాగి ప్రదక్షిణనమస్కారం చేస్కునే భాగ్యం పొందిన భక్తులెల్లరు తమ తమ జీవితాల్లోని తిరుమలయాత్రను
ఒక చిరకాల అమూల్యమైన మధురస్మృతిగా మలిచి ప్రతీ వైకుంఠ ఏకాదశి / ద్వాదశికి నెమరువేసుకోవడం శ్రీశ్రీనివాసుడి భక్తుల్లెల్లరికి సంప్రాప్తించే ఒకానొక దైవికానుభవ పెన్నిధి...

కళ్ళు మిరుమిట్లు గొలిపేలా ఉండే వివిధ మనోహర పుష్పసముదాయంతో అలకరించబడి ఉండే ఆ శ్రీవైకుంఠద్వారంలోకి మానసికంగా ప్రవేశించి ఆ పురాతన ఆలయవైభవాన్ని, ఆ పూలమొక్కలను, రంగురంగుల లైట్లను, ఆ పరిమళాలను, ఆస్వాదిస్తూ స్వామివారి హుండీ దెగ్గర బయటికి వచ్చాక పైన ఉండే ప్రాగీశాన్యాభిముఖ శ్రీమహాలక్ష్మీ అమ్మవారికి నమస్కరించి ఆ సిరులతల్లి అమేయ కరుణాకటాక్షవీక్షణాలను ప్రసాదంగా గైకొని ఎల్లరూ తరించి ఆనందించెదరుగాక......

శ్రీతాళ్ళపాక అన్నమాచార్యుల వారి
అత్యత్భుతమైన ఈ క్రింది సంకీర్తనలో తిరుమలను దర్శించడం భక్తులకు మరింతగా ముదావహం....😊💐🍨🍕🍟

Ragam : Brindavani, composer : G.Balakrishnaprasad
Audio link :PriyaSisters
Archive link :
ప|| కంటి నఖిలాండ (తతి) కర్తనధికుని గంటి | కంటి నఘములు వీడుకొంటి నిజమూర్తి గంటి ||

చ|| మహనీయ ఘన ఫణామణుల శైలము గంటి | బహు విభవముల మంటపములు గంటి |
సహజ నవరత్న కాంచన వేదికలు గంటి | రహి వహించిన గోపురములవె కంటి ||

చ|| పావనంబైన పాపవినాశము గంటి | కైవశంబగు గగన గంగ గంటి |
దైవికపు పుణ్యతీర్థములెల్ల బొడగంటి | కోవిదులు గొనియాడు కోనేరి గంటి ||

చ|| పరమ యోగీంద్రులకు భావగోచరమైన | సరిలేని పాదాంబుజముల గంటి |
తిరమైన గిరిచూపు దివ్యహస్తము గంటి | తిరు వేంకటాచలాధిపు జూడగంటి |

http://annamacharya-lyrics.blogspot.com/2007/03/167kamti-nakilamda.html?m=1

Friday, December 25, 2020

Wishing one and all a Merry Christmas 2020...😊🍕💐🍨🍟

May Lord bless one and all not only with a Happy, Healthy, Peaceful and Prosperous Life but also,

with a happy intelligence to understand that many others around us can be much more intelligent than that of us and thus staying humble adds beauty to that intelligence...

with a healthy knowledge to know that the more we learn we come to know that there always are many more things yet-to-be-learnt and thus staying humble adds beauty to that knowledge..

with a peaceful wisdom to assimilate the fact that we are not the only torch bearers for the entirety of the wisdom propounded by a plethora of philosophical works existing across the world for that it was percolated down to our times by our wisest ancestors and thus staying humble adds beauty to that wisdom.....

with benevolant prosperity that preaches us to imbibe humbleness in every walk of life for the fact that it wasn't there with us sometime ago and thus wouldn't be there with us after sometime for that the time that brings in every prosperous moment is the same time that gulps it back in to it....
and  thus staying humble adds beauty to that prosperity...

May the spirit of true Christmas enlight the lives of all the followers to bring in the glory of that right message from the Lord's life that has taught this world about the importance of humbleness in every walk of life that we tread as a blessing from the God.....

May Santa bring in all the goodies that we have ever wished for at some or the other point in time of our life to make it a fulfilled one...😊

Merry Christmas friends...!
Have a Peaceful and Prosperous X-Mas...!!
🥳😊🍨💐🍕🍟 💐

Thursday, December 24, 2020

శ్రీ పాములపర్తి వేంకట నరసిమ్హారావ్ ( భారత 9వ మాజి ప్రధానమంత్రి వర్యులు ) గారి 16వ వర్ధంతి సంస్మరణ సందర్భంగా వారి గౌరవార్ధమై పోస్టల్ స్టాంపును ఆవిష్కరించడం....

శ్రీ పాములపర్తి వేంకట నరసిమ్హారావ్ ( భారత 9వ మాజి ప్రధానమంత్రి వర్యులు ) గారి 16వ వర్ధంతి సంస్మరణ సందర్భంగా వారి గౌరవార్ధమై పోస్టల్ స్టాంపును ఆవిష్కరించడం నిజంగా దేశం మొత్తం, ప్రత్యేకించి మన రాష్ట్రం మొత్తం ఎంతో హర్శించవలసిన విషయం....!

తెలంగాణ జాతిపితగా ఇప్పుడు 
గౌ|ముఖ్యమంత్రివర్యులు, శ్రీ కే.సీ.ఆర్ గారు ఏ విధంగా అయితే నుతింపబడుతున్నారో, భారత బహుళార్ధసాధక ఆర్ధికసంస్కరణపితామహులుగా అప్పుడు మరియు ఎప్పటికీ నుతింపబడే మాన్యులు శ్రీ పీ.వీ.ఎన్.ఆర్ గారు...

ఇప్పుడు ఈ తరంవారు కాలుకిందపెట్టకుండ కావలసిన వస్తువు ఒక్క మౌస్ క్లిక్ తో వివిధ ఆన్లైన్ కామర్స్ పోర్టల్లనుండి కొనుగోలు చేయగలిగేలా జీవించినా సరే, కేంద్రప్రభుత్వ సంపూర్ణ అజమాయిషీలో ఉండే బ్యాంకుల ద్వార మాత్రమే నిర్ణయించబడే ఆర్ధికవిధివిధానాలకు అనుగుణంగా మాత్రమే సగటు సామాన్య పౌరుడు తన జీవితపు పైసా చట్రాన్ని నిర్ణయించుకోవడం కాకుండా, ఎన్నో ఇతర ప్రభుత్వేతర బ్యాంకులు మరియు వారి విదేశి అనుబంధ సంస్థాగత కార్యకలాపాలకు అనుగుణంగా వినియోగదారుడికి ఎన్నో రకాలుగా ఉపయుక్తంగా ఉండే బ్యాంకింగ్ వ్యవస్థ మరియు తత్సంబంధిత విదేశి ప్రత్యక్ష పెట్టుబడుల వ్యవస్థతో భారత ఆర్థిక వ్యవస్థకు ఎంతో బలమైన ఆలంబన అందించి దేశం నలుచెరగుల ప్రభుత్వసంస్థలకు ధీటుగా ప్రభుత్వేతర సంస్థలు కూడా సామాన్య జనబాహుళ్యానికి అన్నిరకాలా మెరుగైన సేవలను పోటాపోటీగా నేడు అందివ్వబడి, ప్రతి భారత పౌరుడు లాభించడం వెనక పీ.వీ గారి అపరామైన మేధో మథనాంతర్గతంగా ప్రభవించిన కీలకమైన సంస్కరణలే నాంది....

ఒక విత్తు సుక్షేత్రంలో నాటుకొని మొలకెత్తి మొక్కై పెరిగి చెట్టై నిలిచి ఎన్నెన్నో మధురఫలాలను అందించాలంటే అందుకు ఎంతో సమయం పట్టొచ్చు.....

అంత సమయంవరకు వేచి చూసేందుకు అవకాశంలేని తరుణంలో ఒకవైపు హైబ్రీడ్ వంగడాలతో సద్యోసేద్యఫలితాలను సృజించి, మరో వైపు దీర్ఘకాల పంటగా నాటు వంగడాలను కూడా పెంచి పోషించి, ఆకలి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపడంలో సదరు వ్యక్తి యొక్క ముందుచూపుతో పాటుగా తన సవ్యసాచిత్వం కూడా తేటతెల్లమౌతుంది.....

అచ్చం అదే రీతిలో ...

రాబోవు సమీప భవిష్యత్తులోని తీవ్ర ఆర్ధిక క్షామాన్ని తమ అపారానుభవదృష్టితో ఆర్ధికద్రష్టలై పరికించి అందుకు తగు రీతిలో తక్షణ నివారణాచర్యలు మరియు శాశ్వత దీర్ఘకాలిక సంస్కరణలు ప్రవేశపెట్టి దేశ ఆర్ధిక వ్యవస్థ గాడిన పడేలా అతి తక్కువ సమయంలో అత్యున్నతమైన రీతిలో పావులు కదిపి, రాజనీతిని రాజకీయమునుండి క్షీరనీరన్యాయమున గ్రహించి రాజనీతి స్రష్టలై తమ సుదీర్ఘానుభవాన్ని దేశభక్తికై నూటికినూరుపాళ్ళు వెచ్చించి రంగరించి రచించిన ప్రణాళికలే నేటి ఆధునిక ఆర్ధిక సుసంపన్నమైన భారతావనికి కారణమై నిలిచింది అనే సత్యం ఎందరో దేశభక్తులకు, అర్ధశాస్త్ర
మేధావులకు ఎరుకలో ఉన్న విషయమే....

ఒక ఆరితేరిన బహుభాషాకోవిదుడు,
ఒక చక్కని కవి, 
ఒక గొప్ప దేశభక్తుడు,
ఒక తలపండిన రాజనీతిదురంధరుడు, 
ఒక తలనెరిసిన అనుభవజ్ఞ్యుడు,
ఒక అసామాన్య ఆర్ధికశాస్త్రతత్త్వవేత్త,
ఒక అనన్యసామాన్యమైన రాజాకీయనాయకుడు,
ఒక నిరుపామనమైన ప్రధానమంత్రి

గా ఒక వ్యక్తి తన జీవితంలో నెలకొల్పిన ఎన్నెన్నో మైలురాళ్ళను ఈ ప్రపంచం శాశ్వతంగా గుర్తించి గౌరవించబడేలా చరిత్రలో లిఖించబడిన సువర్ణాక్షరాలు కోకొల్లలు.....

అత్త తిట్టినందుకు కాదు తోటికోడలు నవ్వినందుకు.....
అన్నట్టుగా,

దక్షిణభారతప్రాంతవాసి అయినందుకు కాదు మాతో అంతగా సఖ్యత లేనందుకు అన్నట్టుగా.... 

వారి ఖ్యాతిని ఓర్వలేక సొంతకుంపటివారే వారికి వ్యతిరేకంగా ఎన్నో గోతులు తీసినాసరే వాటన్నిటిని తమదైన సాటిలేని మేటైన ధీటైన చాణక్యంతో పూడ్చి వాటిపైనే తమ కీర్తిపతాకాన్ని రెపరెపలాడించిన
ఒక రాటుదేలిన ఱౌతుగా ఈ దేశపగ్గాలను చేబూని ఎంతో ఘనమైన రీతిలో భారతమాతకు తమ జీవితంలో ఎనలేని సేవలందించిన మహానుభావులు శ్రీ పీ.వీ గారు.....!!

వారు సలిపిన కృషిలో వందోవంతుకు కూడా సరితూగని రీతిలో ఉన్న వారి కుంపటివారికే అత్యున్నతమైన భారతరత్న పౌరపురస్కారం లభించగా, వారికి ఇంకా లభించకపోవడం ఎంతో విచారకరం.....!!!

ఈనాటి శ్రీ చాగంటి సద్గురువుల వైభవాన్ని ఆనాడే గుర్తించిన మహానీయులకు ఏనాటికైనా భారతరత్న పురస్కారం ప్రసాదించబడుతుందని ఆశిస్తూ శ్రీ  పీ.వీ నరసిమ్హారావ్ గారి 16వ వర్ధంతి సందర్భంగా వారి శ్రీచరణాలకు ఒక దేశభక్తుడి చిరుకవనకుసుమాంజలి....🙏💐

https://www.newspointapp.com/telugu-news/publisher-tv5news-telugu/top-news/articleshow/14504820dd3a2aecaa1e59e54f4ba24d68a895c9?utm_source=vivo&utm_medium=browser&utm_campaign=np

Sunday, December 20, 2020

శ్రీభద్రకాళి అనుగ్రహమైన శాక్తేయ మంత్రబంధన వ్యవస్థీకృత రక్షణకవచం.....


లౌకికమైనవి మన లాకర్లు, బ్యాంకులు, ఇనప్పెట్టెలు మొదలైనవి...

అవి ఎల్లవేళలా బాగా పటిష్ఠమైనవని అని చెప్పడానికి కుదరదు....

కాని అలౌకిక దేవతా శక్తితో రక్షింపబడే ఏ వస్తువైనా, సొమ్మైనా, పదార్ధమైనా సరే, అది ఎప్పటికీ కూడా తిరుగులేని అభేద్యమైన రక్షణ వలయంలో మంత్రబంధనంతో కవచితమై ఉండే
వ్యవస్థ.....

పాస్వర్డ్లు, పిన్ కోడ్లు, తాళాలు, ఇతరులు అపహరించి లౌకిక వ్యవస్థల్లోని సొమ్మును తస్కరించి లాభించగలరేమో.....

కాని మంత్రశక్తిని, ఆ మంత్రశక్తితో 
అభిమంత్రితమైన వస్తువును, సొమ్మును, పదార్థాన్ని, ఆ మంత్రోపాసనపై ఎనలేని పట్టుగలవారు మాత్రమే హ్యాండిల్ చేయగలరు....అన్యులకు అది అసంభవం....

ఒకరి ఇంటిని మొత్తం వంకరటింకర చేసి,
ఇంటిసిమ్హద్వారాన్ని వంకరటింకర చేసి,
తద్వారా ఆ వికటద్వారవేధతో ఆ యజమాని ఆరోగ్యం కరాబయ్యేలా చేసి,
అతడి ఉన్నతిని ఓర్వలేనివారితో కలిసి అతడికి ప్రతికూలంగా ఎన్నో పన్నాగాలు పన్నిన దౌర్భాగ్యులకు, ఈశ్వరానుగ్రహంగా అతడికి లభించే  ప్రసాదం నొక్కడం ఎంతమాత్రము శ్రేయస్కరం కాదు...కాదు...కాదు...

"వారికితెలియకుండా పరోక్షంగా నొక్కేస్తున్నాం కదా..."
అని అనుకుంటారేమో....

అది

ఓం బీజావృతమై.....
ఐం బీజాలంకృతయై.....
హ్రీం బీజగర్భితమై... 
శ్రీం బీజోక్తమంత్రశక్తిపరివ్యాప్తమై....
ఉండే
ఎదురులేని శ్రీభద్రకాళి అనుగ్రహమైన 
క్షత్రియ గాయత్రి తపోశక్తి జనిత మంత్రాధిష్టాన దేవతచే నిత్యం పరివేష్టించబడి ఉండి రక్షించబడే సొమ్మైనప్పుడు...

అది ఎవరికి చెందాలో, శ్రేయోభిలాషులైన వారికి మాత్రమే చెందాలి....
ఇతరులకు అది తక్షకుడి విషంతో సమానమైన సొమ్ము....

"ఈ మంత్రశక్తి కాన్సెప్ట్ మాకు ఒక అర్ధంకాని సోదిలా ఉంటది..." అని మీరనుకుంటే, చాలా సింపుల్ గా చెప్తా.....

బాగా కాయలు కాసిన ఒక చెట్టుని చూసి ఫటాఫట్ ఆ చెట్టెక్కి అందినకాడికి ఇష్టమొచ్చినట్టు కొమ్మలపైకి ఎక్కి కాయలు కోస్కొని జోబ్లోవేస్కొని మెల్లగా తిందాంలే అనుకొని....

ఒక జాంచెట్టో, మామిడిచెట్టో ఎక్కడం
వేరు....
ఒక రేగు చెట్టెక్కడం వేరు....

రేగు చెట్టెక్కి రేక్కాయలు కోస్కోవాలంటే అందుకు తగు జాగ్రత్తలు కచ్చితంగా పాటించి తీరాలి.....ఆ చెట్టుని రక్షించే యజమాని చెప్తున్నా సరే వినకుండా ఇష్టమొచ్చినట్టు చెట్టెక్కి కాయాలు దుల్ప్కపోతాం అనే తలపొగరు తో ప్రవర్తించి చెట్టు కొమ్మలమీద చెయ్యేస్తే తర్వాత ఆ ముళ్ళ బాధ భరించలేక మీ కాయలు రాలిపోతాయ్.....
వద్దని వారిస్తున్నప్పుడు కాయలు నొక్కడమెందుకు తర్వాత లబోదిబోమని రోదించడమెందుకు...?

మంత్రపూతమై ఉండే ఏ పదార్థమైనా కూడా ఒక రేగు చెట్టుపై ఉండే రేగుపండ్లవంటిది....

అది ఎవరికి ఉద్దేశ్యించబడినదో వారు మాత్రమే అది స్వీకరించడానికి అర్హులు......
కానివారు కండకావరంతో ప్రవర్తించి మంత్రబంధనం తో రక్షింపబడే పదార్థంపై చెయ్యేస్తే,
చేతులు కాలాకా ఆకులు పట్టుకున్నా కూడా ఏమి ఒరగదు.....

కాబట్టి పరిధి తెలుసుకొని పద్ధతిగా ప్రవర్తించడంలో పరిణతి ఉంది....

ఇష్టమొచ్చినట్టు తలపొగరుతో మిడిసిపడితే ఆ తర్వాత భంగపాటు మాత్రమే మిగిలేది...

కాబట్టి తస్మాత్త్ జాగ్రత్త...

శ్రీ తాళ్ళపాక అన్నమాచార్యుల వారు వారు పన్నిన పరబ్రహ్మ మంత్రమును గూర్చి వివరిస్తూ మనకు ఒక చక్కని సంకీర్తనను అందించినారు....

" ఇన్ని మంత్రముల కెల్ల ఇందిరనాథుడె గుఱి - పన్నిన దిదియే పరబ్రహ్మ మంత్రము
నన్ను గావగలిగేబో నాకు గురుడియ్యగాను - వెన్నెల వంటిది శ్రీవేంకటేశు మంత్రము "

అంటూ ఎంతో అందంగా ఆ సౌమ్యలక్ష్మిని తమ నిలువెల్లా నింపుకున్న మూలవిరాట్టైన శ్రీవేంకటేశ్వర ధృవబేర సంబంధిత 
శ్రీవేంకటేశమంత్రమునుగూర్చి వివరించినారు...

అట్లే పంచబేర మూర్తుల్లో ఇతర 4 మూర్తులకు కూడా వారి వారి సంబంధిత మంత్రములు ఉన్నవి....

అందులో ఒకరైన శ్రీ ఉగ్రశ్రీనివాసమూర్తికి సంబంధించిన మంత్రమునకు సామ్యముగా ఉండేదే ఉగ్ర శ్రీభద్రకాళి అనుగ్రహమైన శాక్తేయ మంత్రం.... )

(
రామోలలితాంబికా...
కృష్ణశ్చశ్యామలాస్వయం....
అని కదా మన ఆర్యోక్తి....
)

http://annamacharya-lyrics.blogspot.com/2006/09/12anni-mantramulu.html?m=1

రూపాయి విలువ దమ్మిడీలు, గవ్వల వరకు...!

చారాణకి 5, ఆఠాణకి 10, రూపాయికి 20 వచ్చే పిప్పరమెంట్లు, చకోడీలు, పెద్ద రేగుపళ్ళు, జాంకాయలు, మొదలైనవి కొనుక్కొని తినే రోజులనుండి, 5 పైసల నుండి లెక్క మొదలు అని అనుకున్న తరానికి దమ్మిడీలు, గవ్వలు వరకు ఉండే వాటి లెక్కలు ఆశ్చర్యదాయకంగానే ఉంటాయి కద....😊

Saturday, December 12, 2020

శ్రీగిరి వైభవం....😊💐🍟🍨🍕

శ్రీగిరి / శ్రీశైలం అనే వ్యావహారిక నామం అటు తిరుమల ఇటు శ్రీశైలం ఈ రెండు పుణ్యక్షేత్రాలకు కూడా వర్తిస్తుందని శ్రీ చాగంటి సద్గురువులు నుడవడం చాలా మందికి గుర్తుండే ఉంటుంది....

స్థితికారకుడిగా ఉండే పరమాత్మ స్వరూపమైన శ్రీమహావిష్ణువు యొక్క ప్రశస్తమైన 108 దివ్యదేశాలలో ఒకటిగా ఉన్న భూవైకుంఠమైన తిరుమల మరియు లయకారకుడిగా ఉండే పరమాత్మ స్వరూపమైన రుద్రుడు /  అరూపరూపి గా ఉండే తన శివలింగ స్వరూపంలో కొలువైన 12 జ్యోతిర్లింగ క్షేత్రాల్లో ఒకటైన శ్రీశైలం యావద్ ప్రపంచంలో ఎంతో ప్రశస్తమైన తీర్థయాత్రాస్థలి/పుణ్యక్షేత్రాలుగా ప్రసిద్ధినొందడం జగద్విదితమే కద...

నిజానికి హరిహరులు అభిన్నమైన పరమాత్మ స్వరూపులు...
తత్త్వతః వారి వారి ఉపాధికి నిర్దేశించబడిన కర్తవ్య సాధనకొరకై అలా ఇద్దరుగా తమ ఉనికిని ఈ లోకంలో వివిధ నామరూపాత్మకంగా వ్యాప్తిగావించి జగద్రక్షణ గావించడం కోసం అలా మనకి కనిపించడం...

భువిపై శయనించిన ఆదిశేషుడి సరీసృప శరీరాకారంగా విస్తరించి ఉండే నల్లమల అటవీ ప్రాంత గిరులపై కొలువైన 5 ప్రముఖ క్షేత్రాలను ఎంతో అత్యత్భుతమైన రీతిలో ఎవరో మహానుభావులు చిత్రీకరించిన ఆ చిత్తరువు తిరుమల శ్రీతరిగొండవెంగమాంబ అన్నప్రసాద భవనంలో మనం చూడవచ్చు...

ఈ రెండు క్షేత్రాలూ కూడా ఆదిశేషుడి మొదలు / చివర, అనగా తోకపై శ్రీశైలం ( మూలాధార చక్ర / పృథ్వీతత్త్వ ప్రతీకం ) ఉండడం,

తల / పడగపై తిరుమల ఉండడం మనం ఆ చిత్రంలో చూడగలం....

( సహస్రార కమల మధ్యగత పరమాత్మకు ప్రతీకగా శ్రీవేంకటనగముపై ఆనందనిలయంలోని గర్భాలయంలో అష్టదలపద్మపీఠంపై కొలువైన స్వయంప్రాకాశక సజీవసాలిగ్రామావేశిత శ్రీనివాసుడి సన్నిధి ఆదిశేషుడి సహస్ర ఫణములపై కొలువైన దివ్య మణిసంఘాతం....)

( అహోబలం, త్రిపురాంతకం, మహానంది ఇత్యాది క్షేత్రాలు మిగతా యోగకేంద్ర స్థానాల్లో ఉండడం...)

చివరకు అన్నీ దేన్లోకి కలిసిపోతాయో అది లయ కారకం....

దేని వల్ల అన్నీ సృజించబడినపిదప  పోషింపబడుతున్నాయో అది స్థితికారకం......

అనగా స్థితికారకుడు అన్నిటినీ చక్కగా సమ్రక్షిస్తూంటే లయకారకుడు అన్నింటిని తనలోకి లయించివేస్తున్నాడని లౌకిక అర్ధం కద....

ఒకాయన చక్కగా అన్నీ చక్కబెడుతుంటే మరొకాయన వాటన్నిటిని తనలోకి మింగేయడం ఏంటి విచిత్రంగా...అసలు అలా పనికట్టుకొని అన్నింటిని మింగేయడమే పనిగా లయకారకుడు అని ప్రత్యేకంగా పేరుపెట్టుకొని మరీ ఆ రుద్రుడు ఈ లోకంలో ప్రశస్తినొందడం అనే ప్రశ్న ఆధ్యాత్మిక తత్త్వచింతనాపరులకు రావడం సహజమే కద...

శ్రీ చాగంటి సద్గురువులు బోధించిన ఒక చక్కని ఉదాహరణతో ఆ హరిహరాత్మక పరబ్రహ్మతత్త్వాన్ని కొంత పరికిద్దాం....

పుట్టి, పెరిగి, జీవితపు అన్ని మజిలీలను దాటి ఈ శరీరం " దేహం " గా మారిన తదుపరి, అనగా ఒక 60 సంవత్సరాలు దాటిన తదుపరి ఈ శరీరం దహించబడడానికి సిద్ధమౌతున్నది కాబట్టి దీన్ని "దేహం" అని పిలవడం....

అలా ఉన్న మన పెద్దవాళ్ళను అడిగితే చెప్తారు వాళ్ళ బాధలు ఎంత వర్ణనాతీతమో.....

తింటే అరగదు...తినకపోతే ఉండలేరు... 

ఒకదెగ్గర ఓపికగా కూర్చొని ఒక గంటసేపు కదలకుండా పూజ చేయలేరు...అలాగని గంటసేపు చలాకిగా ఎక్కడికీ నడిచివెళ్ళలేరు....

ఒకవైపు పిల్లల జీవితాలు, కుటుంబబాధ్యతలు, ఆస్తిపాస్తులపై గల మమకారాలు తగ్గించుకోలేరు... 
మరోవైపు మీదపడుతున్న ముసలితనాన్ని తప్పించుకోలేరు....
( అనగా మనలో మనకే ముసలం వచ్చి ఈ శరీరం మీద చిరాకు, కోపం, విసుగు, దైన్యం, ఇలా సకల ఏహ్యభావాలు కలిగి, ఈశ్వరుడిని ఎప్పుడు తనలోకి కలిపేసుకుంటావు అని పదే పదే ప్రార్ధించడం...)

ఇలా ఉన్న సందర్భంలో శ్రీ చాగంటి సద్గురువుల బోధలో చెప్పబడినట్టుగా " పెద్ద నిద్రకు మాగన్ను పెట్టువేళ..."
అనే ఆ సమయంకోసం జీవుడు ఆర్తితో 
అర్ధించినప్పుడు, దేముడు జీవుడిని తనలోకి లయించివేసుకోవడం కూడా అనుగ్రహమే కదా...

లేకపోతే ఈ భూమి పై పుట్టిన వారు పుట్టినట్టే శాశ్వతంగా ఉండిపోవడం....

పొద్దున లేచినది మొదలు మనిషి అట్లే ఎప్పటికీ మేల్కొని ఏదొ ఒక పని చేస్తూండడం..
(నిద్ర పోకుండా...)

ఇలా దీర్ఘకాలిక, స్వల్పకాలిక లయం లేని ప్రపంచాన్ని ఒకసారి ఊహించిచూడండి....ఎంత కష్టంగా ఉంటుందో ప్రాణులకు...వారి జీవితాలే వారికి మోయలేనంత భారంగా ఉన్నప్పుడు, శ్వాసతీసుకోవడమే నరకమై ఉండి చెప్పలేని వేదనకు జీవుడు గురౌతున్నప్పుడు, లయకారకుడిగా ఉండి ఈశ్వరుడు తనలోకి కలిపేసుకోవడం అనే ప్రళయ ప్రక్రియలో ఉన్నది అనుగ్రహమే కాని ఆగ్రహం కాదు....

ఉన్న సత్యం గురించి రూఢపరచాలంటే ముమ్మారు "ఔను"
అని అనడం మన సంస్కృతిలో గమనించే ఉంటారు....

సత్యం సత్యం సత్యం....
రామ రామ రామ...
ఔను ఔను ఔను...

ఇలా ఎదైనా ముమ్మారు ఉటంకించడం ఆ సంధర్భంతాలూకా సత్యాన్ని ధృవపరిచి బలపరచడం కోసం అనే సత్యం మనకు ఎరుకలో ఉన్నట్టుగా...

పొద్దున లేవగానే ముమ్మారు 
శ్రీహరి...శ్రీహరి...శ్రీహరి
అనే మొట్టమొదటి పిలుపుతో రోజును ప్రారంభించడం...

రాత్రి నిద్రకు ఉపక్రమించే ముందు 11 సార్లు 

శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ

అని స్మరించి నిద్రించడం గురించి శ్రీచాగంటి సద్గురువులు మనకు బోధించి ఉన్నారు కద....

స్థితికారకుడైన శ్రీహరిని ముమ్మారు కీర్తించి మేల్కొనడంలో ఆ రోజు మన స్థితిస్థాపకతకు నిదర్శనంగా మనకు మనమే మన అస్తిత్వాన్ని రూఢపరచి బలపరచడం.....

ఏకాదశ రుద్రులుగా తన ఉనికిని ఆ లయకారకుడు ఈ విశ్వంలో వ్యాప్తి గావించి ఉన్నాడు కాబట్టి....

ఈ విశ్వంలోని యావద్ బ్రహ్మాండ పిండాండ వ్యవస్థను అనుసంధానించే మనిషి శరీరం లోని 9 సాధారణ కన్నములు ( ఊర్ధ్వ కూటమైన ముఖమండలంలోని 7 కన్నములు, అధో కూటమైన నాభి అధో భాగంలోని 2 కన్నములు కలిపి 9 కన్నముల సమన్వయం ప్రతి మనిషికి ఉండే సర్వ సాధారణమైన వైశ్వికానుసంధాన వ్యవస్థ....

ఇవి కాకుండా కపాలమధ్యమునకు కేంద్రీకృతమై ఉండే బ్రహ్మరంద్రం...
మరియు యావద్ శరీరానికి మధ్యకేంద్రంగా ఉండే నాభి రంద్రం...

ఈ రెండు కూడా కలిపితే 9+2=11 కన్నముల సంపూర్ణ 
వైశ్వికానుసంధాన వ్యవస్థపై మనిషి తన చేతనాత్మకమైన పట్టును కోల్పోయి వాటిని ఈశ్వరార్పనం గావించేది దైనందిన నిద్రలో మరియు ఆ పెద్ద నిద్రలో....

కాబట్టి 11 సార్లు ఆ లయకారకుడిని స్మరించి వాటిని ఆయనకు అప్పగిస్తే,
జీవుడికి ఉపయుక్తంగా ఉండేలా ఆ జీవాత్మ పరమాత్మల వైశ్వికానుసంధాన వ్యవస్థను ఆ లయకారకుడు తన అధీనంలోకి తీసుకొని, జీవుడికి నూతన జవసత్వాలు ప్రసాదించి అనుగ్రహిస్తాడు...

అనగా రోజువారి నిద్ర తర్వాత మరునాడు లేచినప్పుడు,
" అబ్బా....ఎంత హాయిగా..రిఫ్రెషింగ్ గా...ఉల్లాసంగా...ఎనర్జిటిక్ గా....ఉందో...."
అని అనుకోగలగడం సాధ్యమయ్యేది....

అట్లే పెద్ద నిద్ర తర్వాత లభించే ఉన్నతమైన జన్మలో...
" అబ్బా...ఎంత మంచి జీవితాన్ని ఇచ్చావ్ దేవుడా....అంతా నీ అనుగ్రహం..." అని అనుకోగలిగేది... 
 
అలా కాకుండా ఈశ్వరుడిని విస్మరించి అడ్డమైన గడ్డిని మెదడుకు అందించి నిద్రిస్తే...( అనగా మంచి దైవసంబంధమైన ప్రవచనాలు...పాటలు...మాటలు... ఈశ్వర నామం....కాకుండా ఇతరమైన చెత్తాచెదారం...) మరునాడు లేచిన తదుపరి....
"అబ్బా...మళ్ళీ ఇంకో రోజు జీవితమా....హుమ్మ్...."
అంటూ మూలుగుతూ రొప్పుతూ ఉండడం....

అట్లే లభించిన మరుజన్మలో "హయ్యో..రామ..ఎందుకురా నాయనా ఈ జీవితం..." అనేలా జీవించడం... 

అందుకే కద సద్గురువులు అన్నారు....
" ఈశ్వరుడి స్మరణమే జీవనం...ఈశ్వరుడి విస్మరణమే మరణం...." అని.....

కాబట్టి 3 సార్లు శ్రీహరి నామ స్మరణ,
11 సార్లు శివనామ స్మరణ..
మధ్యలో ఉండే జాగ్రత్ అవస్థలో మనకు 3×11=33 కోట్ల దేవతాసమూహ అనుగ్రహం సమకూరి మన జీవితాలు పరిఢవిల్లే విధంగా మన పెద్దలు అలా మన దైనందిన జీవిత నియమావళిని వ్యవస్థీకరించారన్నమాట....

సరే ఇంతకీ అసలైన టాపిక్లోకి వస్తే...

శ్రీగిరి... అనగా తన శక్తి సహితంగా పరమాత్మ కొలువైన కొండగా మనం ఆరాధించే తిరుమల మరియు శ్రీశైలం యొక్క వైభవం.....

ఉత్తరాన కాశి, 
మధ్యమున ఉజ్జైని, 
దక్షిణాన శ్రీశైలం,

18 శక్తిపీఠాల్లో, 11 జ్యోతిర్లింగాలలో...
ఈ మూడూ మాత్రమే శివశక్త్యాత్మక శక్తిపీఠజ్యోతిర్లింగ క్షేత్రములు...

విశాలాక్షిసహితవిశ్వనాథుడు..
మహంకాళిసహితమహాకాళేశ్వరుడు..
భ్రమరాంబాసహితమల్లికార్జునుడు..

ఒక మనిషికి అత్యంత ముఖ్యమైనది తన ముఖమండలం....
అసలు మొహం లేకపోతే (అనగా కంటం పైన ఉండే తలకాయ్ మొత్తం) మనిషేఉండడు కద...

అటువంటి మనిషికి 3 అత్యంత ముఖ్యమైన శక్తి కేంద్రములు

కళ్ళు, ముక్కు, నోరు....

ఆ సామ్యామున, ఆధ్యాత్మిక జీవ శక్తికేంద్రస్థానాలలో....

నయనమండలం(కళ్ళు) / ఆజ్ఞ్యాచక్ర
జనిత సకల యోచనాత్మక శక్తికి
కాశి క్షేత్ర విశాలాక్షిసహితవిశ్వనాథుడు
ప్రతీక..

నాసికామండలం (ముక్కు) / ఊపిరి / ఘ్రాణశక్తికి ఉజ్జైని క్షేత్ర మహంకాళిసహితమహాకాళేశ్వరుడు ప్రతీక..

అధరమండలం(పెదవులు) / నోరు / దంతములు / నాలుక వీటన్నిటికి శ్రీశైల క్షేత్ర భ్రమరాంబాసహితమల్లికార్జునుడు ప్రతీక....

ఇక్కడ సరిగ్గా గమనిస్తే ప్రతీ మనిషి యొక్క గొప్పదనాన్ని శాసించేది వారి నోరే...

కళ్ళు / ముక్కు చేసే పని అందరికి దాదాపుగా ఒక్కటే....

కాబట్టి నోరే ప్రత్యేకం...

ఎందుకంటే మనం తినే ఆహారంలో 6వ వంతు మన మనసు ఔతుంది....

ఆ మనో శక్తితో క్రమక్రమంగా ఆర్జించుకున్న ఎన్నెన్నో ఇతర శక్తులతో కలుపుకొని,
మనం మాట్లాడే ఉన్నతమైన మాటలు / వాక్యాలు,
మన ఉన్నతికి, మన గౌరవానికి / మన గొప్పదనానికి బాటలు వేసే బంగారు మేటలు...

లోకంలో మనం సాధారణంగా వినేట్టుగా....

"ఎందుకండి అలా అనవసరంగా నోరు పారేసుకుంటారు...
మీ వయసుకు తగ్గట్టుగా...
మీ పెద్దరికానికి తగ్గట్టుగా...
మీ స్థాయికి తగ్గట్టుగా...
మాట్లాడొచ్చుకద..." 
అని అంటూంటారు...

" వామ్మో...ఆయన నోరా....మీరు ఎంత తక్కువ ఆయనతో పెట్టుకుంటే అంత మంచిది...ఆ నోటిని మీరు గెలవలేరు సరికదా మిమ్మల్నీ, మీ వైఖరిని ఎక్కడికక్కడ ఏకిపారేస్తాడు....జాగ్రత్త...ఆయన జోలికి వెళ్ళకపోవడమే మంచిది...." 
అని అంటూంటారు...

"మీ నోటిచలవ వల్ల అంతా శుభంగా జరిగిందండి....మాకు చాలా సంతోషం..."
అని అంటూంటారు.....

ఇవ్విధంగా పలురకాలుగా నోటి యొక్క గొప్పదనం లోకంలో ప్రస్తుతించబడడం మనము గమనించగలం.....

అంత మాత్రాన కళ్ళని, ముక్కును తక్కువ చేసినట్టు కాదు....
వేటి గొప్పదనం వాటిదే...

"ఆల్ఫా, బీటా కిరణాలను దాటి గామా కిరణాలను సైతం సారించి కిలోమీటర్ల మేరా రేడార్ లా అన్నీ స్కాన్ చేయగల కళ్ళు ఆయనవి...
ఆ కంటపడితే ఇక ఎప్పటికీ మరచిపోని జాబితాలోకి ఆ వస్తువు / మనిషి చేరినట్టే...." అని కళ్ళ యొక్క గొప్పదనం గురించి ప్రస్తుతించబడడం.....

" రేచక, పూరక, కుంభకాలతో, పంచభూతములను సైతం తన అధీనంలో బంధించగల ప్రాణాయామ 
శక్తిని తనది...." అనేలా సూర్యనాడి చంద్రనాడి ద్వారా శ్వాస జనిత శక్తులను నియంత్రించే నాసికామండలం / ముక్కు యొక్క శక్తి గురించి ప్రస్తుతించబడడం.....

ఇట్లా మనం గమనించవచ్చు....

కాకపోతే నోటి యొక్క గొప్పదనం మిక్కుటంగా ఈ లోకంలో వ్యాప్తిగావించబడడం అనేది మనం ఎక్కువగా గమనించే సత్యం....

" వారు నోరు తెరిచి ఒక్క గంట మాట్లాడితే చాలండి....కొన్ని వందల పుస్తకాల ద్వారా ఆర్జించబడే జ్ఞ్యానం మనకు వారి వాగ్వైభవంలో లభ్యమౌతుంది....అంతటి ప్రహృష్టమైనవి వారి వచనాలు..."
అనేలా నోటి యొక్క గొప్పదనం గురించి శ్లాఘించబడడం మనం గమనించవచ్చు....

( ప్రవచనాసామ్రాట్, అస్మద్ గురుదేవులు, సద్గురు శ్రీ చాగంటి వంటి మహనీయుల వాగ్వైభవంలా....)

"మహానుభావుడు.....ఒక్కసారి ఈశ్వరుడిని స్మరించి సంకల్పించి వచిస్తే చాలు....వారు అన్నది అన్నట్టుగా జరిగి తీరుతుంది...అంతటి వాక్ శుద్ధి వారిది...." అనేలా నోటియొక్క గొప్పదనం గురించి ప్రస్తుతించబడడం మనం గమనించవచ్చు....

ఇవ్విధంగా నోటి యొక్క గొప్పదనాన్ని వేనోళ్ళా కొనియాడబడడం మనం గమనించవచ్చు.....

ఒక పది గంటల పాటు కళ్ళు బిగించి పెడితే పెద్దగా ఏ సమస్యా ఉండదు....

ఒక పది గంటల పాటు కళ్ళను, ముక్కును బిగించి పెడితే నోటిద్వార శ్వాసను అందుకొని గట్టెక్కవచ్చు....

ఒక పది గంటల పాటు కళ్ళను, ముక్కును, నోటిని కూడా బిగించి పెడితే ఇక చెప్పాల్సింది పెద్దగా ఏమి ఉండదు... కద....

కాబట్టి ఇక్కడ నోరు యొక్క గొప్పదనం చెప్పకనే చెప్పబడుతున్నది.....

"ప్రాణాత్ వాయురజాయత...." అనే శృతివాక్యానుగుణంగా మనుష్యుడి ప్రాణం ఊపిరి అధీనంలో ఉండే వ్యవస్థ....

అందుకే ఆ పంచప్రాణాలను శాసించే దైవం, మృత్యుంజయుడిగా, ఎక్కడాలేని విధంగా అప్పుడే దహనసంస్కారాలు కావించబడిన ఫ్రెష్ చితాభస్మం తో 
అభిషేకం గావించబడే ఎకైక ఘోరాఘొరా చక్షుర్ధారియై
మహాకాళేశ్వర శివలింగస్వరూపంలో
ఆ ఉజ్జైని మహాకాళుడు అధ్యాత్మ పురుషుడి నాసికామండలాధిదైవంగా కొలువైఉన్నాడు.....

ఇక శ్రీగిరి మల్లికార్జున మహాలింగ స్వరూపంలో ఆ 
శ్రీ భ్రమరాంబా సహిత మల్లికార్జునుడు నిత్యం ఎందరో సిద్ధసాధ్యగరుడగంధర్వయక్షకిన్నెరకింపురుషవిద్యాధరచారణనాగాది దేవగణములతో సేవించబడుతూ
దేశంలో ఎక్కడ ఏ పూజా కార్యక్రమం జరిగినా సరే
" శ్రీశైలస్య ----- దిగ్భాగే...."
అని కీర్తించబడే ఆ శ్రీనగాధీశుడై కొలువైఉండి ఎన్నెన్నో ఆశ్చర్యకరమైన దైవిక విశేషములకు ఆలవాలమై 
" సేవే శ్రీగిరిమల్లికార్జున మహాలింగం శివాలింగితం...."
అని ఆరాధింపబడుతుండడం మనం గమనించే సత్యం....

అధ్యాత్మ జీవుడి అధరమండలానికి
( అనగా పెదవులు, నోరు, నాలుక, పళ్ళు, అన్నీ కలిసుండే నోటికి సంకేతం ఈ శ్రీశైల శ్రీ భ్రమరాంబామల్లికార్జున క్షేత్రం...)

ఇందాక పైన చెప్పిన విధంగా ఒక మనిషికి నోరు ఎంతటి వైభవాన్ని సమకూర్చగలదో, అవ్విధంగా శ్రీగిరి కూడా అంతటి విశేషమైన అనుగ్రహాన్ని సమకూర్చే పుణ్యక్షేత్రం....

యోగం, భోగం, ఇష్టకామ్యార్ధసిద్ధి, అష్టసిద్ధులు, నవనిధులు, ఇలా ఒక మనిషి ఏమేమి ఊహించగలడో / ప్రార్థించగలడో వాటన్నిటిని వర్షించే ఆశ్చర్యకరమైన తీర్థస్థలి శ్రీశైల క్షేత్రం....

సకలాఘ నాశిని పాతాళగంగ....
పైకి చూడటానికి ఒక సామాన్య తీర్థంలా కనిపించినా....ఆ తీర్థరాజం యొక్క శక్తి అనంతం, అమేయం.....

ఎన్నెన్నో అగోచర దైవిక తీర్థాల జలనాడులు ఈ పాతాళగంగలోకి సంగమించి ఉండి వాటన్నిటి అనుగ్రహాన్ని భక్తులకు సమకూర్చి పెట్టే ఆశ్చర్యకరమైన తీర్థం...

శ్రీ కంచి పరమాచార్య వారిచే సరస్వతీ తీర్థం కనుగొనబడిన ప్రాంతం....

ఎన్నెన్నో బాగా కాస్ట్లి మందులు మింగితే కాని సాధ్యపడని రక్తశుద్ధిని అనుగ్రహించగల బహు శక్తివంతమైన బయలు వీరభద్రుడి గుడి ఉన్న పుణ్యక్షేత్రం.....

మనుష్యుల ఊహకు కూడా అందని మహదాశ్చర్యకరమైన మహిమాన్విత సిద్ధిదాయక ప్రదేశాలు ఆ శ్రీశైలంలో కోకొల్లలు....

అక్కమహాదేవి గుహలు, ఇష్టకామేశ్వరి అమ్మవారి గుడి, హేమారెడ్డిమల్లమ్మ ఆలయం, కదలీవనం, సిద్ధరామప్పపాదాలు, ఇలాంటి ఎన్నెన్నో చోట్ల గుప్తంగా కొలువైన శక్తిస్థావరాలు సిద్ధిదాయకాలు, మహామహిమాన్విత సిద్ధకూటములు ఇలా ఎన్నో ఎన్నెన్నో వింతలు విశేషాలు ఆ శ్రీగిరి సొంతం....

మానవమాత్రులకు / మనుష్యశరీరంతో చేరుకోలేని విశేషదైవిక పుణ్యస్థలాలు అక్కడ ఎన్నెన్నో....

అందుకున్న వారికి అందుకున్నంత అన్నట్టుగా....

వీటన్నిటి గురించి అస్మద్గురుదేవులు శ్రీచాగంటి సద్గురుదేవుల ప్రవచనాల్లో విని అవన్నీ ఎక్కడెక్కడున్నాయో అని వెతుక్కుంటూ వెళ్లి నాకు వీలైనంత రీసర్చ్ చేసిన సందర్భాలను ఆలంబనగా గావించే వీటి గురించి చెప్తున్నాను....

తిరుమల కొండపై ఎన్నెన్ని ఆశ్చర్యకరమైన తీర్థాలు ఉన్నాయో....
శ్రీశైలం లో కూడా అన్ని ఆశ్చర్యకరమైన తీర్థాలు ఉన్నాయి....

ఇక ఆ మహాయోగేశ్వరేశ్వరి శ్రీభ్రమరాంబా అమ్మవారి వైభవమైతే ఎంత చెప్పినా ఇంకా మిగిలేఉంటుంది.....

మామూలుగా చూడ్డానికి ఒక చిన్న కోవెలలో, పెద్ద రూపాయిబిల్లంత రుధిరవర్ణ కుంకుమబొట్టును ధరించి,
బంగారు త్రిశూలం ధరించి, మహాశక్తివంతమైన శ్రీచక్రానికి అభిముఖంగా నిలిచిన ఆ 
" మహాచతుఃషష్ఠికోటియోగినీగణసేవిత " యొక్క మహిమ ఏ మానవమాత్రుడికి
కూడా అందనిది.....

అది కేవలం ఆ త్రయి యొక్క అనుగ్రహసంపాకమైన యోగదృష్టికి మాత్రమే లభించే విశేషం....

త్రయి అనే లలితనామం పై ధ్యానం మొదలుపెట్టి త్రిపురమాలినీ దెగ్గరికి వచ్చే సరికి ఆ ధ్యానసిద్ధికి గోచరమయ్యే శ్రీభ్రమరాంబాదేవి వైభవం బహు ఆశ్చర్యదాయకం....

అరుణాసురుడిని సమ్హరించేందుకు అలా భ్రామరి గా అవతారాన్ని స్వీకరించిన ఆ ఆదిపరాశక్తి, అట్లే 
ఆ శ్రీగిరిపై కొలువైన వైనంలో ఎంతో గంభీరమైన అధ్యాత్మవిజ్ఞ్యాన విశేషం దాగున్నది.....
 
మందస్మితురాలైన నగుమోమొతో భక్తులను అనుగ్రహించే ఆ గర్భాలయ శ్రీభ్రమరాంబా అమ్మవారి సన్నిధిలో పైన చిన్న గ్లాస్ బాక్స్ / గాజుపేటికలో మనం ఇప్పటికీ ఆ శ్రీభ్రామరి యొక్క నిజరూపాన్ని దర్శించగలం....

సైన్స్ ఎంతగా అభివృద్ధి చెందినా స్పిరిట్యువాలిటిని ఎన్నడు చేరుకోలేనంతగా ఉన్నతంగా శాశ్వతమై ఉండడమే ఆధ్యాత్మికతకు గల గొప్పదనం.....
అది ఎప్పటికీ అట్లే ఉండడం అనేది సైన్స్ కి ఎప్పుడూ ఒక జీవితకాల ప్రశ్నయే....

ఒక భ్రమరం / తేనెటీగలా ఎగరగల
డ్రోన్స్ ని సైన్స్ తన విజ్ఞ్యానవైభవంతో సృష్టించగలదేమోగాని ఒక తేనెటీగలా ప్రకృతిలో ఉండే పూలనుండి మకరందాన్ని పానంగావించి తన భ్రమరకళతో ఆ వగరుగా ఉండే పదార్ధాన్ని తియ్యని తేనెగా మార్చగల మషీన్ ని సైన్స్ సృష్టించగలదా....??

ఎన్నటికీ అది సైన్స్ కి సాధ్యపడని అంశం....
ఇలా ఎన్నెన్నో ప్రకృతి వింతల్లోగల విజ్ఞ్యానాన్ని సైన్స్ అనుకరించి తన గొప్పదనాన్ని ఆవిష్కరించగలదేమో కాన్ని అందలి ప్రజ్ఞాన సిరిని సైన్స్ ఎన్నడూ కూడా తన వశంచేసుకొనజాలదు....
ఇదే మన సనాతన ఆధ్యాత్మికతకు గల గొప్పదనం మరియు సైన్స్ కి గల పరిమితి...

ఒక గొప్పవ్యక్తెవరో అందుకే అన్నారనుకుంటా....
" Spirituality starts where science ends ..." అని....

ప్రకృతి లో లభించేది మకరందం...
ఆ ప్రకృతిసిద్ధమైన మకరందాన్ని అమృతతుల్యమైన మధువు గా మార్చేది భ్రమరం....

( ఆయుర్వేద శాస్త్రరీత్యా తేనె ఒక గొప్ప ఓషధీ శక్తిగల పదార్ధం....అది ఎన్నెన్నో రుగ్మతలకు మందులు తయారుచేయడంలో ఒక కీలక ముడిసరుకు....
ఆశ్చర్యం ఏంటంటే ఇంత గొప్పదనం గల తేనెని వేడి చేస్తే మాత్రం అది విషంగా మారుతుంది....
కాబట్టి ప్రకృతిలో ఎట్లు లభించినదో అట్లే తేనెను స్వీకరించవలెను..... )

అచ్చం ఇదేవిధంగా ఈ భ్రామరికళ తో ఆ ఆదిపరాశక్తి శ్రీగిరి భ్రమరాంబికాదేవిగా తనను కొలిచిన భక్తులకు తన భ్రామరికళను అనుగ్రహంగా ప్రసాదిస్తుంది.....

అనగా సాధారాణంగా అగోచరమైనది, భ్రామరికళతో గోచరమౌతుంది.....

సాధారణంగా వినపడనిది....భ్రామరికళతో వినపడుతుంది......

సాధారణంగా జగత్తులో సంభవం కానివి....భ్రామరికళతో సంభవమౌతాయి....

ఇలా పలువిధాలుగా "సాధరణంగా గ్రాహ్యమయ్యే ప్రకృతి " యొక్క పరిధి ఎదైతో ఉందో.....

దానికి పైస్థాయిలో ఉండే యోగవిభూతులన్నియు కూడా ఆ శ్రీభ్రామరి యొక్క అనుగ్రహంగా వర్షించబడే దైవప్రసాదములు....

తిరుచానూరులో ( శ్రీశుకపురంలో ) ఊర్ధ్వహస్త కమలధారిణి గా కొలువైన ఆ శ్రీనివాసుడి విశేష శ్రీశక్తికి ప్రతీకగా.....

అనగా ఆ

" ప్రకృతిం వికృతిం విద్యాం....
సర్వభూతహితప్రదాం..... "

అట్లే శ్రీశైల అభయారణ్యంలో ఊర్ధ్వహస్త కమలధారిణి గా, పైరెండు చేతుల్లోను కమలాన్ని ధరించి ఏ ఆగమానికి అందని రీతిలో ఉండే శిల్పకళతో అలరారే ఇష్టకామేశ్వరి అమ్మవారు శ్రీగిరి పై నెలకొన్న లయకారకుడి విశేష శ్రీశక్తికి ప్రతీక....

పేరుకు తగ్గట్టే ఇష్టకామ్యార్ధ సిద్ధిని అనుగ్రహించే చిరకాల చింతామణి గా భక్తులకు ఉపాస్యమైన ఘనదైవం ఆ శ్రీశైల ఇష్టకామేశ్వరి అమ్మవారు.....

ఎంతైనా శ్రీఆదిశంకరాచార్యులచే
భూగృహమునుండి బయల్వడి వారి అద్వితీయమైన తపోశక్తితో పునఃస్థాపించబడిన మూర్తి కాబట్టి, సాక్షాత్తు శ్రీఆదిశంకరాచార్యుల తపోస్థలికి
ప్రతీక ఆ అభయారణ్యగత ఆలయం....

జీపుల్లో తీస్కెళ్ళే వర్తకులు "తొందరగా దర్శనం చేసుకొని వచ్చేయండి సాయంత్రం లోపు శ్రీశైలం తిరిగి చేరుకోవాలి అని..." ఒకటే తొందరపెడ్తుంటారు కాని....

కొంచెం టైం తీస్కొని కొద్దిసేపట్లో వస్తాం అని చెప్పి.....

ఆ ఆలయ పరిసర ప్రాంతాలను, అక్కడి
ఆదివాసీల ప్రాంతాలను, అక్కడి సెలయేళ్ళను, అక్కడి ప్రశాంతమైన ప్రకృతి రమణీయతను, బాగా పరికించి చూడండి......
ఎన్నెన్ని వింతలు విశేషాలు ఆ పరిసరాల్లో దాగున్నయో......
బహు శక్తివంతమైన సహజసిద్ధ శ్రీచక్రములు అక్కడి పరిసరాల్లో ఎవరో మహర్షుల తపోశక్తికి ప్రతీకలుగా ఇప్పటికీ దర్శనీయమే...

ఈ కరోనా వల్ల ఈ సారి కార్తీకశోభ కాస్త మందగించిందేమో...
వచ్చే కార్తీకమాసం వరకు అన్నీ సద్దుమణిగి శ్రీగిరి వైభవం ధగధగ తణుకులీనుతూ భక్తులను సదా అనుగ్రహించుగాక....😊

"శ్రీనాథాదృతపాలితత్రిభువనాం శ్రీచక్రసంచారిణీం
గానాసక్తమనోజయౌవనలసద్గంధర్వకన్యాధృతాం
దీనానామతివేలభాగ్యజననీం దివ్యామ్బరాలఙ్కృతాం
శ్రీశైలస్థలవాసినీం భగవతీం శ్రీమాతరం భావయే...."😊🙏💐