Sunday, February 28, 2021

శ్రీచాగంటి సద్గురువుల సుందరకాండ చింతామణి వంటిది...😊

శ్రీ చాగంటి సద్గురువుల వందలాది ప్రవచనాలు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎందరో శిష్య భక్తుల హృదయడోలికల్లో నిత్యం అజరామరమై కొలువైఉండి, వాటి సారాన్ని అందుకున్న వారికి అందుకున్నంత అనే రీతిలో, అవి ఎల్లరిని తరింపజేయడం అనే స్వానుభవపూర్వక సత్యం ఎందరెందరికో గత దశాబ్దకాలంగా బాగా రూఢమైన సత్యం.....

శ్రీచాగంటి.నెట్ అనే వెబ్సైట్ లో వారి అమూల్యమైన ప్రవచనా పెన్నిధి ఆడియో ఫైల్స్ రూపంలో యావద్ ప్రపంచానికి ఉచితంగా అందివ్వబడిన రోజుల్లో వాటన్నిటిని డౌన్లోడ్ చేస్కొని భద్రపరుచుకొని శ్రద్ధగా ఆలకించి జీవితానికి అన్వయించుకొని అనుగ్రహాన్ని బడసిన ఎందరో శిష్య భక్తుల్లో నేనుకూడా ఒకడిని....

వాటన్నిట్లో నా జీవితానికి, మరియు నాకు తెలిసి మరెందరో జీవితాలకు కూడా, ఒక అమూల్యమైన ప్రవచనారత్నాలహారం వంటిది శ్రీ చాగంటి సద్గురువుల శ్రీసంపూర్ణరామాయణం....

అందులోని " సుందరకాండ " ఆ ప్రవచనారత్నహారానికి చింతామణి వంటిది......

శ్రోతలు ఎవరు...
వారి జ్ఞ్యాన స్థాయి ఎట్టిది....
వారి గుణగణాలు ఏమి...
వారి విద్యార్హతలు ఏమి....

ఇత్యాది వేటితో కూడా సంబంధంలేకుండా ఎంతటి అనుగ్రహాన్నైనను వర్శించే శ్రీమద్రామాయణ ప్రవచనంలోని సుందరకాండ నిజంగా జీవితాలను ఎంతో ఘనంగా ఉద్ధరించే దైవిక ఆపన్న హస్తం.....

కేవలం శ్రీచాగంటి సద్గురువుల సుందరకాండ ప్రవచనాల అండతో ఎన్నో రాత్రుల భయంకరమైన దుఖపూరిత ఒంటరితనాన్ని దిగమింగి జీవిత ప్రయాణంలో అలిసి సొలసి ఉన్న వ్యక్తిని బాగా రాటుదేలిన వ్యక్తిత్వం గా, నన్ను మలిచింది మాత్రం కేవలం సద్గురువుల శ్రీమద్రామాయణమే...

ఈ లోక రీతి ఎట్టిది....
ఈ లోకుల తో లౌక్యాన్ని నెరపి మనగలగడం ఎట్లా....
ఈ ప్రపంచంలో మంచితనం అనే ముసుగులో ఉండే వారెవరు...నిజమైన మంచివారెవరు....
ఈ కలియుగం మొత్తం ధనప్రధాన యుగమై లోకులను ఎట్లు బాధిస్తున్నది.....
ఈ ఆధునిక కాలంలో ఉండే మన దైనందిన జీవితానికి ఆధ్యాత్మికతను ఎట్లు ఆపాదించుకొని తరించవలె.....

ఇత్యాదిగా ఉండే ఎన్నో ఎన్నెన్నో సుజ్ఞానగులికల సమాహారం శ్రీచాగంటి సద్గురువుల శ్రీమద్రామాయణం....

వారు ఎంతటి దీక్షాదక్షులై ఆనాడు మండల దీక్షగా సంపూర్ణశ్రీమద్రామాయణ ఆదికావ్యాన్ని అనన్యసామాన్యమైన రీతిలో శిష్యభక్తులకు అందించినారో, అంతటి దక్షతను శ్రీమద్రామాయణం శ్రోతల జీవితానికి ఆపాదించి అనుగ్రహించడం అనేది నాతో పాటుగా ఎందరో స్వానుభవపూర్వకంగా రూఢపరచుకున్న సత్యం.....

శ్రీ చాగంటి సద్గురువులు నుడువినట్టుగా,
శ్రీరాముడి కథను కేవల నరుడి కథగా విన్నా సరే అది జీవితాలను ఉద్ధరించి తీరుతుంది.....

భగవద్ అనుగ్రహం కొలది..
వారి వారి జ్ఞ్యాన స్థాయిని బట్టి...
శ్రీమద్రామాయణం

ఒక కథగా...
ఒక కావ్యంగా....
ఒక అధ్యాత్మ భాష్యంగా...
ఒక ఉపనిషద్ బోధగా....
ఒక వేదమంత్రంగా.....
ఒక సిద్ధసారస్వతంగా.....

భాసించి వారి వారి ఉపాసనకు అనుగుణంగా అనుగ్రహన్ని వర్షిస్తుంది.....

శ్రీమద్రామాయణ సారస్వతం అంతటి శక్తివంతమైనది కనుకే.,

అళిపుళి అనే మెట్లత్రోవ దెగ్గర,
అనగా ఇప్పటి అలిపిరి శ్రీవారి పాదాలమండపం లో, ఆనాడు శ్రీమద్రామానుజాచార్యుల శ్రీరామాయణగోష్ఠి కారణంగా దుర్లభమైన ఆనందనిలయ స్థిత శ్రీవేంకటపరబ్రహ్మం యొక్క శ్రీపాదపద్మములు స్వయంవ్యక్తమై భక్తులను అనుగ్రహించి ఆనాటి నుండి ఈనాటి వరకు కూడా అలిపిరి నుండి తిరుమల మెట్ల మార్గాన్ని అధిరోహించే భక్తులకు లభించే సౌభాగ్యమై వర్ధిల్లింది....

SreemadRaamaayanam is like an immeasurable sugarcane orchard....
Once we gain access to it's assimilation after being blessed by an eminent sadguruji like SreechaaganTi gaaru,
we can make sugarcane juice out of it...
And from it Jaggery / Sugar, and use them to prepare hundreds of varieties of sweets / dishes for a life time and beyond.....

The sugar cane juice obtained is the raw intelligence...
Out of which the jaggery called wisdom is extracted and executional intelligence called sugar is obtained as a refined form of that generic wisdom.....

We can combine this jaggery called wisdom and executional intelligence called sugar in the required quantities to all other raw materials called 'all sorts of situations' in our lives to turn them in to yummy dishes that we would want to savor as per our choice....

అందుకే నాకు శ్రీచాగంటి సద్గురువుల శ్రీమద్రామాయణం మరియు ప్రత్యేకించి
వారి సుందరకాండ ప్రవచనం అంటే ఏదో ఒక అవ్యక్తమైన అనిర్వచనీయమైన అవ్యాజమైన ఆనందసంధాయక అనుగ్రహకారకం....

శ్రీరామరామరామేతి రమేరామేమనోరమే
సహస్రనామతత్తుల్యం రామనామవరాననే...

గోష్పదీకృతవారాశిం మశకీకృతరాక్షసం
రామాయణమహామాలారత్నం వందే అనిలాత్మజం....

దూరికృతసీతార్తిః ప్రకటీకృతరామవైభవస్పూర్తిః
దారితదశముఖకీర్తిః పురతోమమభాతుహనుమతో మూర్తిః..

మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాంవరిష్టం
వాతాత్మజం వానరయూధముఖ్యం
శ్రీరామదూతం శిరసానమామి...

శ్రీరామచంద్రంశ్రితపారిజాతం
సీతాముఖాంభోరుహచంచరీకః
సమస్తకళ్యాణగుణాభిరామం
నిరంతరం శుభామాతనోతు....
😊
🙏🙏🙏🙏🙏


Saturday, February 27, 2021

శ్రీశ్రీనివాసమగాపురం లోని శ్రీకళ్యాణవేంకటేశ్వరస్వామి వారి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవ వీడియో...🙏😊

శ్రీశ్రీనివాసమగాపురం లోని శ్రీకళ్యాణవేంకటేశ్వరస్వామి వారి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవ వీడియో...🙏😊

"శ్రీవారి మెట్ట్ల మార్గం" నుండి తిరుమలకు చేరుకునే చంద్రగిరి మెట్లదారి త్రోవన తిరుమలకు చేరుకునే వారికి సుపరిచితమైన పురాతన ఆలయం మరియు ఇతర చాలా మంది శ్రీవారిభక్తులు వారి వారి తిరుమల యాత్రలో తప్పకుండా దర్శించే ఆలయం శ్రీనివాసమంగాపురం లోని శ్రీకళ్యాణవేంకటేశ్వర స్వామి వారి ఆలయం...

సదాచార సంపన్నులైన పెద్దలు చెప్పేదానిప్రకారంగా

1. తిరుపతి తాళ్ళపాక గంగమ్మ తల్లి ఆలయం.....
( తిరుపతి బస్టాండ్ కి దెగ్గర్లో)

2. తిరుచానూరు / అలర్మేల్మంగాపురం
లోని శ్రీపద్మావతీదేవి ఆలయం....

3. కపిలతీర్థం దెగ్గరి శ్రీకపిలేశ్వరాలయం.....

4. గోవిందరాజస్వామి ఆలయం...
( మరియు ఆ ఆలయ పరిసర అన్ని ఉపాలయాలు..)

మరియు

5. శ్రీనివాసమంగాపురం లోని శ్రీకళ్యాణవేంకటేశ్వరస్వామి వారి ఆలయం....

ఈ ఐదు ఆలయాలు కూడా తప్పకుండా ఒక్కసారైనా తిరుమల శ్రీవారి దర్శనం తో పాటుగా దర్శించుకోవడం అత్యంత శుభప్రదం అని....

ఎందుకంటే ఇవన్నీ కలిపి శ్రీవేంకటాద్రిపై ఉన్న తిరుమల ఆలయానికి గల ఒక పెంటాగొనల్ రక్షకవ్యవస్థ లాంటివి అన్నమాట....

అనగా ఒక 3D పెంటగాన్ యొక్క 5 కొసలను కలుపుతూ ఉండే రక్షణ కవచాన్ని అనుసంధానిస్తూ ఊర్ధ్వమున ఉండే శ్రీవేంకటనిలయంలోని  శ్రీశ్రీనివాస పరమాత్మ మరియు తన యెదపై కొలువైన వ్యూహలక్ష్మీ అమ్మవారు ఒక దివ్యమైన దైవిక వ్యవస్థలోకి తమ భక్తులను అనుసంధానపరిచి విశేషమైన అనుగ్రహాన్ని వర్షించి ఆనందిస్తూంటారు...

పంచకోణాల పెంటగాన్ అమేయమైన శక్తినిలయం....

అమెరికా సమ్యుక్త రాష్ట్రాల రక్షణ కవచం మొత్తం వారికి గల పెంటగాన్ ( Pentagon : The abode of all the USA Security Units ) అనే పంచకోణాత్మక బిల్డింగ్ నుండే ప్రసరించబడుతూ ఉండడం ఎల్లరికి తెలిసిందే కద....

వాళ్ళది భౌగోళిక పెంటగాన్ అనే కట్టడం నుండి వెలువడే రక్షణ కవచం....

ఇక్కడ మన తిరుమలది ఒక దైవిక పెంటగాన్ నుండి ప్రోది గావించబడే అధ్యాత్మ జీవరక్షణ వ్యవస్థ.....

కేవలం భౌతికవాదం గురించి మాట్లాడే వారి గురించి నేను పెద్దగా ఏమి మాట్లాడను కాని,

భౌతికతను ఆధ్యాత్మికతతో అనుసంధానించి విశ్వసించే వారికి తెలిసినట్టుగా...

తిరుమల అనేది కేవలం ఈ భూమండలం పై గల మరొక పర్వతప్రాంతం మాత్రమే కాదు...

అది అప్రాకృతం...

అది శ్రీవైకుంఠ గత క్రీడాద్రి...

అది ఆదిశేషుడి / వాయుదేవుడి ద్వారా శ్రీవైకుంఠం నుండి భూలోకానికి శ్రీహరి అనుగ్రహంగా రప్పించబడిన శ్రీవేంకటాద్రి.....

కాబట్టి ఈ భూతలానికి ఉండని ఎన్నెన్నో ప్రత్యేకతలు శ్రీవేంకటాద్రి సొంతం...

అతల వితల సుతల తలాతల రసాతల మహాతల పాతాళమనబడే 7 అధో లోక తలాలకు...

భువర్లోక సువర్లోక మహర్లోక జనోలోక తపోలోక సత్యలోకమనబడే 6 ఊర్ధ్వ లోకాలకు శ్రీవేంకటాద్రి నుండి ప్రత్యక్షముగా మార్గములు కలవు..!

కపిలతీర్థం దెగ్గరి వకుళమాతగుహ
నుండి అధోలోకాలకు గల మార్గం గురించి శ్రీచాగంటి సద్గురువులు మనకు చెప్పిఉన్నారు......

అట్లే పైన శ్రీవేంకటాద్రి పైన గల కొండలు లోయలు పైకి చూడ్డానికి ఏవో మామూలు కొండలు గుహలు లోయలు అని అనుకుంటాము కాని నిజానికి అవన్నీ
కూడా ఈ విశ్వంలో పరివ్యాప్తమై ఉన్న వివిధ ఆశ్చర్యకరమైన లోకాలకు / ఉపరితల ఖేచర తలాలకు / వివిధ సిద్ధవాటికలకు  గల అనుసంధాయక మార్గములు....

మనకు తెలిసిన అవ్వాచారి కోన / తుంబురు కోన / మలయ కోన ఇవన్నీ కూడా మన భూతలానికి దెగ్గరగా ఉండే ప్రాంతాలు....

స్వామిపుష్కరిణి, కపిలతీర్థం, ఆకాశగంగా తీర్థం, పాపనాశి తీర్థం, నాగతీర్థం, జపాలి తీర్థం, ధృవతీర్థం, సనకసనందన తీర్థం, రామకృష్ణతీర్థం, కుమారధార తీర్థం, తుంబురు తీర్థం, .....
ఇవన్నీ కూడా మన భూతలానికి దెగ్గరగా ఉండే తీర్థాలు....

తిరుమల ఆలయం నుండి దూరం పెరుగుతున్నాకొద్ది, దట్టమైన శేషాచలాభయారణ్య అడవుల్లో మన భూతల ప్రాణులకు అనగా ముఖ్యంగా మనుష్యులకు, అందేవి కొన్ని అందనివి ఎన్నో... ఎన్నెన్నో.....

సిద్ధ కోనలు / సిద్ధ వాటికలు / సిద్ధ తీర్థాలు /
దేవ గరుడ యక్ష కిన్నెర కింపురుష సిద్ధ సాధ్య విద్యాధర నాగ గంధర్వ చారణ ఇత్యాది వివిధ ఉన్నతమైన బుద్ధిగత ఉపాధులు గల మనుష్యేతర ప్రాణులకు / కామరూపధారులకు / ఆ కోనలు / వాటికలు / తీర్థాలు నెలవు....

కేవలం శ్రీశ్రీనివాసానుగ్రహం తో మాత్రమే వాటిని కడు దూరము నుండైనా వీక్షించసాధ్యము....

సకలదేవతా సార్వభౌముడైన శ్రీవైకుంఠధాముడు తన నిత్యసూరులతో సహా శ్రీవేంకటపరబ్రహ్మమై భువికి తరలి వచ్చినప్పుడు తనతో పాటుగా తనను ఆశ్రయించి ఉండే వివిధ ఇతర లోకాలు / తలాలు / ఆ ఉపాధిగత దైవిక ప్రాణులు కూడా వాటి సంక్షిప్త ప్రచ్ఛన్న రూపాల్లో శ్రీవేంకటగిరిపై కొలువైఉన్నాయనడం అతిసయోక్తికానేరదు కద....

ఆ మార్మికత కేవల భౌతిక దృష్టికి / సైంటిఫిక్ తర్కానికి / ఫిసిక్స్ సూత్రాలకు / కెమిస్ట్రి ఫార్ములాలకు / గణిత లెక్కలకు అందేదైతే అది అప్రాకృత శ్రీవేంకటాద్రి ఎందుకు అవుతుంది..?

అది కేవలం అమేయ పుణ్య సంచయ భరిత శ్రీశ్రీనివాస అనుగ్రహ పరిపుష్టమైన శ్రీహరి భక్తులకు మాత్రమే ఆ శ్రీవేంకటముడయవర్ ఎరుకపరిచే దివ్యదైవిక విలాసం.....

5వ తరగతిలో ఉండి ఎక్కాలే ఇంకా సరిగ్గా రానివారికి 10వ తరగతిలో కూర్చొబెట్టి లాగరితంస్ గురించి చెప్తే ఎవ్విధంగా అయోమయంగా అగ్రాహ్యంగా ఉంటుందో

ఇది కూడా అంతే....

ఆగి ఉన్న ఒక బైకో / కారో ఎక్కి ఫోటోలకు పోజులిచ్చినంత మాత్రాన......
ఆ బైక్ / కార్ కొనేసి, నడిపేసి, ఒక చోట నుండి ఇంకో చోటుకు తరలి వెళ్ళినట్టు కాదు కద......

అచ్చం అట్లే ఒక తీర్థం / ఆలయం / ఒక దైవిక ప్రదేశం కేవలం భౌతికంగా దర్శించినంతమాత్రాన ఆ తీర్థం / ఆలయం / దైవిక ప్రదేశం యొక్క శక్తిని ఆకళింపు చేస్కొని వాటి అనుగ్రహం పొందడం తో సమానం కానేరవు.....

కొండ కింద ఆగి ఉన్న ఒక బైక్ / కార్ ఎదురుగా నిలుచొని తిరుమల ఆలయం ఫ్లెక్సీ పక్కన నిల్చొని ఫొటో దిగడం వేరు....

వాటిని అధిరోహించి వందలఫీట్ల ఎత్తైన శ్రీవేంకటాద్రిపైకి చేరుకొని అక్కడ స్వామి వారిని దర్శించి నిజంగా శ్రీవారి ఆలయ పరిసరాల్లో ఫొటో దిగడం వేరు....

చూసే వారికి రెండు ఫోటోలు చూడ్డానికి ఒకేలా ఉన్నా.....

అందులో ఉన్న వారికి భేదం తెలుసు....

అచ్చం అట్లే

ఒక తీర్థాన్ని / దైవిక ప్రదేశాన్ని కేవలం భౌతికంగా చేరుకోవడం వేరు...

వాటిని ఆధ్యాత్మిక దృక్కోణంలో సేవించి తరించడం వేరు..

ఇవ్విధంగా తిరుమలతిరుపతి పరిసర దైవిక ప్రాంతాల్లో శ్రీనివాసమంగాపురం కూడా ఒక పరమపవిత్ర పుణ్యస్థలి....

నారాయణవనం లో శ్రీనివాసపద్మావతీ పరిణయాంతరం ఆకాశరాజు నుండి సెలవుగైకొని తన తిరుమల ఆనందనిలయానికి చేరుకోవడానికి ఆ వేంకటపతి ఇప్పటి శ్రీవారి మెట్ల మార్గం ద్వారా నడిచి కొండకు చేరుకున్నాడనేది తరతరాలుగా మన పెద్దలచే మనకు తెలపబడిన సత్యం...

పెళ్ళై గృహస్తాశ్రమం లోకి అడుగిడిన తదుపరి 6 మాసాలవరకు కొండలు ఎక్కకూడదు అనే పెద్దల సూచన మేరకు అక్కడి శ్రీ అగస్త్య మహర్షి వారి ఆశ్రమంలో /మునివాటికలో అనగా ఇప్పటి శ్రీనివాసమంగాపురంలో ఆ శ్రీవేంకటహరి పద్మావతీ సమేతుడై 6 మాసాలు బసచేసిన పుణ్యస్థలి....

అందుకే ఆ ప్రాంతమంతా కూడా ఇప్పటికీ ఎంతో మనఃశాంతి కారకమైన ఆహ్లాదభరితంగా, పచ్చదనంతో, స్వచ్ఛదనంతో, భక్తులను ఒక అలౌకికానందానుభూతికి, ధ్యానసిద్ధి కారక నిర్మల స్థితికి గురుచేసి అనుగ్రహిస్తూంటుంది....

తిరుపతి నుండి శ్రీనివాసామంగపురానికి ప్రయాణం గావించేటప్పుడు బస్ గవాక్షం (కిటికీ) లోనుండి కుడిపక్కకు తిరిగి చూస్తే ఆశ్చర్యానందకారకమైన తిరుగిరుల శ్రీహరి రూపం దర్శనమై...

" కొండలలో నెలకొన్న కోనేటిరాయడువాడు.....
కొండలంత వరములు గుప్పెడు వాడూ...."
అనే అన్నమాచార్యుల సంకీర్తన అప్రయత్నంగా స్ఫురించి మనల్ని ఆనదింపజేయడం కద్దు....

ఏడు కొండలే తన రూపంతో కొలువుతీరేలా చేసి...

కొండ తానై, కొండల్లో తానై, కొండపై తానై, వెలసిన ఆ కోనేటి రాయడి దైవిక రాచరిక వైభవం ఎంత వర్నించినా ఇంకా ఏదో మిగిలే ఉంటుంది.....

పెళ్ళైన కొత్తలో తను బస చేసిన దైవిక ప్రాంతం కాబట్టి ఆ ప్రాంతంలో శ్రీకళ్యాణవేంకటేశ్వరుడిగా కొలిచిన భక్తుల కొంగుబంగారమై కొలువై, ప్రత్యేకించి అక్కడ జరిగే తన నిత్యకళ్యాణ కైంకర్యోత్సవం లో ప్రసాదించబడే హరిద్రాకంకణధారణ గావించే వారికి త్వరలోనే కళ్యాణవైభవం సమకూరుతుందని వరమిచ్చిన మహామహిమాన్విత పుణ్యక్షేత్రం శ్రీనివాసమంగాపుర శ్రీకళ్యాణవేంకటేశ్వర స్వామి వారి ఆలయం....

తెలుగు నేలపై కళ్యాణానుగ్రహదాయక
పుణ్యక్షేత్రాలుగా వాసికెక్కినవి

1. మురమళ్ళ శ్రీభద్రకాళిసమేతశ్రీవీరేశ్వర ఆలయం...

మరియు

2. తిరుపతి శ్రీకళ్యాణవేంకటేశ్వరస్వామి వారి
ఆలయం.....

విశ్వాసంతో నమ్మి కొలిచిన ఎందరెందరో భక్తులకు అది వారి వారి జీవితాంతర్గత స్వానుభవసత్యం...

నేను బల్లగుద్ది మరీ చెప్పగలను...

మురమళ్ళ లో వధూవరుల జన్మనక్షత్రానుగుణంగా
ఇచ్చే డేట్స్ లో శ్రీభద్రకాళివీరేశ్వర కళ్యాణం గావించి..
శ్రీనివాసమంగాపురంలోని శ్రీకళ్యాణవేంకటేశ్వర స్వామి వారి కళ్యాణకంకణం ధరించిన వారికి

30 యేళ్ళు దాటినా, ఎన్ని సంబంధాలు చూసినా, సరే ఇంకా పెళ్ళి సెట్ అవ్వట్లేదని బాధపడేవారికి....

వారి వారి జాతకరీత్య, కర్మరీత్య, గృహవాస్తురీత్య, ఎన్ని దోషాలున్నా సరే, అవన్నీ కూడా శ్రీభద్రకాళివీరేశ్వరుల వీక్షణాలకు క్షయించబడి దోషాలన్నీ సమసి

శ్రీకళ్యాణవేంకటేశ్వరుడి అనుగ్రహంతో వారు కళ్యాణతిలకం ధరించడం తథ్యం....!

అవసరమైతే సకల దోషభరిత గృహమునుండి విడిపించి కొత్త ఇంటిని అనుగ్రహించి మరీ తన కళ్యాణ కంకణం ధరించిన భక్తుడి నొసట కళ్యాణ బాసిగం కట్టబడేంతవరకు వరకు ఆ శ్రీహరి భక్తుడిని అనుగ్రహిస్తూనే ఉంటాడు.....అంతటి వాత్సల్యమూర్తి ఆ శ్రీకళ్యాణవేంకటేశ్వరుడు....!!

(
సామాన్యులకు పెద్దగా అర్ధంకాకపోవచ్చు కాని,
వాస్తు శాస్త్రంపై అవగాహన గల పెద్దలకు, పండితులకు, బాగా తెలిసినట్టుగా.....

ఈశాన్య దోషాలు ఉన్న గృహాల్లో, వెంటిలేషన్ కోసం తూర్పు / ఉత్తర ఈశాన్యాల్లోని స్లాబ్ కత్తిరించబడిన గృహాల్లో,

ఆ ఈశాన్య దోషకారణంగా ఇంట్లో ఏ శుభకార్యాలు జరగవు....

30 లు దాటినా సరే, 5 ఏళ్ళ నుండి వెతుకుతున్నా సరే ఆ ఇంట్లోని పిల్లలకు వివాహభాగ్యం ఆమడదూరంలోనే ఉండిపోతుంది....

ఈశాన్య దోషాలకు పశ్చిమ దోషాలు కూడా తోడైతే ఆ ఇంట్లోని పిల్లల ఆరోగ్యం కూడా అంతకంతకు దెబ్బతినడంతో ఇక పెళ్ళిళ్ళ గురించి చేసే ప్రయత్నాలు కూడా పెద్దగా అనుకూలించవు....
)

" కళ్యాణం " అంటే శుభం...

చుట్టూ బురద పెట్టుకొని శుభ్రత గురించి మాట్లాడడం ఎట్లుంటదో....

సకల వాస్తు దోషాలతో, జాతకదోషాలతో నివసించే వారికి శుభాల గురించి మాట్లాడడం కూడా అట్లే ఉంటది....

మన భక్తికి అనుగుణంగా అన్నీ సరిదిద్దబడేలా గావించి సకల కళ్యాణాలను ఒసగే శ్రీనివాసమంగాపుర శ్రీకళ్యాణవేంకటేశ్వరుడి దర్శనం
సాక్షాత్తు తిరుమలేశుడి దర్శనంతో సమానం......

కొండపైన భక్తుల రద్దీ కారణంగా శ్రీవారి దర్శనం చాలసేపు కుదరదేమో కాని శ్రీనివాసమంగాపురంలోని శ్రీకళ్యాణవేంకటేశ్వరుడి సురుచిర స్మితవదన భరిత దివ్యమంగళ స్వరూపాన్ని ఆపాదతలమస్తకం తనివితీరా మళ్ళి మళ్ళి లైన్లో వెళ్ళి దర్శించి తరించవచ్చు.....

వార్షిక బ్రహ్మోత్సవ వైభవంతో అలరారే ఆ శ్రీనివాసమంగాపుర శ్రీకళ్యాణవేంకటేశ్వరుడు భక్తుల్లెలరిని చల్లగా అనుగ్రహించుగాక.....😊💐🍟🍕🍨


Tuesday, February 23, 2021

" సికింద్రాబాద్ " అనే ప్రదేశానికి గల పేరు స్కందర్ --> సికందర్ --> సికందరాబాద్ / సికింద్రాబాద్ గా కాలానుగుణంగా రూపాంతరం చెందిన స్కంద నామవాచకమే అని తెలుసుకోవడం నిజంగా ఆశ్చర్యమే కదు....! 😊

శ్రీకంచికామకోటి వారి స్కందగిరి లోని సుబ్రహ్మణ్యాలయం, శ్రీమహాస్వామి వారి అనుగ్రహంగా జంటనగరాలకు లభించిన అమూల్యమైన ఆలయ సంపద....!

ఎందుకంటే ఒక వ్యక్తి వల్ల ఒక పదార్థానికి / ఒక వస్తువుకి / ఒక ప్రదేశానికి / ఒక అత్యత్భుతమైన దైవిక శక్తి సమకూరి, ఆ మహానుభావుల కారణంగా ఆ పదార్థం / ఆ వస్తువు / ఆ ప్రదేశం నిరంతర దైవిక శక్తిసంచయంతో దిన దిన ప్రవర్ధమానమై యావద్ ప్రపంచం నమస్కరించేంతటి మహోన్నతమైన సంపదగా పరిణమిస్తుంది.....

నదిలో చాలా కాలం నానిన కేవల వస్తువు ఒక చక్కని శిల... ఒక మహానుభావుడి ఉలి స్పర్శతో ఒక ఆగమోక్త దేవతా మూర్తిగా రూపాంతరం చెంది మరొక మహానుభావుడి వేదోక్త మంత్ర శక్తితో జీవంపోసుకొని ఆలయంలో దేవత గా కొలువై కోరినవరాలనొసగే కల్పతరువై పరిణమించడంలో....

"కేవల రాయి.." అనే వస్తువు ఇద్దరు మహానుభావుల కృషితో " కనిపించే దైవం" గా రూపాంతరంచెంది ఎల్లరి ఉన్నతికి కారణమయ్యింది...

ఆ శిలను శిల్పంగా మార్చే ప్రక్రియలో లభించిన రాయిపొడి ఒక మహానుభావుడి వద్దకు ముగ్గు గా చేరుకొని కేవల ముగ్గు అనే ఒక పదార్థం నుండి సకల సంపదలను తనవద్దకు ఆకర్షించే శ్రీచక్రం లోని వివిధ రేఖలుగా రూపాంతరం చెంది దైవత్వాన్ని ఆపాదించుకుని నమస్కరించబడుతుంది.....

మిగతా ఇతర ప్రదేశాలా ఒక సామాన్య ప్రదేశం, ఒక్కొక్క మహానుభావుల మంత్రశక్తి తో పరిపుష్టమైన ఆగమోక్త ఆలయాంతర్గత దేవతా మూర్తిలో పరివ్యాప్తమై ఉండే షోడశకళాత్మక దేవతా శక్తి కి స్థావరమై రూపాంతరం చెందడంతో ఆ ప్రదేశానికి శాశ్వత వైభవం, మహిమ్నత గౌరవం, ఆపాదించబడి చిరంతనకీర్తిని గడిస్తుంది....

అవ్విధంగా భాగ్యనగరానికి శ్రీకంచిమహాస్వామి వారి ప్రత్యక్షానుగ్రహంగా వారి అనన్యసామాన్య మంత్రశక్తితో పరిపుష్టమైన ఆలయం, సికింద్రాబాద్ లోని శ్రీస్కందగిరిసుబ్రహ్మణ్యాలయం అనుగ్రహించబడడం ఎల్లరికి విదితమే కద....

ఆ " సికింద్రాబాద్ " అనే ప్రదేశానికి గల పేరు కూడా

స్కందర్ --> సికందర్ --> సికందరాబాద్ / సికింద్రాబాద్ గా కాలానుగుణంగా రూపాంతరం చెందిన స్కంద 
నామవాచకమే అని తెలుసుకోవడం నిజంగా ఆశ్చర్యమే కదు....! 😊

"ఎంతో దైవానుగ్రహం / పూర్వజన్మార్జిత పుణ్యబలం ఉంటేనే జీవితానికి స్కంద / సుబ్రహ్మణ్యానుగ్రహం అనేది లభిస్తుంది... అంతటి విశేషమైనది స్కందారాధన..." 
అని శ్రీచాగంటి సద్గురువులు నుడివినట్టుగా....

అటువంటి శ్రీసుబ్రహ్మణ్యస్వామి వారు కొలువైన స్కందగిరి నిజంగా ఈ భాగ్యనగరి యొక్క నిజ భాగ్యం...😊

చిన్నప్పటి నుండి వెళ్ళే వేములవాడ / కొండగట్టు / భద్రాచలం...
ఆ తరువాత 2009 నుండి ప్రవేశించిన షిరిడి / తిరుపతి / తర్వాత నా జీవితంలోకి కేవలం శ్రీ చాగంటి సద్గురువుల ప్రవచనాల అనుగ్రహంతో ప్రవేశించిన ఆరో ఆలయం మోపిదేవి సుబ్రహ్మణ్య ఆలయం కావడం నిజంగా ఆ షణ్ముఖుడి అనుగ్రహవిశేషమే...!

మరియు కేవలం శ్రీ చాగంటి సద్గురువుల ప్రవచనాల అనుగ్రహంతో నా జీవితానికి లభించిన 
" శ్రీమద్భాగవతాంతర్గత క్షీరసాగరమథన ఘట్టాంతర్గత సర్వదేవకృత లక్ష్మీస్తోత్రం యొక్క
అనుగ్రహంతో లభించిన నా భార్యామణి ఇల్లు / అత్తగారిల్లు కూడా స్కందగిరికి దెగ్గర్లోనే కావడం కూడా ఆ స్కందుడి అనుగ్రహవిశేషమే కాబోలు...! 😊

మరియు ఆశ్చర్యకరంగా జీవితంలో అస్మద్గురుదేవులను మొట్టమొదటిసారి ప్రత్యక్షంగా దర్శించి రెండు దానిమ్మ పళ్ళు సమర్పించుకొని వారి పాదపద్మాలకు సాగిలపడి నమస్కరించుకున్న ప్రదేశం, "షణ్ముఖోత్పత్తి" మరియు "గంగావతరనం"
ప్రవచనాలు జరిగిన సికింద్రాబాద్ లోని ఒక సుబ్రహ్మణ్యసేవాసమితి కావడం మరింత విశేషం..!!😊

ఎందుకంటే 3 సంవత్సరాల క్రితం వరకు అసలు స్కందగిరి అనే ఒక ప్రదేశం ఉన్నట్టుగాని అక్కడ శ్రీకంచికామకోటి వారి సుబ్రహ్మణ్యాలయం ఉందనే విషయమే నాకు తెలియదు కాబట్టి...😊

సకల రోగబాధా శత్రుబాధా ఈతిబాధా నాశక..
సకల సుజ్ఞ్యాన దాయక....
సకల సంపత్కారక....
సకల శక్తియుక్తిదాయక....
శ్రీవల్లీదేవసేనాసమేతసుబ్రహ్మణ్యస్వామికి
హరోం హర హర...

ఓం శరవణభవాయ నమః...! 🙏😊

******
కంచి పరమాచార్య స్వామి వారి అమృత వచనాలు - గణపతి (182)

స్కందనామ మహిమ

స్కందుడనగా శత్రువులను శోషింపచేయువాడని; దేవస్త్రీ దర్శనం వల్ల వదలిన ఈశ్వర రేతస్సు వల్ల పుట్టినవాడని నిర్వచనం. పరమేశ్వరుని జ్యోతిస్సువల్ల ఆవిర్భవించినాడు. ఇతనికి సుబ్రహ్మణ్య, కార్తికేయ, కుమార, శరవణభవ మొదలైన అనేక పదాలున్నా ఇతనికి సంబంధించిన పురాణం పేరు స్కంద పురాణమే. ఇతని నుద్దేశించి చేయబడు వ్రతము స్కంద షష్టియే. పరమేశ్వరుడు, అమ్మవారితో కుమారస్వామితో అతని పేరు సోమ స్కందుడే. 
ఏదైనా విషయం వేదమంత్రాలలో కన్పిస్తే దానికి గొప్పదనం, గౌరవం కల్గుతుంది. స్కంద పదానికి అట్టి విలువ వచ్చింది. వల్లికి గురువు నారదుడని స్కంద పురాణంలో రాగా, ఛాందోగ్యోపనిషత్తులో సుబ్రహ్మణ్యుని పూర్వావతారమైన సనత్కుమారుడు, నారదునకు ఉపదేశించినట్లుంది. సనత్ అని బ్రహ్మకు ఒక పేరు. సృష్టికి పూర్వం బ్రహ్మ యొక్క సంకల్పానికి అనుగుణంగా సనత్యునారుడు ప్రత్యక్షమయ్యాడు. ఇతడు సనక, సనందన, సనాతన, సనత్కుమారులలో ఒకడు. ఈ నల్గురు బ్రహ్మజ్ఞానులు. పుట్టుకనుండీ నివృత్తి మార్గంలో ఉన్నవారు. జ్ఞానులకు మార్గదర్శకులు. వీరు నిత్య యౌవనులు. కామవాసన అణుమాత్రం లేనివారు. ఛాందోగ్యంలో సనత్కుమారుడు సుబ్రహ్మణ్యునిగా వచ్చినట్లుంది. ఇట్లా వచ్చినట్లు స్కంద పదం రెండుమార్లు ఉచ్చరింపబడింది. 

స్కందుడు, ప్రపంచ వ్యాప్తమైన దేవత. కొందరు స్కూల్ ని ఇ స్కూల్ అన్నట్లు స్కంద పదాన్ని ఇ స్కంద గా విదేశాలలో ఉచ్చరిస్తారు. సెమెటిక్ భాషలలో AL అనేది ఇంగ్లీషులోని The వంటి Definite Article. (A. An, The) అది ఒక వస్తువును నిర్దిష్టంగానే చెప్పేది. స్పష్టంగా AL పదం, ఒక పదానికి ముందు చేరిస్తే ఇస్కందర్, అల్ ఇస్కందర్ అవుతుంది. ఇది గ్రీసుదేశం వెళ్ళి అలెగ్జాండర్ గా అయింది. 

సికిందర్ అనేమాట కూడా స్కందర్ పదం నుండే వచ్చింది. ఇటీవల సికింద్రాబాద్ లో స్కందగిరి ఆలయం వచ్చింది. అసలు సికింద్రాబాద్ యే సిక్కందరాబాద్.

స్కాండినేవియా, అనేక దేశాలతో అనగా స్వీడన్, నార్వే, డెన్మార్కులతో కూడింది. అది స్కాండియా ప్రాంతం. హిందూ - ఇండియా మాదిరిగా స్కంద - స్కాండియాగా మారింది.
******

Sunday, February 21, 2021

Wishing one and all a very happy International Mother Language day 2021....😊💐🍕🍟🍨👏

శ్రీకరమైన మాతృభాషావైభవం
ప్రస్ఫుటంగా కొనియాడబడేలా
"అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం..."
పేరిట ఒక రోజుని ప్రత్యేకంగా కేటాయించి మాతృభాషాభిమానులెల్లరూ ఆనందించడం న్యూస్ పేపర్లలో / టీవీల్లో ఎల్లరూ చూసే ఉంటారు...

కాబట్టి ఎల్లరికీ వారి వారి మాతృభాషాదినోత్సవ శుభాభినందనలు....

Wishing one and all a very happy International Mother Language day 2021....😊💐🍕🍟🍨👏

మొన్న వాలెంటైన్స్ డే...
ఇవ్వాళ ఇంటర్నాష్నల్ లాంగ్వేజ్ డే..
రేపు ఇంకోటి... ఎల్లుండి మరొకటి....

ఇలా ఆ డే, ఈ డే, అంటూ ప్రతిరోజు ఏదో ఒక డే అని నామకరణం చేసి వాటిని ఉత్సవంగా జరుపుకోవడం లో, మిగతా డేస్ అన్నీ వాటికి నిర్దేశించబడిన ఒకానొక సంఘటన / ప్రత్యేకత / గురించి ఉటంకించబడి
ఉత్సవంగా భావించబడితే...

ఇవాళ్టి అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం అనేది నిజానికి మనం ప్రతి నిత్యం జరుపుకునే ఉత్సవమే....

ఎందుకంటే ఎవరికైనా సరే అసలు మాతృభాషను నుడవని రోజంటూ ఉండదు కనక....

జన్మనిచ్చిన మాతృమూర్తిని సైతం వారు గతించిన తదుపరి ఎప్పుడో ఏడాదికోసారి సంస్మరణ దినంగా వారి ఆబ్దీకముల రోజున గుర్తుకుతెచ్చుకొని గౌరవిస్తామేమో కాని జన్మించి మాటలు నేర్చినది మొదలు అసలు మాతృభాష ని మాట్లాడకుండా / తద్వార తత్ వైభవాన్ని ప్రత్యక్షంగా / పరోక్షంగా గుర్తించని రోజంటూ ఉండనేరదు....

ఎందుకంటే
మాతృభాషే మన ఉనికికి చిహ్నం......
మాతృభాషే మన మనికికి మూలం ....
మాతృభాషే మన జీవిత పురోగతికి ఆధారం......
మాతృభాషే మన మేధో వికసనమునకు సిద్ధౌషధం....
మాతృభాషే మన దైనందిన కార్యసాధక మాధ్యమం.....

ఇలా జీవితంలో ఎన్నెన్నో సాధించబడడానికి, సాధించి తరించబడడానికి కారణం మాతృభాష...

మనిషి సహజంగా సంఘజీవి....
దృఢమైన భాషా  నైపుణ్యం వల్లే తనకు ఈశ్వరప్రసాదితమైన సకలవిధమైన గొప్పదనాన్ని, చాతుర్యాన్ని, చాణక్యాన్ని, ఈ సమాజంలో స్థిరీకరించి తన్మూలంగా ఖ్యాతిని, సంపదను బడసి
సుఖించడం సంభవమయ్యేది.....

మీరు వివిధ పరిశోధనల ఫలితాలను పరీశీలించి ఉండి ఉంటే మాతృభాషపై ( ప్రోక్త / లిఖిత )
ఎనలేని పట్టు సాధించిన వారు
ఇతర భాషలపై మరియు ఎన్నో కళలపై చాల బలమైన పట్టున్నవారిగా సమాజంలో పురోగమించడం తద్వారా వారి వివిధ మార్గాల్లోని కీర్తికిరీటాల వెలుగుజిలుగులకు మూలకారణం మాతృభాషావైభవమే అయ్యి ఒప్పారడమనేది ఎంతో మందికి స్వానుభవపూర్వకంగా బోధపడే సత్యం.....

ఇంకా మాటలు కూడా సరిగ్గా నేర్వని చిన్నతనంలో మా అమ్మమ్మవాళ్ళింట్లో ఉన్నప్పుడు కొత్తగూడెం, రామవరంలోని అప్పటి మామిడితోటల దెగ్గర్లోని చెట్టు కింద స్కూల్లో పలకా బలపం పట్టించి అ ఆ ఇ ఈ  దిద్దించిన పద్మ పిన్ని తో మొదలై రాం నగర్లో / భరత్ నగర్లో అవే ఓనామాలు సాగుతూ, 1991 నుండి  ఇప్పటి అస్బెస్టాస్ హిల్ల్స్ లోని రాజధాని స్కూల్లో తెలుగు అక్షరాలను దాటి,

అ అమ్మ
ఆ ఆవు
ఇ ఇల్లు
ఈ ఈక

పదాల్లోకి అనురాధా టీచర్ అనుగ్రహించి, ఆ తదుపరి వచ్చిన కీ.శే శ్రీ నాగసూర్యకళా టీచర్ గారి పర్యవేక్షణలో నా తెలుగు అభ్యాసం అప్రతిహత గంగాప్రవాహంలా దూసుకెళ్ళడంతో సాగిన నా మాతృభాషాభ్యాస ప్రస్థానం ఆనాటి నుండి ఈనాటి వరకు కూడా అడపాదడపా నాలో దాగున్న మరొక నేను ని అనగా తెలుగు భాషాభిమానిని ప్రతినిత్యం పలకరిస్తూ అసంఖ్యాక తెలుగు భాషా పదపరిజాతాలతో ఆ సాహితీకళామతల్లికి అక్షరార్చన గావిస్తూ తరించేలా అనుగ్రహించబడిన మహత్వపూర్ణమైన మాతృభాషామంజరులెన్నెన్నో....

శ్రీ చాగంటి సద్గురువులు నుడివినట్టుగా ఆ శారదాదేవి ఒక్కొక్కరికి ఒక్కోలా తన శ్రీకటాక్షాన్ని అలది అనుగ్రహిస్తూ ఉంటుంది....

ఒకరికి అక్షరమయి గా అంతులేని పదసంపదతో వర్ధిల్లే ప్రౌఢపదబంధనభరిత కావ్యానుగ్రహం అలది అనుగ్రహిస్తూ ఉంటుంది....

ఒకరికి వేదమయి గా అంతులేని వేదస్వరసంపదతో వర్ధిల్లే సుస్వర వేదపఠనానుగ్రహం అలది అనుగ్రహిస్తూ ఉంటుంది....

ఒకరికి నాదమయి గా అంతులేని రాగసంపదతో వర్ధిల్లే ప్రౌఢస్వరబంధనభరిత సంగీతానుగ్రహం అలది అనుగ్రహిస్తూ ఉంటుంది....

ఒకరికి శబ్దమయి గా అంతులేని
రాగాలాపనసంపదతో వర్ధిల్లే గానానుగ్రహం అలది అనుగ్రహిస్తూ ఉంటుంది....

ఒకరికి యోగమయి గా అంతులేని
అక్షరాంతర్గత దైవికానుగ్రహంతో వివిధ యోగరాహస్యావిష్కారక భరిత యోగానుగ్రహం అలది అనుగ్రహిస్తూ ఉంటుంది....

ఇలా ఒక్కొక్కరికి ఒక్కోలా వారి వారి పూర్వజన్మపరంపరార్జిత పుణ్యపరిపాకంతో వారి వారి ఉపాసనా బలానుగుణంగా ప్రార్ధించి సేవించిన భక్తుల్లెల్లరిని ఆ గీర్వాణి తన అనన్యసామాన్య అమేయ సంగీతసారస్వత విశేషానుగ్రహాన్ని వర్షించి జీవితాలను తరింపజేస్తూంటుంది....

చిరకీర్తికాయులై ఉండడం అనేది అవ్విధంగా ఆ సరస్వతీ అనుగ్రహవిశేషమై లభిస్తుంది....

ఒక్కొక్క మహానుభావులచే రచింపడిన పద్య గద్య గాన కావ్య సంకీర్తన భజన సారస్వతాలు ఆ అక్షరమయి అనుగ్రహంతో లోకానికి అందివ్వబడినవి కాన అవి కొన్ని వందల వేల సంవత్సరాల పర్యంతం తమ శక్తిని ప్రపంచంలో నిరంతరం వ్యాప్తి గావిస్తూ వాటిని ఉపాసించిన ఎల్లరినీ అనుగ్రహిస్తూనే ఉంటాయి....

శ్రీ బమ్మెర పోతనామాత్యూల వారి శ్రీమద్భాగవతం...
కవిత్రయం గా వినుతి కెక్కిన
శ్రీ నన్నయ, ఎర్రన, తిక్కన, గారి శ్రీమదాంధ్రమహాభారతం.....
శ్రీ తాళ్ళపాక అన్నమాచార్యుల వారి శ్రీవేంకట ముద్రాంకిత సంకీర్తనా భాండాగారం...
శ్రీ త్యాగరాయ, శ్రీ భద్రాచల రామదాసు వంటి మహనీయుల సంగీతసాహిత్య సమ్మిళిత
సారస్వతం.....

ఇత్యాదిగా ఎందరో కవుల, రచయితల,
సాహితీకర్తల నుండి వెలువడిన అక్షరమయి యొక్క అనుగ్రహం ఆనాటి నుండి ఈనాటి వరకు కూడా మనకు ప్రాతఃస్మరణీయమే కద....

టీ.టీ.డి వంటి సనాతన వైదిక ధర్మ పరిరక్షక సంస్థల్లో కొలువై ఉండే వేదపాఠశాలల్లో వేదాధ్యయనం / వేదపఠనం గావించే భూసురోత్తముల గలసీమల్లో కొలువైఉండే వేదమయి యొక్క అనుగ్రహం తరతరాలుగా సుస్వర వేదపఠన / శ్రవణంతో ఈశ్వరుడితో సహా ఎందరెందరికో స్వాంతనను అనుగ్రహిస్తూనే ఉన్నది కద...

శ్రీ వేటూరి ప్రభాకరశాస్త్రి గారు,
శ్రీ నేదునూరి కృష్ణమూర్తి గారు,
శ్రీ గరిమెళ్ళ బాలకృష్ణప్రసాద్ గారు,
శ్రీ వేదవ్యాసభట్టర్ గారు,
శ్రీ మంగళంపల్లి బాలమురళి గారు,
ఇత్యాది నాదకోవిదుల ద్వార లోకానికి అందిన స్వర రాగ సంపద ఆ నాదమయి యొక్క అనుగ్రహంగా
చిరంతనకీర్తి గడించడం ఎల్లరికీ తెలిసిందే కద...

శ్రీమతి ఎం.ఎస్ సుబ్బులక్ష్మి గారు,
శ్రీ ఘంటసాల గారు,
శ్రీమతి శోభారాజు గారు,
శ్రీ బాలసుబ్రహ్మణ్యం గారు,
శ్రీ ప్రియాసిస్టర్స్ గారు,
ఇత్యాదిగా ఎందరెందరో గాయకుల గలసీమల్లో కొలువైన శబ్దమయి యొక్క అనుగ్రహంగా లోకానికి వినిపించబడి చిరంతన కీర్తిని గడించిన దైవిక గానాలపనలు అనేకం ఎల్లరికి విదితమే కద....

శ్రీ మల్లాది చంద్రశేఖరశాస్త్రి గారు,
శ్రీ చాగంటి గారు, ( అస్మద్ గురుదేవులు... 😊🙏)
శ్రీ సామవేదం షణ్ముఖశర్మ గారు,

శ్రీ టీ.కే రాఘవన్ గారు,
శ్రీ కాకునూరి సూర్యనారయణమూర్తి గారు,
శ్రీమతి అనంతలక్ష్మి గారు,

ఇత్యాదిగా ఎందరో మహనీయులైన ప్రవచనకర్తల, ఆధ్యాత్మికవేత్తల, మాన్యుల రసనపై కొలువైన యోగమయి అనుగ్రహంగా ఈ లోకానికి అందిన అక్షర విజ్ఞానాంతర్గత యోగరహస్య విశేషములు సిద్ధ సారస్వతానుగ్రహ విశేషములు, మంత్ర సారస్వతానుగ్రహ విశేషములు...ఎల్లరికి విదితమే కద....

ఇవ్విధంగా భాషా / మాతృభాష అనేది ప్రతీ సంస్కృతికి జీవగర్రగా నిలిచిన ఒక శక్తివంతమైన సాధనం....

ఆ సాధనంతో సాధించబడు విశేషానుగ్రహములు ఎన్నో ఎన్నెన్నో....

అది అందుకున్న వారికి అందుకున్నంత....
ఆరాధించిన వారికి ఆరాధించినంత....
ఆకళింపుచేసుకున్న వారికి ఆకళింపుచేసుకున్నంత...

అక్షరం అనగా క్షరము కానిది...
అనగా నశించనిది...
అనగా శాశ్వతమైనది....

అదేవిధంగా అక్షరోపాసన గావించేవారు కూడా ఈ లోకంలో అమరత్వాన్ని గడించి చిరంతనకీర్తికాయులై వర్ధిల్లుతారు....

ఆ నిరంతర అక్షరసేద్యానికి ఆలంబన మాతృభాష....

కాబట్టి ఎల్లరూ కూడా తమ తమ మాతృభాషపై గౌరవం పెంపొందించుకొని మన భావితరాలకు కూడా అక్షర విజ్ఞ్యానానుగ్రహం అందేలా జీవితాలను తీర్చిదిద్దుకొని తరించెదరు గాక...

అక్షరం యొక్క శక్తి అటువంటిది కనుకే శ్రీ తాళ్ళపాక అన్నమాచార్యుల వారు తమ శ్రీవేంకటముద్రాంకిత సంకీర్తనా సారస్వత పూదోటలోని ఈ క్రింది ఒక చక్కని శ్రీశ్రీనివాసశ్రీపాదార్చిత సాహితీసుమంలో

" ఈ సిద్ధ సాహిత్యాన్ని తలచుకున్నంత మాత్రాన శ్రీవేంకటేశ్వరానుగ్రహంతో సకల ఇహ పర సంపదలు అనుగ్రహింపబడి జీవితాలు ధన్యతనొందుతాయి..."

అని ఆచార్యులు బహు రసరమ్యంగా నుడివినారు.😊

http://annamacharya-lyrics.blogspot.com/2008/01/381narayanaya-namo-namo-nanatmane.html?m=1

ప|| నారాయణాయ నమో నమో నానాత్మనే నమో నమో |
యీరచనలనే యెవ్వరు దలచిన యిహపర మంత్రము లిందరికి ||

చ|| గోవిందాయ నమో నమో గోపాలాయ నమో నమో
భావజగురవే నమో నమో ప్రణవాత్మనే నమో నమో |
దేవేశాయ నమో నమో దివ్యగుణాయ నమో యనుచు |
యీవరుసలనే యెవ్వరు దలచిన యిహపర మంత్రము లిందరికి ||

చ|| దామోదరాయ నమో నమో ధరణీశాయ నమో నమో |
శ్రీమహిళాపతయే నమో శిష్టరక్షిణే నమో నమో |
వామనాయ తే నమో నమో వనజాక్షాయ నమో నమో
యీమేరలనే యెవ్వరు దలచిన యిహపర మంత్రము లిందరికి ||

చ|| పరిపూర్ణాయ నమో నమో ప్రణవాగ్రాయ నమో నమో |
చిరంతన శ్రీ వేంకటనాయక శేషశాయినే నమో నమో |
నరకధ్వంసే నమో నమో నరసింహాయ నమో నమో |
యిరవుగ నీగతి నెవ్వరు దలచిన యిహపర మంత్రము లిందరికి ||

pa|| nArAyaNAya namO namO nAnAtmanE namO namO |
yIracanalanE yevvaru dalacina yihapara maMtramu liMdariki ||

ca|| gOviMdAya namO namO gOpAlAya namO namO |
BAvajaguravE namO namO praNavAtmanE namO namO |
dEvESAya namO namO divyaguNAya namO yanucu |
yIvarusalanE yevvaru dalacina yihapara maMtramu liMdariki ||

ca|| dAmOdarAya namO namO dharaNISAya namO namO |
SrImahiLApatayE namO SiShTarakShiNE namO namO |
vAmanAya tE namO namO vanajAkShAya namO namO |
yImEralanE yevvaru dalacina yihapara maMtramu liMdariki ||

ca|| paripUrNAya namO namO praNavAgrAya namO namO |
ciraMtana SrI vEMkaTanAyaka SEShaSAyinE namO namO |
narakadhvaMsE namO namO narasiMhAya namO namO |
yiravuga nIgati nevvaru dalacina yihapara maMtramu liMdariki ||

https://youtu.be/4AKMDwCDOxs

Saturday, February 20, 2021

I am not just a fighter..... I am a warrior....!


It is like when a hostile aircraft enters the unauthorized zone and starts creating a lot of chaos with its unmindful actions , it becomes imminent to...

1. First give it a friendly message to stop bothering the vicinity of our concern and return to it's abode.

2. If it doesn't listen to us and continues it's provocative actions disturbing the peace in the vicinity of our concern, then chasing it down to answer via appropriate retaliatory measures like gun fire on the fly, etc would be the next line of action to be taken to control the situation.

3. Despite the multiple appropriate measures taken to inform it of it's deliberate hostility, if it doesn't stop creating the ruckus then finally activating a laser guided missile with object-to-object inter lock activated would be the final controlling measure to completely take it down so as to re-establish the peace.

( Once the object-to-object inter-lock gets activated on a laser guided missile, irrespective of the territories being traversed the missile will not leave it's target no matter what until it makes a successful collision to completely bombard with and annihilate it's target in it's entirety )

Now that my vicinity of concern is software engineering and a few folks associated with it, let me take a practical simple scenario that I have had a chance to work along with all the various personnel who were resolving the ticket with the inputs from all the allied teams of the SDLC gamut.

It was a ticket from a customer complaining about the efficiency of their production systems going down significantly ( Unix/Linux/HP-UX) after installing a specific one-off patch aimed at fixing one of the S2 issues specific to their environments.

Long story short would be,
the installer bundling the specific fix or the one-off patch ( the .bin file ) wasn't successfully performing the clean up process of all the interim temp files generated during the installation and configuration of the fix because the lock on some of those temp files wasn't getting released by a few rogue processes created during the installation process. Adding to that every specific DM process ( 'Dependency Mapping' was one of the most sought after maquee feature of the then product being built ) getting spawnned from the Introscope Agent via the EM server's aggregated metrics' the same of which gets displayed in the form of a "visual map" that provides the workstation admin a complete clear picture of the entire end-to-end webservice transaction tracing once it gets invoked by an end user.....

So this rogue processes would go on increasing multifold as and when that specific feature is accessed by every authorized user and thus they keep on burdening the entire system with no GC equivalent to clean them off from time to time. So it indeed is a serious concern for the customer because all his key resources like CPU / RAM / DiskSpace are being eaten away by those innumerable 
ad-hoc rogue processes with no one having an idea of who are creating them and why....

It was then that 2 veterans who are highly revered engineering personnel of the group that I was working with, one named 
Mr. Stewart Thain ( the Introscope EM expert ) and the other Mr. Roger Saunders ( the Introscope agent expert ) , pitched in to zero in on the actual root cause of the issue and then suggested the appropriate measures to be taken to force kill all those specific processes with a certain naming pattern before the clean up script gets executed by the installer to leave no trace of any unwanted rogue files and processes burdening the customer environment which was a complex Introscope clustered set up...

And thus there was another one-off patch to fix the issue with the earlier one-off patch by including the corresponding changes to the IAP_XML files creating the respective platform's installer files along with the allied few changes to the build system scripts executing those iap_xml files to post the final software bundles on to a huge builds' storage server named Truss.ca.com that is configured with the Apache Tomcat HTTP server that allows the builds to be download by all the authorized internal users / external customers ...

The PdM / product management personnel

( who don't all of a sudden pop up from the skies.. They essentially have donned various core engineering roles earlier and after having had a good exposure to the various facets of the SDLC gamut, have placed themselves in the role of a Product Manager who essentially play a pivotal role in tying all the individual strings being held by the PrgM, Dev, Qa, Sustenance, Ops and all the other allied teams to align the universal goal of
"building the right software to the right customer with a right feature set with-in the right time in a right way...."
by their defined executions.... )

have no clue as to why only this customer has complained such an issue when it was just the same generic feature set for all the platforms being supported as per the 3PQ matrix....

The Dev had no idea about how such a use case can arise when almost all the brought up use cases by the global engineering team have been considered and are included in the iterative feature development process.... 

The CQ Qa / Sustenance Qa has no idea about how can such an issue be there when they have executed all the test cases that were handed over to them by the core Qa after the Alpha and Beta checks were all good....

So every one in the org were like
" Ohh...
hamay tho nahi pata...!
ham kaisay bhoolay...! 
hamay kaisa pataa chalegaa....!
ham kaisa pataa karay....!
"
and all that typical exclamatory remarks with a rather frowned expression based on the SDLC discipline they belong to....

It is here the experience of a veteran combined with the exploratory outlook of the field personnel implementing the software at the customer site, that comes to our rescue with their exceptional RCA capabilities and efforts put in to zero-in on the root issue...

Similarly in real life scenarios too, 
there would be a rather peculiar situation where in a few rogue personnel keep fabricating strange issues when we already have enough to deal with, that keeps harming our peace of mind and all other precious resources like Health, Time, Efforts.....etc.... 

And it is when the approach of
" Going above the usual plane of existence by thinking beyond the obvious realms..."
that one needs to look for so as to zero in on the root cause of the problem in order to 
nullify it completely and it can happen only with the grace of a sathguru and God's blessings..... 

Let me explain one such scenario.....

Mr. V, some typical normal chap, was busy with his regular work by putting in all his diligent efforts within the purview of the authority and opportunities he was allowed to consider and it was like any other typical global software team...,

A few associated folks let this guy do his work as usual...

Another few wanted him to work like a donkey but they neither want him to get any name nor they want to provide atleast some amount of minimal 'food' to satiate the obvious hunger.....
They just want him to keep dragging the load....

Another few have become jealous and deliberately caused many hard ships to stop this guy from becoming successful with his diligent and smart efforts....

Another few with their arrogance have cunningly plotted various types of hard ships to stop this guy from gaining good name at the top management....

Another few couldn't digest the fact that this guy would certainly become one of the pivotal personnel of the org and thus have become extremely jealous and have resorted to put an end to his efforts and existence intelligently and anonymously...

In a wild goose chase of finding solace amidst these many different types of weird executions going on around him,
this chap simply kept observing everyone so keenly so that he can form the entire block chain of the hostile folks with their respective executions as their individual  block's signature and when its the right time to answer them in a right way, he can just start his counter executions accordingly as appropriate....

However a few extremely cunning and over intelligent folks have barged in to the territories that they're aren't supposed to enter and started infusing their venom of narrow mindedness to many of his friends, relatives, family members, neighbours etc so that they can achieve their spoilsport matrix to stop him from being successful in his endeavors....

While dealing with this highly intricate and complex situational crisis, this chap can neither hurt his own folks whose executions were infiltrated by the hazardous narrow mindedness of all those hostile folks who want to stop him from achieving his goals by all possible means....

nor can he stop himself from becoming vehemently ferocious against all those who are either knowingly or unknowingly 
have become a reason for his sorrow and pain by allowing the hostile folks to hurt him via them..... 

So the most efficient way to solve this problem / fix this pestering issue would be to completely stop the rogue folks from spreading their ire and narrow-mindedness by appropriately identifying the core root ( or 'roots' if the conglomerate is akin to a Banyan tree with multiple groundings,
which it sounds to be.... ),
i.e., the core culprit or culprits need to be given a strong blow ( both cosmic and executional ) that can ground their arrogance at once forever when the time is ripe....
Just like MaheshBabu's powerful punch in the movie 'AthaDu' when they undermine Parthu's power and listen to Naidu's words to continue bashing the former despite witnessing enough blows from his steel nerved fist....

Copied below are the lyrics of the 'AthaDu' movie's title song that would aptly describe this 35 year old witty Manager's vehemently wiser executions....

" అదరక బదులే చెప్పేటి తెగువకు తోడతడే తరతరాల నిశీధి దాటే చిరు వేకువ జాడతడే
తరతరాల నిశీధి దాటే చిరు వేకువ జాడతడే..అతడే..అతడే..అతడే
ఎవరని ఎదురే నిలిస్తే తెలిసే బదులతడే
పెను తుఫాను తలొంచి చూసే తొలి నిప్పు కణం అతడే..
పెను తుఫాను తలొంచి చూసే తొలి నిప్పు కణం అతడే...
 Life has made it stronger It made him work a bit harder
he got to think and act a little wiser This world has made him a fighter
కాలం నను తరిమిందో శూలంలా ఎదిరిస్తా సమయం సరదా పడితే సమరంలో గెలిచేస్తా
నే ఫెళ ఫెళ ఉరుమై ఉరుముతూ..జిగి ధగ ధగ మెరుపై వెలుగుతూ..
పెను నిప్పై నివురును చీల్చుతూ.జడివానై నే కలబడతా..
పెను తుఫాను తలొంచి చూసే..తొలి నిప్పు కణం అతడే !!
చుట్టూ చీకటి ఉన్నా వెలిగే కిరణం అతడు
తెగపడే అల ఎదురైతే తలపడే తీరం అతడు
పెను తుఫాను తలొంచి చూసే..తొలి నిప్పు కణం అతడే !!
తన ఎదలో పగ మేల్కొలుపుతూ..వొడి దుడుకుల వల ఛేధించుతూ..
ప్రతినిత్యం కధనం జరుపుతూ..చెలరేగే ఓ శరమతడూ..
Life started to be faster made him had a little think smoother
he's living on the edge to be smarter this world has made him a fighter "

Thursday, February 18, 2021

శ్రీవేంకటేశ్వరస్వామి వారి రథసప్తమీ పర్వదిన ప్రయుక్త సకలవాహన సేవ / ఏకాహ్నిక బ్రహ్మోత్సవం జరిగే మాఘ శుద్ధ సప్తమీ / రథసప్తమి 2021 పర్వదిన శుభాభినందనలు...💐🍕🍟🍨👏😊


శ్రీ తాళ్ళపాక అన్నమాచార్యూల వారి అత్యత్భుతమైన సంకీర్తనల్లో ఒకటైన 

" ఇతనికంటే మరిదైవము కానము యెక్కడా వెదకిన నితడే
అతిశయమగు మహిమలతో వెలసెను అన్నిటికాధారముతానె || "

అనే సంకీర్తనలో ఆఖరిచరణంలో

" అంచెల జీవులలోపల వెదకిన అంతర్యామై మెరసెను
యెంచుక ఇహమున పరమున వెదకిన యీతడే శ్రీవేంకటవిభుడు ||
"
అని చమత్కరించడంలో శ్రీశ్రీనివాసుడి సర్వాంతర్యామిత్వాన్ని ఎంతో చక్కని రీతిలో శ్రీహరి దశావతారాలతో పోల్చి వర్నించిన శైలి ఎల్లరికి విదితమే.....

మరి ఈ సర్వాంతర్యామిత్వాన్ని అలా పాడుకొని పరవశించడంలో మాత్రమే ఆ ఆధ్యాత్మికతను 
స్వానుభవానంలోకి స్వాగతించి సప్రామాణికంగా తర్కించి తరించడమా...లేదా భౌతికవాదంతో కూడా జతపరిచి సైన్స్ అనే పేరుతో పిలువబడే సామాన్యశాస్త్రం ఉటంకించే 
సిద్ధాంతాలకనుగుణంగా సప్రామాణికంగా నిర్వచించి తర్కించి తద్ జనిత భౌతికమూలగుణకంగా కూడా భగవద్ తత్త్వాన్ని స్థిరీకరించి సమన్వయపరచగలమా....
అనే దృక్కోణంలో ఆధ్యాత్మికతను ఒడిసిపట్టడంలో మరింత మెండుగా ఆ భగవద్ తత్త్వాన్ని మన జీవితాలకు ఆపాదించుకొని తరించగలము అని నా భావన....

తెల్లని పొగలాంటి పదార్ధాన్ని చిన్న తోక లా కనిపించేలా ఎగజిమ్ముతూ నింగిలో కడు దూరంలో బహువేగవంతంగా దూసుకుపోతున్న ఒక సుపర్ సోనిక్ జెట్ గురించి క్షుణ్ణంగా అవగాహన లభించాలంటే...

1. మనం అదే ఉన్నతమైన స్థాయిలో ఆ జెట్ కి సమాంతరంగా ప్రయాణం గావిస్తూ దాని కథెంటో తెలుసుకోగలం...

2. మన స్థాయికి ఆ జెట్ దిగివచ్చి దాని కథెంటో తెలుపడం...

3. ఆ ఉన్నతమైన స్థాయిలో ఆ జెట్ కి సమాంతరంగా ఒక విశేషమైన వ్యవస్థాంతర్భాగంగా ప్రయాణం గావించే కోవిదులు, మన స్థాయికి దిగివచ్చి దాని కథెంటో తెలుపగా అది విశ్వసించి అప్పుడు ఆ జెట్ గురించిన సరైన అవగాహన లభింపజేసుకోవడం
...

అచ్చం అట్లే....

ఆధ్యాత్మికత అనే సముద్రమంత లోతైన తత్త్వశాస్త్రాన్ని ఆకళింపుచేసుకొని తన్మూలంగా భగవద్ తత్వాన్ని ఒడిసిపట్టడం అంటే
సముద్రమంతా పడవలో తిరుగుతూ ఎక్కడో ఒక్కచోట ఒక పెద్ద నిధిని మోసుకెళ్తున్న ఒక ఓడ మునిగిపోవడంతో ఆ ఓడలో ఉన్న ఒక రత్నఖచిత మంజూషలో భద్రంగా దాచిపెట్టిన ఒక అమూల్యమైన నాగమణిని వెతికి వెలికితీసి సొంతంచేసుకోవడం లా ఉండే ఒక గహనాతిగహనమైన ప్రక్రియ.....

కాబట్టి సముద్రమంతలోతైన, ఆకాశమంత అమేయమైన భగవద్ విభూతులను ఆకళింపుజేసుకొని ఆ తదుపరి భగవద్ తత్త్వాన్ని విశ్వసించడం అనేది ఒక అంతూదరిలేని ప్రయాసవంటిది.....

పైన ఉదహరించబడిన సూపర్ సానిక్ జెట్ కి సమాంతరంగా ప్రయాణించే వ్యవస్థ కి ఆధ్యాత్మిక సామ్యం సద్గురుబోధ.....

ఆ సద్గురుబోధలకు ఆలంబనగా ఉండే ఈశ్వరానుగ్రహమే వాటిని మన స్థాయికి దిగివచ్చి అందించే వారి సద్వాక్కులను మొక్కవోని విశ్వాసంతో
జీవితానికి ఆపాదించుకోవడంలో మాత్రమే భగవతత్త్వం అనుభవంలోకి వచ్చి జీవితం తరించడం అనేది సాధ్యమౌతుంది.....

నిజానికి సద్గురువులు అంత ఉన్నతమైన భగవద్ స్థాయికి చేరుకున్నప్పుడు వారికి మన స్థాయికి దిగివచ్చే అవసరం ఉండదు.....
కాని ఆ ఉన్నతమైన భగవద్ తత్త్వానికి ఉండే లక్షణం, అనగా నిర్హేతుక దయ, అనేది సద్గురువులకు కూడా ఒక గౌణమై ఉండడంతో వారు అలా మన స్థాయికి దిగివచ్చి ఆ భగవద్ విభూతివిశేషాలను అర్ధించిన ఎల్లరికి అందించి తరింపజేయడంలో ఆనందిస్తుంటారు.....

In other words there is absolutely no need for a sadguru to come down to our mere mortal strata to spend a lot of effort in order to bless the mankind with that otherwise unfathomable spiritual knowledge,
but for the fact that they too are just like God in being kind and graceful to elevate us to those higtened divine realms....

కమ్మని సున్నుండలు కళ్ళెదుట కనిపించినప్పుడు 

అవతలి వ్యక్తి యొక్క జ్ఞ్యాన స్థాయిని బట్టి...

1. ఒకరు అవి కేవలం ఏవో పిండిముద్దలు అని అనడం...

2. ఒకరు అవి మినప ఉండలు అని అనడం....

3. ఇంకొకరు అవి అమృతతుల్యమైన దేశవాళి గోఘృతంతో చక్కెర / బెల్లం యొక్క కలయికతో కట్టబడిన పోషకవిలువలు గల మినప సున్నుండలు అని అనడంలో...

సదరు వ్యక్తి యొక్క స్థాయిని బట్టి ఆ సున్నుండల వైభవం మారడం అనేది ఏమి ఉండదు....

కంటికి పిండి కనిపిస్తుంది కాబట్టి అవి ఏవో పిండిముద్దలు మాత్రమే అనడం ఒక జ్ఞ్యాన స్థాయి....

కేవలం చేత్తో వాటిని స్పృశించి ఇవి మినప పిండి ముద్దలు అనడం ఇంకొంచెం ఉన్నతమైన జ్ఞ్యాన స్థాయి....

వాటిని ఆరగించి ఆస్వాదించి,
అందులో అదృశ్యంగా తీపికి కారణమైన
చక్కెర / బెల్లం మరియు అన్ని నిరాకార ముడిపదార్ధాలను ఒక సాకార గోళాకార ఉండగా రూపాంతరం గావించడానికి ఉపయోగించబడిన ఆవు నెయ్యి అంతర్నిహితమై ఉన్నాయి అనడం అత్యున్నతమైన జ్ఞ్యాన స్థాయి....

మినప ఉండ మాత్రమే కనిపిస్తుంది కాని అందలి నెయ్యి కంటికి కనిపించడం లేదు కాబట్టి నెయ్యి ఉందనడానికి తగు సాక్ష్యం లేదు అనే మూర్ఖవాదానికి కేవల భౌతికవాదం అని పేరుపెట్టుకొని తర్కించడం సదరు వ్యక్తి యొక్క విజ్ఞ్యానానికి సంబంధించిన అత్యల్పస్థాయి.....

అసలు నెయ్యి లేకుండా ఆ గోళాకార సాకార మినప ఉండ యొక్క ఉనికి అసాధ్యం....కాబట్టి నెయ్యి కచ్చితంగా అంతర్నిహితమై ఉంది అనే రూఢమైన సత్యశ్రేష్ఠాన్ని విశ్వసించి ఆస్వాదించి తరించడం అనేది సదరు వ్యక్తి యొక్క అత్యున్నతమైన ప్రజ్ఞ్యాన స్థాయి.....

ఇక ఇతరములైన మిగతా వాదప్రతివాదాలన్నీ కూడా వివిధ సామాన్య / మధ్య స్థాయికి సంబంధించిన అంశాలు....

అచ్చం ఇదే విధంగా కనిపించే నామరూపాత్మక జగత్తు కేవలం పాంచభౌతిక / కేవల భౌతిక సృష్టి అని వాదించడం సదరు వ్యక్తి యొక్క విజ్ఞ్యానానికి సంబంధించిన అత్యల్పస్థాయి.....

మరియు శ్రీ చాగంటి సద్గురువులు వివరించినట్టుగా, వేదం విజ్ఞ్యానం సైతం పరమాత్మను 

"న ఇతి...న ఇతి...న ఇతి...నేతి...నేతి..."

అని మాత్రమే చెప్పగలిగింది....

కాబట్టి

అసలు పరమాత్మ యొక్క ప్రత్యక్ష అనుగ్రహంతో మాత్రమే ఈ నామారూపాత్మక పాంచభౌతిక సృష్టి యొక్క ఉనికి సంభవమయ్యేది అని విశ్వసించి నిర్వచించడం అనేది సదరు వ్యక్తి యొక్క అత్యున్నతమైన ప్రజ్ఞ్యాన స్థాయి.....

ఇక ఇతరములైన మిగతా వాదప్రతివాదాలన్నీ కూడా వివిధ సామాన్య / మధ్య స్థాయికి సంబంధించిన అంశాలు....

పంచ భూతాల సమ్మిళితమై ప్రభవించే పాంచభౌతిక ప్రపంచంలోనే ఆ పరతత్త్వం కూడా ఇమిడి ఉండడం అనేది చాల ఆశ్చర్యకరమైన సత్యం....

అయానిక్ మరియు కోవలెంట్ బాండింగ్ కి చెందని మరొక సూక్ష్మతరమైన ప్రత్యేక బాండింగ్ ఈ జగత్తులో కలదు... అని నిర్వచించి దానికి
" వాండర్ వాల్స్ ఫోర్స్ " అని సైంటిస్ట్ నామకరణం చేస్తే నమ్మే మనం....

పంచభూతాత్మకమైన ప్రపంచంలోనే పంచభూతాలకు అతీతమై ఉండే పరమాత్మతత్త్వం ఇమిడి ఉంటుంది అని మన అధ్యాత్మ తత్త్వవేత్తలు బోధిస్తే....
" ఏంటో...వీళ్ళు....వీళ్ళ చాదస్తం...." అని కొట్టిపారేసే చదువుకున్న మూర్ఖులే ఈ లోకంలో అధికంగా ఉన్నప్పుడు ఆ విశేష పరతత్త్వం ఎల్లరికి సామాన్యస్థాయిలో అందిరావడం అనేది 
అంతగా కుదిరేది కాదు అనడం అతిశయోక్తి కానేరదు.....

అంత మాత్రాన దాని ఉనికికి నిదర్శనం లేదు అని అనడం అత్యల్ప విజ్ఞ్యాన స్థాయి....
దాని ఉనికి వెతికి ఒడిసిపట్టడమే అత్యున్నతమైన ప్రజ్ఞ్యాన స్థాయి...

గహనమైన భాష్యాలు, వేదాంత సూక్ష్మాలు, ఇవన్నీ కాకుండా సామాన్య మానవుడు సైతం 
" ఔను..." అని అనేలా ఒక సాధారణ లౌకిక ఉదాహరణతో ఈ పాంచభౌతిక సృష్టిలో దాగుండే పరతత్త్వాన్ని నిరూపించే ప్రయత్నం గావిస్తాను.....

అనగా సాధారణంగా ఇంద్రియాలకు అగ్రాహ్యమై ఉండే ఆ పాంచభౌతిక ప్రకృత్యాంతర్గత పరతత్త్వం ఇంద్రియ
గ్రాహ్యమై "ఔరా..." అనిపించుట....

మన రోజువారి పనుల్లో ఒకటైన భగవంతుడుకి అగర్బత్తి వెలిగించి ధూపం సమర్పించడం అనే ప్రక్రియను ఇక్కడ చాల సింపుల్ గా ఉండే ఉదాహరణగా తీసుకుందాం....

ఆకాశం
గాలి
అగ్ని
జలం
పృథ్వి

అనే పాంచభౌతిక తత్త్వాల కలయికగా ఉండే ఒక అగర్బత్తిలో ( అగరొత్తులు / ధూప్ స్టిక్స్ )
ఆ ఈశ్వర తత్త్వాన్ని ఇంద్రియగ్రాహ్యం కావించుట.....

1. ఆకాశం - 

సర్వే సర్వత్రా పరివ్యాప్తమై ఉండే అమేయ పాంచభౌతిక మూలకం...
అంటే వినా ఆకాశం క్రింది మిగతా 4 భూతాలు / వాటి కలయిక ఒక సాకార రూపాన్ని దాల్చడం కుదరని పని...

కాబట్టి అగర్బత్తిలో ఆకాశం ఉన్నది...

2. గాలి

గాలి ద్వారా మాత్రమే ధూపం మన చుట్టూ ఉండే ప్రదేశంలో అనగా సమీపాకాశంలో పరివ్యాప్తమై తన వాయు తత్త్వాన్ని ప్రదర్శించగలదు...
 
కాబట్టి అగర్బత్తిలో వాయువు ఉన్నది....

3. అగ్ని 

అగ్ని సంపర్కం లేనిదే అసలు అగర్బత్తిని వెలిగించి అందులో నిక్షిప్తమై ఉండే ధూపాన్ని / వాయు తత్వాన్ని వ్యక్తపరచలేము కాబట్టి
వెలిగించిన అగర్బత్తిలో కంటికి కనిపించేలా అగ్ని తత్త్వము ఉన్నది...

కాబట్టి అగర్బత్తిలో అగ్ని ఉన్నది....

4. నీరు

ఒక చెక్కపుల్లను ఆధారంగా చేసుకొని అగర్బత్తి యొక్క ముడిపదార్థం దాని చుట్టూ అలదబడడానికి ఉపయోగించే రసాయనాలు / సెంట్లు / జిగురు / అత్తర్ ఇత్యాది సకల జల సంబంధమైన పదార్ధాలు ఉపయోగించడం వల్ల అగర్బత్తిలో పరోక్షంగా జలతత్త్వం కూడా ఉన్నది....

కాబట్టి అగర్బత్తిలో నీరు ఉన్నది....

5. పృథ్వి

అగర్బత్తి వెలిగేటప్పుడు సువాసన రావడం / ఆ సువాసన ముడిపదార్థాంతర్గతంగా కొలువైఉండడం వల్ల అగర్బత్తిలో ప్రత్యక్షంగా పృథ్వి కూడా ఉన్నది....
వెలిగించబడకున్నా అగర్బత్తి యొక్క పరిమళం ఆఘ్రానించబడ యోగ్యమైనది...

కాబట్టి అగర్బత్తిలో పృథ్వి ఉన్నది....

సో, పంచభూతాలు కూడా ఒక అగర్బత్తిలో మనం సమన్వయపరుచుకున్నాం కద....

సొ ఇప్పుడు ఈశ్వరుడి చే జనించబడినది...
కాబట్టి ఈశ్వరుడికి అభేదమైనది....
కాబట్టి ఈశ్వరుడే అయిన పరతత్వం ఎట్లు ఈ పాంచభౌతిక అగర్బత్తి అనే సృష్టి నుండి బయల్వడి ఇంద్రియగ్రాహ్యమయ్యేది....

అనేకద మన ప్రయత్నం....

ఈశ్వరుడి హస్తంలో ఉండే త్రిశూలానికి 
అమరిఉండే ఢమరుకం నుండి జనించినదే నాదం అనే విషయం గురించి....
మరియు ప్రత్యక్ష పరమాత్మ అయిన సూర్యుడినుండి ఆ త్రిశూలం విశ్వకర్మచే తయారుకావించబడడం గురించి మనకు శ్రీచాగంటి సద్గురువులు తెలిపియున్నారు కద....

కాబట్టి ఇక్కడ నాదమే మనం వెతుకుతున్న పంచభూతాలకు ఆతీతమైన,
పంచభూతాంతర్గతమైన
పరతత్త్వ పదార్ధం....

ఒక పదార్ధం తత్ భిన్న తత్త్వ పదార్ధం తో రాపిడి చెందినప్పుడు "లా ఆఫ్ ఎనర్జి ట్రాన్స్ఫర్ " కి అనుగుణంగా శక్తి రూపాంతరం చెందుతుంది కాబట్టి మన సైన్స్ సూత్రానికి సరిపడేలా ఉండే అనగా రెండు విభిన్న పార్శ్వములు గల అగ్నితత్త్వం / జలతత్వం యొక్క సమ్యోగం చేత ఆ అంతర్నిహితమైన పరతత్త్వ శక్తిని అందునుండి ఉద్గమించేలా చేసి అవ్విధంగా అంతర్నిహితమైన ఆ పాంచభౌతికాంతర్గత పరతత్త్వాన్ని ఇంద్రియగ్రాహ్యం కావిద్దాం...

మామూలుగ అగ్నితో రగల్చబడిన ఒక అగర్బత్తిని అనగా కొసకు నిప్పు ఉండి పొగను / ధూపాన్ని విడుదలచేసే స్థితిలో ఉన్న అగర్బత్తిని,

ఆ నిప్పు ఎంత పరిమాణంలో ఉన్నదో అంతే పరిమాణంగల నీటిచుక్కను ఒక ప్లేట్లో పోసి,
ఆ రగులుతున్న అగర్బత్తి కొసను ఆ నీటి బిందువుకు దెగ్గరగా జరపండి....

సమపరిమాణం లేదా కొంచెం అటు ఇటు గా ఉండే ఆ నిప్పు నీరు సమ్యోగం చెందిన వెంటనే ఒకదాన్లోకి ఇంకోటి లయించి అందునుండి నాదం
( స్ స్ స్ స్ స్ క్ అనే సౌండ్ ) ఎంతో వేగంగా మన సాధారణ చెవులకు వినిపించేలా ధ్వనిస్తుంది )

ఇప్పుడు చెప్పండి....
కేవలం అయానిక్ / కోవలెంట్ బాండింగ్ తో పంచభూత తత్త్వాల కలయికతో ఏరపడిన ఒక సాధారణ అగర్బత్తిలోకి,

పంచభూతాలకు అతీతమైన ఆ నాదశక్తి అనబడే పరతత్త్వ పదార్ధం ఎక్కడినుండి వచ్చి చేరింది...

మనం ప్రత్యేకంగా నాదాన్ని సృజించి అగర్బత్తిలోకి ప్రవేశపెట్టలేదు కద....
 
అత్యంత సామాన్యమైన స్థాయిలో ఉండే ఈ చిన్న ఉదాహరణ మొదలుకొని,
భగ భగ మండే అగ్నిగోళమైన సూర్యుడి నుండి వెలువడే నాదశక్తి వరకు యావద్ విశ్వంలో ఈ పాంచభౌతిక ప్రకృతిలోనే పరతత్త్వం కూడా దాగున్నది....

అది ఎవరు ఏ ఏ మాధ్యమాలతో ఎవ్విధంగా ఒడిసిపట్టుకుంటారనే అంశంపై ఆ పరతత్త్వ గ్రాహ్యత అనేది వివిధ స్థాయుల్లో వివిధ రీతుల్లో ఉండడం అనేది వాస్తవిక అధ్యాత్మ సత్యం....

అది ఎల్లవేళలా సైన్స్ కి అంది తీరాలని ఏంలేదు...

ఎందుకంటే

Science relies on the physical, tangible, always measurably receptive entities where as Spirituality spreads beyond these and many other meta-physical limits as well....

ఎక్కడెక్కడో పరమాత్మను వెతుకుతూ కళ్ళెదుటే నిత్యం దేదీప్యమానంగా వెలిగే ప్రత్యక్ష నారాయణుడైన శ్రీసూర్య భగవానుడిని మర్చిపోతుంటాం....

"ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్..." అని కదా ఆర్యోక్తి....

అటువంటి మహాభాగ్యమైన ఆరోగ్యం మొదలుకొని...

కేవలం మనస్పూర్తిగా సమర్పించే నమస్కారాలకు వివిధ వర్ణాశ్రమయుక్తమైన మంత్రములను జతపరిచి ఆరాధిస్తే ఫ్రీ గా సూర్యభగవానుడి నుండి ఎన్నెన్ని సంపదలను పొందొచ్చో మన ఆర్షవాంజ్ఞ్మయం తరతరాలనుండి బోధించి అనుగ్రహిస్తూనే ఉంది....

సూర్యభగవానుడిని సర్వదేవతాత్మకంగా, త్రిమూర్త్యాత్మకంగా వివిధ దైవిక స్తోత్రాలు కొనియాడుతున్నాయి... 

" సర్వదేవాత్మకో హ్యేష తేజస్వీ రశ్మిభావనః |
ఏష దేవాసుర గణాన్ లోకాన్ పాతి గభస్తిభిః ‖ 7 ‖ "

అని శ్రీఆదిత్యహృదయం లో స్తుతించబడడం....

" బ్రహ్మస్వరూప ఉదయే మధ్యాహ్నేతు మహేశ్వరహః
అస్తకాలే స్వయంవిష్ణుః త్రయీమూర్తిర్దివాకరః.... "

అని శ్రీ శివప్రోక్త సూర్యస్తోత్రం లో 
స్తుతించబడడం....

( తిరుచానూర్ శ్రీపద్మవతీదేవి అమ్మవారి ఆలయ పుష్కరిణికి అభిముఖంగా సాక్షాత్ శ్రీవేంకటేశ్వర స్వామి ప్రార్ధించగా ఆ కొలనులో దేవలోకం నుండి తీసుకురాబడిన స్వర్ణ కమలాలు సదా వికసితమై ఉండడానికి సౌరమండలం నుండి దిగివచ్చి సాకార
శ్రీసూర్యనారాయణమూర్తిగా కొలువైన
ఆలయంలో ఈ స్తోత్రం అక్కడి బోర్డ్ పై
రాసి ఉంటుంది... )

అటువంటి శ్రీసూర్యనారాయణుడికి సంబంధించిన మాసంగా,
విశేషమైన పుణ్యప్రదాయక / పాపనాశక మాఘ మాసంగా, 
ఏడుకొండల ఎంకన్న ఒక్కరోజు బ్రహ్మోత్సవంగా వినుతికెక్కిన
శ్రీవేంకటేశ్వరస్వామి వారి రథసప్తమీ పర్వదిన ప్రయుక్త సకల వాహన సేవ / ఏకాహ్నిక బ్రహ్మోత్సవం జరిగే మాఘ శుద్ధ సప్తమీ / రథసప్తమి పర్వదిన ప్రాభవంతో వెలిగే ఆ శ్రీవేంకటనారయణుడిని శ్రీసూర్యనారాయణుడిలో దర్శిస్తూ
ఎల్లరూ విశేషానుగ్రహాన్ని బడసి తరించెదరు గాక....😊👏🍨🍟🍕💐

అర్క బదరీపత్రములు / పళ్ళు
( జిల్లేడు ఆకు + రేగు పళ్ళు లేదా రేగు ఆకులు) శిరస్సుపై ధరించి సంకల్ప సహిత రథసప్తమి పర్వదినస్నానం గావించడం విశేషపుణ్యదాయకం అని మన పెద్దలు నుడివినారు కాన ఈ పోస్ట్ కు జతచేయబడిన శ్లోకం తో ఆ శ్రీసూర్యనారాయణుడిని ప్రార్ధించి సేవించి తరించండి...😊

ఇతనికంటే మరిదైవము కానము యెక్కడా వెదకిన నితడే
అతిశయమగు మహిమలతో వెలసెను అన్నిటికాధారముతానె ||

మదిజలధులనొకదైవము వెదకిన మత్స్యావతారంబితడు
అదివో పాతాళమందు వెదకితే ఆదికూర్మమీ విష్ణుడు
పొదిగొని యడవుల వెదకి చూచితే భూవరాహమనికంటిమి
చెదరక కొండల గుహల వెదకితే శ్రీనరసింహంబున్నాడు

తెలిసి భూనభోంతరమున వెదకిన త్రివిక్రమాకృతి నిలిచినది
పలువీరులలో వెదకిచూచితే పరశురాముడొకడైనాడూ
తలపున శివుడునుపార్వతి వెదకిన తారకబ్రహ్మమురాఘవుడు
కెలకుల నావులమందల వెదకిన కృష్ణుడు రాముడునైనారు ||

పొంచి అసురకాంతలలో వెదకిన బుధ్ధావతారంబైనాడు
మించిన కాలము కడపట వెదకిన మీదటికల్క్యావతారము
అంచెల జీవులలోపల వెదకిన అంతర్యామై మెరసెను
యెంచుక ఇహమున పరమున వెదకిన యీతడే శ్రీవేంకటవిభుడు ||

http://annamacharya-lyrics.blogspot.com/2007/09/301itanikamte-maridaivamu.html?m=1

Wednesday, February 17, 2021

శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్రావ్ గారు, గౌ|| రాష్ట్రముఖ్యమంత్రివర్యులు, తమ 67 వ జన్మదినోత్సవ సందర్భంగా హరితహారం కార్యక్రమం...

గౌ|| రాష్ట్రముఖ్యమంత్రివర్యులు, తమ 67 వ జన్మదినోత్సవ సందర్భంగా హరితహారం కార్యక్రమం తో రాష్ట్రమంతా కూడా వివిధ చోట్ల 

విశేషంగా మొక్కలను నాటి ప్రకృతి శక్తిని మరింత ఉజ్జీవనంగావిస్తున్న శుభసమయాన్ని పురస్కరించుకొని వారికి ఒక పౌరుడి శుభాభినందనానమస్సులు....

శ్రీ చాగంటి సద్గురువులు బోధించినట్టుగా
రాజాధిరాజులపై కూడా అధికారాన్ని కలిగి అధివసించి ఉండే శ్రీరాజరాజేశ్వరి అనుగ్రహం మెండుగా ఉన్నవారే సిమ్హాసనారూఢులై ( అనగా మన భాషలో సీ.ఎం కుర్చీని కైవసం చేసుకోవడం ) సుభిక్షంగా ఉండేలా రాజ్యపాలన కావించడం అనేది అధ్యాత్మ విశేషం.....

వారి పూర్వుల / పితరుల పుణ్యపరిపాకమై శ్రీ వేములవాడ శ్రీరాజరాజేశ్వరి అనుగ్రహంతో తెలంగాణ రాష్ట్ర కీర్తి దేశంలో దశదిశలా వ్యాప్తిచెంది అన్నిరాష్ట్రాల్లోకెల్లా అత్యుత్తమమైన సర్వతోముఖాభివృద్ధితో వర్ధిల్లే
రాష్ట్రంగా ప్రజామనోరంజకమైన పరిపాలనతో, ఆర్థికంగా బడుగుబలహీన వర్గాల అభివృద్ధికై ప్రత్యేక చొరవతో, ఆధునిక సాంకేతిక విజ్ఞ్యానాన్ని అన్ని విభాగాల్లో అంతర్భాగంచేసి పరిపూర్ణ ఆన్లైన్ పరిపాలనా విధానాలతో పౌరులకు మెరుగైన సేవలను అందిస్తూ ( దలారీల బెడద లేకుండా...) సువ్యవస్థీకృత సాంకేతిక పరిపాలనా విధానాలతో,
మరియు
దేశానికి వెన్నెముకైన పాడిపంటలను అధారంగా గావించి జీవించె గ్రామీణ పల్లె ప్రజానీకానికి ఉపయుక్తంగాఉండే వివిధ సంక్షేమపథకాలతో వర్ధిల్లే రాజ్యపరిపాలనతో మీ రాజకీయప్రస్థానం యశోభరితమై కొనసాగాలని అభిలషిస్తూ,
మరియు
కవులను, కళాకారులను, లలితకళలను, సంగీతసాహిత్యాన్ని ఆదరించి గౌరవించే వ్యక్తిత్వవైభవంతో వర్ధిల్లే మీ వ్యక్తిగతజీవితంకూడా ఆయురారోగ్యైశ్వర్యాలతో పరిపుష్టమై వర్ధిల్లుగాక అని
అభిలషిస్తూ మీ 67 వసంతాల సుదీర్ఘ నాయకత్వ పటిమ దేశానికి మరింతగా రాజనీతిదార్శనికమై లోకులెల్లరు శ్లాఘించే విధంగా ప్రవర్ధమానమౌ గాక అని ఆకాంక్షిస్తూ....

Wishing a very happy birthday to one of the most charismatic personalities of the Indian polity who strived a great deal to bring in a great global recognition to Telangana, the youngest and the most happening state of India, by ensuring that it's true spirit of
"Sab log acche rahay...Sab log kushi rahay... Sab log sahi rahay....Sab log Sukhi rahay...." is imbibed in every aspect of ruling the state to make the lives of all it's citizens a fulfilled one with fruitful and all-round development in every given arena.....

కోటి రతనాల వీణను...తెలంగాణను....

సర్వతోముఖాభివృద్ధి అనే తంత్రులతో మీటుతూ...
సకలజనసంతోషకారకం అనే స్వరమధురిమలను సృజిస్తూ...

ఒక ధీటైన మేటైన రాజనీతివైణికులుగా కళామతల్లి అనుగ్రహంతో మీ పరిపాలన పరిఢవిల్లుగాక...
😊🍕🍟🍨👏👍
💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐


Wednesday, February 10, 2021

శ్రీ శార్వరి మాఘ బహుళ చతుర్దశి నిశీధి మధ్యగత లింగోద్భవ ఘడియల అత్యంత మహత్త్వపూర్ణమైన కాలం / రాబోయే 2021 మహాశివరాత్రి పర్వసమయ శుభాభినందనలు....😊🍨🍕💐🍟


( ఇవ్వాళ పుష్య బహుళ చతుర్దశి మాస శివరాత్రి.....
కాబట్టి వచ్చే నెల మాఘ బహుళ చతుర్దశి మాహా శివరాత్రి మహోత్సవం....😊 )

శ్రీకంఠుడు / నీలకంఠుడు ,శివుడు, రుద్రుడు, హరుడు, భోలాశంకరుడు, చంద్రశేఖరుడు, చంద్రమౌళీశ్వరుడు, గంగాధరుడు, అర్ధనారీశ్వరుడు, శంభుడు, మల్లికార్జునుడు (మల్లన్న)....
ఇలా ఎన్నో ఎన్నెన్నో పేర్లతో ఆ మహేశ్వరుడు లయకారకుడిగా వివిధ క్షేత్రాల్లో వివిధ పేర్లతో వివిధ రీతుల అర్చారాధనలు అందుకుంటూ భక్తులను విశేషంగా అనుగ్రహించే శివతత్వం గురించి శ్రీ చాగంటి సద్గురువులు వారి  "శ్రీ ఉమామహేశ్వరవైభవం " ప్రవచనాల్లో కడు రసరమ్యంగా శిష్య భక్తులకు అందించినారు.....
మరియు శ్రీమహాశివరాత్రి వైభవం గురించిన విశేషాలు కూడా అందించినారు.....

శ్రీ చాగంటి సద్గురువుల శ్రీమద్భాగవత ప్రవచనాల్లోని క్షీరసాగర మధనం / హాలాహలభక్షణం గురించి విన్నవారికి గుర్తున్నట్టుగా,
అప్పటివరకు ఉమాకాంతుడికి లేని పేరు 
ఒకటి కొత్తగా వచ్చి చేరింది...

అదే " నీలకంఠుడు " అనే నామం...

హరిహర తనయుడు మణికంఠుడిగా ప్రఖ్యాతి గడిస్తే తండ్రి నీలకంఠుడిగా వినుతికెక్కిన సంఘటనలు నిజంగా ఆశ్చర్యకరమైన లోకోపకార లీలావిశేషాలు.....

రైమింగ్ వర్డ్స్ లా నీలకంఠ , మణికంఠ వినడానికి చాలా బావున్నా మొదటి నామం మాత్రం 
రెండవనామానికి ఏ పోలిక లేనిది...

ఎందుకంటే అయ్యప్పస్వామి నిజంగానే కళ్ళుచెదిరే కాంతులీనే బాగా కాస్ట్లీ మణిని కంఠాభరణంగా ధరించాడు కాబట్టి మణికంఠ అనే నామం బాగ అమరింది....

మరి అలాంటి కాస్ట్లీ బ్లూ సఫైర్ లాంటి మణిని తన కంఠము నందు శివుడు ఏమి ధరించకుండానే అలా నీలకంఠుడిగా పేరొందడం ఆశ్చర్యమే కద.... 

కాబట్టి ఒకింత ఆశ్చర్యచకితమైన ఈ నీలకంఠుడి కథేంటో ఇప్పుడు చర్చిద్దాం.....

అమృతాన్ని సాధించడం కోసం దేవదానవులందరు కలిసి పాలకడలిని వేదికగా గావించి మందరగిరిని కవ్వంగా నిలిపి ఆ పర్వతకవ్వాన్ని ఇరువైపులా అటూ ఇటూ తిప్పుతూ క్షీరసాగరాన్ని మధించుటకు వాసుకిని తాడుగా గావించి, అది పాలసముద్రంలో మునిగిపోతుంటే స్థితికారకుడైన శ్రీమహావిష్ణువును 
ఆ మునిగిపోతున్న మందరగిరిని స్థిరంగా నిలుపుటకు శ్రీమహాకూర్మమై కడలి అడుగున కొలువై ఆ మహాకూర్మ వీపుపై ఉండే దృఢమైన డిప్ప లాంటి కవచంపై మందరగిరిని స్థిరంగా నిలిపి ఆ మధనాన్ని కొనసాగిస్తే అప్పుడు వివిధ వింతలు విశేషాలకు ఆలవాలమైన వివిధ దైవిక వస్తుజాలం పాలకడలినుండి ఉద్భవించడం గురించి ఎల్లరికీ విదితమే కద...

మేయిన్ ప్రొడక్ట్ గురుంచి చర్నింగ్ స్టార్ట్ చేస్తే వివిధ బైప్రొడక్ట్స్ లభించడం, అనగా 

ఐరావతం, కామధేనువు, కల్పతరువు, ఉఛ్చైశ్రవం, చంద్రుడు, శ్రీమహాలక్ష్మీ, ఇత్యాదివన్నీ కూడా 
అమృతకలశం అనే మేయిన్ ప్రొడక్ట్ కి బైప్రొడక్ట్స్ గా లభించడం వరకు బాగానే ఉంది కాని వీటితో పాటుగా లోకభీకరమైన హాలాహలం కూడా అందునుండి ఉద్భవించి అక్కడున్నవారందరిని హాహాకారాలు పెట్టించి పరుగెత్తేలా చేయడమే అక్కడ అంతగా ఎవ్వరూ ఊహించని ఆహ్వానించని సంఘటన....

అన్నిటినీ తనలోకి లయించివేసే లయకారకుడే ఇక దిక్కని తలచి అందరూ ఆ హరుడి వద్దకు పరుగిడి అర్ధించగా, ఆ భోళాశంకరుడు భక్తులమొరలను ఆలకించి ఆ అత్యంత విషపూరిత గరళాన్ని తన యోగశక్తితో ఒక చిన్నసైజ్ బ్లూకలర్ చాక్లేట్లా అణిమా సిద్ధిని ఉపయోగించి సంక్షిప్తం గావించి దాన్ని మింగేసి తన గొంతులోని కంఠభాగంలో అటు పూర్తిగా కడుపులోకి మింగకుండా ఇటు బయటికి కనిపించకుండా కట్టడి గావించి, ఆ గరళగులిక జనిత నీలవర్ణం తన కంఠసీమయందు వ్యాప్తిచెందగా అప్పటినుండి గరళకంఠుడిగా / నీలకంఠుడిగా / శ్రీకంఠుడిగా పేరొందడం అనే వృత్తాంతం ఒకింత సంభ్రమాశ్చర్యజనితమైనదే కదు....

బయటికి కనపడేలా అదిమిపెడితే అది ఎవరిని ఎప్పుడు ఎలా బాధిస్తుందో తెలియదు.....

"
దృశ్యాదృశ్యవిభూతిపావనకరీ బ్రహ్మాండభాండోదరీ
లీలానాటకసూత్రఖేలనకరీ విజ్ఞానదీపాంకురీ
శ్రీవిశ్వేశమనఃప్రమోదనకరీ కాశీపురాధీశ్వరీ
భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ ||
"

గా ఆ ఆదిపరాశక్తి తన వామార్ధభాగమై కొలువైఉంది కద....

కాబట్టి లోపలికి మింగెస్తే తన ఉదరంలో కొలువైఉండే బ్రహ్మాండసమూహం ఆ హాలాహల ప్రభావానికి మాడిమసై పోతుంది....

ఇక బయటకి కాకుండా లోపలికి కాకుండా మరెక్కడ బంధించడం కుదిరేది..?

కంఠసీమ నందు మాత్రమే అది కుదిరేది.....

ఎందుకంటే కంఠసీమ అనునది ఊర్ధ్వకూటమైన ముఖమండలానికి మధ్యకూటమైన నాభి ఉపరితల కంఠ అధో భాగానికి అనుసంధాయక ప్రదేశం....

కాబట్టి దుస్సహమైన భగ భగ మండుతున్న ఆ హాలాహలాన్ని తియ్యని కమ్మని గర్మాగరం రంజాన్ నాటి షీర్ కూర్మా పాయసంలా స్వీకరించి 
దాన్ని ముద్దగా మార్చి కంఠం లోపల నీలమణిగా దాచి నీలకంఠుడిగా పేరొందడం ఆ హరునకే చెల్లింది..!!

సరే ఇక్కడివరకు అప్పడు జరిగిన అనుకోని బాధాకర సంఘటనను సర్వప్రాణి హితకరంగా పరిష్కరించే దిశగా ఆ హరుడు అలా ఆ లోకభీకర హాలాహలాన్ని తనలోకి లయించివేయడం అనేది భౌతిక అధ్యాత్మ విశేషం....

మరి ఈ సంఘటనలోని భౌతిక అధ్యాత్మ విశేషం తో పాటుగా మరేదైనా దైవిక, తాత్త్విక, సైద్ధాంతిక, యోగ విశేషం కూడా ఎమైనా ఉన్నదా అనే దిశగా అధ్యాత్మ తత్త్వ చింతనాపరులు / జిగ్ఞ్యాసాపరులు మేధోమధనం గావించడం సహజం.....

వారి వారి గురుబోధలకు అనుగుణంగా అధ్యాత్మ వస్తువిషయ సామాగ్రి న్యాసంగావించబడి,
మననంగావించబడి, ధ్యానించబడి
దైవానుగ్రహంగా అందుకోవడంలో,
ఒక్కో స్థాయిలో ఒక్కొక్కరికి ఒక్కోలా ఆ యోగవిశేషాలు భాసించడం అనేది సహజం....

ఈశ్వరానుగ్రహంగా అస్మద్గురుబోధాంతర్గతంగా సాగిన ధ్యానమంజరులను ఆలంబనగా గావించి కొంతమేర ఈ శ్రీకంఠుడి / నీలకంఠుడి విశేషం ఏంటో ఇప్పుడు చూద్దాం....

84 లక్షల జీవరాశుల్లో స్వరపేటిక గల ఎకైక ప్రాణిగా జన్మించే అదృష్టం కేవలం మనుష్యునకు మాత్రమే కలదు.....

ఆ విశేషం వల్లే మనిషి ఎంతో ఉన్నతమైన స్థాయికి ఎదిగి మేధోమధనం అనే కృషితో ఋషిగా మారి, మరే ఇతరప్రాణి తరించలేని విధంగా తను తరించి ఇతరులను తరింపజేయగలడు...!

అంతటి ఉత్కృష్టమైనది మనుజుడి కంఠసీమ యొక్క వైభవం....!

కాబట్టే మన పెద్దలు మనిషికి సకల మహత్తును ఆపాదించే దైనందిన పూజ అనే దైవిక క్రతువులో, మొట్టమొదటి పనిగా అత్యంత ముఖ్యమైన పనిగా కంఠసీమ యందు కొలువై ఉండే స్వరపేటిక శుద్ధికొరకై కందకంలా ఉండేలా జలాన్ని ముమ్మారు,
అనగా మినప గుండు మునిగేంతటి పరిమాణంలో ఉండే స్వఛ్చమైన బుడగలు లేని నీటి చుక్కను కుడిచేతి మధ్యలో ఉద్ధరిణతో 
( అదే..మన భాషలో స్పూన్ తో ) పోసి..

ఓం కేశవాయ స్వాహా...
ఓం నారాయణాయ స్వాహా...
ఓం మాధవాయ స్వాహా...

అని మూడు సార్లు విడి విడి గా పెదవులకు, పళ్ళకు తగలకుండా కుడిచేతి మధ్య నుండి అమృతమార్గం గుండా అనగా ఒక గీతలా ఉండే కుడి అరచేతి మార్గం ద్వారా డైరెక్ట్ గా నోట్లో నుండి గింతులోకి చేరుకునేలా స్వీకరించడం అనగా " ఆచమనం " గావించడం అనే ప్రక్రియను మన పెద్దలు వ్యవస్థీరకించారు.....

అంతటి ఉత్కృష్టమైనది మనుజుడి కంఠసీమ యొక్క వైభవం....!

పై నామాల్లోని

క కార
న కార
మ కారాలతో

క్రమంగా కంఠం / నాలుక / పెదవులు ఈ మూడు కూడా ఉత్తేజితమై ఇక ఆ తదుపరి పూజా కృతువులో కంఠం కంచు ఘంఠారావం లా పనిచేస్తు ఈశ్వరుడుని వివిధ నామ / స్తోత్ర / సంకల్ప / అర్చన ఇత్యాది వాటితో ఆరాధించి అనుగ్రహం పొందే ఏర్పాటును మన సనాతన పెద్దలు సువ్యవస్థీకరించారు...

మనుష్యుడి స్వరపేటిక / అది కొలువైన కంఠసీమ అంత గొప్పవి మరి....
( సరిగ్గా ఉపయోగించుకునప్పుడు మాత్రమే...)

లేకపోతే వరమైన స్వరపేటికే శోక కారణమై ఒక్కోసారి రణమై పరిణమిస్తుంది....

అది మన మాట తీరుతో, అనగా మాట యొక్క గొప్పదనంతో / గట్టిదనంతో, స్వర మాధుర్యంతో / స్వర గాంభీర్యంతో / ఆర్జించబడే ఫలితం...

ఒక సందర్భంలో

ఒకరేమో...

" అబ్బో వచ్చారండి విచిత్ర సోదరులు....ఎవరి కోసం వచ్చారో మరి...." అని ఎంతో పెడసరిగా మొహం మీదే వాకిట్లోనే పొగరుతో నోరుపారేసుకొని మర్యాదనుకోల్పోతే....

మరొకరేమో

" ఓహ్ చాల రోజులకు కనిపించారే.....మొత్తానికి వచ్చారు....చాలా సంతోషం....అంతా 
బాగేనా...."

అంటూ ఆప్యాయతతో పలకరించడంలో మర్యాదను పెద్దరికాన్ని గౌరవాన్ని ప్రదర్శించి ఆప్తులుగా అనిపిస్తారు...

మరో సందర్భంలో...

ఒకరేమో 

"
ఈ జోక్ ఇన్నవ మామ...ఇగ నెక్స్ట్ వీడికంట...పెళ్ళంట....హహహహహ..."

అని గుమ్మం దెగ్గరే నలుగురు నవ్వేలా 
ఎంతో వెకిలిగా మాట్లాడి అవమానం గావిస్తే....

మరొకరు....

" ఎం రా పెళ్ళెప్పుడు...ఇగ నెక్స్ట్ నీదే...దావత్ ఎప్పుడు మరి..."

అని నలుగురు అభినందించే రీతిలో మాట్లాడగలరు....

ఇక్కడ సందర్భం ఒక్కటే....
స్వరాలు వేరు.....
స్వరం యొక్క తీరుతెన్నులు వేరు....
మాటల యొక్క కూర్పు వేరు...
మాట్లాడిన వైనం వేరు.....

తన్మూలంగా ఒకరు ధూర్తులుగా ఒకరు స్నేహితులుగా ఉత్తరక్షణం మన మదిలో ముద్రపడడం అనే సత్యంలో....
మనుష్యుడి స్వరపేటిక / కంఠసీమ ఎంత గొప్పవో అనే విషయం చెప్పకనే చెప్పబడుతుంది....

ఇటువంటి సాధారణ ఉదాహరణలు మొదలుకొని,
మాటలు, వాక్యాలు, చర్చలు, ప్రకటనలు, తర్కాలు, భాష్యాలు, ఇలా మనుష్యుడు తన మాటల ద్వారా
ఎందరెందరో జీవితాల్లో తనదైన ముద్రతో ప్రభావం చూపగలడు.....

అది మాట / స్వరపేటిక యొక్క గొప్పదనం...

ఎన్ని గుర్తున్నా మర్చిపోయినా మనుష్యుల మాటలు మాత్రం చాలా తీవ్రమైన ప్రభావం చూపే సాధనాలు....

శ్రీ చాగంటి సద్గురువుల మాటల్లో చెప్పాలంటే
" రంపపు కోత కన్ననూ ఒక కఠినమైన మాట కలిగించే వ్యధ అధికమైనది..."

పదేళ్ళ క్రితం జరిగిన ఫంక్షన్లో
ఎవరు ఎంత గొప్ప డ్రెస్ వేస్కున్నారో...
ఎన్నెన్ని రకాల ఫుడ్ ఐటెంస్ పెట్టారో...
మరే ఇతరమైనవన్నీ కూడా అంతగా గుర్తుపెట్టుకోరు కాని....

ఒక్క కఠినమైన మాటతో గావించబడిన అవమానం మాత్రం జీవితాంతం దహిస్తూనే ఉంటుంది....

మాటకు గల గొప్పదనం అటువంటిది...
మాటకు గల శక్తి అటువంటిది...
మాటకు గల ప్రాముఖ్యత అటువంటిది....
మాటకు గల విలువ అటువంటిది...
మాటకు గల మన్నిక అటువంటిది...

" ఆ పెద్దయాన్ని మాట హామి ఇవ్వమనండి...
మీకు ఇప్పటికిప్పుడే డబ్బిస్తా...
ఆయన మాటంటే అంత నమ్మకం నాకు...."

" వారి ఒక రెండు మంచి మాటలు విన్నా చాలండి....మనసు ఎంతో తేలిక పడి హాయిగా ఉంటుంది...."

" వాడి పొగరు ఏతులు ఎచ్చులు నీకెం తెలుసు...
వాడి మాటలు విన్నావో ఇక అంతే సంగతులు...
నువ్వు నిలువునా మోసపోతావు...జాగ్రత్త..."

"ఆవిడ చెప్పింది చెప్పినట్టు చేయండి...అన్నీ అవే చక్కబడతాయ్....

ఇవ్విధంగా ఒక మనుష్యుడి స్వరపేటికను / కంఠసీమను ఆధారంగా చేసుకుని వెలువడే మాట మనిషి యొక్క స్థాయిని స్థిరీకరించి నిర్వచించేంతవరకు వెళ్ళగలదు అంటే కంఠసీమ నిజంగా ఎంత గొప్పదో కద..!

ఇక ఆంతరమున, ఊర్ధ్వకూటమి గా ఉండే తలకాయ్

( అనగా కళ్ళు, ముక్కు, చెవులు, నోరు, మెదడు, కపాలం, తత్ సంబంధ జ్ఞానేంద్రియ 
క్రియాకలాపానికి ఆలవాలమైన తల భాగానికి )

మరియు మధ్య కూటమి గా ఉండే శరీరానికి

( అనగా ఊపిరితిత్తులు, గుండే, బొజ్జ, ప్రేవులు, లివర్, పాంక్రియాస్, కిడ్నీలు, ఇత్యాది సకల జీవక్రియానిర్వాహక ఆంతరావయవ సంఘాతమై ఉండే భాగానికి )

కంఠసీమ అనేది అనుసంధాయక వ్యవస్థ.....

అధో కూటమి కి చెందిన కాళ్ళు లేని వారిని,
మధ్యకూటమికి చెందిన చేతులు లేని వారిని మరియు ఇతర వివిధ ముఖ్య అవయవాలు లుప్తమైన వారిని 
( కళ్ళు, చెవులు, కిడ్నీలు, ఇత్యాదిగా ) 
చూసుంటారు కాని 

ఎప్పుడైనా ఎక్కడైనా పైన పేర్కొన్న ఊర్ధ్వ కూటమి, మధ్యకూటమిని అనుసంధానపరిచే
కంఠసీమ లేని మనుషులను చూసారా...?

అది అసంభవం....ఎందుకంటే....
మనుష్యుడి ప్రాణశక్తి ఊపిరిని ఆధారంగా గావించి కంఠసీమనందు కేంద్రీకృతమై తనువెల్లా వ్యాప్తిగావించి ఉంటుంది కాబట్టి....

ఇన్ అదర్ వర్డ్స్ వితౌట్ ఫిసికల్ త్రోట్ దేర్ ఇస్ నో లైఫ్ ఫర్ దట్ లివిన్ బీయింగ్...

అందుకే ఏ సినిమా డైలాగ్స్ విన్నా సరే....

" వాడు బాగా ఉషార్...పైకి అలా అమాయకుడిలా కనిపిస్తాడు కాని...వామ్మో వాడి మాటలు వింటే తెలుస్తుంది..వాడు ఎంత శార్పో...."

"మాటే మంత్రము... మనసే బంధము...." అనే ఫేమస్ పాట ఒకటి వినే ఉంటారు....

బయోమెట్రిక్ యునీక్ ఐడెంటిటీస్ లో
ఫింగర్ప్రింట్స్, ఐరిస్ తో పాటుగా వోకల్/ వాయిస్ రెకొగ్నిషన్ కూడా ఒకభాగమై ఉండడం తెలిసిందే....

ఒక మనిషి ఎంత గొప్ప వ్యక్తైనా సరే, ఎంతటి ఆరితేరిన మేధావి అయినాసరే, ఎంతటి తలనెరిసిన పండితుడైనా సరే అవన్నీ కూడా సదరు వ్యక్తిచే నుడువబడే మాటలు / పదాలు / వాక్యాలు / భాష్యాలు గా మాత్రమే తమ గొప్పదనాన్ని స్థిరీకరించుకుంటాయ్....

సదరు వ్యక్తిచే వెలువడే అక్షరాలు / మాటలు / పదాలు వినా వారి గొప్పదనాన్ని తెలియపరిచే సాధానాలు మృగ్యం.....

వాటన్నిటికి కారణం సదరు వ్యక్తి యొక్క స్వరపేటిక మరియు మేధోమండలాంతర్గతంగా తనలో జనించే అసంఖ్యాక భావాలు 

"అక్షరమయి నాదమయి యోగమయి వేదమయి శబ్దమయి...."

ఇత్యాదిగా మనుజుడి హృత్కుహరంలో కొలువైఉండే ఆదిపరాశక్తి యొక్క అనుగ్రహంగా వివిధ భావలహరులుగా బహిర్గతమై లోకానికి అంది అంతటి అనుగ్రహసముపార్జితంతో జీవించే ఇతర మాన్యులచే తర్కించబడినప్పుడు సదరు వ్యక్తిలో అంతర్నిహితమై ఉండే వాగ్దేవి వైభవం ప్రపంచంలో ప్రస్ఫుటంగా పరివ్యాప్తమై పరిఢవిల్లుతుంది...

కాబట్టి స్వరపేటిక కొలువైఉండే కంఠసీమయే మనుజుడిలో ఆదిపరాశక్తి యొక్క కేంద్రస్థానమై అక్కడినుండి యావద్ శరీరం మొత్తానికి ప్రాణశక్తిని స్థిరీకరిస్తూ ఉంటుంది...

సవైదిక సనాతన సంప్రదాయంలోని వివాహ క్రతువులో మీరు గమనించిఉండిఉంటే శివశివా కళను సంతరించుకునే పెళ్ళికొడుకు పెళ్ళికూతురు ఇరువురిని ఒకటిచేసే గుడజీరకధారణ మరియు మాంగళ్యధారణ అనేవి అత్యంత ముఖ్యమైన ఘట్టాలుగా చెప్తారు...

అటువంటి మాంగళ్యధారణ సమయంలో 
ఆ సర్వామంగళాదేవి అనుగ్రహం పరిపూర్ణంగా కొలువైఉండేందుకు వరుడు వధువు కంఠసీమకి అలంకరణగా ఉండేలా వేసే మూడుముళ్ళ మాంగళ్యధారణకు ముందు ఆ సూత్రాన్ని / శతమానములను పెళ్ళికి తరలివచ్చిన పెద్దముత్తైదువుల కంఠసీమలకు అలా కొద్ది సేపు అలంకరణగా ఉండేలా అక్కడి సువాసినులందరి కంఠసీమల్లో కొలువైన మాంగళ్యంలోని సర్వమంగళాదేవి అనుగ్రహం ఆ కొత్త సూత్రానికి / శతమానములను తద్వార ఆ నవవధువు యొక్క కంఠసీమకు కూడా సమకూరేలా ఉండే ఆచారాన్ని మన పెద్దలు పాటించడం గమనించే ఉంటారు.... 

అసలు ఒక మనిషి యొక్క జీవితపు ఆయువుపట్టు మొత్తం పెళ్ళైన తదుపరి తన భార్య యొక్క కంఠసీమలో కొలువైన సౌమాంగళ్య వైభవంలోనే స్థిరీకరించబడి ఉంటుంది....

వినడానికి విడ్డూరంగా ఉన్న ఇది సనాతన శాస్త్ర వైభవం....

ఎన్నో సినిమాల్లో కూడా చూసే ఉంటారు..

" భార్య తాళి మహత్తు...అందుకే అంతటి ఆపదనుండి కూడా బ్రతికాడు..."

అనేలా ఉండే ఎన్నో డైలాగ్స్ ని....

ఒక సువాసిని పతివ్రతగా పూజలు నోములు వ్రతాలు గుళ్ళు అంటూ ఆధ్యాత్మిక జీవన పరిపుష్టితో ఉన్నప్పుడు.....
తన భర్త అంతగా ఆధ్యాత్మిక వ్యక్తి కాకపోయిన ఆ సర్వమంగళాదేవి అనుగ్రహంతో సకల వైభవాలతో జీవిస్తుంటాడు....

ఒక సువాసిని పెద్దగా ఏ ఆధ్యాత్మిక జీవనం లేకుండా, జీవితపర్యంతంలో ఎడమచేత్తోనైనా ఒక్క పదిరూపాయల దానధర్మాలు కూడా చేయకుండా, కనీసం ఒక్క శ్రావణశుక్రవారం కూడా నిండు మనసుతో ఒక ఐదుగురు ముత్తైదువులకైనను ఎర్రపూలు, తమలపాకులు, మొలకెత్తిన పచ్చి శనగలు, ఒక పండు వాయనంగా ఇచ్చి వారి దీవెనలు అందుకోకుండా, కేవలం తిన్నామా, కూడబెట్టామా, అని మాత్రామే ఉండేలా జీవించినప్పుడు ఆ జీవితానికి సర్వమంగళాదేవి అనుగ్రహం లుప్తమై...,
తన భర్త ఎంతటి ధార్మిక జీవితంగడిపే వ్యక్తైనను, చక్కని జీవనశైలి గల మనిషైనను, కాలగతిలో గండం గా పరిణమించే ఘడియల్లో ప్రమాదాలకు లోనైనప్పుడు తనువుచాలించడం లాంటి విపత్కర పరిస్థితులను మనం సినిమాల్లో / సమాజంలో గమనించవచ్చు....

సర్వమంగళాదేవి అనుగ్రహం అంతటి ఘనమైనది కనుకనే ఆదిపరాశక్తిగా ఉన్నాసరే,
తన పతి కామేశ్వరుడిచే అలంకరించబడిన మంగళసూత్రంతో శోభిల్లే కంఠసీమ గల శివకామసుందరి గా ఆ లలితాపరాంబికను వాగ్దేవతలు స్తుతించినారు....

గహనమైన శ్రీలలితా భాష్యాలు కాకుండా, ఈ క్రింది లలిత శ్లోకాల్లో కంఠసీమయొక్క వైభవం ఎల్లరికీ సరళగ్రాహ్యమే కద...

అనాకలిత సాదృశ్య చుబుక శ్రీ విరాజితా |
కామేశబద్ధ మాంగల్య సూత్రశోభిత కంథరా ‖ 12 ‖

పరా, ప్రత్యక్చితీ రూపా, పశ్యంతీ, పరదేవతా |
మధ్యమా, వైఖరీరూపా, భక్తమానస హంసికా ‖ 81 ‖

అనాహతాబ్జ నిలయా, శ్యామాభా, వదనద్వయా |
దంష్ట్రోజ్జ్వలా,ఽక్షమాలాధిధరా, రుధిర సంస్థితా ‖ 100

విశుద్ధి చక్రనిలయా,ఽఽరక్తవర్ణా, త్రిలోచనా |
ఖట్వాంగాది ప్రహరణా, వదనైక సమన్వితా ‖ 98 ‖

" విశుద్ధిచక్రనిలయా, రక్తవర్ణా " గా అభివర్ణించబడిన ఆదిపరాశక్తి మన రక్తంలో అంతర్లీనంగా కొలువై శరీరం అన్నిదిక్కులా ఎంత అవసరమో అంతే వేగంతో రక్తాన్ని ఎగజిమ్మడం వల్లే మనం జీవించడం సంభవమయ్యేది....

ఆవిడ అనుగ్రహం లుప్తమై ఒక్క చోట రక్తం నిలిచిపోతే అది ఎంతో తీవ్రమైన సమస్యగా పరిణమిస్తుంది..

అది రక్తశుద్ధిని గావించే గుండెలో అయితే ఉత్తరక్షణం సడెన్ స్ట్రోక్ తో మనిషి అక్కడికక్కడే కుప్పకూలి గతించిపోవడం అనేది ఎల్లరికి తెలిసిన విషయమే....

మనిషి యొక్క మేధోమండలం అత్యంత చురుగ్గా పనిచేసేలా ఊర్ధ్వకూటానికి ఎంత వేగంగా రక్తాన్ని మన కంఠనాళం ఎగజిమ్ముతుందో సినిమాల్లో అయినా చూసుంటారు కద.....

( చంద్రముఖి సినిమాలో రజినికాంత్ వినీత్ తల తరిగినప్పుడు....
బాహుబలి సినిమాలో ప్రభాస్, అనుష్కను అవమానించిన వ్యక్తి తలను ఒక్క దెబ్బకు తరిగినప్పుడు రక్తం ఎగజిమ్మిన సీన్లో... ఇలా వివిధ సిమిమాల్లో వివిధ సీన్లల్లో చూసేఉంటారు కద....
ఒకానొక సమయంలో శ్రీశైల శ్రీభ్రమరాంబామల్లికార్జున సన్నిధిలోని శ్రీవీరశైవమండపంలో ఎంత మంది వీరశైవయోగుల కంఠాలు తెగిపడ్డాయో లెక్కేలేదు....
)

ఇవ్విధంగా కంఠం యొక్క ప్రాముఖ్యత
బహుధా లోకవిదితం...

అంతటి ఉత్కృష్టమైనది కనుకే తన కంఠసీమలో ఆ గరళాన్ని బంధించి నీలకంఠుడైనాడు ఆ నిగమవంద్యుడు...

ఎందుకంటే తన సతి యొక్క కంఠసీమలో కొలువైన సర్వమంగళాదేవి యొక్క అనుగ్రహంతో అది తనను ఏమాత్రం ప్రభావితం చెయ్యదు కనుక....

కాబట్టి అటు బయటికి కనిపించకుండా....ఇటు లోపలికి మ్రింగకుండా...సరాసరి కంఠమునందు కాఠిన్యాన్ని బంధించి లోకాలను సమ్రక్షించి అనుగ్రహించాడు ఆ భోలాశంకరుడు....😊

Tuesday, February 2, 2021

శ్రీ శార్వరి బహుళ పంచమి, సద్గురుశ్రీత్యాగరాయ సంస్మరణ / త్యాగరాయ ఆరాధనా మహోత్సవ శుభాభినందనలు....😊🙏💐🍟🍨🍕

జగద్ప్రసిద్ధినొందిన సద్గురు శ్రీత్యాగరాజ సంగీత పెన్నిధి సంగీతప్రియులెల్లరికి సుపరిచితమే....

పంచరత్న కృతులుమొదలుకొని ఎందరో దేవీదేవతలను కీర్తించిన ఎంతో హృద్యమైన సరళమైన శుద్ధమైన సిద్ధమైన సంగీత సాహిత్య
సారస్వతాన్ని ఈ లోకానికి అందించిన ఆ మహనీయులు తెలుగు భాష చేసుకున్న పుణ్యపరిపాకమై మనకు లభించిన పుంభావసరస్వతీ స్వరూపులు.....

వారి అమూల్యమైన ఎన్నో సంకీర్తనాసుధాగుళికల్లో ఒక చక్కని సంకీర్తనలో శాస్త్రీయ కర్ణాటక సంగీత సప్తస్వరాల యొక్క మహత్తును ఈశ్వరుని పంచవక్త్రజనితములుగా వర్నిస్తూ,

వేదాల్లో ఉత్తమమైన సామవేదసారాన్ని సంగీత సప్తస్వర రససిద్ధిగా అందుకొని జీవితాన్ని తరింపజేసుకొని ఆనందించండని అందించిన ఒక కడురసరమ్యమైన సంకీర్తనలో

" నాద తనుమనిశం శంకరం...నమామిమే మనసా శిరసా..." అని ఈశ్వరుడిని కీర్తించిన వైనం నిజంగా అత్యత్భుతం....

( స్వరజతులతో సహా కావాలంటే
ఎం.ఎస్ గారి పాత రెకార్డింగ్ వినండి...
సింపుల్ ఆలాపనలో కావాలంటే ప్రియా సిస్టర్స్ రెకార్డింగ్ వినండి....రెండు కూడా అద్భుతమైన ఆలపనలు...)

" స : షడ్జమం "
సద్యోజాత  పశ్చిమాభిముఖ వదనం / వరుణుడు దిగ్దేవత
( జంబుకేశ్వర జలలింగం )

" తత్త్ జలాన్ " అని శ్రీ చాగంటి సద్గురువులు నుడివిన పరమాత్మ తత్త్వం చాలామందికి ఎరుకలో ఉన్న విషయమే....

కాబట్టి జల సూచక వాచకంగా ఉన్న మొట్టమొదటి షడ్జమమే పరమాత్మ ప్రతీక...

వేదానాం సామ వేదోస్మి అని అంటాడు గీతాచార్యుడు... దేహాంతర్గతమైన నాదాన్ని స్వరంగా బహిర్గతం చేయాలంటే నాలుక యొక్క కొస / చిట్టచివరి భాగం పై దవడను గట్టిగా అదిమితే కాని స
అక్షరాన్ని తత్ జనిత sssssss అనే శబ్దాన్ని పలకలేము...

స.... దీర్ఘంగా ఉచ్చరించాలంటే నాభి నుండి వాయువును ఏకబిగిన వెలువరిస్తేనే అది సాధ్యమయ్యేది....
అనగా అత్యంత శక్తివంతంగా శరీరాంతర్గత ప్రాణశక్తి బహిర్గతమయ్యేది షడ్జమం పలికినప్పుడే....

కేవలం స అక్షరానికే ఉండే ప్రత్యేకత అది....

మిగతా అన్ని శివాలయాల్లోకెల్లా పశ్చిమాభి ముఖమైన సద్యోజాత శివలింగ క్షేత్రాలు అత్యంత శక్తివంతమైనవి అని శ్రీ చాగంటి సద్గురువులు నుడివిన అధ్యాత్మ విశేషం చాలా మందికి గుర్తుండే ఉంటుంది....

ఇవ్విధంగా షడ్జమం అత్యంత శక్తివంతమైన స్వరం కాబట్టి అది పరమాత్మ ప్రతీక.....

" రి : రిషభం "
అఘోర దక్షిణాభిముఖ వదనం / యమధర్మరాజు దిగ్దేవత
( దక్షిణం పక్కనే ఉండే నైరుతి పృథ్వీ సూచకం)
( కంచి ఏకామ్రేశ్వర పృథ్వీలింగం )

" ద : దైవతం "
వామదేవ ఉత్తరాభిముఖ వదనం / కుబేరుడు దిగ్దేవత
( ఉత్తరానికి పక్కనే ఉండే వాయవ్యం గాలికి సూచకం )
( శ్రీకాళహస్తి వాయులింగ క్షేత్రం )

" గ : గాంధారం "
తత్పురుష ప్రాగ్/తూర్పు అభిముఖ వదనం / ఇంద్రుడు దిగ్దేవత
( తూర్పుకి పక్కనే ఉండే ఆగ్నేయం అగ్నికి సూచకం )
( అరుణాచల అగ్ని లింగ క్షేత్రం )
( తత్పురుషాయ విద్మహే మహదేవాయ ధీమహి
తన్నః రుద్రః ప్రచోదయాత్... )

నిజానికి గ వాచకానికి చాలా సూచకంగా ఉంటాయి. ఇక్కడ రుద్రుడి అధీనంలో ఉండే సకల భూత గణములకు గ వాచకం సూచకం. )

" ని : నిషాదం "
ఈశాన ఊర్ధ్వాభిముఖ / పర్జన్యుడు మేఘమండలాధిదేవత
( ఊర్ధ్వముఖ 5వ వదనం చూసేది ఆకాశం... ఆకాశానికి మేఘాలకు సామ్యము కలదు....
(చిదంబర ఆకాశలింగం )

మ : మధ్యమం
ప : పంచమం

మ, ప జీవాత్మ మరియు తద్ వినియోగిత శక్తి సముపార్జక మాధ్యమ సూచకములు
( సూర్య & చంద్ర లింగ క్షేత్రాలు @
కోనార్క్ & సీతాకుండ్...
నేపాల ఖాట్మండు పశుపతినాథ్ ఆలయం / యజమానలింగక్షేత్రం)

మ అనగా విష్ణు శక్తికి / సర్వపరివ్యాపక శక్తికి / అమృత శక్తికి ప్రతీక...

ప అనగా జీవాత్మ / ప్రాణి దేహాంతర్గత యజమాని కి ప్రతీక )

దేహాంతర్గత జీవుడికి జీవశక్తి లభించేది సూర్యచంద్రుల నుండి...
( సూర్యజనిత ఆత్మశక్తి + చంద్రజనిత మనోశక్తి = జీవశక్తి )

స రి గ మ ప ద ని
స్వరోచ్ఛారణ ను

మీరు సరిగ్గా గమనిస్తే

సప్తస్వరాల్లో మ : మధ్యమం మరియు ప : పంచమం మాత్రమే బాహ్యావయవమైన పెదవుల సహాయం లేకుండా పలకలేము....

మిగతా ఐదింటికి అనగా
స రి గ - - ద ని
స్వరాలను పలకడానికి పెదాల అవసరం లేదు..

అనగా యావద్ విశ్వంలో కూడా పరివ్యాప్తమై ఉండేవి పంచభూతాలే అయినా,
బాహ్య ప్రపంచంలో సూర్య చంద్ర శక్తిని ఆధారంగా గావించి నామరూపాత్మక శరీరధారులుగా ఉన్న ఇరు జీవధారుల మూలంగా మాత్రమే ప్రభవించేది మరో పాంచభౌతిక ప్రాణి...

దానికి సంకేతంగానే
మ మధ్యమ , ప పంచమ స్వరాలను
బాహ్య అవయవములైన అధరమండల సహాయం వినా పలకలేము....

సరిగా గమనిస్తే ధనూరాశికి సంకేతంగా ఉండే , వింటినారిని ఎక్కుపెట్టి ఉన్న ధనస్సు లా, మనుష్యుల అధరమండలం అనగా రెండు పెదవులు మూయబడి ఉన్నప్పుడు ఉండే ఆకారం....

ధనస్సు యొక్క ఇరుకొనలు సూర్యచంద్రులకు ప్రతీకైతే వాటిని అనుసంధానిస్తూ ఉండే ఆ వింటి నారి జీవుడికి ప్రతీక....

ఆ ధనస్సు యొక్క ఇరుకొనలు ధృఢంగా లేనినాడు
వింటినారికి శక్తిలేదు...

అట్లే సూర్య చంద్రులు లేని నాడు జీవుడికి శక్తిలేదు....

యావద్ పాంచభౌతిక చరాచర విశ్వంలో పరివ్యాప్తమై ఉండే ఆ పరమాత్మ తన యావద్ శక్తిని సప్తస్వరాత్మక సమ్మిళితమైన సంగీతశాస్త్రంలో నిక్షిప్తం గావించి స్వరపేటిక గల ఉత్క్రుష్టప్రాణిగా జన్మించినందుకు తరించమని మనుష్యుడికి అందించినాడు....

గాలి అంతటా ఉంటుంది....కాని అది ప్రస్ఫుటంగా మనకు ఎరుకలోకి వచ్చి ఆస్వాదించబడి అభినందించబడాలంటే ఫాన్ / కూలర్ ఆన్ చేసి, ఎంత స్పీడ్ పెంచుకుంటూ పోతూంటే అంతగా గాలి ఉధృతి పెరుగడంలో మనం సేదతీరినట్టుగా...

సశాస్త్రీయ రాగరంజితమైన ఆలాపనలోని సప్తస్వరాల ఆరోహణ అవరీహణలో మన తనువులోని అణువణువు పులకరించి ముఖ్యమైన నవనాడిమండలాంతర్గత కణజాలం ఆ స్వరాలాపనకు సంతసించి మేధోమండలం ఒక అనిర్వచనీయ అవ్యక్త ఆనందానుభూతి కి గురవ్వడంలో ఆ పరమాత్మ తత్త్వం అనుభవంలోకి రావడంతో,
ఇంద్రియాలకు అలభ్యమైన పరతత్త్వం ఇంద్రియగ్రాహ్యమై మనుజునకు మహిమ్నతను కలిగించి తరింపజేస్తుంది....

మన పెద్దలు అందుకే అన్నారు...

రాగాలకు నయం కాని రోగాలు లేవు...అని....

అంతటి స్వరసిద్ధితో ఆలపించే గాత్రముంటే మనుజుడు ప్రత్యక్ష గంధర్వానుభూతికి లోనై గంధర్వులతో సమంగా దైవిక సిద్ధిని అందుకొని తరిస్తాడు....

నాదోపాసన అంత గొప్పదికనుకనే,

"రాగసుధారసపానముజేసి రంజిల్లవే ఓమనసా...."

అంటూ మనుష్యుడికి నిజమైన మితృడు సంగీతం మాత్రమే అని....

ఆ సంగీత సాధన సకల యాగయోగఫలమొసగె అమేయ దైవిక అనుగ్రహమని తెలియజేస్తూ మనల్ని అనుగ్రహించిన శ్రీ సద్గురు త్యాగరాయుల సంగీత స్ఫూర్తిని ఆలంబనగా గావించి ఎల్లరు తమ తమ జీవితాలను సార్ధకం గావించుకొని ఆనందించెదరుగాక....

సర్వే జనాః సుజనాః భవంతు....
సర్వే సుజనాః సుఖినోభవంతు....
సమస్త సన్మంగళానిసంతు..... 🙏😊

ప. నాద తనుమనిశం శంకరం
నమామి మే మనసా శిరసా

అ. మోదకర నిగమోత్తమ సామ
వేద సారం వారం వారం (నా)

చ. సద్యోజాతాది పంచ వక్త్రజ
స-రి-గ-మ-ప-ద-ని వర సప్త-స్వర
విద్యా లోలం విదళిత కాలం
విమల హృదయ త్యాగరాజ పాలం (నా)

nAda tanumaniSam-cittaranjani

In the kRti ‘nAda tanumaniSam’ – rAga cittaranjani SrI tyAgarAja states that Siva is the embodiment of nAda.

P nAda tanum-aniSam Sankaram
namAmi mE manasA SirasA

A mOdakara 1nigam(O)ttama sAma
vEda sAram vAram vAram (nAda)

C sadyOjAt(A)di 2panca vaktraja
sa-ri-ga-ma-pa-dha-ni vara 3sapta svara
vidyA lOlam vidaLita 4kAlam
5vimala hRdaya tyAgarAja pAlam (nAda)

thyagaraja-vaibhavam.blogspot.com/2007/09/thyagaraja-kriti-naada-tanumanisam-raga.html?m=1


ప్రశాంతంగా జీవించు......ప్రశాంతంగా జీవించనివ్వు...

శ్రీశ్రీనివాసుడి, అనగా సకల విశ్వపరిపాలనా  వ్యవస్థను తన క్రీగంటి చూపులతో ఆనందనిలయ గర్భాలయ పద్మపీఠంపై ఎంతో ఒద్దికగా వీరస్థానక ధృవమూర్తిగా వరదకటిహస్త శోభితుడై నిలిచి, కొలిచిన భక్తుల కొంగుపైడిగా వెలుగులకే వెలుగైన శ్రీవైష్ణవ ఠీవి ని నిలువెల్లా నింపుకున్న సజీవ సాలిగ్రామావేశిత ధృవమూర్తిగా కొలువైన కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీవేంకటేశ్వరుడి, శ్రీపాదపద్మాలను ఆశ్రయించి ఉన్న భక్తులను హింసించే ధూర్తులను ఎవ్విధంగా దునుమాడాలో ఆ దుర్గమ్మకు బహుబాగా తెలుసును....ఎందుకంటే ఆవిడ

"నారాయణీ నాదరూపా నామరూపవివర్జితా "

గా నామరూపాత్మక రహితమైన శక్తిగా సర్వేసర్వత్రా  పరివ్యాప్తమై ఉంటుంది కాబట్టి....

ఒక్కొక్కడికి తలబిరుసు ఎంత తీవ్రంగా ఉంటుందంటే 
అనవసరంగా ఎందుకు ఎగిరెగిరి పడుతున్నాడో తెలుసుకోడు...

ఎవరి మీదికి ఎగిరెగిరి పడుతున్నాడో తెలుసుకోడు...

అట్లా అనవసరంగా నిప్పుతో చలగాటం తనను సమూలంగా దహించివేసే గుణపాఠమై పరిణమించి తీరుతుంది అనే ఇంగితం ఉండదు...

చెప్పినా అర్ధం చేసుకునే ఓపికా/తీరికా లేనంత బిజీ గా  ఉన్నట్టుగా ఉంటారు....

అజ్ఞానం అరవై రకాలు...వెర్రికి వెయ్యి తలలు.....అని వినేఉంటారు....

అది ఎట్లుంటదో వివరిస్తాను చదవండి...

పైస మోజులో పడి విదేశాలకేగి బాగా లక్షల లక్షల డాలర్లు సంపాదించి అక్కడే సెటిల్ అయ్యి బాగా గడుస్తున్న చక్కని జీవితంలో,

భగవంతుడికి చోటు లేని జీవితం, జీవనశైలి కాబట్టి....

కేవలం ఐహిక భోగలాలసతతో జీవించడమే ధ్యేయంగా ఉన్న సంపన్న జీవితంలో...

మరింత అధికార ఐశ్వర్య మదమత్తులై
సామాన్య మధ్యతరగతి వ్యక్తిని పీక్కతినేందుకు ఉద్యుక్తులై వారిని జీవితంలో, వృత్తిలో, సమాజంలో ఎంతో తీవ్రంగా దెబ్బతినేవిధంగా శకుని యుక్తులను రచించి అమలుపరచడంలో బాగ బిజీ గా ఉంటారు....

ఒక చైన్ స్మోకరైన దుష్టుడితో తమ పన్నగాలను రచించడం మొదలుపెట్టి క్రమక్రమంగా వారి విషవలయంలో ఎందరో అమయాకులు చిక్కి సతమతమయ్యేలా ఆ సగటు సామాన్య మధ్యతరగతి వ్యక్తి యొక్క సకల జీవన వ్యవస్థని దెబ్బతీసి, అనగా వాడి దోస్తులను, బంధువులను, తెలిసిన వారిని, ఇలా వాడికి సంబంధించిన ప్రతి ఒక్కరిని పావుగా మలిచి వాడి కష్టానికి, కార్మిక జీవితానికి, కృషికి, సమూలంగా తెరపడేలా ఎన్నెన్నో గుంటనక్క వేషాలు వేసి, అసలు వాడి జీవితంలో మనః శాంతి అనేదే లేని విధంగా ఒక కౄర కంసకావర సమమైన ఘొరకలిని తలపెట్టి ఎన్ని విధాలా హింసించాలో అన్నివిధాలా హింసించారు....

1. The crooked guy started the mental mayhem by moving the pawns beginning with a chain smoker bastard who is the Indian Telugu proxy for that American Telugu bastard, who has very intelligently 
" advised " the normal middle class fellow struggling with his life on many a regular common man's hardships to put an end to his the then on-going journey.

2. The crooked guy started disturbing and distracting the entire block chain of friends, relatives, peers, neighbours, etc and the latter continued to silently observe everything to have a much better understanding of why it is being done and via whom....etc etc....

3. The crooked guy has unnecessarily instigated a few folks to remain focused to create the ruckus much vehemently by disturbing the latter's family balance by breaking his only brother's mediocre career life to destabilize their already poor financial balance and then injecting poisonous executional matrix against his very own brother and then to his parents and then to his wife and then to his in-laws and so on and on and on.....
The latter kept fighting alone to the best of his capacities by making God as his only source of energy.

4. The crooked guy took a step ahead by instigating the local political channel against the latter to mentally torture him so much so that his own family members were made his enemies by injecting all sorts of venomous executional steps to make him lose the expedition..

5. The latter went a step above and roped in a much superior political channel by letting his folks involve his relative present at a cabinet minister's strata to counter the local political idiots who were blind folded by the crooked fellow's baseless executions to torture a normal middle class person which is completely absurd and heinous..

6. The crooked guy went ahead to take all possible moves with all the pawns left in his matrix to crush the latter from being back in to the field which is his only goal behind all of his wolverine executions....

7. The latter normal middle class fellow has pulled in all of his energies to strengthen his armour to continue fighting the entire hostile world albeit alone by believing in God and his blessings as the only source of power to travel the journey ahead...

8. As it goes, for those who believe in God there is always endless hope... 
So it is ought to happen that quite soon the latter must make his way to be back in to the field to start a brand new beginning that shall hopefully put an end to the immeasurable arrogance of the crooked fellow and his channel,
assuming that the crooked guy would remain humble enough to recognize all of his blatant arrogant executions that have only made him go mad in his greed and insatiable hunger for illegitimate power that his superiors don't want to grant him with, owing to all of his anger filled ill minded executions as explained above and many others as well.

His futile attempts of creating a parallel organisation against his very own superiors and the global owners of the business that he is a part of along with many others, should have ideally come to a halt unless he is yet to learn that such a stupid endeavor would only jeopardize the peaceful lives of several passengers on board starting with his own....

A nation shall have only one P.M...
A state shall have only one C.M...
A constituency shall have only one M.L.A.
A district shall have only one Collector...
An organization shall have only one C.E.O..

And thus quite similarly, it makes sense to accept the fact that any given business unit shall have only one head who represents / executes the same for everyone who are a part of it....

Hope I need not make things much more elaborate beyond this sensible threshold in explaining the realty out there in decently simple terminology accordingly as appropriate....!

And now it would be really good if you can kindly stop your hostility 
"at every level" for that the latter is really tired of fighting your head strongness and it is a high time for him to remain peaceful for the next few months which is indeed very important for his complete life for all obvious reasons and please stop framing new executions to loot him further to fill your already rich pockets....
Yes, I mean it very seriously...!

ప్రశాంతంగా జీవించు......
ప్రశాంతంగా జీవించనివ్వు.... 

కాదు కూడదు అంటూ అట్లే మొండిగా మూర్ఖంగానే ప్రవర్తిస్తూనే ఉంటాను అంటే 
ఆ శ్రీరాజరాజేశ్వరి గజ్జెల మ్రోతకు నీ పుణ్యాలన్నీ క్షయించిపోయి,
ఆ ఉగ్రభద్రకాళి ఆగ్రహానికి నీ తలపొగరే కారణమై,
ఆ క్రోధ కనకదుర్గమ్మ త్రిశూల పోటుకి నీ జీవితపు పునాదులు కూలిపోవడం తథ్యం.....
తాస్మాత్ జాగ్రత్త....!