Tuesday, May 19, 2026

శ్రీపరాభవ 2026 వైశాఖ పౌర్ణమి పర్వసమయ ప్రయుక్త శ్రీకూర్మనారాయణ జయంతి శుభాభినందనలు.


శ్రీ చాగంటి సద్గురువుల శ్రీమద్భాగవతకర్ణామృతప్రవచనాలను శ్రద్ధాభక్తితో ఆలకించిన భక్తులకు / విజ్ఞ్యులకు తెలిసినట్టుగా,
అంబరీషోపాఖ్యానాంతర్గతమైన సంఘటనలో భాగంగా లోకసమ్రక్షణార్ధమై శ్రీహరి స్వీకరించిన దశావతారవర్ణన గురించిన ఆఖ్యానాలను, వ్యాఖ్యానాలను, ఇతిహాసఘట్టాలను, నెమరువేసుకోవడం కూడా ఎంతో పుణ్యప్రదమైన స్వాధ్యాయ తపస్సు....

ఎందుకంటే మనమున్న ప్రస్తుత కలియుగలక్షణం రీత్యా, 
కృత, త్రేత, ద్వాపర యుగాల్లో మునులు, మహర్షులు, యోగులు, రాజులు, చక్రవర్తులు గావించిన రీతిలో అగ్రశ్రేణి తపస్సును ఆచరించడం చాలా కఠినమైన అంశం....

ఎందుకంటే 
అందుకు తగిన విధంగా...
దేవతలుప్రసన్నమయ్యేలా ఉండే పరిసరశౌచం,
దేవతలనుప్రసన్నం గావించుకునేందుకు కావలసిన
సదాచారశౌచం, మంత్రసిద్ధి, యోగశక్తి, వేదవిజ్ఞ్యానంతో వర్ధిల్లుతూ తరించడం ఈ కలియుగంలో అంతగా అన్నివేళలా కుదరని అంశం...

కావాలంటే మీరు గమనించండి...

"రాబోయే దశాబ్దాల్లో భారత అంతరిక్ష విజ్ఞ్యాన కౌశలం  ఎవ్విధంగా ఉండబోతోంది...?"

అనే ప్రశ్నను మీరు అడిగితే...

ఒక ఎంజినీరింగ్ కాలెజ్ విద్యార్థి మొదలుకొని ఒక అగ్రశ్రేణి సైంటిస్ట్, ఐ.ఏ.ఎస్ ఆఫీసర్ గారి వరకు ఠక్కున వారివారి సైంటిఫిక్ స్టడీస్ కి తగ్గట్టుగా ఇవ్విధంగా సమాధానం ఇస్తారు.....

ఒక ఎంజినీరింగ్ కాలెజ్ విద్యార్థి యొక్క సమాధానం.....

"ఇప్పుడున్న స్థూల ట్రాన్సీవర్స్ కంటే ఎన్నో రెట్లు మెరుగైన, శక్తివంతమైన సూక్ష్మ ట్రాన్సీవర్స్ యొక్క సమూహంతో బిగించిఉండే అత్యాధునిక సాంకేతిక వ్యవస్థను కలిగి ఉండి, నిర్దేశిత డౌన్లింక్ ఫ్రీక్వెన్సి లో భూమికి నిరంతరం కొన్ని వేల గీగాబైట్స్ సమాచారాన్ని చేరవేస్తు ఈ భూప్రపంచంలో ఎక్కడ ఏ మూలన ఏ ఇంటిపై అమర్చనడిన ఏ సోలార్ పరికరం
ఏ కంపెని వారు తయారు చేసారో చెప్పగలిగేంతటి స్థాయిలో రాబోయే నవయుగ నవభారత అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞ్యానశాసిత భారత అంతరిక్ష సంచార సాంకేతిక వ్యవస్థ ఉండబోతోంది..."

మరియు ఒక అగ్రశ్రేణి సైంటిస్ట్, ఐ.ఏ.ఎస్ ఆఫీసర్ గారి సమాధానం.....

"సోలార్ పవర్డ్ ఎనర్జి మోడ్యూల్స్తో భూమిచుట్టూ పరిభ్రమించే ఇప్పుడున్న స్టేటిక్ పేలోడ్ సిస్టంస్ కంటే ఎన్నో రెట్లు మెరుగైన, శక్తివంతమైన ఏ.ఐ ప్రొపెల్డ్ డైనమిక్ పేలోడ్ సిస్టెంస్ తో ఆకాశంలో ఒక ఆకాశహర్మ్యంలా నిర్మించబడిన సమ్యుక్త అంతర్జాతీయ అంతరిక్ష పరిశోధనా వ్యవస్థతో ఎప్పుడుకావాలంటే అప్పుడు అనుసంధానమౌతూ,
ఒక నిర్దేశిత ఉపగ్రహం నిర్దేశిత పౌనహ్పున్యం లో నిర్దేశిత లక్ష్యసాధన మాత్రమే కాకుండా, తనకు ఉపయుక్తమైన "అప్డేట్స్ ఆన్ ది ఫ్లై" అనే కాన్సెప్ట్ తో అప్పటికప్పుడు ఒక సరికొత్త ఉపగ్రహంగా తనను తాను వ్యవస్థీకరించుకునే శక్తితో పరిఢవిల్లే అత్యాధునిక నానోటెక్నాలజి సెన్సర్స్ బేస్డ్ డైనమిక్ రిక్యాలిబ్రేషన్ & రి అలైన్మెంట్ సిస్టెంస్తో ప్రత్యర్ధి దేశాల ఉపగ్రహవ్యవస్థలకు అంతుచిక్కని అల్గోరిదంస్ తో వర్ధిల్లెలా రాబోయే నవయుగ నవభారత అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞ్యానశాసిత భారత అంతరిక్ష సంచార సాంకేతిక వ్యవస్థ ఉండబోతోంది....ఇప్పటికే అమెరిక, రష్యా, ఈ టెక్నాలజిని సమర్ధవంతంగా పరీక్షించి అంతరిక్షంలో వాటి పైచేయిని వ్యవస్థీకరించుకునే దిశగా ఎన్నో రహస్య ప్రాజెక్ట్లను మరియు వాటికోసం తగిన లాంచ్ వెహికిల్స్ ని కూడా నిర్మించుకుంటున్నారు...."

అని చెప్పబడుతుంది....

కొన్ని శతాబ్దాల క్రితం కేరళ దేశంలో కాలటి అగ్రహారంలో ప్రభవించిన శ్రీ ఆదిశంకరాచార్యులు అనుగ్రహించిన "శ్రీస్తవం" లో వర్ణింపబడిన శ్రీమహాలక్ష్మీదేవి యొక్క వైభవం మరియు ఆనాడు క్షీరసాగరమథనంలో శ్రీకూర్మనారాయణుని అనుగ్రహంగా, వాసుకి అల్లెత్రాడుగా, మేరుపర్వతం కవ్వంగా, దేవదానవుల పరస్పర పరిశ్రమగా ప్రభవించిన
కల్పవృక్షం, కామధేనువు, ఉచ్ఛైశ్రవం, ఐరావతం, చంద్రుడు, శ్రీమహాలక్ష్మి, అమృతకలశం తో శ్రీధన్వంతరీ నారాయణమూర్తి, అనే దైవికవస్తుతత్త్వాల్లో,
అక్కడున్న దేవతలందరూ అప్పుడు ప్రభవించిన శ్రీమహాలక్ష్మీదేవిని స్తుతించిన
"సర్వదేవకృతశ్రీలక్ష్మీస్తవం" లో వర్ణింపబడిన శ్రీమహాలక్ష్మీదేవి యొక్క వైభవం గురించి మీరు కొంచెం వివరించగలరా...?

అనే ప్రశ్నను మీరు అడిగితే...

ఒక కాలేజ్ విద్యార్థి అయినా....
ఒక ఐ.ఏ.ఎస్ ఆఫీసర్ గారైనా...
ఒక సైంటిస్ట్ గారైనా...
మరే ఇతర విజ్ఞ్యులైనా...

"ఆ...అంటే....అది...మీరు అడిగిన సనాతనభారతీయ వైభవానికి సంబంధించిన సదరు అధ్యాత్మ అంశం ఏ సినిమాలోను చూసినట్టుగా కాని, ఎక్కడా విన్నట్టుగా చదివినట్టుగా కాని, అంతగా గుర్తులేదండి..."

అనే సమాధానమే ఎక్కువగా ఎక్కువమందినుండి వచ్చేది...
ఎందుకంటే....
ఈ కలియుగంలో జెట్ స్పీడ్లో దూసుకుపోతున్న సైన్స్ విజ్ఞ్యానాన్ని అందించేందుకు వేలల్లో, లక్షల్లో, కాలేజీలు, విశ్వవిద్యాలయాలు, ఉన్నాయేమో కాని...
మనకు చెందిన, మనకు మాత్రమే సొంతమైన, సనాతన భారతీయ ఆర్ష విజ్ఞ్యానానికి చెందిన గొప్పగొప్ప మహిమాన్వితమైన అంశాల గురించి,
భారతీయ సనాతన ధర్మవైభవం గురించి, సాధారణ జనబాహుళ్యానికి విశదీకరించే ప్రాచీనశాస్త్రీయవిజ్ఞ్యానకోవిదులు వందల్లో కూడా లేకపోవడం
ఈ కలియుగ వైచిత్రికి నిదర్శనం....
ఉన్నాకూడా చాలామంది, మంచి విషయాలను చెప్పే వారిని 
ఓర్వని ఈ సమాజం గురించి, సమాజాభ్యున్నతి గురించి
మనకెందుకు తలనొప్పి.....
మన స్వాధ్యాయమేదో, మనపనేదో మనం చేసుకుంటే సరిపోద్ది కద.....అని సమాజంలో సగటు సాధారణ వ్యక్తుల్లా ఉండే అసాధారణ మాన్యుల గౌరవాభిమానాలకు పాత్రతను సంతరింపజేసుకోలేని ఆధునికసమాజభరిత అవనియవనిక గురించి విజ్ఞ్యులకు విదితమే....

మరి ఇలాంటి యుగంలో, ఇలాంటి ఆధునికసమాజంలో, మంచిమంచి మహిమాన్విత అధ్యాత్మ అంశాలు, మంచి హృదయం గలవారికి ఎట్లు అందివచ్చి వారు తరించి ఇతర మాన్యులను తరింపజేయడం...?
అని ఎవరైనా యోచిస్తే....అందుకు సమాధానమే 
కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీవేంకటేశ్వరస్వామి వారు...!

పార్థాయ తత్-సదృశ సారధినా త్వయైవ
యౌ దర్శితౌ స్వచరణౌ శరణం వ్రజేతి ।
భూయోఽపి మహ్య మిహ తౌ కరదర్శితౌ తే
శ్రీవేంకటేశ చరణౌ శరణం ప్రపద్యే ॥ 11 ॥

"ఓ శ్రీవేంకటేశ్వరా! పూర్వం అర్జునుడికి (పార్థుడికి) తగిన సారథివై ఉండి, 'నా పాదాలనే శరణు వేడుకో' (మామేకం శరణం వ్రజ) అని ఏ చరణాలనైతే చూపించావో, అవే చరణాలను ఇప్పుడు ఇక్కడ నీ హస్తకమలంతో చూపిస్తున్నావు. అటువంటి నీ శ్రీచరణాలను నేను శరణు వేడుకుంటున్నాను."

ఆనాడు కురుక్షేత్రసంగ్రామంలో ఎంతో అలజడితో ఏం చేయాలో అర్ధంకాక, విహితకర్తవ్యాచరణగురించి వివిధరీతుల వికలుడై, రణభూమిలో కృంగిన రథచక్రంలా మనోభారంతో మథనపడుతున్న అర్జునుడి మనస్సును అర్ధంజేసుకున్న అంతర్యామిగా, శ్రీకృష్ణపరమాత్మ గీతాచార్యుడిగా భగవద్గీతను బోధించి, అర్జునుడిని తన విహితకర్తవ్యంపట్ల కార్యోణ్ముఖుడిగా నిలబెట్టినాడు....
తదనంతరం చక్రిగా చెయ్యాల్సిందంతా చేసి అర్జునుడికి
హస్తినాపురి సిమ్హాసనాన్ని అందించి అనుగ్రహించాడు....

ఇదంతా శ్రీకృష్ణుడు ఎందుకు చేసాడంటే...
ఒకరోజు...
దుర్యోధనుడు / కౌరవులు,
మరియు
ధర్మరాజు, అర్జునుడు / పంచపాండవులు,
సభలో ఉండగా...
అతిధిగా విచ్చేసిన శ్రీకృష్ణుడు....
"అంతా కుశలమేకద కురుయోధులారా.....
మీకు ఏం కావాలో అడగండి...."
అని వచించినప్పుడు.....
"మొదటగా అడిగేందుకు అనుమతించినందుకు దుర్యోధనుడి నమస్సులు యదుకులతిలకా....." అని
వచించి...
మంచి సమయం దొరికింది కదా అని అనుకొని....
"మీ యొక్క సకల లౌకిక వీర సంపత్తి నావైపు ఉండేలా అనుగ్రహించు రుక్మిణీపతి..."
అని వెంటనే దుర్యోధనుడు తన దురాశను, దుర్బుద్ధిని వ్యక్తపరిచాడు....
శ్రీకృష్ణుడు చిరునవ్వు నవ్వి తధాస్తు దుర్యోధన...
అని వచించాడు.....

ఆ తదుపరి అర్జునుడి, పాండవుల వంతు వచ్చేసరికి....
"అడగడానికి ఇంకేం ఉంది శ్రీకృష్ణా...నీదంతా మొదట అడిగిన వాళ్ళకే ఇచ్చావ్ కదా బావా..." అని అర్జునుడు అనలేదు సరికదా....
"నువ్వు నా వెంటే ఉంటే, మా వెంట అన్నీ ఉన్నట్టే కదా బావా..."
అని వచించాడు.....
అప్పుడు కూడా శ్రీకృష్ణుడు అదే చిరునవ్వు నవ్వి తధాస్తు అర్జున...
అని వచించాడు....

అందుకే...
అటు నూర్గురు కౌరవుల సేన వైపు,
మిక్కుటమైన రథ గజ తురగ పదాతి దళాలు,
భీష్మ, ద్రోణ, అశ్వత్థామ, కర్ణ, కృప, ఇత్యాది అరితేరిన అగ్రశ్రేణి వీరులు ఉన్నాకూడా....
ఇటు పాండవుల వైపు, అర్జునుడి వెంటే పార్ధసారధిగా ఉన్న శ్రీకృష్ణుడి శ్రీవైష్ణవభాసకు కౌరవుల సర్వస్వం స్వాహా అయ్యింది...

ఎవ్విధంగా....
దేవతలప్రార్ధనమేరకు...
పరమేశ్వరుడు లోకకంటకమైన హాలహలాన్ని స్వీకరించి గరళకంఠుడైన తదుపరి,మరలా దేవతలప్రార్ధనమేరకు క్షీరసాగరమథనానికి ఆలంబనగా శ్రీకూర్మనారాయణమూర్తిగా శ్రీమహావిష్ణువు వర్ధిల్లి, అందునుండి అమృతం ప్రభవించిన తదుపరి లోకోత్తరమైన సౌందర్యమూర్తిగా మోహినీ అవతారాన్ని దాల్చి దానవులను మోహింపజేసి, దేవతలకు అమృతాన్ని అందించి లోకాన్ని అనుగ్రహించాడో....

అవ్విధంగానే...
పరమేశ్వరుడి నుండి పాశుపతాస్త్రం అర్జునుడికి అనుగ్రహింపజేసి,
అత్యంత సంక్లిష్టమైన సైంధవవధను సాధ్యంకావింపజేసి,
మరెన్నో రీతుల అర్జునుడికి హితోపదేశం గావిస్తూ,
రథసారధ్యాన్ని వహిస్తూ,
తుదకు రణభూమిలో విజేతగా నిలిపి విజయుణ్ణి హస్తినాపుర చక్రవర్తిగా అనుగ్రహించాడు శ్రీకృష్ణుడు...

మీరు ఎప్పుడైనా జూ లేక ఇతర ప్రదేశాల్లో ఎప్పుడైనా తాబేలును గమనించి ఉండి ఉంటే....

1. గమ్యం పట్ల నిశితమైన చూపు.
2. గమ్యం దిశగా నిర్విరామ పరిశ్రమ / పయనం.
3. పరిసరాల్లో ఉండే ప్రతికూలతను అధిగమించడానికి
దుర్భేద్యమైన కవచంలా ఉండే ఉపరితల మూపురం / డొప్ప.
4. నెమ్మదిగా స్వీకరింపబడే శ్వాసతో సుదీర్ఘ ఆయువు.
5. మీన దృక్కులకు సమానంగా ఉండే శక్తివంతమైన కూర్మ దృక్కులతో తమ సంతతిని అభివృద్ధిపరచడం.

శ్రీకూర్మనారాయణ వృతాంతాన్ని శ్రద్ధాభక్తితో ఆలకించే వారికి,
శ్రీకూర్మనారాయణుణ్ణి ఆరాధించేవారికి,
ఇవ్విధమైన అధ్యాత్మ సిద్ధి / ఈశ్వరానుగ్రహం లభించి వారివారి జీవనప్రయాణాల్లో, పరిశ్రమలో, గమ్యాల్లో, సత్ఫలితాలు లభించి తరించెదరు అని ఆర్యోక్తి....

సకల దేవతాస్వరూపుడైన శ్రీవేంకటేశ్వరుడి ఎన్నో మధురమైన సంకీర్తనల్లో...
శ్రీకూర్మనారాయణ వైభవాన్ని శ్రీతాళ్ళపాక అన్నమాచార్యుల వారు ఎంతో ఘనంగా కీర్తించారు....

************ ************ ************ ************

https://annamacharya-lyrics.blogspot.com/2006/11/59indariki-abhayambulichchu-cheyi.html?m=1

ఇందరికి నభయంబులిచ్చు చేయి
కందువగు మంచి బంగారు చేయి॥

వెలలేని వేదములు వెదకి తెచ్చినచేయి
చిలుకు గుబ్బలి కింద చేర్చు చేయి
కలికి యగు భూకాంత కౌగిలించినచేయి
వలనైన కొనగోళ్ళ వాడి చేయి ॥

తనివోక బలిచేత దానమడిగిన చేయి
ఒనరంగ భూదాన మొసగు చేయి
మొనసి జలనిధి యమ్ముమొనకు దెచ్చిన చేయి
ఎనయ నాగేలు ధరియించు చేయి ॥

పురసతుల మానములు పొల్లసేసినచేయి
తురగంబు బరపెడి దొడ్డచేయి
తిరువేంకటాచలాదీశుడై మోక్షంబు
తెరవు ప్రాణుల కెల్ల తెలిపెడి చేయి॥

************ ************ ************ ************

https://annamacharya-lyrics.blogspot.com/2007/03/150machcha-kurma-varaha.html?m=1

మచ్చ కూర్మ వరాహ మనుష్య సింహ వామనా
యిచ్చ రామ రామ రామ హిత బుధ్ధ కలికీ

నన్నుగావు కేశవ నారాయణ మాధవ
మన్నించు గోవింద విష్ణు మధుసూదన
వన్నెల త్రివిక్రమ వామనా శ్రీధరా
సన్నుతించే హృషికేశ సారకు పద్మనాభ

కంటిమి దామోదర సంకర్షణ వాసుదేవ
అంటేజాలు ప్రద్యుమ్నుడా అనిరుధ్ధుడా
తొంటే పురుషోత్తమ అథోక్షజా నారసింహమా
జంటవాయుకు మచ్యుత జనార్దన

మొక్కేము వుపేంద్ర హరి మోహన శ్రీకృష్ణరాయ
యెక్కితి శ్రీవేంకట మిందిరానాథ
యిక్కువ నీ నామములు యివియే నా జపములు
చక్కగా నీ దాసులము సర్వేశ అనంత

************ ************ ************ ************

https://annamacharya-lyrics.blogspot.com/2006/10/39dolayamchaladolayam.html?m=1

డోలాయాం చల డోలాయాం హరే డోలాయాం ॥పల్లవి॥

మీనకూర్మ వరాహా మృగపతిఅవతారా
దానవారే గుణశౌరే ధరణిధర మరుజనక ॥డోలా॥

వామన రామ రామ వరకృష్ణ అవతారా
శ్యామలాంగా రంగ రంగా సామజవరద మురహరణ ॥డోలా॥

దారుణ బుద్ద కలికి దశవిధఅవతారా
శీరపాణే గోసమాణే శ్రీ వేంకటగిరికూటనిలయ 2 ॥డోలా॥

************ ************ ************ ************

సర్వం శ్రీశ్రీనివాస శ్రీచరణారవిందార్పణమస్తు...💐🙏🙂

No comments:

Post a Comment