Thursday, January 3, 2019

" Nandyaala - MahaaNandi - Ahobilam - Yaaganti - Tirumala " - Trip

Vinay Kumar Aitha added 81 new photos.
Have been to a lunch invite by my relatives in Nandyaal and from there visited Mahaanandi
( NavaNandi kshetramulu ), Ahobila LakshmiNarasimhaSwaamy Temple, Yaaganti Uma Maheshwara Swaamy Temple, Choudeshwarimaata Temple, and completed the trip with Perumaal Darshanam and Vaikuntha / Uttaradwaara pravesham on MukkoTi eakadashi in Tirumala... 

New 100 ka sikka, a honor to Atal ji on his 94th birthday...!🙂

New 100 ka sikka, a honor to Atal ji on his 94th birthday...!🙂
Indeed a great befetting honor for one of the finest of 'BharataRatnas' that have done immeasurable good to the nation during his regime...
About This Website
INDIATODAY.IN
PM Narendra Modi released a commemorative coin worth Rs 100 in honour of former prime minister Atal Bihari Vajpayee, who died this year. The coin was released just a day before the 94th birth anniversary of Atal Bihari Vajpayee.

Merry Christmas - 2018

May this Christmas bring in loads of blessings to each of us, and enrich our lives with abundance of Peace, Prosperity, Health, and Happiness....!
Let those yummy X-mas chocolate cakes topped with cozy cherries 🍒 bring in a big smile on our faces .... 😁
Merry Christmas to all my friends out there busy in decorating their place with jingle bells and all other gifts from Santa 🎅 😊

శ్రీభూ సతులతో తిరుమల శ్రీనివాసుడి ప్రణయకలహోత్సవం - 2018

శ్రీగురు సద్వాక్కుల స్మరణం... శ్రీహరిహర నామముల స్మరణం....
శ్రీగురు దర్శనం... శ్రీహరి దర్శనం...
శ్రీగురు పాద సంసేవనం...శ్రీహరి పాద సంసేవనం...
శ్రీమాత..గోమాత..భూమాత..స్వమాతాపిత..సేవ...
నారాయణసేవ/అన్నసమారాధన/అన్నదానం...
ఈ 5 సేవలు ఎనలేని పుణ్యార్జితములు అని సనాతన ధర్మమునందు ఎందరో మహనీయులచే యుగయుగాలుగా రూఢి పరచబడిన సార్వకాలికసత్యశ్రేష్టములు..! 
ఈ కల్తీల కలియుగంలో, ఆఖరికి వీటిని కూడా కలుషితం చేసేలా ఈనాటి కలికాలపు దాష్టీకములు ఉండడం శోచనీయమే అనుకోండి...
కనీసం శ్రీసూక్త / పురుషసూక్త / మంత్రపుష్పాదులకు సైతం సరైనవ్యాఖ్యానం చేయలేని వారు, ఆధునిక గురువులుగా అవతారాలెత్తి దొరికినకాడికి దండుకొని బిచాణా ఎత్తేసే ఆశ్రమాలు స్థాపించి, ప్రజలకు ఆధ్యాత్మికతపై ఏహ్యభావన కలిగించే వారుండడం...!
మూర్ఖుల చెప్పుడు మాటలు విని వ్యసనాలకోసం, డబ్బులకోసం, ఆస్తులకోసం కన్నబిడ్డలనే కష్టాలకు గురిచేసే తల్లితండ్రులుండడం...!
చదివించి పెంచి పెద్ద చేసిన కన్నవారికి కనీసం పట్టెడు కూడు పెట్టకుండ, వాళ్ళు ఎప్పుడు పోతారా..వాళ్ళ ఆస్తులు ఎప్పుడు మనపేర చేసుకుందామా అని సుదూరాలోచనగా దురాలోచన సాగించే బిడ్డలుండడం..!
అంతంతమాత్రంగా బ్రతుకుతున్న అన్నల దెగ్గర కాలిబూట్ల నుండి డబ్బులు వరకు అడుక్కొని చదువుకున్న తమ్ముళ్ళు, పెళ్ళై ఒక ఉన్నత స్థాయికి చేరుకోగానే చేసిన మేలును మరిచి కృతఘ్నతతో జీవించడం...!
దైవానుగ్రహంగా లభించిన కొద్దిపాటి అధికార సాకుతో, తమ క్రింద పనిచేసే సిబ్బంది లోని నైపుణ్యాన్ని ఓర్వలేక అక్కసుతో వారికి శల్యసారధ్యం రచించే చదువుకున్న బుద్ధిహీనులుండడం...!
ఇట్లా ఈ కలియుగంలో కొదువేలేని కర్కశత్వాలు కోకొల్లలు.....!!
అందుకే ఈ కలియుగంలో శ్రీ గురు హరి హర సంబంధిత వ్యాపకములు / సేవలు, గోసేవ, భక్తులకు అన్నసమారాధన...
ఇటువంటివి ఒకమనిషిని సంపూర్ణంగా తరింపజేసేందుకు ఉపయుక్తంగా ఉండే ధర్మసాధనములు...
వాటి ద్వారా ఆర్జించబడిన జ్ఞ్యానైశ్వర్యపుణ్యములు శాశ్వతసుఖశాంతి కారకములు.....
ఇవన్నీ జీవితంలోకి సక్రమరీతిలో సమకూరడం అన్నది, కేవల మన ప్రమేయంతో మాత్రమే కాకుండా సద్గురువాగ్ అనుగ్రహ విశేషంగా సిద్దిస్తుంది...
ఎవరికి ఎవరు సద్గురువు అన్నది వారి వారి జ్ఞ్యానస్థాయిని బట్టి వారి ఆత్మోద్ధరణకై వారే నిర్ణయించుకునే వ్యక్తిగత అంశం...,
(అంటే నా ఉద్ధేశ్యం, మనకు గల జ్ఞ్యానం మొట్టమొదట మనకు బోధించేది మనకు ఎంత తెలియదు అనే విషయమే...
As a saying goes, " The more learnt and wise I become, I come to know how much I don't know...." )
అందులో దైవనిర్ణయమే తుదిగా ఉండి, ప్రార్ధించే సదరు జీవుడికి యోగ్యమైన సద్గురువు ఎవరన్నది సూచించడానికి, ఒక్కొక్కచో తానే ఆ సద్గురువై వస్తాడన్నది అధ్యాత్మ జగత్తులోని ఆశ్చర్యమైన అంశం..!
లోకమంతా నేలమీద పడి నమస్కరించే, నడిచే దైవంగా పేర్గాంచిన శ్రీ కంచి పరమాచార్యులవారు, ఒకనాడు ఒక వ్యక్తి మీరు జగద్గురువులు ఎందుకు అవుతారు అని అడిగితే, దానికి సమాధానంగా,
'ఈ జగత్తులో ఎందులోనైనా నేను ఒక గురువును దర్శించి నమస్కరించగలను...
ఉదాహరణకు..ఒక చిన్న పిట్ట, పుల్లలను ఏరి ఎంతో నేర్పుతో నివసించేందుకు చెట్టు కొమ్మకు వేలాడేలా గూడు కట్టుకొనే విద్య నాకు రాదు...
కాబట్టి ఆ పిట్టలో ఒక గురువుని దర్శించి నమస్కరించగలను....అందుకే...." అని చెప్పినప్పుడు, వారి పాదాలకు అప్పటికప్పుడే నేల మీద పడి ప్రణమిల్లడం ఆ వ్యక్తివంతయ్యింది... ఇక్కడ అప్రయత్నంగానే ఆ వ్యక్తికి తన సద్గురువు లభించి, ఆ గురుత్వం ద్వారా తను ఉద్ధరించబడడం అనేది జరిగింది...
ఒకనాడు, నరేంద్రుడు ( స్వామి వివేకానంద ) శ్రీరామకృష్ణ పరమహంసలను తన గురువులుగా స్వీకరించేక్రమంలో, " మీరు నిజంగా దేవుణ్ణి చూసారా...? ", అని ప్రశ్నించినప్పుడు,
" ఓ, చాలా బాగా చూసా నరేన్... నిన్ను ఇప్పుడు ఎంత దెగ్గరగా స్పష్టంగా చూస్తున్నానో...అంతకంటే దెగ్గరగా స్పష్టంగా చూసా...!" అని సమాధానం ఇవ్వడంతో, ఆ సద్గురువుల జ్ఞ్యానవలలో చిక్కి, ఆ తదుపరి లోకానికి ప్రాచ్య పాశ్చాత్య అధ్యాత్మ విద్యానుసంధానకర్తగా ఉండి, అక్షీణ అధ్యాత్మవిద్యాగంగాజలాలను భువిపై దశదిశలా ప్రవహింపచేసి, తరతరాలకు వన్నెతరగని వివేకానందుని బోధలుగా సుస్థిర పరిచిన శాంతి కపోతమై, ఆనాడు 3 పదులే భౌతికంగా నివసించి కాలగతిలో కరిగిపోని శాశ్వత జ్ఞ్యాన వజ్రమై నిలిచిన శ్రీ ఆదిశంకరాచార్యుల లాగా, ఈ నవయుగపు గురువులుగా స్వామి వివేకానందున్ని నిలిపింది, కేవలం శ్రీ శారదామాత-రామకృష్ణపరమహంసల గురుకటాక్ష వైభవమే...!
అలనాడు శ్రీరామానుజాచార్యులు, తమకు గురుకటాక్షంగా లభించిన "ఓం నమో నారాయణాయ" అనే అష్టాక్షరి మంత్రాన్ని, అన్యాపదేశం వలదు అని వారించినాసరే గుడిగోపురం పైకెక్కి అరిచిమరీ భక్తజనులందరికి పంచి మీరందరుకూడా ఈ అష్టాక్షరి ని జపించి తరించండి అని, ఉదాత్తభావం తో సెలవివ్వడం, సద్గురువుల స్థాయిలో నిలిచి లోకశ్రేయస్సు కాంక్షించేవారిగా ఉండడంవల్లే....
ఇవ్విధంగా, సద్గురుకటాక్షం / సద్గురువాగ్ వైభవం, సిద్ధింపజేయనిదంటూ ఏదిఉండదు...ఎందుకంటే వారిది లోక/సాధుసజ్జనుల శ్రేయస్సు కోరి జీవించే తత్వం కనుక....!
----------------------------------------------------------------------
ఇవ్వాళ్టి పేపర్లోని, శ్రీభూ సతులతో తిరుమల శ్రీనివాసుడి ప్రణయకలహోత్సవం చూడగానే, నాకు 2016 నాటి స్వామివారి ప్రణయకలహోత్సవం గుర్తుకువచ్చింది...
ఎందుకంటే అలనాటి ఉత్సవంలో, అస్మద్ గురుదేవులు, శ్రీ చాగంటి సద్గురువులు కూడా స్వామివారి పక్కనే ఉండి , హరి గురువుల దర్శన భాగ్యం ఏకకాలంలో సంప్రాప్తించడం నాకు చాలా ప్రత్యేకమైన సందర్భం... పైకి చూడ్డానికి ఈ ఉత్సవం చాలా గమ్మత్తుగా, సరదాగా స్వామి తన ఇరుదేవేరులతో జోక్స్ వేస్తూ, అలక తో సాగే అమరోత్సవంగా ఉన్నా, ఇందులోని గాంభీర్య సందేశం జీవుడిని ఈ కలికాలపు ధాటినుండి సమ్రక్షించి తన శ్రీపాదదాస్యంలో ధృడంగానిలిపి తరింపచేయడమే....
' కల్యతే ఇతి కలి...' అనే వ్యుత్పత్తి ప్రకారంగా, అకారణ కలహములను కలిగించి జీవుడికి సదా వివిధ కష్టాలు కలిగించువాడు కలిపురుషుడు....
తదనుగుణంగా, ఆ కలికారక కలహాలను తన క్రీగంటి చూపులతోనే రూపుమాపి, ఒక చిన్న రభసగా మాత్రమే అవి జీవుడిని స్పృశించేలా చేసి, దుష్కర్మక్షయం గావించి, దురితాపహారకుడిగా, దయజూచేవాడు ఆ దామోదరుడు... ఆ దేవతాఉత్సవం ఈ విధంగా జీవుడికి శుభమై వర్ధిల్లడానికి అక్కడ సమ్మిళితమైన సద్గురువు అనుగ్రహమే కారకమై ఒప్పారుతుంది అనేది ఇక్కడి గహనమైన కర్మసిద్ధాంతపు మార్మికం...! 

Centre gives nod to Telangana Regional Ring Road - RRR - 2018

A significant milestone indeed in the state's development progress card for 2023-24 preparations...😁
Many a folk across the state have had a rather keen watch on would be the next giant step by our honorable CM KCR, after the emphatic Vidhan Sabha win and adorning the throne as the 2nd time CM of the 29th Indian state to get the resurgent saga of Telangana keep going to fulfill the aspirations of an 'aam-aadmi' among all the segments and to place it in the forefront of rapidly developing states across the country.
While the 400 years' old city of Hyderabad, one of the finest metropolitan cities in the country in any chosen aspect, is poised to become a finest global city across the world in the coming decade, its overall development ( not just growth ) inline with that of the state is certainly one of the crucial agenda for the government to ensure that it expands its horizons in a way that would cater to the needs of several generations to be flourished in the city.
The announcement of setting up a massive RRR ( regional ring road encircling the city of greater Hyderabad ) as a means to fulfill the ever growing rapid transport needs of the future city by establishing a firm connectivity to and fro off of the various inter and intra city roadways including the ORR, is certainly bound to place the city among those elite cities across the world that have a matchless transport system to every nook and corner of the city from any part of the country thus paving way for all kinds of development to take place with ease of implementation and high growth rate of successful completion.
The core reason for any kind of backwardness in any part of the country is the lack of proper road connectivity to that place that hinders the development of that place right from basic amenities like drinking water, underground sewerage, electricity and others. A leader with vision is certainly the one who knows not only how to rope in eminent IAS officers to chalk out and implement such authoritative development plans but also the one who can place himself/herself in to the shoes of an IAS officers' thought process to embark on a glorious rule for their regime so that people will remember them as not just another leader on the floor but also as a leader with a practically feasible vision and a dextrous executional stalwart with a ground level focus on every area of sustainable development for the overall benefit of the state.
Bestowing the party's overall responsibilities rightly to a firm young dynamic leader who can bridge the generation gap between the yesteryear and youngster statesman to carveout a new age polity procedure maintaining focus right from a 'galli representative' (agent) who works hard to expand and sustain the party's cadre, to the Delhi leader (MP) who represents the state on the central arena to convince for more funding to successfully complete various projects and secure multitude of grants to the state for its overall development. Thus making honourable minister KTR, party's working president, is very well an anticipated appreciable move to strengthen the party from grass root level.
Hope the state will continue to march forward towards unbeatable heights in the years ahead, to become one of the finest states of the country and the T development saga continues to thrive in its excellence with the mottos of " Live and let live....Development for one and all.... Farmer first everything else next.... " setting an example for other states to embrace its micro growth model for sustainable development across all sectors. 🙂
TELANGANATODAY.COM
The top officials of National Highway Authority of India (NHAI) asked the State government to commence land acquisition for the project based…

Annamaaryula padakavitaasaahityaaraadhakulandariki apuroopamaina kaanuka... 🙂

Annamaaryula padakavitaasaahityaaraadhakulandariki apuroopamaina kaanuka... 🙂
Patanjali Tadepalli uploaded a file in the group: ఫేస్ బుక్ అన్నమయ్య.. facebook annamayya.
శ్రీ కామిశెట్టి శ్రీనివాసులుగారు సంపాదకత్వం వహించిన భారతరత్న సుబ్బులక్ష్మి గానం చేసిన అన్నమాచార్య సంకీర్తనలు పుస్తకం ( పుస్తకం నాకు పంపినవారు చెరుకుపల్లి నాగరాజుగారు,. వారి సౌజన్యానికి ధన్యవాదాలు)

సుబ్బులక్షి-అన్నమ్మయ్య-kamisetti.pdf PDF

Kartika Puranam - 30 అధ్యాయము

Kartika Puranam - 30

కార్తిక పురాణము - ముప్పదవ అధ్యాయము

ఋషులడిగిరి. ఓ సూతమహర్షీ! మాకు పుణ్యమైనా హరి మహాత్మ్యమును జెప్పిటివి. ఇంకా కార్తికమహాత్మ్యమును వినగోరితిమి చెప్పవలసినది. కలియుగమందు కలుషిత మానసులై రోగాదులకు లోబడియుండి సంసార సముద్రమందు మునిగియున్న వారికి అనాయాసముగా పుణ్యము లభించెడిది యేది? ధర్మములలో ఎక్కువ ధర్మమేది? దేనివలన మోక్షము సిద్ధించును? దేవతలలోపల ఎక్కువ దేవుడెవ్వడు? ఏ కర్మచేత మోహము నశించును? కలియుగమున మానవులు మందమతులు జడులు, మృత్యుపీడితులును అగుదురు. వారికి అనాయాసముగా మోక్షము దొరికెడి ఉపాయమును జెప్పుము. ఇంకా ఇతరమైన హరికథను జెప్పుము.

సూతుడు పల్కెను. మునీశ్వరులారా! మీరడిగిన ప్రశ్న చాలా బాగున్నది. మంగళకరమైన హరికీర్తన స్మృతికి వచ్చినది. కాబట్టి సర్వసుఖకరమైన దానిని చెప్పెదను వినుడు. మీరు అల్పబుద్దులయిన జనులకు మోక్షోపాయమును జెప్పుమని కోరితిరి. ఈ ప్రశ్నలో కోపకారము కొరకయినదగుట చేత నాకు చాలా ఆనందదాయకమైనది. అనేక యాగములు చేసియు, అనేక పుణ్య తీర్థములందు స్నానాదికమాచరించియు ఏ ఫలమును బొందెదరో ఆ ఫలము ఈలాటి మంచి మాటలచేత లభ్యమగును. మునీశ్వరులారా! వినుడు. కార్తిక ఫలము వేదోక్తమైనది. అనగా కార్తికమందు వేదోక్త ఫలమును బొందెదరాణి భావము. కార్తిక వ్రతము హరికి ఆనందకారణము. సర్వశాస్త్రములను సంపూర్ణముగా చెప్పుటకు నేను సమర్థుడను గాను. కాలము చాలదు. కాబట్టి శాస్త్ర సారములలో సారమును జెప్పెడను వినుడు. శ్రీహరి కథను సంగ్రహముగా చెప్పెదను వినుడు. శ్రీహరి కథాసక్తులు ఘోరమైన నరకాలయందు పడక సంసార సముద్రమునుండి తరింతురు. కార్తికమందు హరిణి పూజించి స్నానము, దానము, ఆలయములందు రాత్రి దీపమును వెలిగించుటను జేయువారు అనేక పాపములనుండి శీఘ్రముగా ముక్తులగుదురు. సందేహము లేదు. సూర్యుడు తులారాశి యందు ప్రవేశించినది మొదలు ముప్పది దినములు ఒక్క కార్తిక వ్రతమును జేయవలెను. అట్లు చేయువాడు జీవన్ముక్తుడగును సుమా! బ్రాహ్మణులు గాని, క్షత్రియులు గాని, వైశ్యులు గాని, శూద్రులు గాని, స్త్రీలు గాని కార్తిక వ్రతమును జేయని యెడల తమ పూర్వులతో కూడా అంధతామిస్రమను పేరుగల నరకమును, (చీకట్లతో గ్రుడ్డిడగు నరకము) బొందుదురు. సంశయము లేదు. కార్తికమాసమున కావేరి జలమందు స్నానమాచరించు వారు దేవతలచేత కొనియాడబడి హరిలోకమును బొందుదురు. కార్తిమ మాసమందు స్నానము చేసి హరిణి పూజించు మానవుడు విగత పాపుడై వైకుంఠమును జేరును. మునీశ్వరులారా! కార్తిక వ్రతమును జేయని వారు వేయి జన్మములందు చండాలురై పుట్టుదురు.

కార్తిక మాసము పుణ్యకరము. సమస్త మాసములందు శ్రేష్ఠము. కార్తిక వ్రతము హరి ప్రీతి దాయకము. సమస్త పాపహారము. దుష్టాత్ములకు అలభ్యము. తులయందు రవియుండగా కార్తిక మాసమందు స్నానమును, దానమును, పూజను, హోమమును, హరిసేవను జేయువాడు సమస్త దుఃఖ విముక్తులై మోక్షమొందెదరు. కార్తిక మాసమందు దీపదానము, కంచుపాత్ర దానము, దీపారాధానము, ధాన్యము, ఫలము, ధనము, గృహదానము అనంత ఫలప్రదములు. ధనికుడు గాని, దరిద్రుడు గాని హరిప్రీతి కొరకు కార్తిక మాసమందు కథను విన్నయెడల వినిపింపజేసినా యెడల అనంత ఫలమునొందును. కార్తిక మహాత్మ్యము సర్వ పాపములను నశింపజేయును. సమస్త సంపత్తులను గలుగజేయును. అన్ని పుణ్యముల కంటెను అధికము. ఎవరు ఈ పవిత్రమగు విష్ణువుకు ప్రీతికరమగు అధ్యాయమును వినునో వాడు ఈ లోకమున గొప్ప సుఖాలను అనుభవించి పరలోకమున బ్రహ్మానందము పొందును. తిరిగి జనన మరణ ప్రవాహమున పడకుండ జేయునదియే పరసుఖము లేక నిత్య సుఖము.

ఇతి శ్రీస్కాందపురాణే కార్తిక మహాత్మ్యే ఫలశ్రుతిర్నామత్రింశోధ్యాయస్సమాప్తః!!

Karthika Puranam - 29 అధ్యాయము

KARTHIKA PURANAM -- 29

రాజు చూచుచుండగానే సుదర్శన చక్రమంతర్థానమందెను. సుదర్శన చక్రము అంతర్థానము బొందిన తర్వాత అంబరీషుడు భక్తితో దుర్వాసునకు నమస్కరించి శిరస్సుతో వందనమాచరించి భక్తిచేత పులకాంకితుడై తన శిరమును ముని పాదములపైన బడవేసి ఇట్లని విన్నవించెను. బ్రాహ్మణోత్తమా!నేను మహాపాపిని. పాపమునందు మునిగి ఉండి కష్టించుచున్నాను. కాబట్టి గృహస్థుడనైన నాయింటిలో అన్నమును భుజించి నన్నుద్ధరించుము. నీవు నాయందు దయయుంచి తిరిగి నాయింటికి వచ్చి నన్ను రక్షించితివి. మూడు లోకములకు భయమును కల్గించు నీకు భయమెక్కడిది? భయమను మిషతో నన్ను రక్షించుటకు తిరిగి నా యింటికి వచ్చితివి. నీవు తిరిగి వచ్చుట చేత నేను బ్రతికితిని. నాకు పరలోకము సిద్ధించును. కాబట్టి త్వద్దర్శన దానముతో నాకభయ దానము, దానితో ప్రాణ దానము, దానితో పరలోక దానము సంభవించినవి. ఇట్లు విన్నవించుచున్న రాజును తన బాహువులతో లేవనెత్తి దుర్వాసమహాముని ఆనందముతో యిట్లనియె. రాజా! ప్రాణములను రక్షించు వాడు తండ్రియని చెప్పబడును. ఇప్పుడు నీచేత నాప్రాణములు రక్షించబడినవి. కనుక నాకు తండ్రివి నీవే. నేను నీకిప్పుడు నమస్కారము చేసినయెడల నీవు దుఃఖించెదవు. తండ్రికి కష్టము కలిగెడు వ్యాపారము చేయగూడదు. కాన నీకు నమస్కారమును చేయను. బ్రహ్మణ్యుడవైన నేను నీకు గొప్ప కష్టమును కల్గించితిని. దానికి ఫలమును అనుభవించితిని. చివరకు నీవు దయతో ఆ కష్టము నివారించితివి. రాజా! నీతో కూడా భుజించెదనని దుర్వాసుడు ధర్మ బుద్ధి గలవాడై ధర్మ వేత్తయైన అంబరీషునితో గూడి భుజించెను. సాక్షాత్తూ శివ రూపుడైన దుర్వాసుడు విష్ణు భక్తునియొక్క మహాత్మ్యమును పరీక్షించ గోరి వచ్చి ఇట్లు పరీక్షించి సంతోషించి ఆజ్ఞాపితుడై స్వాశ్రమమునకు వెళ్ళెను. కాబట్టి కార్తిక మాసమునందు హరిబోధిని ద్వాదశి సమస్త దాన ఫలప్రదము. సమస్త ఫలప్రదము. సమస్త యజ్ఞ ఫలప్రదమగును. కార్తిక మాసమందు శుక్లైకాదశి నాడు ఉపవాసమాచరించి జాగరణముండి ద్వాదశినాడు దానములిచ్చి బ్రాహ్మణులతో కలిసి పారణ జేయువాడు మహాపాతక విముక్తుడగును. మోక్షమును గోరిన విష్ణు భక్తులు ద్వాదశి స్వల్పముగా ఉన్నప్పుడు దానిని విడువక ద్వాదశి ఘడియలలోనే పారణ చేయవలయును. అందులో కార్తిక శుక్ల ద్వాదశి మిక్కిలి పుణ్యప్రదము. కనుక దానిని ఎంతమాత్రమూ విడువరాదు. కార్తిక శుక్ల ద్వాదశియందు చేసిన పుణ్యము స్వల్పమైనను అనంత ఫలప్రదము. ఈ పుణ్య కథను వినువారు పాప విముక్తులై అనేక భోగములననుభవించి అంతమందు పరమపదము పొందుదురు.
ఇతి శ్రీ స్కాందపురాణే కార్తికమహాత్మ్యే ఏకోనత్రింశాధ్యాయ సమాప్తః!!

Karthika Puraanam -- 28 అధ్యాయము

KARTHIKA PURANAM -- 28

కార్తిక పురాణము - 28వ అధ్యాయము

అంబరీష ఉవాచ:
అంబరీషుడు ఇట్లు పలికెను. ఓ సుదర్శన చక్రమా! ఆగు ఆగు. నీకు నమస్కారము. ఈతడు బ్రాహ్మణుడు. ఇతనిని చంపుట తగదు. నీకు వధతో కూడిన ఆహారము కావలెనన్న నా శరీరమును యిచ్చెదను. ఈ బ్రాహ్మణుని విడువుము. లేనియెడల నాతొ యుద్ధము చేయుము. నీవు హరియొక్క ఆయుధముగనుక నాకు దైవమువైతివి. అయినప్పటికీ నీతో యుద్ధము చేయుదును గాని నిన్ను బ్రతిమాలుటలేదు. క్షత్రియునకు బ్రహ్మయుద్ధమును విధించెను గాని యాచనను విధించలేదు. అయినాను నీవు నాకు దేవతవు గనుక యాచించవచ్చును. ఓ సుదర్శన చక్రమా! నీవు సమస్త భూతములకు అజేయుడవు. ఈమాట నాకు తెలియునుగాని అయినాను నా బాహుబలమును జూడుము. విష్ణ్వాది దేవతలందరూ నీ బలమును నా బలమును చూతురు గాక. నిన్నిపుడు భూమియందు పడవైచెదను. అట్టియవస్థను జెందక యీతనిని విడువుము. నీకు జీవించియుండి హరిహస్తమందు నివసించు కోరికయున్న యెడల నన్ను పాలించుము. శరణాగతుడైన ఈ బ్రాహ్మణుని విడువుము. రాజిట్లు స్తుతించగా సుదర్శన చక్రదేవత సంతోషించి రాజును పరీక్షించవలయునను తలంపుతో కోపము వచ్చిన వాడు వలె నటించి యిట్లనియె.
సుదర్శనమిట్లు పలికినది. రాజా! నీకు తెలియునా? మధుకైటభులను నేను చంపితిని దేవతలకు జయించుటకు శక్యము కాని వారైన రాక్షసులను అనేకులను చంపితినని తెలియదా? ఈ దుర్వాసుని కోపముతో గూడిన ముఖమును జూచుటకెవ్వడైన సమర్దుడున్నాడా? ఇట్టి దుర్వాసుడు శంకర బ్రహ్మల యొక్క తేజోధారియైనను యిప్పుడిట్టి అవస్థను నావలన జెందెను గదా? శంకరుని వలన క్షత్రియ సంహారకారకమయిన తేజస్సు సంభవించినది. ఆ బ్రహ్మ తేజస్సు నాకంటే అధికము గాదు. అదియు నాచేత అనేక పర్యాయములతిక్రమించబడినది. క్షత్రియతేజోవంతుడైన నీవు నాతో యుద్ధమునకెట్లు సమర్థుడవగుదువు? బ్రహ్మ శంకరుల రెండు తెజస్సులు నాకు చాలనివైయున్నవి. రాజా! క్షేమము కోరినవాడు బలవంతునితో స్నేహము చేయవలెను. ఇట్లు న్యాయముండగా నీవు మూర్ఖత్వమునవలంబించి నాతో యుద్ధమునకు సన్నద్ధుడవెందుకైతివి? నీవు హరిభక్తుడవని నేను నిన్ను ఇంతవరకు సహించితిని. కాబట్టి నీవు దూరముగా పొమ్ము. ప్రాణములను వృధాగా పోగొట్టుకొనకుము. ఇట్లు సుదర్శన చక్ర వాక్యమును విని అంబరీషుడు కళ్ళెర్రజేసి సుదర్శన చక్రముతో ఇట్లనెను.
అంబరీషుడు ఇట్లు చెప్పెను. సుదర్శన చక్రమా! నీవు నా దేవునకు ఆయుధమైతివని నిన్ను బాణములచేత నూరు ఖండములుగా కొట్టలేదు. నీవు క్షత్రియ ధర్మమూ అవలంబించి నాతో మాట్లాడుచున్నావు. గనుక ఇకముందు నీకు గర్వముండబోదు. నీ గర్వమును నశింపజేయు బాణములు నా హస్తమందున్నవి. నేను బ్రాహ్మణులందును, దేవతలందును, స్త్రీలయందును, జ్ఞాతులందును గోవులందును, బాణములను వదలను. నీవు క్రూరుడవైనను దేవుడవగుట చేత ఇంతవరకు ఉపేక్షించితిని. నీవు దేవత్వమును వదలుకొని క్షత్రియత్వముతో గూడి నాయందు నిలిచి అగ్నితో సమానమైన వేడిగల నా బాణములను సహించుము చూతము. ఇట్లని అంబరీషుడు ఇరువది నాలుగు బాణములను సుదర్శన చక్ర పాదముల మీద వదలెను. ఇట్లు క్షాత్ర పౌరుషముతో గూడిన రాజును జూచి సుదర్శనుడు నవ్వుచు యిట్లనియె. సుదర్శనుడు ఇట్లు పలికెను. రాజా! నీ సంరక్షణ నిమిత్తమే హరినన్ను పంపినాడు. నిన్ను శరణాగతుడైన బ్రాహ్మణుని విడిచితిని. సుఖముగా నుండుము. ఇట్లు పలికి ధనుర్బాణములతో గూడియున్న రాజును కౌగలించుకుని భూమియందు పది నమస్కారము చేసెను. ఓ అగస్త్యా! రాజు అలా విధేయుడైన సుదర్శన చక్రస్థ పురుషునితో చక్రముతో యిట్లనియె. సంసార మధ్యను సంచరించెడు పురుగునైన నేనెక్కడ? హరియొక్క హస్తమందు ప్రకాశించెడి నీవెక్కడ? ఇట్లు తెలిసియు నీతో యుద్ధమునకు సన్నద్ధుడయిన నా తప్పును క్షమించుము. నేను నిన్ను తిరస్కరించి విజ్రుంభించి యుద్ధమునకు సిద్ధపడితిని. క్రూరమయిన నా క్షత్రియ స్వభావమిట్లు చేసినది గనుక క్షమించుము. ఇది శుక్ల పక్షము. పగలు. యుద్ధభూమి. మకరమాసము. మాఘమాసము. ఇట్టి పుణ్యకాలమునందు నా దేవుడైన నీవలన మృతిని గోరియే యుద్ధమునకు వచ్చితిని. భగవద్గీతయందు ఇట్లు కలదు. ఉత్తరాయణమందు శుక్లపక్షమందు పగలు మృతినొందిన వారు అర్చిరాది మార్గమున పోయి బ్రహ్మపదమును జేరుదురు. కార్తిక శుక్ల ద్వాదశినాడు వెళ్ళిన దుర్వాసనుడు మాఘమాసమునకు తిరిగి వచ్చెను. సుమారు ౩ మాసాలకు అంబరీషుని చేరినాడు.
జ్వాలలచేత భయంకరమును, దేవదానవులకసహ్యమును నూరు మెరుపులకంటే అధికమయిన కాంతిగలదియును అయిన నీ రూపమును గవ్వతో సమానుడను నేనెట్లు సహింతును? సహస్రాగ్నియుతమైన రవిబింబము వలె సహస్రారములను ధరించునటువంటి సమస్త సంహారకరమగునటువంటి నీ రూపముతో యుద్ధము చేయనేనెట్లు శక్తుడనగుదును? కోరలతో గూడి భయంకరము దశదిక్కులందు అగ్నులను బయటకి చిమ్ముచున్నటువంటి నీ యొక్క దంతపుదెబ్బను దేవుడుగాని, రాక్షసుడు, దేవేంద్రుడు గాని, రాక్షసాధిపతి గాని యింకెవ్వడు గాని సహించగలడు? మెరుపులను సూర్యునికిరణజాలములును మొత్తములై భయంకరాకారములను ధరించి వచ్చినను నీ తేజస్సును తిరస్కరించలేవు. విష్ణువు భయంకరాకారమయిన నిన్నాశ్రయించి మూడు లోకములను పాలించుచున్నాడు. నీతో విరోధించినయెడల దేవతలు గాని, దానవూ గాని, అన్యులు ఆని నిన్ను జయించలేరు. దైత్యులు చంపుదానవు భక్తులను పరిపాలించుదానవు. విష్ణువు యొక్క కాంతిచేత ప్రకాశించుదానవు. ప్రాణగమన కష్టమును హరించుదానవు అగు నీకు నమస్కారము. ఇట్లు స్తుతించి భూమియందు నమస్కారము చేయుచున్న రాజును లేవదీసి నీకు క్షేమమగుగాక! అని సుదర్శనుడు పలికెను. ఈ సుదర్శన చక్ర స్తోత్రమును మూడు కాలములందు పఠించువాడు ఆపదలనుండి విముక్తుడై చిరతరసుఖములను బొందును. కలియుగమందీయధ్యాయమును ఒకమారయినను వినువారు అనేక భోగములు పొంది అంతమందు మోక్షము పొందుదురు.

ఇతి శ్రీ స్కాందపురాణే కార్తికమహాత్మ్యే అష్టావింశాధ్యాయః!!

Kartika Puranam - 27 అధ్యాయము

Kartika Puranam - 27

కార్తిక పురాణము - ఇరవై ఏడవ అధ్యాయము

ఓ అగస్త్య మునీంద్రా! భగవంతుడైన పురుషోత్తముడిట్లు దుర్వాసునితో పలికి స్వభక్తపాలన దీక్షాతిసహాయమును బ్రకటించుచు యిట్లనియె. భగవంతుడిట్లు పల్కేను. దుర్వాసా! అంబరీషుని గురించి యిచ్చిన శాపములు నాకు చాలా సంతోషమును జేయుచున్నవి. ఈ శాపజన్మల వల్ల నాకేమీ కష్టము లేదు. నీ వచనము వేదతుల్యము గనుక దానిని సత్యముగా చేయవలెను. అట్లుగాని యెడల బ్రాహ్మణ మర్యాదకు భంగము కలుగును. అట్లు నాశము కలిగినంతలో నాకది శాపమగును గాన అట్టి కష్టము లేక ఆనందము కైగినది. రాజు ప్రాయోపవిష్టుడు వాలే బ్రాహ్మణ పరివేష్టితుడై పడియున్నాడు. అదిగాక అయ్యో బ్రాహ్మణాపకారి యీ ఆత్మయని దుఃఖించుచున్నాడు. కాబట్టి త్వరగా పొమ్ము. రాజు యీ ప్రకారముగా చింతించి దుఃఖించుచున్నాడు. ణా మూలముగా సుదర్శన చక్రము బ్రాహ్మణుని వెంటబడినది. ఛీ!ఛీ! బ్రాహ్మణోపద్రపకారకుడయిన రాజు ఎందుకు? రాజు మనుష్యులను పాలించువాడు గనుకను, రాజుకు ముఖ్యము ప్రజారక్షణము గనుకను, రాజు గోవుల నిమిత్తము కొరకును, బ్రాహ్మణుల నిమిత్తము కొరకును ప్రాణములు విడువవలెను. రాజు స్వేదజ, అండజ, ఉద్భిజ్జ, జరాయుజములను నాలుగు విధములగు జీవములను సర్మార్గమందుంచి పాలించవలెను. అందులో అందరికి దండన మీయదగును. పాలించవలెను. బ్రాహ్మణులను విడువవలెను. బ్రాహ్మణుని సత్య ధర్మరతులును, లోభ దంభ శూన్యులును అగు బ్రాహ్మణులే అతని తప్పును దెలిసికొని దండించవలెను. బ్రాహ్మణుడు పాపమును జేసి ప్రాయశ్చిత్తమును జేసికోనని పక్షమందు అతని తల గోరిగించుట, ధనమును హరించుట, స్థాన భ్రష్టత్వము మొదలయిన దండనముల చేత దండించవలెను. బ్రాహ్మణుడు దుర్మార్గుడై హింస చేయుచున్నాను వానిని రాజు దండించరాదు. రాజు ధర్మార్ధ బుద్ధి గలవాడగుచు ఎప్పుడైనను బ్రాహ్మణునకు గాని తనకపకారము చేయువానికి గాని శాస్త్ర ప్రయోగము ఆచరించదగదు. బ్రాహ్మణేతారులందరూ భయములేక క్షాత్ర కీర్తిని చూపవలయును గాని బ్రాహ్మణ హిమ్సమాత్రము చేయగూడదు. తానూ స్వయముగా బ్రాహ్మణుని చంపినాను, తన నిమిత్తమై బ్రాహ్మణుడు చంపబదినాను, అన్యుని చేత చంపించినను బ్రహ్మహత్య సంభవించునని ధర్మశాస్త్రమునందు చెప్పబడియున్నది. బ్రాహ్మణుడు లాగబడిగాని, కొట్టబడి గాని, ధనహీనుడుగా చేయబడి గాని, ఎవని నుద్దేశించి ప్రాణములు విడుచునో వాడును బ్రహ్మ హంతకుడగును.
దుర్వాసునకు ప్రాణ హానికరమైన కష్టము నామూలముగా గలిగెను గదా? కాబట్టి నేను బ్రాహ్మణ హంతకుడనైతిని అని అతడు తలచుచున్నాడు. దుర్వాసా! అంబరీషుడీ ప్రసంగముతో మిక్కిలి దుఃఖముతో నున్నాడు. కాబట్టి నీవచ్చటికి త్వరగా పొమ్ము. నీకును రాజునకును కుశలమగును. ఇట్లు విష్ణువు చెప్పిన మాటను విని దుర్వాసుడు నమస్కరించి అప్పుడే చక్రముతో సహా బ్రాహ్మణ పరివేష్టితుడైన రాజు వద్దకు వచ్చెను. ఇట్లు సూర్యకాంతితో వచ్చుచున్న దుర్వాసుని చూచి అంబరీష మహారాజు లేచి నమస్కరించి సుదర్శన చక్రముతో యిట్లని విన్నవించెను. అంబరీషుడు పల్కేను. ఓ చక్రమా! నన్ను మన్నించుము. ఆర్తుని సంహరించుట న్యాయము గాదు. గనుక బ్రాహ్మణుని రక్షించుము. అతి క్రౌర్యముతో హింసించుట తగదు. రక్షించుమని వేడుచున్న నన్నును శరణాగతుడైన బ్రాహ్మణుని రక్షించుము. అంబరీషుడిట్లు పలుకుచు దుర్వాసుని కౌగలించుకుని తరువాత అతనిని తన వెనుక ఉంచుకొని తాను ముందు నిలబడి భయములేక ధనువును ఎక్కుపెట్టి సుదర్శన చక్రముతో ఇట్లనియెను.
ఇతి శ్రీస్కాంద పురాణే కార్తిక మహాత్మ్యే సప్తవింశాధ్యాయస్సమాప్తః!!