Sunday, April 26, 2020

శ్రీ వైశాఖ శుద్ధ పంచమి / శ్రీఆదిశంకరజయంతి 2020 పాంచాహ్నిక మహోత్సవ శుభాభినందనలు......😊

శ్రీ వైశాఖ శుద్ధ పంచమి / శ్రీఆదిశంకరజయంతి పాంచాహ్నిక మహోత్సవ శుభాభినందనలు......😊
శ్రీ ఆదిశంకరాచార్యులు......
శంకరభగవద్పాదులు / శంకరులు / కాలడి శంకరులు / ఇత్యాది పేర్లతో ఆచర్యుల ప్రస్తుతి రాగానే వారికి ప్రణమిల్లని ఆస్తిక ప్రాణి ఈ దేవభూమిపై ఉండదు  అనేది జగద్విదితమైన సత్యం.....

భారతాదేశ సనాతన ధర్మవైభవాన్ని ఎన్నో విధాలుగా ఇబ్బందులకు గురిచేస్తు ప్రజలను / భక్తులను వివిధ అవైదిక అశాస్త్రీయ ఆచారవ్యవహారాల వైపునకు కొనిపోతున్న మూర్ఖులనుండి ఈ దేశం యొక్క వెలకట్టలేని సంపదను కాపాడడానికి సాక్షాత్తు ఆ కైలాస శంకరుడే శ్రీ కాలడి శంకరులుగా శ్రీ ఆర్యాంబ / శివగురు అనే పుణ్యదంపతుల ఇంట జన్మించిన వృత్తాంతం శ్రీరుద్రం చెప్పకనే చెబుతున్నది అనే సత్యాన్ని శ్రీ చాగంటి సద్గురువులు ఎన్నో ప్రవచనాల్లో మనకు బోధించినారు....

( నమః' కపర్ధినే' చ వ్యు'ప్తకేశాయ చ..... 
అని సాగే నమక మంత్ర భాగంలో కపర్ధి అంటే ఎల్లప్పుడు జటాజూటధారిగా ఉండే సదా శివుడు....
మరి వ్యుప్తకేశాయ అనగా 
' బోడి గుండు తో ఉన్న శివుడు'  అనే నామం శంకరునకు ఎక్కడ వర్తిస్తుంది.....? కేవలం సన్యాసాశ్రమాన్ని స్వీకరించి అసేతుహిమాచల పర్యంతం పాదచారియై ధర్మపరిరక్షణకై అద్వైత సిద్ధాంత ప్రచారకులుగా షణ్మతస్థాపనాచార్యులుగా తిరుగాడిన శ్రీ ఆదిశంకరావతారానికి మాత్రమే ఆ నామం వర్తిస్తుంది...కద.....)

ఈ దేశంలో సూర్య చంద్రులు ప్రకాశిస్తున్నంత కాలం, జీవనదులు ప్రవహిస్తున్నంత కాలం శ్రీ ఆదిశంకరులకు సదా కృతజ్ఞులై ఉండి నమస్కరించడం ఎల్లరికి విహిత ధర్మం.....

ఇక్కడ గమనించవలసిన ముఖ్యమైన  విషయం ఒకటుంది......

స్థితికారులుగా ఉండే శ్రీమహావిష్ణువు మరియు శ్రీఆదిపరాశక్తి కదా వివిధ రూపాలు ధరించి అవతారాలు స్వీకరించి భూమిపై ప్రభవించి ధర్మపరిరక్షణ కావించేది....
మరియు పరమశివుడు అలా శ్రీ ఆదిశంకరులుగా అవతారం స్వీకరించి రావడం ఒకింత ఆశ్చర్యమే కద......
ఇది కేవలం యాదృశ్చికమా లేదా మరెమైన కారణాలు ఉన్నాయా ??

శ్రీ ఆదిశంకరుల నాటి కాలానికి ఈ దేశానికి వచ్చిన అతి పెద్ద ఆపద నలుదిశలా అలుముకుపోయిన అశాస్త్రీయత అనే అజ్యానాంధకారం.....

ఏది ప్రామాణికం....?
ఏది ఉచితం....?
ఏది శ్రేయస్కరం...?
ఏది శాస్త్ర సమ్మతం...?
ఏది సర్వజన హితకరం....?
ఏది ఎల్లరికి ఆమోదదాయకం...?
ఏది తక్షణ విహితధర్మం....?

ఇలా ప్రతి విషయంలో కూడా సందిగ్ధత నెలకొన్న ఒకానొక విషమపరిస్థితి.....

అటువంటి సమయంలో శిష్టరక్షణ / దుష్టశిక్షణ అనేవి అన్వయం కాని విషయాలు.......

కావలసింది సమాజంలో సమూలంగా పాతుకుపోయిన అజ్ఞ్యాన ప్రక్షాలన...... జ్ఞ్యాన దివిటీల వెలుగుల్లో వివిధ మార్గాల్లో ప్రయాణిస్తున్న వారికి మార్గదర్శనం.....

భగంతుడికి భక్తుడికి ఎల్లవేళలా అనుసంధానకర్తగా ఉండే ఆచార్యులకు మాత్రమే అది సాధ్యం.....

కాబట్టి ఆ సమయంలో అవతారాన్ని స్వీకరించి ఈ సనాతనదేవభూమిని సమ్రక్షించేందుకు కావలసింది ఆచార్యులుగా దేశం నలుచెరగులా నడయాడి జ్ఞ్యాన యజ్ఞ్యం నిర్వహిస్తూ అజ్ఞ్యాన లంపటాన్ని సమూలంగా దహించివేసే దైవస్వరూపం........

అనంతమైన సురగంగాఝరిని తన వ్యోమవ్యాప్తమైన కేశపాశంలోకి ఒక్క బిందువు కూడా క్రిందపడనివ్వకుండా ఒడిసిపట్టిన రుద్రునకు మాత్రమే అది సాధ్యం.......

ఎందుకంటే జ్ఞ్యానం కూడా అట్లాంటి అనంతమైన ఝరి.....

జ్ఞ్యానగంగా అనే తీర్థాన్ని సేవించి ఒక్క చుక్క కూడా అజ్ఞ్యానం మిగలని రీతిలో అనుగ్రహం ప్రసాదించాలంటే అంతటి శక్తివంతమైన జ్ఞ్యానమూర్తికే అది సాధ్యం......

శ్రీదక్షిణామూర్తిగా సనక సనందన సనత్కుమార సనత్సుజాతులకు మౌనం తోనే చిన్ముద్రతో బ్రహ్మజ్ఞ్యానాన్ని ప్రసాదించిన ఆ పరమశివుడు, 
మౌనాన్ని వీడి, ధ్యానాన్ని ఆపి, బహిర్ముఖుడై, బ్రహ్మవేత్తగా అవతారాన్ని దాల్చి ఈ జగత్తులో ఆవరించుకుపోయిన అజ్ఞ్యాన గ్రంధులను తన త్రినేత్రానలసమమైన జ్ఞ్యానఝరులతో దహించివేయడమే అప్పటి సమస్యకు పరిష్కారం......

అందుకే జగదాచార్యుడై నిలిచి జగత్తుకు తరతరాలకు సరిపడే జ్ఞ్యానగంగా ప్రసాదాన్ని అనుగ్రహించేందుకు ఆ కైలస శంకరుడే కాలడి శంకరులుగా ప్రభవించి ఈ దేశంలో అన్ని ఆచార వ్యవస్థలను సవైదిక సశాస్త్రీయ విధివిధానాలతో సువ్యవస్థీకరించి అవి ఎన్ని శతాబ్దాలైనా సరే అట్లే కొనసాగేలా చతురామ్నాయ పీఠ వ్యవస్థను నెలకొల్పి వాటికి తమ నలుగురు శిష్యులతో మొదలుకొని అవిచ్ఛిన్నమైన పరంపరాగతంగా అవి కొనసాగుతూ ఎటువంటి అవైదిక అశాస్త్రీయతలను ఈ దేశంలోకి చొరబడని విధంగా కట్టుదిట్టం గావించి, శ్రీ ఋష్యశృంగుడి తపో భూమి అయిన ఇప్పటి శృంగేరి లో ఒక పాము తన పడగ క్రింద ఒక కప్పను సమ్రక్షించిన దృశ్యానికి ఆశ్చర్యం చెంది జీవుల జాతివైరాన్ని కూడ మరచేలా చేయగలిగిన అటువంటి మహత్తరమైన తపోస్థలి లో నెలకొన్న దక్షిణామ్నాయ పీఠం ఈ 4 పీఠాలకు గురుస్థానమై ఉండేలా
వ్యవస్థీకరించి ఈ ధర్మభూమిపై జనులచే నిరంతరం ధరించబడి ( ధృయైర్వా జనైరితిధర్మం అనే వ్యుత్పత్తి ప్రకారంగా ) ధర్మం ఎపట్టికీ శాశ్వతంగా వర్ధిల్లేలా మానవాళిని అనుగ్రహించిన అపర కరుణా సాగరులు శ్రీ ఆది శంకరాచార్యులు......

సకల శాస్త్ర జ్ఞ్యానాధిష్టాన దైవమైన శంకరుడే శ్రీ ఆదిశంకరులు కాబట్టే.....,

8 వ ఏటికే అన్ని శాస్త్రాల సారాన్ని
రంగరించి రచించిన విధంగా
శ్రీ కనకధారాస్తవాన్ని వచించి,  ఇంట్లో మరేమి లేని దైన్యంతో సతమతమవుతూ ఉన్న
ఒక బీదబ్రాహ్మణి  భక్తితో సమర్పించిన ఒక ఎండిపోయిన ఉసిరికాయ కు ( ఆమలక ఫలం ) సంతసించి ఏకధాటిగా ఆవిడ వాకిట్లో బంగారు ఉసిరికల వర్షాన్ని కురిపించడం కేవలం శంకరాచార్యులకే చెల్లింది.....!

స్తోత్రాలకు, మంత్రాలకు చింతకాయలు రాలుతాయ......
అని వైదిక వాంజ్మయాన్ని అపహాస్యం చేసిన వారికి చెంపపెట్టుగా ఉండే రీతిలో బంగారు ఉసిరికాయలను రాల్చడం శ్రీఆదిశంకరాచార్యులకే చెల్లింది........


రాజు గారి శరీరంలో పరకాయప్రవేశంతో కొలువై ఉన్న శంకరాచార్యుల నిజ దేహాన్ని దుండగులు నిప్పుపెట్టి దహించగా 
స్వశరీర స్వీకరణ లో ఆలస్యమై  చేతులు కాలిన ఆ సంఘటనలో శ్రీనృసిమ్హకరావలంబ స్తోత్రాన్ని పఠించి స్వస్థత పొంది ఆ శక్తివంతమైన స్తోత్రాన్ని లోకానికి అందించి.......
యావద్ ప్రపంచానికి శ్రీలక్ష్మీనారసిమ్హుడి వైభవం తెలియజెప్పడం కూడ కేవలం శ్రీ ఆదిశంకరాచార్యులకే చెల్లింది....!

ఎల్లరికి ఉపయుక్తంగా ఉండేలా

గణపతి / గాణాపత్యము 
సుబ్రహ్మణ్యుడు / కౌమారము 
( దీపశిఖయే కుమారస్వామి )
అంబిక / శాక్తేయము
శివుడు / శైవము
విష్ణువు / వైష్ణవము
సూర్యుడు / సౌరము

అనే  5 ఉపాస్య దైవస్వరూపాలతో సశాస్త్రీయ పంచాయతన పూజావిధానాన్ని నెలకొల్పి ఎన్నెన్నో దేవాలయల్లో ఈ విధానంతో అర్చారాధనా వ్యవస్థను చక్కదిద్ది షణ్మతస్థాపనాచార్య అనే బిరుదు నామం పొందినా అది కేవలం శ్రీ ఆదిశంకరులకే చెల్లింది....!

అన్నీ దేవతా స్వరూపాలపై ఎంతో గంభీరమైన స్తోత్రాలను రచించి  మానవాళికి అందించి అందరు తరించేలా అనుగ్రహించినా అది కేవలం శ్రీ ఆదిశంకరులకే చెల్లింది....!

శ్రీ గణేశ పంచరత్న స్తోత్రం...
శ్రీ దక్షిణామూర్తి స్తోత్రం....
శ్రీ కాలభైరవాష్టకం......
శ్రీ నృసిమ్హకరావలంబ స్తోత్రం....
శ్రీ భజగోవింద స్తోత్రం / మోహముద్గరం.... 
శ్రీ సుబ్రహ్మణ్యభుజంగస్తోత్రం.....
శ్రీ హనుమత్భుజంగస్తోత్రం.......
శ్రీశైల ప్రాభవాన్ని ప్రస్ఫుటంగా తెలిపేలా సౌందర్యలహరి / శివానందలహరి......
.........

ఇలా వారు ప్రార్ధించి మనకు అందించిన శక్తివంతమైన స్తోత్రాలు ఎన్నెన్నో.....

బాహ్య ప్రపంచానికి కనిపించేలా పై విధంగా జ్ఞ్యాన సిద్ధిని వర్షించినా........

కేవలం కొందరికి మాత్రమే అనుగ్రహించబడేలా యోగ సిద్ధిని ప్రకటించినా అది కేవలం శ్రీ ఆది శంకరులకే చెల్లింది....!

ఉప్పొంగి జనావాసాలను ముంచెత్తుతున్న నర్మదా నది ఉరుకులను  తమ కమండలంలోకి ఒడిసిపట్టినా.... 

నీళ్ళకోసం కష్టపడుతున్న తల్లి యొక్క కష్టాలు తగ్గేలా పూర్ణానదీ ప్రవాహాన్ని వారి ఇంటి వైపుగా ప్రవహించేలా చేసినా....

మూగాంబిక యొక్క పదమంజీర సవ్వడులకు అణుగుణంగా నడిచినా....

ప్రపంచంలో ఏ ఆగమశాస్త్రానికి అందని రీతిలో శ్రీశైల అభయారణ్యాల్లో కొలువైన ఇష్టకామేశ్వరి అమ్మవారి ఆలయాన్ని భూగృహమునుండి వెలికితీసి ఇప్పుడు మనకు దర్శనయోగ్యంగా ఉండేలా చేసినా.......

మండనమిశ్రునితో ( శంకరాచార్యులతో వాదంలో ఓడిన తర్వాత సురేశ్వరాచార్యులుగా శంకరుల నలుగురు శిష్యుల్లో ఒకరైనవారు..... )
వాదం జరిగే సమయంలో మూలాధారచక్రాన్ని భేదించి పృథ్వీతత్వాన్ని తమ అధీనంలోకి తీసుకొని గోడలు, పైకప్పుల గుండా అవలీలగా ప్రయాణం గావించినా.......

సన్యాసి కి కామశాస్త్రము నందు అంతగా ప్రావీణ్యము ఉండదు కాబట్టి అందులో వాదించి శంకరులను ఓడిద్దామనుకున్న మండనమిశ్రుని 
భార్య వేసే ఎత్తులను చిత్తు చేయుటకు ఆ శాస్త్రంలో ఆరితేరిన రాజుగారి శరీరంలోకి పరకాయప్రవేశం గావించి కామశాస్త్ర వాదంలో కూడ తమను ఓడించడం అసంభవం అని నిరూపించినా.......

తమ సకల శాస్త్ర ప్రావీణ్యానికి తగు రీతిలో అలంకరణగా ఉండే కాశ్మీర సర్వజ్ఞ్యపీఠాన్ని అధిరోహించే సమయంలో సాక్షాత్తు ఆ సరస్వతీ దేవితోనే వాదించి గెలిచి సర్వజ్ఞ్యపీఠాన్ని అధిరోహించినా......

పద్మపాదాచార్యులుగా బిరుదునామం పొందేలా తోటకాచార్యులనబడే తమ శిష్యునకు గంగమ్మ పద్మాలు ప్రభవింపజేసి వాటిలో పాదం మోపి అవతల తీరంలో ఇతరశిష్యులతో ఉన్న ఆది శంకరుల సన్నిధికి చేరేలా చేసి, 
'మంద బుద్ధి గల శిష్యుడు.....'
అని ఇతర శిష్యులతో పరిహాసమాడబడిన పద్మపాదాచార్యులకు ఒక్క సంకల్పంతో సకల విద్యలను కట్టబెట్టి వారిచే 
ఎంతో ఘనమైన తోటకాష్టకం చెప్పించినా సరే.......

ఒళ్ళు మొత్తం కొయ్యబారే చలిలో చుట్టూ మొత్తం మంచు దట్టంగా ఉండే హిమాలయ ప్రాంతాల్లో తమ తపశ్శక్తితో ఉష్ణకుండాలను ఏర్పాటు చేసి ఇన్ని శతాబ్దాలుగా అక్కడ వేడినీళ్ళు లభించే విధంగా 
అనుగ్రహించినా సరే......

వాళ్ళ మాతృమూర్తికి అవసాన సమయంలో ఎక్కడ ఉన్న సరే తిరిగివస్తానని ఇచ్చిన మాటను గౌరవించి, సన్యాసిగా దేశాటనం లో ఉన్నవారు కాలడికి వచ్చి జన్మనిచ్చినందుకు అమ్మకు సంపూర్ణ కర్మక్షయం గావించి మోక్షం ప్రసాదించడం తమ బాధ్యతగా భావించి శ్రీ కృష్ణపరమాత్మను ప్రార్ధించి శ్రీమద్భావత ఘట్టాలను దర్శింపజేసి పరమాత్మ యొక్క సంకర్షణేక్షనములతో అమ్మకు కైవల్యం ప్రసాదించినా సరే......

32 సంవత్సరాల యవ్వన ప్రాయంలోనే
ఇన్ని ఘనకార్యాలు సాధించి ఇక తమ అవతార ప్రయోజనం సిద్ధించిందని గ్రహించి నడుచుకుంటూ వెళ్తూనే ఎవ్వరికి కనిపించకుండా కేదారనాథ్ పర్వతసానువులపై అదృశ్యమైనా సరే......

అది కేవలం శ్రీ ఆదిశంకరులకే చెల్లింది....!!!

భక్తి మార్గంలో ప్రయాణం మొదలు పెట్టిన వారికి అత్యంత సులభమైన రీతిలో 
" గేయం గీతా నామ సహస్రం.....
ధ్యేయం శ్రీపతి రూపమజస్రం....." 
అని బోధించిన భజగోవింద స్తోత్రం తో మొదలుకొని 

మనీషాపంచకం లాంటి మహత్తరమైన స్తోత్రంతో విద్వాంసులను ఆశ్చర్యచకితం చేయగలిగేలా సాగిన ఆ అధ్యాత్మ శాస్త్ర వస్తు విషయ రచనాప్రౌఢిమ కేవలం శ్రీశంకరాచర్యులకు మాత్రమే చెల్లింది......

ఆఖరికి " మీరు ఏమి చేయకున్నా సరే, భక్తితో ప్రార్ధించి సేవించి కొప్పెర / హుండీలో కానుకలు ధర్మబద్దమైన ఆర్జితం తో సమర్పించండి.... మీ పాపాన్ని మీ సొమ్ముపైకి అవహింపజేసి క్షయింపజేస్తాను......"
అనే తిరుమల శ్రీనివాసుడి కలియుగ భక్త రక్షణా వైచిత్రిని మనకు అందించినా సరే అది కేవలం శ్రీశంకరాచర్యులకు మాత్రమే చెల్లింది...!!!

అందుకే 
" నమః శంకరభానవే...!"
అని జ్ఞ్యానభాస్కరులై మన జీవితాలను తీర్చిదిద్దిన శ్రీఆదిశంకరులకు నమస్కరించడం 
నేర్పించారు మన గురువులు, ఆచార్యులు......

" శ్రుతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం ! నమామి భగవద్పాద శంకరం లోకశంకరం ! " 🙏

తమ పూర్వాశ్రమమునందు మరియు సన్యాసాశ్రమము నందు కూడా ఒకేపేరు గల ఎకైక సన్యాసాశ్రమ చక్రవర్తులు, శ్రీఆదిశంకరాచార్యులు... !!

శ్రీ చాగంటి సద్గురువులు నుడివినట్టుగా శ్రీఆదిశంకరజయంతి రోజు కనీసం తోటకాష్టకం పఠించి వారికి నమస్కరించడం ప్రతి ఆస్తికుడి విహిత బాధ్యత.....

కరోనా కారణంగా ఈ సారి శ్రీ శంకరాచార్యుల పల్లకీ ఉత్సవం లో పాల్గొనడం కుదరదేమో..... 

కనీసం వచ్చే వైశాఖ శుద్ధ పంచమి వరకు ఈ ప్రపంచం లో కరోన విలయతాండవం మొత్తం సమసి శాంతియుతంగా అందరు శ్రీశంకరజయంతిని జరుపుకుందురు గాక........అని ఆశిద్దాం.....😊

🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

జయ జయ శంకర హర హర శంకర.....!
జయ జయ శంకర హర హర శంకర....!! 

🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

తోటకాష్టకం :

గురుర్నామ్నా మహిమ్నాచ శంకరో యో విరాజతే |
తదీయాంఘ్రిగళద్రేణు కణాయాస్తు నమో మమ ||

విదితాఖిల శాస్త్రసుధాజలధే మహితోపనిషత్ కథితార్ధ నిధే
హృదయే కలయే విమలం చరణం భవ శంకరదేశిక మే శరణం || 1 ||

కరుణా వరుణాలయ పాలయమాం భవసాగర దు:ఖవిదూన హృదం
రచయాఖిలదర్శన తత్త్వవిదం భవ శంకరదేశిక మే శరణం || 2 ||

భవ ఏవ భవానితి మే నితరాం సమజాయత చేతసి కౌతుకితా
మమ వారయ మోహమహాజలధిం భవ శంకరదేశిక మే శరణం || 3 ||

భవతా జనతా సుహితా భవితా నిజ బోధ విచారణ చారుమతే
కలయేశ్వర జీవ వివేకవిదం భవ శంకరదేశిక మే శరణం || 4 ||

సుకృతే ధిక్రుతే బహుధాభవతా భవితా సమదర్శన లాలసతా
అతిదీనమిమం పరిపాలయ మాం భవ శంకరదేశిక మే శరణం || 5 ||

జగతీ మవితుం కలితా కృతయో విచరంతి మహా మహాసశ్చలత
ఆహిమాన్శురివాత్ర విభాసి పురో భవ శంకరదేశిక మే శరణం || 6 ||

గురుపుంగవ పుంగవకేతన తేసమతా మయతాం నహి కోపి సుధీ
శరణాగతవత్సల తత్త్వనిధే భవ శంకరదేశిక మే శరణం || 7 ||

విదితానమయా విదితైక కలా నచ కించన కాంచన మస్తి విభో
ధ్రుతమేవ విధేహి కృపాం సహజాం భవ శంకరదేశిక మే శరణం || 8 ||

ఓం శాంతిః  శాంతిః శాంతిః ..... !!

శ్రీవైశాఖశుద్ధతదియ అక్షయ తదియ / అక్షయ తృతీయ 2020 / శ్రీ వేంకటాచలాధీశుడు అందరికి అక్షయమైన భక్తి ప్రపత్తులను, పుణ్యాన్ని కటాక్షించి ఎల్లరిని చల్లగా కరుణించి కాపాడుగాక.....😊🙏

శ్రీవైశాఖశుద్ధతదియ అక్షయ తదియ / అక్షయ తృతీయ గా అందరు పండగ జరుపుకోవడం ఎల్లరికి విదితమే.....
ఇవ్వాళ్టి సమాజంలో అక్షయతృతీయ అంటే
"అది బంగారం కొనుకున్నే ఒక పండగ"
గా ఈ సమాజంలో వ్యాపారస్తులు వ్యాప్తిగావించి ప్రజల ఆస్తికత్వాన్ని కూడా తమ వ్యాపార వస్తువుగా మార్చేసారనుకోండి......
శ్రీచాగంటి సద్గురువుల మాటల్లో చెప్పాలంటే,
అక్షయ తదియ రోజు బంగారం కొంటే బంగారం అక్షయం అవుతుందనేది వ్యాపారస్తుల అజ్ఞ్యానవల.....
అలా చేస్తే బంగారంతో పాటుగా కలిపురుషుడికి పరీక్షిత్ మహారాజు వరంగా ఇచ్చిన వాసస్థానాల్లో బంగారం కూడా ఒకటి కాబట్టి కలిపురుష ఉద్ధతికూడ కూడా అక్షయమై వివిధ ఈతిబాధలకు అది దారితీస్తుంది...,
అనే విషయన్ని గ్రహించి మనల్ని మనం సరిద్దుకోవడం జ్ఞ్యానవల...
ఏ వలలో చిక్కి తదనుగుణమైన ఫలితాలు పొందుతామనేది వారి వారి గురుభక్తి, దైవభక్తి పై ఆధారపడేవిషయం.....
శ్రీ చాగంటి సద్గురువులు నుడివినట్టుగా ఆ రోజు చెయ్యవలసిన ముఖ్యమైన పని జీవుడికి ఇహపరాల్లోను ఉపయుక్తమయ్యే విధంగా బాగ పుణ్యం మూటకట్టుకోవడం......
మరీముఖ్యంగా " శీతలోదకభరితజలభాండదానం " అనగా చల్లటి త్రాగునీటితో నింపబడిన ఒక మట్టికుండ / కూజా ని ఒక సత్బ్రాహ్మణోత్తమునకు దానం గా
ఇవ్వడం.......
సంకల్ప సహిత సమంత్రక దానంగా ఇవ్వడం మరింత ప్రశస్తం.....
మన వైదిక ధర్మానికి ఆయువుపట్టే "సంకల్ప సహిత సమంత్రక క్రతువులు"
యావద్ ప్రపంచంలో మరెక్కడా కానరాని విశేషమైనది మన సనాతన ధర్మం కాబట్టే ఇక్కడి వేదోక్త క్రతువులకు వెలకట్టలేని విలువ గొప్పదనం ఇవ్వబడి యావద్ ప్రపంచం తలవంచి నమస్కరించే దేశంగా ఈ భారతదేశం యుగయుగాలుగా ఖ్యాతి గడించింది....
ఒక అమూల్యమైన రత్నం యొక్క విలువ అది తనంతట తాను స్వతహాగా
నిర్ణయించి ఎదుటివ్యక్తికి చెప్పదు.....
గొలీల ఆట ఆడుకునే ఒక పిల్గాడి చేతికి ఆ రత్నం చిక్కితే అది కూడ అతడిదెగ్గర ఉన్న మిగతా రాళ్ళలో ఒక రాయిగా విలువకట్టబడుతుంది.....
ఒక స్వర్ణకారుడి చేతికి అది లభించి ఆభరణంలో మణిపూసగా అమరినప్పుడు ఆ ఆభరణం తో పాటుగా అది విలువకట్టబడుతుంది....
బాగా నిష్ణాతుడైన ఒక వజ్రాల వ్యాపారికి అది లభిస్తే తన దెగ్గర ఉన్న మిగతా రత్నాలతో పోల్చబడి దానికి తగురీతిలో విలువపొందుతుంది.....
ఇక్కడ రత్నం తన స్థానం వల్ల, అనగా అది లభించిన వ్యక్తి యొక్క జ్ఞ్యానానికి సమంగా విలువకట్టబడిందే తప్ప దాని యొక్క స్వతహ్సిద్దమైన విలువ ఇంత అని ఎవ్వరు ఆ రత్నానికి విలువకట్టలేదు.....
అట్లే ఈ భరతభూమి ని కొందరు మిగతా అన్నిదేశాలమాదిరిగా ఇంకో దేశం మాత్రమే అని భావిస్తారు....
( రత్నంతో గోలీలు ఆడుకునే ఆ పోరగాడిలా ) వారికి అది అక్కడివరకే విలువ.....
ఇంకొందరు మరింతగా ఈ దేశం యొక్క విలువను కేవలం భోగభూమిగా కాకుండా కర్మభూమిగా, ధర్మభూమిగా, యోగభూమిగా గుర్తించి తదనుగుణంగా ఈ దేశాన్ని
గౌరవిస్తారు.....
( ఆభరణంలో మణిపూసగా తనకు లభించిన రత్నాన్ని పొదిగిన స్వర్ణకారుడి రీతిగ )
మరి కొందరు ఈ దేశాన్ని తద్ అభిన్నమైన వైదికసంస్కృతిని, సనాతనశాస్త్రప్రాభవాన్ని, గౌరవిస్తూ ఈ భూమిని జ్ఞ్యానభూమిగా సేవించి వెలకట్టలేని కైవల్యభూమిగా మార్చుకొని తరిస్తుంటారు.....
( రాళ్ళను, రత్నాలను జ్ఞ్యానదృష్టితో చూసి వేరుచేసి రత్నానికి తగు విలువనిచ్చి గౌరవించిన ఆ ఆరితేరిన వజ్రాల వ్యాపారిలా..... )
కాబట్టి ఇక్కడ ఈ దేశం యొక్క గొప్పదనం కేవలం అందులో జన్మించిన వ్యక్తుల వల్ల కాకుండా ఈ దేశానికి మాత్రమే సొంతమైన వైదిక శాస్త్ర విజ్ఞ్యాన సంపత్తి ని గురువుల, ఆచార్యుల, యోగుల, సిద్ధపురుషుల, భక్తభాగవతుల, సాంగత్యం, అనుగ్రహం, వల్ల లభించిన జ్ఞ్యానదృష్టికి తగు రీతిలో ఆపాదించబడుతుంది అనేది నిర్వివాదాంశం........
కాని ఇక్కడ గమనించవలసిన ముఖ్యమైన విషయం ఒకటుంది.....
రెండు అరచేతులు కలిస్తేనే కరతాళధ్వని ప్రభవించి
( చప్పట్లు ) ఎదుటి వ్యక్తిని అభినందించగలం.....
రెండు భాస్పరపుతునకలను రాపాడిస్తేనే అందులోనుండి అగ్ని ప్రభవించి దీపాన్ని వెలిగించగలం....
అట్లే ఒక ఉన్నతమైన జ్ఞ్యానస్థాయిలో ఉన్న వ్యక్తి కి అంతటి ధీటైన కోవిదుడు ఎదురుగా నిలిచిననాడే వారి పరస్పర సహకారంవల్ల ఆ దేదీప్యమైన జ్ఞ్యానరాశి లోకానికి అందివచ్చి తన్మూలంగా ఎందరెందరికో ఆ జ్ఞ్యానజ్యోతులు మార్గదర్శకత్వాన్ని వహించి జ్ఞ్యానమార్గాన్ని ఆశ్రయించిన వారందరికి యోగక్షేమాలను ఒసగుతు వారి జీవితాలను తరింపచేసేది......
( ఒక్క అగ్గిపుల్లను అగ్గిపెట్టేతొ రాపాడించి వెలిగించిన ఆ ఒక్క దీపం కొన్ని వందల వేల దీపాలను వెలిగించగలదు అన్నచందంగా.....)
శ్రీచాగంటి సద్గురువుల సంపూర్ణ రామాయణంలో సీతమ్మ రావణాసురుడితో సంభాషించే సమయంలో ఒక ప్రశ్న అడుగుతుంది.....
" రావణా.... నీకు లంకలో మంచి చెప్పేవారు లేరా.....
లేదా చెప్తే విని నిన్ను నువ్వే సరిదిద్దుకునే లక్షణం నీకు లేదా ....?
నన్ను బాధించి నీ పుణ్యాన్ని నువ్వే కరిగించుకొని నీ మృత్యువుని నువ్వే వండుకుంటున్నావు.......తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త......"
అవ్విధంగా చెప్పే వారు ఉండాలి.....
చెప్తే వినే వారూ ఉండాలి.......
అప్పుడే ఆ ప్రయాస సార్ధక్యం చెందుతుంది.....
అట్లే జ్ఞ్యానమార్గంలో ప్రయాణంగావించి కైవల్య తీరానికి చేరగోరే వారికి కూడా సద్వాక్కుల దివిటీలతో ఉభయకర్మక్షయాన్ని గావించి ముక్తితీరానికి చేర్చే మహాత్ములు లభించి, వారి సద్వాక్కుల సహాయంతో ప్రయాణం కొనసాగించే వారు ఉన్నప్పుడే ఆ ప్రయాస సార్ధక్యం చెందుతుంది......
వీటన్నిటికి మూలకారణం భగవద్ అనుగ్రహం తన్మూలంగా జనించే తత్త్వజ్ఞ్యాన జిగ్న్యాసా భరిత అధ్యాత్మతత్త్వచింతన........
అసంఖ్యాకమైన జన్మపరంపరలో గడించబడిన విశేషమైన పుణ్యబలం చేతనే అది సంభవించేది.....
ఆ పుణ్యానికి హేతువు భగవద్భక్తి అనగా భక్తిమార్గ ప్రయాణం......
ఆ భగవద్భక్తి వల్ల సమకూరిన భగవదనుగ్రహంవల్ల సిద్ధించబడేది జ్ఞ్యానం......
ఆ అధ్యాత్మజ్ఞ్యాన ప్రయాణం వల్ల తుదకు భగవదనుగ్రహంగా సిద్ధించబడేది జన్మరాహిత్యమైన స్థితి అనగా మోక్షం......
భగవద్భక్తి --> భగవదనుగ్రహం --> పుణ్యకర్మసంచయం / పాపకర్మక్షయం --> జ్ఞ్యానసముపార్జన --> భగవద్భక్తి
అనే ఈ పంచవిధమైన వలయప్రయాణంలో ఎన్నెన్నో జన్మల ప్రయాణంగావించిన జీవుడికి ఒకనాడు కేవల భగవదనుగ్రహం వల్ల ఆఖరిదైన
జ్ఞ్యానసముపార్జన --> భగవద్భక్తి
అనే వలయస్థానంలో ఉన్న ప్రాణి యొక్క చిత్తశుద్ధికి సంతసించి సదరు జీవుడిని ఈశ్వరుడు తనలోకి లయించివేసి ఆ జన్మపరంపరల వలయము నుండి ఇక పూర్తిగా స్వతంత్రత ప్రసాదించి అనుగ్రహిస్తాడు......
అనగా జీవుడిని కైవల్యతీరానికి జీవేశ్వరుడు చేర్చుట అన్నమాట....
అనగా క్లుప్తంగా ఈ యావద్ కర్మచట్రాన్ని జాగ్రత్తగా పరికించిచూస్తే జీవుడికి అతి ముఖ్యమైనది పుణ్యం తన్మూలంగా జనించే భగవద్భక్తి భరిత చిత్తశుద్ధి......
కాబట్టి పుణ్యసంచయంకోసం ఈశ్వరుడు ప్రసాదించిన ఎన్నో పర్వదినాల్లో ప్రశస్తమైనది ఈ అక్షయతృతియ........
కాబట్టే సుదీర్ఘ జీవయాత్రల్లో ఉపయుక్తమయ్యే విధంగా జీవుడికి కావలసిన అక్షయమైన పుణ్యబలాన్ని సమకూర్చే విధంగా ఈ అక్షయతదియనాటి పర్వదినాన్ని మలచుకోవడంలోనే మనుష్యునకు తన మానవప్రయాసకి సార్ధకత లభించి లాభించేది.......
ఇక్కడ గమనిస్తే భక్తిమార్గము / జ్ఞ్యానమార్గము రెండూకూడా సమ్మిళితమై ఉన్నట్టుగా కనిపించడం కద్దు........
కొందరు అవి వేరు వేరు మార్గాలు అని భావిస్తారు.......
కాని నిజానికి అవిరెండు కూడా ఒకేవిధమైన మార్గంలో మనల్ని ప్రయాణింపచేస్తాయి అనేది నిఘూడమైన అధ్యాత్మ సత్యం.......
శ్రీ చాగంటి సద్గురువుల మాటల్లో చెప్పాలంటే
"భక్తి / జ్ఞ్యాన మార్గాలు రెండూ కూడా ఈశ్వరుని కడకు కొనిపోవు సమాంతర మార్గములు ....."
చిన్న లౌకిక ఉదాహరణతో ఈ కాన్సెప్ట్ చాలా సింపుల్ గా చెప్పే ప్రయత్నం కావిస్తాను......
గౌ|| ముఖ్యమంత్రివర్యులు శ్రీ కే.సీ.ఆర్ గారు
గౌ|| ప్రధానమంత్రివర్యులు శ్రీ నరేంద్రమోది గారు నిర్వహించే ఒక అత్యవసర ప్రత్యక్ష వ్యక్తిగత సమావేశానికి ఢిల్లీ కి ప్రయాణం చేయాలి అనుకుంటే.....
వారు వెంటనే చేసేది
1. ఒక హెలికాప్టర్ / పర్సనల్ చాపర్ సహాయంతో గగనతలం మీదుగా ఢిల్లీ చేరుకోవడం.......
2. ఢిల్లీ కి మరో గంటలో బయలుదేరే ఫ్లైట్స్ గురించి సమాచారం సేకరించి ఒక ఏరోప్లేన్ ఎక్కి ఢిల్లీ చేరుకోవడం.......
వారు ఏ పద్దతిలో ప్రయాణంగావించినాసరే,
అవలంబించే గగనమార్గం ఒక్కటే.....
చేరుకునే గమ్యం ఒక్కటే...
ఇక్కడ మార్గము, మాధ్యమము ఒక్కటే అయినాసరే కొన్ని భేదాలు మాత్రం ఉండడం సహజం......
అవేంటో ఒకసారి చర్చించి, అచ్చం అదేవిధంగా భక్తి / జ్ఞ్యాన మార్గాల్లో ప్రయాణించే జీవుడు జీవేశ్వరుడిని ఏ విధంగా పొందుతాడో అనే సామ్యాన్ని పరికిద్దాం......
1. "Heavy upward thrust propeller coupled with sufficient forward thrust addition..."
అనే సూత్రానికి అనుగుణంగా వ్యవస్థీకరించబడిన
హెలికాప్టర్ లో ప్రయాణించడం
( జీవుడు భక్తి మార్గంలో ప్రయాణించడానికి సూచిక )
ఇది ఒకరకంగా చెప్పాలంటే ప్రైవేట్ ప్రయాణం. హెలికాప్టర్ నడిపే పైలట్ తో కాకుండా ఇతరులతో పెద్దగా సంబంధంలేని ప్రయాణం......
ఆకాశంలో తక్కువ ఆల్టిట్యూడ్ లో కొనసాగగలిగే ప్రయాణం....
లోపల ఉన్నవారికి మరియు బయట క్రింద భూమి పై ఉన్న వారికి కూడా నిరంతరం హోరెత్తించే శబ్దం తో కూడిన ప్రయాణం.....
భూమి పై ఉండే మిగతా అందరు కూడా చూడగలిగే ప్రయాణం.......
అవసరమైతే మధ్యలో అనువైన చోట ( హెలిప్యాడ్ ) క్రిందకి దిగి ఇంకొకరిని ఎక్కించుకోవడం, ఎమైనా కొత్త సామాన్లు వగేరా తీసుకోవడం,
అవసరమైతే మనకు పైనుండి పులిహోర పాకెట్లు అట్లాంటివి అందివ్వగలిగే ప్రయాణం,
" వాయుపీడనబంధనం " /
' Air Pressure Insulation ' అనే కాన్సెప్ట్ ఇక్కడ వర్తించదు......
అనగా ఇది భూమికి దెగ్గరగా సాగగలిగే ప్రయాణం........
2. "Heavy forward thrust propeller coupled with sufficient upward thrust addition...".."
అనే సూత్రానికి అనుగుణంగా వ్యవస్థీకరించబడిన
ఏరోప్లేన్ లో ప్రయాణించడం
( జీవుడు జ్ఞ్యాన మార్గంలో ప్రయాణించడానికి సూచిక )
ఇది ఒకరకంగా చెప్పాలంటే పబ్లిక్ ప్రయాణం. ఏరోప్లేన్ నడిపే పైలట్ తో కాకుండా ప్లేన్ లో ఉండే ఇతరులందరితో కూడా సహకరిస్తూ సాగవలసిన ప్రయాణం......
ఆకాశంలో ఎక్కువ ఆల్టిట్యూడ్ లో కొనసాగే ప్రయాణం....
లోపల ఉన్నవారికి మరియు బయట క్రింద భూమి పై ఉన్న వారికి కూడా
ప్లేన్ ఒక ఎత్తు అందుకున్న తర్వాత అంతగా శబ్దం వినిపించని ప్రయాణం.....
అవసరమైతే మధ్యలో దిగి ఇంకొకరిని ఎక్కించుకోవడం, ఎమైనా కొత్త సామాన్లు వగేరా తీసుకోవడం లాంటివి కుదరవు.....,
మనకు పైనుండి పులిహోర పాకెట్లు అట్లాంటివి ప్లేన్ కిటికీలు తెరిచి అందివ్వడం లాంటివి ఉండవు....,
" వాయుపీడనబంధనం " /
' Air Pressure Insulation ' అనే కాన్సెప్ట్ కచ్చితంగా అవసరమయ్యే ప్రయాణం........
అనగా భూమి పై ఉండే మిగతా వాళ్ళతో సంబంధం లేని విధంగా చాల ఎత్తులో సాగే ప్రయాణం.......
అచ్చం ఇదే విధంగా
1. జీవుడు భక్తి మార్గంలో ప్రయాణించేటప్పుడు,
ఇతరులతో పెద్దగా సంబంధంలేని విధంగా అది ఒకరకమైన వ్యక్తిగత ప్రయాణం.....
నిరంతరం భగవన్నామస్మరణం / భగవద్ చింతన అనే ధ్వని హోరెత్తించే ప్రయాణం......
ఎందుకంటే ఇక్కడ అదే upward propelling force కాబట్టి....
లౌకికంగా భూమిపై ఉండే ఇతర భక్తులందరికి కూడా దెగ్గరగా సాగే ప్రయాణం.......
ఈ భక్తి మార్గ ప్రయాణం ఇతరులు కూడా సులభంగా అందుకోగలిగిన ప్రయాణం........
భగవద్ ప్రసాదంగా మధ్యమధ్యలో పులిహోర, చక్కెరపొంగలి ఇత్యాది ప్రసాదాలను హాయిగా ఆరగిస్తూ సాగే ప్రయాణం...😊
పంచేంద్రియచిత్తవృత్తుల బంధనం ఇక్కడ అంతగా వర్తించని ప్రయాణం.......
ఆ ఇంద్రియకలాపాలన్ని కూడా యధావిధిగానే ఉంటాయి కాని అవన్నీ కూడా భగవద్పరంగా కొనసాగుతాయి......
అనగా ఇది లౌకిక / ప్రాపంచిక పోకడలకు చాలా దెగ్గరగా సాగే సులభతరమైన ప్రయాణం.......!
2. జీవుడు జ్ఞ్యాన మార్గంలో ప్రయాణించేటప్పుడు,
ఇతర తోటి జ్ఞ్యానులందరితోను కలిసిమెలిసి సాగించే ఒక విధమైన పబ్లిక్ ప్రయాణం.....
అనగా సదరు జ్ఞ్యాని యొక్క తత్త్వ ప్రతిపాదన యావద్ లోకానికి సమ్మతమై ఉండగలగాలి......
అది అందరి ప్రశ్నలకు సశాస్త్రీయ సమాధానాలు ఇవ్వగలిగి చెక్కుచెదరని తత్త్వధీరత్వాన్ని ప్రతిపాదించే రీతిలో కొనసాగే లోకశ్రేయస్కరమైన అధ్యాత్మ జ్ఞ్యాన ప్రయాణం అయ్యి ఉండగలగాలి....
ఆ జ్ఞ్యానభరితతత్త్వప్రతిపాదనలు సార్వజనీనమై సార్వకాలిక సత్యశ్రేష్టములై చిరంతన జ్ఞ్యానదీపికలై శాశ్వతమై నిలిచి గెలిచే రీతిలో కొనసాగే ప్రయాణమై ఉండగలగాలి....
లౌకికంగా భూమిపై ఉండే ఇతర భక్తులందరికి కూడా అంత దెగ్గరగా ఉండని ప్రయాణం.......
ఈ జ్ఞ్యాన మార్గ ప్రయాణం ఇతరులు అంత సులభంగా అందుకోలేని ప్రయాణం........
పంచేంద్రియచిత్తవృత్తుల బంధనం అనేది ఇక్కడ కచ్చితంగా వర్తించే ప్రయాణం.......
ఇంద్రియకలాపాలన్ని కూడా యధావిధిగా కాకుండా అవి వివిధ జ్ఞ్యాన స్థ్యాయిలో ఉండి భగవద్పరంగా కొనసాగుతాయి......
అనగా ఇది లౌకిక / ప్రాపంచిక పోకడలకు దెగ్గరగా సాగని ప్రయాణం.......!
ప్లేన్ ఒక ఎత్తు అందుకొని వినువీధిలో స్థిరంగా కొనసాగేటప్పుడు క్రింద భూమిపై ఉండి చూసే వారికి అది ఆకాశంలో నిశ్శబ్దంగా సాగిపోయే ఒక చిన్న విహంగం లాగ కనిపిస్తుంది......
కాని అదే స్థాయిలో ప్రయాణించే ఇంకో ప్లేన్ కి మాత్రమే ఆ స్థాయిలో
ఎంతో గంభీరంగా వేగంగా స్థిరంగా దూసుకుపోతున్న ఆ ప్లేన్ యొక్క విశ్వరూపం గోచరించేది....
అట్లే జ్ఞ్యానమార్గంలో ప్రయాణించే వారు కూడా.....
ప్రపంచంలోని ఇతరులకు ఒక్కోసారి వారొక నిశ్శబ్దమైన సోదిమాలోకం లాగ కనిపిస్తారు.......
ఆ జ్ఞ్యానస్థాయిలో ఉండే ఇతరులకు మాత్రమే వారి యొక్క నిశ్శబ్దంలోని
గాంభీర్యం, వేగం, స్థిరత్వం కానవస్తాయి....!
తుదకు ఇరు మార్గాలు కూడా చేరేవి ఆ సర్వేశ్వరుడినే కాబట్టి దేని విలువ దానిదే......
ఏది ఎక్కువ కాదు......ఏది తక్కువ కాదు.....
ఎవరికి ఏ మార్గం వారి వారి గురువుల ద్వార భగవదనుగ్రహంగా అందివ్వబడుతుందో వారికి ఆ మార్గం ఈశ్వరుడిని చేరే మార్గం అన్నమాట....
కాని అన్నిటికి మూలం మాత్రం భక్తియే...!!
భక్తి --> జ్ఞ్యానం --> పుణ్యం --> చిత్తశుద్ధి --> జన్మరాహిత్యం.....
అటువంటి అక్షయమైన భక్తి, పుణ్యం, జ్ఞ్యానం, చిత్తశుద్ధి, ఇత్యాది ఇహ పర లోక సంపదలన్నీ కూడా వర్షించేందుకు హరి భక్తి అనేది ఒక అమూల్యమైన సాధనం.......
అనన్యసామాన్యమైన శ్రీహరిసంకీర్తనం సకల శాస్త్రవేదేతిహాసా పారాయణ ఫలితాన్ని ప్రసాదించి ఒక మనుష్యునకు ఇహ పరాల్లో సుఖించేందుకు అవసరమైన అక్షయమైన సంపదలన్నీ అనుగ్రహిస్తుంది అని మనకు సెలవిస్తు అన్నమాచార్యుల వారు ఎంత ఘనమైనరీతిలో ఈ క్రింది సంకీర్తనను రచించారో ఒకసారి చూడండి......
********************************
145.chAladA brahmamidi-చాలదా బ్రహ్మమిది
Audio link :G.BalaKrishnaPrasad
Audio link :MohanaKrishna
Archive link :
ప|| చాలదా బ్రహ్మమిది సంకీర్తనం మీకు | జాలెల్ల నడగించు సంకీర్తనం ||
చ|| సంతోష కరమైన సంకీర్తనం | సంతాప మణగించు సంకీర్తనం |
జంతువుల రక్షించు సంకీర్తనం | సంతతము దలచుడీ సంకీర్తనం ||
చ|| సామజము గాంచినది సంకీర్తనం | సామమున కెక్కుడీ సంకీర్తనం |
సామీప్య మిందరికి సంకీర్తనం | సామాన్యమా విష్ణు సంకీర్తనం ||
చ|| జముబారి విడిపించు సంకీర్తనం | సమ బుద్ధి వొడమించు సంకీర్తనం |
జమళి సౌఖ్యములిచ్చు సంకీర్తనం | శమదమాదుల జేయు సంకీర్తనం ||
చ|| జలజాసనుని నోరి సంకీర్తనం | చలిగొండ సుతదలచు సంకీర్తనం |
చలువ గడు నాలుకకు సంకీర్తనం | చలపట్టి తలచుడీ సంకీర్తనం ||
చ|| సరవి సంపదలిచ్చు సంకీర్తనం | సరిలేని దిదియపో సంకీర్తనం |
సరుస వేంకట విభుని సంకీర్తనం | సరుగనను దలచుడీ సంకీర్తనం ||
********************************
కలియుగ ప్రత్యక్ష పరమాత్మగా కొలువైన ఆ
శ్రీ వేంకటాచలాధీశుడు అందరికి అక్షయమైన భక్తి ప్రపత్తులను, పుణ్యాన్ని కటాక్షించి ఎల్లరిని చల్లగా కరుణించి కాపాడుగాక.....😊🙏
ఓం శాంతిః శాంతిః శాంతిః.....!

Wednesday, April 22, 2020

Shree Guruparampara's importance & a movie named 'VishwaachaaryuDu' on HH Shree Raamaanujaachaarya's life history

श्रीगुरु श्रीगुरु चरन सरोज रज, निज मनु मुकुरु सुधारि।

बरनऊं रघुबर बिमल जसु, जो दायकु फल चारि।।

and so on went the words of an extremely powerful and most magnanimous world renowned stotra called Shree Hanuman Chalisa, by Sant Goswaami Tulasidaas, when he was blessed darshan by none other than Lord Hanuman in his original ape form standing mighty among hundreds of other apes that flew in, all of a sudden like a heavy downpour from the skies, to the courtyard of a Sultan who was the then ruler of Avadh province and near by areas to which Tulsidas ji belonged to.

One can read online about that legend that drove Sant Tulsidas to the Sultan to answer his "ShreeRaama naama mantra japamahima" that got a person back to life sometime after he breathed his last and how that discussion became an argument and when Sultan was about to get hard on him Lord Hanuman and his army of apes got all of the Sultan's sepoys in their custody and clearly gave a message to Sultan that if he were to harm Sant Tulsidas, all of his men would be slayed down right then and there itself........

A shell shocked Sultan witnessing the unimaginable situation prostrated infront of Hamunan ji and honoured sant Tulsidas with all the due respect......

One can see that Tulsidas ji was a simple Sant Sadhu who was leading an ascetic life like many others in the world, by immersing himself in ShreeRaamaBhakti singing and praising the glory of Lord with his Bhajans, Chants, Dohas etc.....  And that miraculous incident happened just because of Lord ShreRaama's grace.
He wasn't of any opinion to set up a shop to sell his Raamabhakti and keep performing miracles so that folks around can " purchase and consume " divinity.....

It was Sultan who was jealous of him practising the regular spiritual beliefs as anyone else would do and wanted to insult his simple Bhakti towards ShreeRaam and forced him to display the miracles infront of everyone which is an unfair take on someone's personal beliefs and devotional life and so was there a strong need for Hanuman to intervene and save his Lord Shree Raama's devotee by teaching a befitting lesson to the Sultan......

One can see that the very first word Tulsidas ji included in his stotram is
"Shree Gurucharana Saroj.....", ( the Holy lotus feet of thy Guru......)
It is because of the fact that this land has always been the abode of great spiritual wealth spanning the length and breadth of the nation from Kaashmeeram to Kanyaakumaaari.........
and from Dwaaraka to Nagaland......
ever since this world started learning things with the help of the revered "Guruparampara......."

In the 5 cardinal entities that govern this " SanaatanaDevaBhoomi "namely

1. Ganga ( The holy River Ganges )

2. Govu ( The holy Indian Cow )

3. Guruparampara ( The lineage of revered Gurus who were born on this soil taking human form starting from HH ShreeAaadiShankaraachaarya.....
It's true that before Shree AadiShankaraachaarya too we have the guruparampara starting from Lord Shreemannaaraayana / Lord Dakahinaamoorthy thru several highly revered ancient personalites up until Shree Govindabhagawadpaada, under whose tutelage Shree AadiShankara has started his spiritual journey by aligning himself in to the Guruparampara......)
)

4. Govinda ( The universal Lord Krushna )

5. Geeta ( Lord Krushna's invaluable sayings collectively referred to as BhagavadGeeta )

Of all these 5 entities extreme importance and respect is given to the Guruparampara and their invaluable teachings / commands. Because they are the only ones who sacrifice their lives for the sake of Dharmaparirakshana and are always available to every disciple to guide them and bless them appropriately for a prosperous peaceful life.......

The other 4 are always there however they are not always as close and as approchable as a sadguru and his words of wisdom are. The latter always guard a disciple by forming an unbreakable armour of intelligence around him that shields the disciple from being affected by the worldly ignorance which is the root cause of all the sorrow and suffering and thus Guruparampara is of paramount importance to all the devotees of this land so much so that more than God it is a sadguru and his words that matter most to a devotee....

It is for this very reason that Lord Shree Venkateshwara, the eon God of this Kaliyuga, residing in the most sacred sanctum Santorum of AanandaNilayam atop the Holy 7 Hills of TiruvengaDam, has placed the subshrine of his guru Shree BhagawadRaamaanujaachaarya
( who has graced the Lord with
'Golden Sankha Chakra  Dhaarana ' as a part of stabilizing the disturbed form of worship being carried out in Tirumala Shrine in those days by establishing the finest principles of ShreeVaikhaanasaagama form of worship to be followed thereafter, )
in the most sacred north eastern part of his Shrine in an elevated subshrine facing South similar to ShreeDakshinaamoorty swaroopam. If one can make a fine observation, the feet of Shree Raamaanujaachaarya moorthy located in that elevated sub shrine in a seated posture holding the sacred tridanDam would be almost at the height of Lord Venkateshwara Saaligraamamoorthi's chest portion...

It signifies that Lord is facing east and  prostrating humbly to his Guruju who is facing south,
with his Guruji's holy feet located closely to his heart... i.e., a disciple must place a sathguru and his words always so close in his heart so that they can keep driving him well all along the journey......

VishisTaadwaita siddhaanta prachaaraka
HH Shree BhagawadRaamaanujaachaarya,

Adwaita siddhaanta prachaaraka
HH Shree Shankarabhagawadpaada / AdiShankaraacharya

It is only because of these two revered aachaarya Shikhaamani that we are able to receive Lord Srinivasa's blessings and are able to live peacefully in this materialistic Kaliyuga where the commanding principle is " Dhanamoolam idam jagath....."
signifying that this entire world runs on money in this Kaliyuga....

Hence Shree Shankaraachaarya has requested Lord Shreenivaasa to stay in the Aananda Nilayam Shrine and bless devotees with all the proper boons essential for their peaceful lives. He has also  inscripted / engraved an extremely powerful ShreeChakram in the Northern middle part ( Kubera Sthaanam)  of the Shrine and instantiated it with his unparalleled TapahShakti so that it keeps drawing millions and millions of money from all over the globe in the form of offerings to Lord Shreenivaasa from all his devotees across the world.
( Refer to Shree ChaaganTi sathguruji's Shree Venkateshwara Vaibhawam Pravachanam where Lord is referred to as " Shree Shankaradhyaata Moortayea"
which was told by ShreeRamanadeekshitulu gaaru as well in one of his interviews...... )

( Inscripting something is not the same as instantiating it.
It requires the knowledge of art to inscript / engrave something on some metal / stone. But it requires a lot of mantra Shakti to instantiate it appropriately to achieve the very purpose of carving it out....

Its akin to the below worldly example....
You may write / create a huge Java class encapsulating an extremely powerful code that pulls in several other APIs via the prefixed import *.* key word which can run an entire bank's software but to instantiate it in the form of a dynamic object to carry out its intended work it needs a lot of resources / computing power.

A Java class, which is essentially just a blue print, cannot do anything on its own unless it is properly instantiated with the required resources.

Similarly any yantram / chakram when drawn / inscripted / engraved somewhere is just a blue print that cannot do anything on its own unless it is activated / instantiated with an ascetic's mantra / japa Shakti appropriately...... )

While Shree AadiShankaraachaarya has focussed on the aspect of
" Creating the required spiritual den to draw in the universal cosmic energy to help all the devotees visiting the Tirumala shrine...."

Shree Raamaanujaachaarya has focussed on the aspect of
" Stabilizing the sacred form worship required inside the sanctum Santorum to sustain the divine universal cosmic energy fields being drawn in to the Sanctum Santorum so that the SaaligraamaMoorty of Lord Shreenivaasa remains unaffected by the  manual energy fields caused by millions of devotees thronging the AanandaNilyam continuously..... "

( Its similar to a process where one scientist creates all the required paraphernalia to absorb a certain form of energy from all around the globe and another scientist is working on stabilizing all that paraphernalia by shielding them properly so that the absorbed energy fields achieve the intended purpose.
So by working in tandem, they have ensured that the energy fields drawn and stabilized inside the laboratory are neither wasted nor corrupted by the local energy fields so that they can keep achieving their intended purpose....... )

Once again the most auspicious and special time of the year is around, the Vaishaakha Maasam, that celebrates the birth anniversaries of these two revered AachaaryaShikhamani that have blessed the mankind with a perennial source of grace called Lord ShreeVenkateshwara that is the only boat available to the human beings of this  Kaliyuga to sail thru  the ocean of Samsaara.....

Here is the trailer of a new movie on the life history of
HH ShreeRaamaanujaachaarya on this special occassion ......

And thus the ShreeVenkatesha Suprabhaatam is completed with the below verse seeking the blessings of all the Poorvaachaarya.....

maṅgaḻā śāsanaparair-madāchārya purogamaiḥ |
sarvaiścha pūrvairāchāryaiḥ satkṛtāyāstu maṅgaḻam ||

Peace be to all......!

Shree Shreenivaasa Parabrahmanay Namaha....😊🙏

https://www.facebook.com/Vinay.Aitha/videos/10219807980003303/


-0:55

శ్రీతాళ్ళపాక అన్నమాచార్యుల సంకీర్తనల ఆవశ్యకత ఇప్పుడున్న మన సమాజానికి ఎందుకంతగా ముఖ్యమైనది.....?

శ్రీశ శ్రియా ఘటికయా త్వదుపాయ భావే
ప్రాప్యేత్వయి స్వయముపేయ తయా స్ఫురంత్యా |
నిత్యాశ్రితాయ నిరవద్య గుణాయ తుభ్యం
స్యాం కింకరో వృషగిరీశ న జాతు మహ్యమ్ || 16 ||
శ్రీతాళ్ళపాక అన్నమాచార్యుల వారిచే రచింపబడిన 32000 సంకీర్తనారత్నాల్లో ఇప్పుడు మనకు లభించినవి దాదాపు సగం కంటే తక్కువ అని పెద్దలు / అన్నమాచార్య సంకీర్తనా వాంజ్ఞయ పరిశోధకులు చెప్పడం వినేఉంటారు.......
పదకవితాపితామహులచే రచింపబడిన ఆ సంకీర్తనలను అధ్యాత్మ శృంగార వైరాగ్య సంకీర్తనలుగా విభాగించి వివిధ సంగీత సాహిత్య స్రష్టలు, పరతత్త్వ ద్రష్టలు వాటిని పరిశోధించి అందులో ఉపయోగించబడిన సాహితీ విజ్ఞ్యానం తో పాటుగా తద్ప్రతిపాదితమైన పరతత్త్వపరమార్ధాలను కూడా జనబాహుళ్యానికి అందించి ఆ కలియుగ ప్రత్యక్ష పరమాత్మ అనుగ్రహం భక్తులెల్లరికి చేరువయ్యేలా ప్రత్యక్షంగా పరోక్షంగా కృషిచేస్తున్న మహనీయులెందరికో ఈ లోకం సదా కృతజ్ఞ్యతతో నమస్కరిస్తూనే ఉంటుంది.........
ఆచార్యులచే అన్ని వందల వేల సంకీర్తనలు రచింపబడి కొన్ని వందల సంవత్సరాలు అవి గుప్తంగా
"అన్నమాచార్యసంకీర్తనాభాండాగారం " గా పిలువబడే ఆ చిన్న గదిలాంటి గూటిలో
( స్వామివారి ఆలయ హుండీలో కానుకలు సమర్పించి ప్రదక్షిణగా ఆ కొప్పెరకు నమస్కరించి తిరిగి వచ్చే లైన్లో అట్లే ముందుకు నడిచి శ్రీభాష్యకార్లసన్నిధికి వెళ్ళే ముందు వచ్చే ప్రదేశం ) సాక్షాత్ అన్నమాచార్యుల వంశీకులే, వాటివిలువ తెలియని దుండగుల కంటబడకుండా దాచిపెట్టడం, కొన్ని వందల సంవత్సరాల తరువాత అవి స్వామివారి సంకల్పంగా బయల్పడి ఇప్పుడున్న మన 20 / 21వ శతాబ్దానికి అవి అనుగ్రహింపబడడం, కలియుగ దైవమైన శ్రీనివాసుణ్ణి దర్శించడమంటే అన్నమాచార్య సంకీర్తనల్లోని పరతత్త్వాన్ని గ్రహించి ఆ గోవిందుడిని సాక్షాత్కరింపజేసుకోవడమే నిజమైన శ్రీవేంకటేశ్వర దర్శనంగా ఈ లోకంలో అన్నమాచార్య సంకీర్తనల ప్రాభవం దశదిశలా దినదినప్రవర్ధమానమై ఎల్లరికి ఆ శ్రీనివాసుడి సన్నిధిని వారున్న చోటే స్థిరీకరించబడి స్వామివారి అనుగ్రహం సిద్ధించబడడం...... ఇవన్నీ ఇప్పటి తరం వారు ప్రతిరోజు చూస్తున్న సత్యాలే కద......
ఇవన్నీ స్వామివారి లీలలే అనేది అధ్యాత్మ సత్యం......
కాని వీటన్నిటి వెనకాల ఇంకా ఎమైనా లౌకిక సత్యం దాగున్నదా...?
తన సంకీర్తనావేద వ్యాప్తి ద్వారా శ్రీనివాసుడు ఈ లోకానికి ఇంకేమైనా చెప్తున్నాడా...?
ఇత్యాది గా కొందరికైనా ఆలోచనరాకమానదు....
వేల సంకీర్తనల ద్వారా ప్రతిపాదించబడుతున్నది అదే పరతత్త్వం.....కాని ప్రతీ సంకీర్తన కూడా ప్రత్యేకమైన విధంగా రచింపబడి లోకానికి అందించబడింది......
అన్ని సంకీర్తనలు కూడా ఆ శ్రీనివాసుణ్ణి వివిధ రకాలుగా కీర్తిస్తున్నాయి అనేది కనిపించే సత్యం.....
ఆ కీర్తించే వైనంలో కడు ఘనమైన గహనమైన అనుగ్రహం భక్తులకు అనుగ్రహింపబడుతున్నది అనేది కనిపించని సత్యం......
అన్నమాచార్యుల సంకీర్తనల ఆవశ్యకత ఇప్పుడున్న మన సమాజానికి ఎందుకంతగా ముఖ్యమైనది.....?
ఇంటింటా అన్నమయ్య పాట..... అనే రీతిలో అన్నమాచార్య సంకీర్తనలు అందరి జీవితాల్లో ఒక భాగమై ఉండడం ద్వార ఆ శ్రీనివాసుడు ఏ విధంగా తన భక్తులను ఈ కలియుగంలో సమ్రక్షిస్తున్నాడు....?
ఇత్యాదిగా కొన్ని ముఖ్యమైన అంశాలను ఒకసారి పరికిద్దాం....
1. ఆంగ్లేయులు భారతదేశాన్ని ఆక్రమించి ఇక్కడి శాంతియుతమైన సనాతన ధర్మ జీవన విధానాన్ని దెబ్బకొట్టి, ఇక్కడి సొత్తంతా కొల్లగొట్టి ఈ దేశానికి ఎంతగానో నష్టం కలిగించేటప్పటికే వివిధ సనాతన ధర్మ వ్యతిరేకమైన రాజులు రాజ్యాలు మతాలు ఈ దేశాన్ని చిన్నాభిన్నం చేయడం ప్రారంభించాయి........
అటువంటి క్లిష్ట పరిస్థితులను, ఇక్కడి ప్రజల సహజమైన సత్త్వ గుణప్రధానమైన జీవనవిధానాన్ని
తమకు అనువుగా చేసుకొని ఆంగ్లేయులు
మరింతగా ఈ దేశంలో విధ్వంసం సృష్టించడం ప్రారంభించారు....
అది అన్నిరకాలుగా ఇక్కడి విద్యావిధానాన్ని, జీవనవిధానాన్ని కూడా ఎంతో ఘోరంగా కోలుకోలేనివిధంగా గాయపరిచింది
కాబట్టి శౌచము, వేదాధ్యయనము, దైవారాధన, సదాచారము, ధర్మము, స్వాధ్యాయము, ఉపాసన, హరికథల ద్వార భక్తి ప్రచారము, ఇత్యాది సనాతనధర్మాంతర్గతమైన ఉనికిపట్ట్లన్నీ కూడా క్రమంగా సమాజంలో క్షీణించడం ప్రారంభించాయి.......
దానికి తోడుగా దేశ జనాభ ( ప్రపంచ జనాభా కూడా )
గణనీయంగా పెరిగిపోవడం అందులో సిమ్హభాగం సత్త్వగుణరహితమై, కలిప్రభావంతో రజోగుణ తమోగుణ సంఘాతము ఉగ్రగుణరూపంగా విజృంభించడం, చాతుర్వర్ణవ్యవస్థ లుప్తమైపోవడం, ఇవ్విధంగా యావద్ సమాజం బాహ్యాంతర కాలుష్యంతో నిత్యం సతమతమవుతూ, పరిశుద్ధమైన నీరు, ఆహారం, తగ్గిపోవడం, ఉగ్రరోగాలు ప్రబలిపోవడం, ఇత్యాదిగా కేవలం జీవించడం కోసమే నిత్యం ఒక దైనందిన పోరాటంలా ప్రజల జీవితాలు మారిపోవడం తో అసలు మనః శాంతి
అనేది ఒకటుంటుందనే విషయంకూడా
తెలియనంతగా ఇవ్వాళ్టి ఆధునిక జీవితాలు జీవితంలో ఆధ్యాత్మికతకు అసలు చోటులేకుండా చేసి చేటు చేయడం మనం గమనించవచ్చు........
ప్రశాంతత లేని జీవితంలో దైవము, దైవారాధన అనేవి అందని ద్రాక్ష.... అంటే యాంత్రికంగా ఏదో రెండు నిమిషాలు చెయ్యగలరేమో కాని ఆ ఆరాధనలో మనోలగ్నత సాధించడం కుదరని పని....
శ్రీచాగంటి సద్గురువులు చెప్పినట్టుగా ఈ కలియుగమానవులు కనీసం 18 క్షణాలపాటు కూడా మనసును నిలకడగా నిలపలేని అశక్తతతో జీవించే దుర్భరపరిస్థితుల్లో జీవనం సాగిస్తుంటారు......
కాబట్టి ఇక మిగతా గొప్ప విషయాలగురించి చింతించేందుకు ఈ కలియుగమానవులకు
అంతగా తీరికలేని కాలం.......
ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లో చిక్కుకొని క్రమేపి కలికాలం అనే సాలీడుగూటిలో చిక్కి శల్యమై కృషించిపోయే కీటకంలా మారిన మనుష్యిడిని ఉద్ధరించి కాపాడి కరుణించి అనుగ్రహించే మార్గం ఏది ....?
అనగా...,
ఎప్పటికీ కలుషితం కానిది....
ఎన్నటికీ శక్తిని కోల్పోనిది....
ఎవ్వరూ అపహరించలేనిది.....
ఎల్లరికీ అందుబాటులో ఉండేది.....
తక్కువ ప్రయాసతో త్వరితగతిన ఎక్కువగా అనుగ్రహించేది.....
అక్షరం.....!!
అక్షరాలు కలిపితే వచ్చే జానపదాలు.....
ఆ పదాల అల్లికలతో వచ్చే పాటలు.....
ఆ పాటలకు సాహితీవిలువలను జోడించి దైవిక మహత్తును జొప్పించి.....బీజాక్షర శక్తిని గుప్పించి...... మకుటాన్ని అలంకరించి రంగరించబడిన అమృతతుల్యమైన సంకీర్తనలు......
"కలౌ సంకీర్త్య కేశవం...." అనే సత్యాన్ని ఆధారంగా చేస్కొని...
కృతయుగంలో 4 పాదాల మీద...
త్రేతాయుగంలో 3 పాదాల మీద...
ద్వాపరంలో 2 పాదాల మీద
ఈ కలియుగంలో కేవలం ఒకే ఒక్కపాదం మీద నిలిచే ధర్మాన్ని రక్షించాలంటే,
ఉన్న ఆ ఎకైక మార్గమైన " సత్యం " అనే పాదాన్ని ఆలంబనగా అన్నమాచార్యులవారు ఆ పరతత్త్వ సత్యాలను సంకీర్తనల్లో పొందుపరచి ఈ లోకంలో వ్యాప్తిగావించబడేలా ఆ శ్రీనివాసుని దేవకార్యం నిర్వహించారు.......
సకల శాస్త్రపురాణవేదేతిహాస జ్ఞ్యానాన్ని మొత్తం అలతి అలతి పదాలలో నిక్షిప్తం గావించి అనంతమై ఉండి ఆద్యంతరహితమై వెలుగొందే ఆ పరమాత్మతత్వాన్ని సులభగ్రాహ్యంగా భక్తులెల్లరికి అందించి వారందరికి ఇహపరలాన్నీ కూడా ఈడేరి జీవితమే శ్రీనివాసుని శ్రీకైంకర్యంగా మారి అందరు చల్లగా జీవించేలా ఆచార్యులు ఎంతో దూరదృష్టితో కరుణతో ఆ సంకీర్తనలను జీవితాంతం రచించి తరించారు....
మనందరిని తరింపజేసారు......
అందుకే ఆ కీర్తనలు సంకీర్తనలయ్యాయి......
సంకీర్తనలు సంకీర్తనామంత్రములయ్యాయి.....
సంకీర్తనామంత్రముల సంపుటి సంకీర్తనావేదం అయ్యింది.....
ఆ సంకీర్తనావేదమే కలిదోషభంజకమైన వైద్యమై వర్ధిల్లి ఎల్లరికి సుఖశాంతులను ప్రసాదించే
శ్రీనివాసుని శ్రీపాదశరణాగతి అనే అమృతమయమైన జీవనవిధానాన్ని ప్రసాదిస్తోంది......
ప్రతి సంకీర్తన కూడా ఒక వెలకట్టలేని ఆణిముత్యమే....
ప్రత్యేకించి కొన్ని మరింతగా తణుకులీనే మేలిమిముత్యాల సరములో ఒదిగిన మణిపూసలా ఎంతో వైభవంతో ఆ శ్రీనివాసుణ్ణి కీర్తించే కడు రమ్యమైన తిరుమంత్ర ద్వయమంత్ర సారప్రతిపాదితములై అలరారే అభినవ జ్ఞ్యానమణిప్రకాశికలు.....
ఎవరు ఎంతగా గురుభక్తి హరిభక్తి అనే పరికరాలతో మెరుగులు దిద్ది ఆ సంకీర్తనామణిపూసల వెలుగులను ప్రకాశింపచేసుకొని వాటిలో ఆ శ్రీనివాసుడి వైభవాన్ని దర్శించి తరిస్తుంటారో వారికి ఆ సంకీర్తనలన్నీ కూడా చిరకాల చింతామణులై ఎల్లప్పుడు అనుగ్రహన్ని వర్శించడం కద్దు......!
మచ్చుకకు ముచ్చటైన ఈ సంకీర్తనను ఒకసారి చూడండి.....
ఎన్నెన్ని పురాణాల గాధలను తనలోఇముడ్చుకొని మనకి వాటన్నిటిని అధ్యయనం గావించిన ఫలితాన్ని అనుగ్రహిస్తున్నదో....
************************
ప|| ఈ పాదమేకదా యిల యెల్లగొలిచినది |
ఈ పాదమే కదా యిందిరా హస్తములకిరవైనది ||
చ|| ఈ పాదమే కదా యిందరును మ్రొక్కెడిది |
యీపాదమే కదా యీ గగన గంగ పుట్టినది |
యీపాదమే కదా యెలమి బెంపొందినది |
యీపాదమే కదా యిన్నిటికి నెక్కుడైనది ||
చ|| ఈ పదమే కదా యిభరాజు దలచినది |
యీపదమే కదా యింద్రాదు లెల్ల వెదకినది |
యీపాదమే కదా యీబ్రహ్మ కడిగినది |
యీపాదమే కదా యెగసి బ్రహ్మాండ మంటినది ||
చ|| ఈ పాదమే కదా యిహపరము లొసగెడిది |
యీపాదమే కదా యిల నహల్యకు గోరికైనది |
యీపాదమే కదా యీక్షింప దుర్లభము |
యీపాదమే కదా యీ వేంకటాద్రిపై నిరవైనది ||
************************
శ్రీమహావిష్ణువుగా క్షీరసాగరంలో ఆదిశేషపర్యంకశయనుడై శ్రీమహాలక్ష్మిచే నిరంతరం పాదసంవాహనం గావించబడే ఆ లోకోత్తరమైన శ్రీపాదపద్మములే,
( అనగా ఇక్కడ లౌకికంగా స్వామివారు అలసటతో పరుండగా కాళ్ళు నొప్పిగా ఉన్నాయని లక్ష్మీ అమ్మవారు అలా కాళ్ళుపట్టడం అని కాదు.......
శ్రీచాగంటి సద్గురువులు నుడివినట్టుగా ఆవిడ ఆయనకు నిత్యాన్నపాయిని.....
( శ్రీలక్ష్మీఅష్టోత్తరం లో పఠించినట్టుగా.....)
లౌకికంగా అర్ధం నిరంతరం స్వామివారికి కావలసిన అన్నపానీయాలు సమకూర్చే పనిలో నిమగ్నమైఉండడం......
కాని మనలా స్వామివారు అన్నము ముద్దపప్పు పెరుగు స్వీట్లు ఒడియాలు మంచినీళ్ళు మజ్జిగ ఇత్యాదివి తినడం ఉండదు కాబట్టి మరి ఎవరికి అలా అన్నపానీయాలు ఆవిడ అలా సమకూర్చుతుంది...?
అక్కడ అవన్నీ చూసుకోవడానికి వివిధ సపర్యలు చేయడానికి విష్ణుపార్శ్వదులు, నిత్యసూరులు లేరా...?
అనే సందేహం రావడం సహజమే......
"నిత్యాన్నపాయినీం నిరవద్యాం...."
అనడంలో అసలైన అర్ధం ఏమనగా
స్థితికారుడైన శ్రీమన్నారాయణుడికి శ్రీమహాలక్ష్మి అమ్మవారు నిరంతరం వెంటేఉండి అన్నీ స్థితికార్యాలకి కావలసిన శక్తిని అందించే తత్త్వసూచిక.......
నారాయణుడు అనగా నారముల యందు వసించువాడు.....
నారములు అనగా నీరు, ప్రాణిసమూహము / నరసమూహము అని వివిధ అర్ధాలు కలవు.....
అనగా ప్రాణికోట్ల పాంచభౌతిక దేహంలోని హృదయపద్మంలో అంతర్యామిగా కొలువైఉండే పరమాత్మ యొక్క యోగక్షేమాలకు అవసరమైనవన్నీ సమకూర్చడం అని అర్ధం...అనగా మన యొక్క దేహపోషణకు మరియు ఆత్మోద్ధరణకు అవసరమైనవి సమకూర్చే అనుగ్రహస్వరూపిణి అని అసలైన అర్ధం...! )
వామనావతారం దాల్చి బలి దర్పాన్ని అణచి 3 అడుగుల భూదానం యాచించి యావద్ విశ్వాన్ని కొలిచిన పాదములు.....
అప్పుడు బ్రహ్మగారు తమ కమండలంలోని నీటితో ఆ శ్రీపాదాలకు పాద్యం ఇవ్వగా ప్రభవించినదే సురగంగానదీ....
ఎనెన్నో వృత్తాంతాల్లో అసురులు దేవతలపై దండెత్తినప్పుడు ఇంద్రుడితో సహా అందరు శరణాగతి గావించి వెతికిన పాదపద్మములు....
గజేంద్రుడు తనపాదాలను ఒడిసిపట్టిన మొసలిని చంపడానికి ఇక తన బలం సరిపోదని గుర్తించి ఎలుగెత్తి మొరలు పెడితే పరుగుపరుగున వచ్చి సుదర్శనచక్రం తో మొసలి కుత్తుకకత్తిరించిన ఆ పరమాత్మ యొక్క పాద్మపద్మములు ...
ఇంద్రుడి కుటిలత్త్వానికి బలై, తన పతి గౌతమమహర్షి చే జడంగా పడుండమని శపించబడిన అహల్యకు శాపవిమోచనం అనుగ్రహించిన శ్రీరామనారాయణుడి పాదపద్మాలు .....
ఎందరెందరో యోగులు సిద్ధులు తపమాచరించగా ఏ శ్రీపాదాల వేలికుండే దుర్నిరీక్ష్యమైన గోటికాంతిని సైతం దర్శించలేరో అటువంటి మహత్తరమైన శ్రీపాదపద్మములే నేడు కలియుగవాసుల భాగ్యపరిపాకమై శ్రీవేంకటాద్రి పై ఆనందనిలయంలోని అష్టదలపద్మపీఠంపై అమరి ఉండి భక్తులెల్లరికి దర్శనంప్రసాదించి ఎనలేని అనుగ్రహన్ని వర్షిస్తున్నది...!
అని ఆ శ్రీనివాసుడి శ్రీపాదవైభవన్ని ఎంత ఘనంగా ఆచార్యులు ఈ సంకీర్తనలో కృతిపరిచినారు కద......
శ్రీవైష్ణవసిద్ధాంతంలో శ్రీమహావిష్ణువు యొక్క అర్చారాధనలో శ్రీపాదార్చన చాల ముఖ్యమైనది, ప్రశస్తమైనది....
ఆపాదతలమస్తకం గా స్వామివారిని అర్చించేది / దర్శించేది అందుకే కద ......
అలాంటి శ్రీపాదాలు అధోలోకాల్లో ఉన్నవారు అర్చిస్తూ ఉన్నకారణంగా సగం మూర్తిభూమిలోపల ఉండగా శ్రీపాదార్చన కావించడం తప్పనిసరి కాబట్టే ద్వారక మహర్షి యొక్క తపఃఫలితంగా ఏర్పడిన ద్వారకాతిరుమలలోని ( చిన్న తిరుపతి ) గర్భాలయంలో ప్రపంచంలో ఎక్కడాలేని విధంగా ఇద్దరు మూర్తులు ఉండడం మనం గమనించవచ్చు......
అంతటి ఘనమైనవి ఆ శ్రీనివాసుడి శ్రీపాదపద్మములు...!!
అందుకే అనుకుంటా వామనావతారంలో విశ్వరూపం దాల్చిన ఆ శ్రీమన్నారాయణుడి పాదాలను సేవించిన గంగమ్మ అంతటి భాగ్యం నాకు ఎప్పుడూ ఉండవలే అని తలచి ఇప్పటికీ ర్యాలి శ్రీజహన్మోహినీకేశవస్వామి వారి ఆలయంలో స్వామి వారి పాదాలదెగ్గర నిరంతరం ఒక ఊటబావిలోని నీరులా పెల్లుబికి స్వామివారి శ్రీపాదాలను సేవిస్తూనే ఉంది...!
ప్రపంచంలో ఎన్నో ఆలయాలు మీరు దర్శించి ఉంటారు కాని ర్యాలి ఆలయంలో అతిలోకసౌందర్యం తో విరాజిల్లే ఆ జగన్మోహినీ స్వరూపం అసలు ఎక్కడా చూసిఉండిఉండరు......
అంతటి సమ్మోహనమైన స్వరూపం ఆ కేశవుడిది....!!!
అసలు అది మానవనిర్మితమైన మూర్తి కాదు అనేది ఆ సజీవసాలిగ్రామ మూర్తిని దర్శించిన వారెల్లరికి ప్రస్ఫుటంగా గోచరించే సత్యం....!!🙏😊
"విష్ణోః పదే పరమ" ఇత్యుదిత ప్రశంసౌ
యౌ "మధ్వ ఉత్స" ఇతి భోగ్య తయాఽప్యుపాత్తౌ |
భూయస్తథేతి తవ పాణితల ప్రదిష్టౌ
శ్రీవేంకటేశ చరణౌ శరణం ప్రపద్యే || 10 ||