Thursday, September 27, 2018

శ్రీమహావిష్ణువు సుదర్శనం..!!

ఒక్క సారి మనసులో స్వామివారిని త్రికరణ శుద్ధితో వేడుకొని మన బాధలను, కష్టాలను స్వామికి విన్నవించుకొంటే, స్వామివారు తమ కుడి చేతిలో ధరించిన సుదర్శన చక్రాన్ని మనకు రక్షగా ఈ 14 లోకాల్లో మనం ఎక్కడ ఉన్నా సరే పంపించేస్తారు.
ఒక్కసారిగా మనము చక్రత్తాళ్వార్ వారి రక్షణా వలయంలోకి వెళ్ళిపోయామంటే , మనకు కష్టం కలిగించే వాళ్ళు, ఎంత గొప్ప వాళ్ళు, ఎంత పెద్ద వాళ్ళు, ఎంత అధికార బలం ఉన్నవాళ్ళు, ఎంత మేధో సంపద ఉన్నవాళ్ళు, మొదలైన వేటితో సంబంధం లేకుండా శత్రువులను ఛీల్చి చెండాడే దాక వెనక్కి తిరిగిపోని అమోఘమైన దైవికాస్త్రం - "సుదర్శనం"..!!
హిందూ ధర్మచక్రం.
శ్రీమహావిష్ణువు లోక కల్యాణం కోసం తన ఆయుధంగా సుదర్శన చక్రాన్ని ప్రయోగించేవాడనే విషయం పురాణాల ద్వారా తెలుస్తుంది. శ్రీమహావిష్ణువు చేతిలోని ఈ చక్రాయుధం అత్యంత శక్తిమంతమైనదని చెప్పబడుతోంది. ఏ ఉద్దేశంతో శ్రీహరి ఆ చక్రాన్ని ప్రయోగిస్తాడో, ఆ ఉద్దేశాన్ని నెరవేర్చనిదే తిరిగిరాకపోవడం ఈ చక్రం ప్రత్యేకత. దేవతలను ... మహర్షులను ... సాధారణ మానవులను అనేక ఇబ్బందులకు గురిచేసిన రాక్షసులు ఎందరో ఈ చక్రానికి బలైపోయారు.
అయితే ఎంత దుర్మార్గులు అయినప్పటికీ మొదటిసారే శ్రీహరి వారిపై చక్రాన్ని ప్రయోగించిన దాఖలాలు కనిపించవు. నయానా .. భయాన చెప్పి చూసినా వినిపించుకోకపోతే, చివరి ప్రయత్నంగా మాత్రమే ఆయన సుదర్శన చక్రాన్ని ప్రయోగించేవాడు. అసలు ఈ చక్రం శ్రీ మహావిష్ణువు ఆయుధంగా ఎలా మారిందనే సందేహం చాలామందిలో కలుగుతుంటుంది. తిరుగులేని ఈ చక్రాన్ని శ్రీమహావిష్ణువుకు ఇచ్చినది పరమశివుడేనని పురాణాలు చెబుతున్నాయి.
పూర్వం 'శ్రీదాముడు' అనే అసురుడు అపారమైన తన శక్తిసామర్థ్యాలతో సమస్త లోకాలలోని ప్రజలను భయభ్రాంతులను చేయసాగాడు. అంతా కలిసి తమని రక్షించవలసిందిగా శ్రీహరిని ప్రార్థిస్తారు. అసురుడి ఆటకట్టించడానికి అవసరమైన సూచన కోసం శివుడిని ప్రార్థిస్తాడు శ్రీమహావిష్ణువు. దాంతో పరమశివుడు ప్రత్యక్షమై, సమస్త దేవతల శక్తి నిక్షిప్తం చేయబడినదంటూ ఓ చక్రాన్ని శ్రీ మహావిష్ణువుకు ప్రసాదిస్తాడు.
ఒకసారి ప్రయోగించబడిన ఆ చక్రాయుధం ఆ పని పూర్తి అయిన తరువాతనే యథాస్థానానికి చేరుకుంటుందనీ, దానిని ఉపసంహరించడం కుదరదని చెబుతాడు. ఎంతటి పరాక్రమం కలిగినవారైనా ... తపోబల సంపన్నులైనా ... వర గర్వితులైనా దాని ధాటికి తల వంచవలసిందేననీ, ప్రాణాలను సమర్పించుకోవాల్సిందేనని అంటాడు. శ్రీదాముడిని సంహరించడానికి ఇదే తగిన ఆయుధమని చెబుతాడు. పరమశివుడికి కృతజ్ఞతలు తెలిపిన శ్రీ మహావిష్ణువు ఆ చక్రాయుధంతో శ్రీదాముడిని సంహరించి, సమస్త లోకాలకు సంతోషాన్ని కలిగించడంలో మరోమారు ప్రధానమైన పాత్రను పోషిస్తాడు.

Raama ka Kahaani and Ganga Ki Paani...


On the occasion of the pious Shree Raama Navami, a small snippet below speaks of what makes INDIA the greatest place in the entirety of this Universe :
Alexander- the great, after his successful victory in battles with the Kings and rulers, was asked at the time of his departure from India to
offer his opinion about India and its greatness.
He said:
“One is Raama ka Kahaani and the other is Ganga Ki Paani”...!
Jai Shree Raam..!

"నీవుగలిగిన చాలు" - "శ్రీ తాడేపల్లి పతంజలి " గారు

నిన్న జరిగిన "నీవుగలిగిన చాలు" , అనే అన్నమాచార్య 607 జయంతి ఉత్సవ సభలో, అన్నమయ్య సాహిత్య విశ్లేషకులు , Tadepalli Patanjali "శ్రీ తాడేపల్లి పతంజలి " గారి పాద పద్మాలకు నమస్కరించే భాగ్యము కలిగింది.
అన్నమాచార్యులు స్వామివారి పై రచించిన కృతులను పాడుకొని ఆనందించడం ఒకెత్తు. ఆ కృతులలోని నిగూఢమైన అర్ధాలను తెలుసుకొని ఆ రచనా శైలిని ఆనందించడం మరోఎత్తు.
సరళమైన తెలుగు భాషలో దాగి ఉన్న శక్తిని అన్నమయ్య ఎంత రసరమ్యంగా ఆనాడు ప్రయోగించారో, ఈనాడు మరో తెలుగు పుంభావ సరస్వతి స్వరూపులు, అన్నమయ్య సాహిత్య సౌరభాలను ఒడిసిపట్టుకొనే భాగ్యం కలిగిస్తున్నారు. వీరి సరళమైన విశ్లేషణాత్మక శైలిలో , అద్వైత - విశిష్టాద్వైత సిద్ధాంత సర్వస్వమును "సోహం - దాసోహం "అనే పదాలతో ఎంత చక్కగా వివరించారో చూడండి.

For those who wish to cross this mundane world The protector is Lord Venkateswara..!

Have come across a very special Annamaachaarya Kruti, which is just the entire gist of tons of philosophical literature by many an eminent scholar. If one can carefully analyse the Kruti, its indeed one of the greatest Krutis that
brings the "Adwaita" & "Vishistaadwaita" philosophies on to the same plane.
[ For that one can very clearly see the reflection of Sri Aadi Shankaraachaarya's "BhajaGovinda Stotram" in this Keertana ]
Many thanks to Shankar Gandham gaaru for a great explanation of the Kruti @
http://annamacharya-lyrics.blogspot.in/…/179inni-chaduvanel…
--------------------------------------------------
Why read so much ?
Why search everywhere ?
You open your eyes when you are born
And close when you are gone
If there is a want, there is an attachment
If there is no desire, that is liberation
There lies knowledge !
Birth is a doubt and death is a fact
That is knowledge
For those who wish to cross this mundane world
The protector is Lord Venkateswara..!
--------------------------------------------------
ANNAMACHARYA-LYRICS.BLOGSPOT.COM
Sri Tallapaka Annamacharya (1408-1503) the saint composer of the 15th century is the earliest known musician of India to compose 32k songs called…

శ్రీరామరామరామేతి రమేరామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే... !

Vinay Kumar Aitha shared a photo.
25 May 2015
Jai Shree Raam !
Madhavi Latha to Hindu Powerful slokas mantrams
అర్థం.. అది ఎలా అంటే పూర్వం మన పదాలకు గణాలనీ.. ప్రతి అక్షరానికి ఒక విలువను కెటాయించి వాటిని సరైన క్రమంలో అమర్చి వ్యాకరణాన్ని, శాస్త్రాలను తయారు చేసారు.. దీనినే కటపయాది సూత్రం అంటారు..‘ పై ’విలువ కూడా ఈ పద్ధతి ద్వారానే కనుగొన్నారు.. ఇది ఎంత ఖచ్చితమైన దంటే దశాంశం ప్రక్కన ఇరవై మూడు అంకెలను కూడా గుర్తించదగినంత ఖచ్చితమైన సూత్రం.. అందుకే రామ నామ విలువను అంత గొప్పగా వివరించగలిగారు...
రామ నామము యొక్క ఇంకొక విశేషమేమంటే ఈ పదం నారాయణ మంత్రంలో ‘నారాయణ’ లోని రెండవ అక్షరం .. పరమ శివుని పంచాక్షరీ మంత్రం నమఃశివాయ లోని రెండవ అక్షరం రెండింటి కూర్పే.. రామ మంత్రం.. సాధారణంగా ఒక పద్యం లో వాక్యంలోని రెండవ అక్షరాన్ని యతి అంటారు...
నారాయణ మంత్రం లోని యతి..
నమఃశివాయ మంత్రం లోని యతి ల కూర్పే.. రామ మంత్రం..
సాక్షాత్తూ పరమ శివుడు పార్వతీ దేవికి ఉపదేశించిన మంత్రంగా దీనిని చెపుతారు..
అందుకే అన్ని మంత్రాలలోకెల్లా రామ మంత్రం చాలా బలమైనది అని చెపుతారు..
ధ్యానమును ప్రారంభించే వారికి మొదట మంత్ర జపాన్ని కానీ నామ జపాన్ని కానీ అదీ శ్రీరామ మంత్రం తోనే ప్రారంభించే విధంగా గురుదేవులు ఉపదేశిస్తారు..
అందరికీ శ్రీరామానుగ్రహ ప్రాప్తిరస్తుః
(పరిపూర్ణానంద స్వామి వారి ప్రవచనములలోచెప్పబడిన రహస్యమిది!!)
జైశ్రీరామ్ !!!!

The heritage of the sunken city mighty Dwaaraka ..!

Vinay Kumar Aitha shared a post.
29 May 2015
The heritage of the sunken city mighty Dwaaraka ..!
Thallapaka annamacharyulu
సాగర గర్భంలో మునిగిపోయిన కృష్ణ ద్వారక — in Gujarat, India.
192 కిలోమీటర్ల పొడవు...
192 కిలోమీటర్ల వెడల్పు..
36864 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం..
బారులు తీరిన వీధులు..
వీధుల వెంట బారులు తీరిన చెట్లు..
రాయల్‌ ప్యాలెస్‌లు..
రెసిడెన్షియల్‌ కాంప్లెక్స్‌లు..
కమర్షియల్‌ మాల్స్‌..
కమ్యూనిటీ హాల్స్‌..
క్రీస్తుపూర్వం నాలుగు వేల సంవత్సరాల నాడే
అపూర్వ మహానగరం..
రత్నస్తంభాలు..
వజ్ర తోరణాలు..
సాటిలేని ఆర్కిటెక్చర్‌..
సముద్రం మధ్యలో మహా నిర్మాణం..
జగన్నాథుడి జగదేక సృష్టి..
క్రీస్తుపూర్వం 5000 సంవత్సరాల నాటి
లెజెండ్‌ సిటీ...
ద్వారక..
ఇప్పుడు సాగర గర్భంలో..
మన నాగరికత..
మన సంస్కృతి..
మన ప్రతిభకు పట్టం కట్టిన
నాటి కాస్మోపాలిటన్‌ సిటీ..
ద్వారక
----------------------------
అవును, రామాయణం నిజం.. మహా భారతం నిజం.. ద్వాపర యుగం నిజం.. వేల ఏళ్ల నాటి మన సంస్కృతి నిజం.. అద్భుతమైన మన నాగరికత నిజం.. అపూర్వమైన మన సైన్స్‌ నిజం.. సాటి లేని మన ఇన్వెన్‌షన్స్‌ నిజం.. ఇందుకు ఈ సముద్ర గర్భంలో కనిపిస్తున్న మహానగరమే తిరుగులేని ఉదాహరణ.. ఒక్కమాటలో చెప్పాలంటే.. ద్వారక.. గోల్డెన్‌ సిటీ ఆఫ్‌ ఇండియా..
1980వ దశకంలో గుజరాత్‌ సముద్ర తీరంలో జరిగిన పరిశోధనలు భారతీయ చారిత్రక నిర్మాణంలో అపూర్వ ఘట్టాన్ని ఆవిష్కరించింది. పశ్చిమాన గోమతి నది అరేబియా సముద్రంలో కలిసే ప్రాంతంలో సాగర గర్భంలో ఒక మహానగరం బయటపడింది.. మహాభారత కాలాన్ని, శ్రీకృష్ణుడి ఉనికిని ఈ నగరం బయటి ప్రపంచానికి చాటి చెప్పింది.. ఇదే ఇవాళ మనం చెప్పుకుంటున్న ద్వారక.. .కృష్ణుడి ద్వారక.. విశ్వకర్మ నిర్మించిన ద్వారక..
ఈ తవ్వకాల్లో ఏవో చిన్న చిన్న రాళ్ల కట్టడాలు దొరికాయనుకుంటే పొరపాటే.. శిథిలాల రూపంలోనే అయినా, ఒక మహా నగరమే బయటపడింది.. సముద్రం అట్టడుగున ముందుకు వెళ్తున్న కొద్దీ వెళ్తున్నట్లే.. కిలోమీటర్ల కొద్దీ, అంతమెక్కడో తెలియనంత విస్తీర్ణంలో అపురూపమైన నిర్మాణం వెలుగు చూసింది..
మన దేశంలో ప్రసిద్ధి చెందిన ఆర్కియాలజిస్ట్‌ ఏస్‌.ఆర్‌. రావు నేతృత్వంలో సాగిన ఈ పరిశోధనలు ఈ మహానగరాన్ని దాదాపు క్రీస్తుపూర్వం 3150 సంవత్సరాల క్రితం నాటిదిగా నిర్ధారించారు.. మహాభారత కాలంలో కృష్ణుడు నిర్మించిన ద్వారకగా స్పష్టమైంది..
శ్రీకృష్ణుడు జన్మించిన సమయం క్రీస్తుపూర్వం3222 జూలై 27 శుక్రవారం అర్ధరాత్రి... మధురలో కంసుడి జైలులో జగద్గురువు జన్మించాడు.. కంసుడిని చంపిన తరువాత మధురను ఏలుతున్న కృష్ణుడిపై మగధ రాజు జరాసంధుడు, కాలయవనుడితో కలిసి 17 సార్లు యుద్ధం చేశాడు.. చివరకు ప్రజలకు రక్షణ కల్పించటం కోసం ఏకంగా పశ్చిమ తీరానికి వచ్చి గోమతి తీరంలో ద్వారకను కృష్ణుడు నిర్మించాడు..
శ్రీకృష్ణ నిర్యాణానంతరం సునామీ రూపంలో ప్రళయం వచ్చి ద్వారక సాగర గర్భంలో కలిసిపోయింది. కాలగర్భంలో ఆనవాలే లేకుండా పోయింది. మనకంటూ చరిత్రే లేదని అనిపించేలా అదృశ్యమైంది..
-------------------
ద్వారక సముద్రంలో మునిగిపోయిన తరువాత భారత్‌ నాగరికత కూడా మాయమైపోయింది.. మనం అన్నీ మర్చిపోయాం.. మన కల్చర్‌ గురించి మనకు అందించేవాళ్లే లేకుండా పోయారు. ఇప్పుడు అయిదు వేల ఏళ్ల తరువాత ఒక్కటొక్కటిగా బయటపడుతున్న మన మూలాల్ని చూస్తుంటే మనకే కాదు.. ప్రపంచ దేశాలన్నింటికీ కళ్లు బైర్లు కమ్ముతున్నాయి.
సాగర గర్భంలో బయటపడిన ద్వారక నగరం ఆషామాషీ నగరం కానే కాదు.. ఇవాళ మనకు తెలిసిన గొప్ప గొప్ప నగరాలకంటే వెయ్యి రెట్లు అడ్వాన్స్‌డ్‌ మెట్రోపాలిటన్‌ సిటీ అని చెప్పవచ్చు. శ్రీకృష్ణుడు పర్‌ఫెక్ట్‌ ప్లాన్‌తో ద్వారక నిర్మాణానికి పూనుకున్నాడు.. విశ్వకర్మతో ఈ నగరాన్ని నిర్మించాడు.. గోమతి నది, సముద్రంలో కలిసే చోటును నగర నిర్మాణానికి ఎంచుకున్నాడు. అక్కడ సుమారు 36 వేల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో నగర నిర్మాణం జరిగింది.
ఈ నిర్మాణం కూడా అలాంటిలాంటి సెユ్టల్‌ కాదు. ద్వారకలో తొమ్మిది లక్షలు.. అవును.. అక్షరాలా తొమ్మిది లక్షల రాజభవనాలు ఉండేవి.. శ్రీకృష్ణుడి అష్ట భార్యలతో పాటు 16వేల మంది గోపికలకూ ఒక్కో రాజభవనం ఉండేదిట.. ఈ భవనాలన్నీ కూడా క్రిస్టల్స్‌, ఎమరాల్డ్‌, డైమండ్స్‌ వంటి అపురూప రత్నాలతో నిర్మించారు..ఒక్క మాటలో చెప్పాలంటే సిటీ ఆఫ్‌ గోల్డ్‌గా ద్వారకను చెప్పుకోవాలి..
పొడవైన అతి పెద్ద పెద్ద వీధులు.. వీధుల వెంట బారులు తీరిన చెట్లు.. మధ్యమధ్యలో ఉద్యానవనాలు.. వాటి మధ్యలో రాజభవనాలు.. ఏ వర్గానికి ఆ వర్గం ప్రత్యేకమైన నివాస గృహాలు.. వ్యవసాయ క్షేత్రాలు.. ఒక క్రమ పద్ధతి ప్రకారం ఒక నగరం ప్రజలందరికీ ఎలాంటి సౌకర్యాలు ఉండాలో.. అలాంటి సౌకర్యాలన్నింటితో నిర్మించిన ఏకైక నగరం ద్వారక..
నగర నిర్మాణం ఇళ్లు, వీధుల నిర్మాణంతోనే అయిపోయిందనుకుంటే పొరపాటే.. హైదరాబాద్‌ మహానగరంలో ఎక్కడ కమర్షియల్‌ జోన్లు ఉండాలో, ఎక్కడ రెసిడెన్షియల్‌ జోన్లు ఉండాలో ఇప్పుడు మాస్టర్‌ ప్లాన్లు వేస్తున్నారు.. ఇప్పటికే కట్టిన నిర్మాణాలను ఎలా తొలగించాలో తెలియక సిగపట్లు పడుతున్నారు.. కానీ, ద్వారకలో ఆనాడే ఇవన్నీ ఉన్నాయి.. కమర్షియల్‌ జోన్లు, ప్లాజాలు, అవసరమైన ప్రతిచోటా పబ్లిక్‌ యుటిలిటీస్‌, భారీ షాపింగ్‌ మాల్స్‌ అన్నీ ఉన్నాయి..
బ్యూటీకే.. బ్యూటీ... అందమైన గార్డెన్‌లు, పూల సువాసనలు, సరస్సులతో ద్వారక గోల్డెన్‌ సిటీ ఆఫ్‌ ఇండియాగా అలరారిందనటంలో సందేహం లేదు.
----------------------------
రామాయణ కాలంలో రావణుడి ఎయిర్‌పోర్ట్‌లను కనుగొన్నాం.. అతని ఆర్కిటెక్చర్‌ నైపుణ్యాన్ని తెలుసుకున్నాం.. భారత కాలంలో ద్వారక శ్రీకృష్ణుడి దార్శనికతకు దర్పణం పట్టింది.. భారత దేశంలో వేల ఏళ్ల నాడే అపూర్వ నాగరికత ఉన్నదన్న వాస్తవాన్ని ప్రపంచానికి చాటి చెప్పింది.. కాల గర్భంలో కలిపేందుకు చూసినా కలిసేది కాదని నిరూపించింది..
న్యూయార్క్‌ సిటీ, వాషింగ్టన్‌ డిసి, లండన్‌, మాస్కో, బీజింగ్‌, టోక్యో, ముంబయి.. ఇవన్నీ ఏమిటని అనుకుంటున్నారా? ఇవాళ ప్రపంచం గొప్పగా చెప్పుకునే, చాటుకునే మహానగరాలు.. మెట్రో పాలిటన్‌ సిటీలు.. కాస్మో పాలిటన్‌ సిటీలు.. ఏళ్ల తరబడి కష్టపడితే తప్ప ఇవాళ్టి రూపానికి రాలేని నగరాలు..
ఈ మెట్రో, కాస్మో పాలిటన్‌లకు వేల రెట్లు అడ్వాన్స్‌డ్‌ అభివృద్ధితో అపురూప నగర నిర్మాణం ఆనాడే జరిగింది. అదే ద్వారక.. ఇక్కడ కేవలం కమర్షియల్‌ జోన్లు ఏర్పాటు చేయటమే కాదు. సాగర తీరంలో గొప్ప హార్బర్‌ను కూడా యాదవ రాజులు సక్సెస్‌గా నిర్వహించారు. గ్రీకు, ఇతర దేశాలతో నౌకల ద్వారా అంతర్జాతీయ వర్తకం కూడా చేసినట్లు ఆధారాలు కనిపిస్తున్నాయి.
ప్రముఖ ఆర్కియాలజిస్ట్‌ ఎస్‌ఆర్‌ రావు పరిశోధనల్లో ద్వారక ఆరు ప్రధాన రంగాల్లో ద్వారక అభివృద్ధిని సాధించిందని ధృవీకరించారు. ద్వారకను ద్వారామతి, ద్వారావతి, కుశస్థలి గా పిలిచేవారని కూడా తేల్చారు..
క్రీస్తుపూర్వం 3138లో మహాభారత యుద్ధం జరిగింది. యుద్ధం జరిగిన తరువాత 36 సంవత్సరాల పాటు శ్రీకృష్ణుడు ద్వారకలోనే ఉన్నాడు.. ఆ తరువాత యాదవ రాజుల మధ్య పరస్పరం గొడవలతో ఒకరికొకరు చంపుకున్నారు.. ఆ తరువాత కొంతకాలానికే శ్రీకృష్ణుడు దేహ పరిత్యాగం చేసి భూమిని విడిచివెళ్లిపోయాడు..ఈ భూమిపై కృష్ణుడు నివసించింది 120 సంవత్సరాలు. కృష్ణ నిర్యాణానంతరం ద్వారకను సముద్రం ముంచివేసింది. సాగరం ఉవ్వెత్తున ఎగిసి వస్తుంటే తాను ప్రత్యక్షంగా చూసినట్లు అర్జునుడు మహాభారతంలో చెప్తాడు..
సాగర గర్భంలో మునిగిపోయింది మునిగిపోగా.. తీరం వెంట కూడా ద్వారకకు సంబంధించిన, కృష్ణుడి రాజ్యానికి సంబంధించిన ఆనవాళ్లు లభించాయి. ప్రస్తుత ద్వారకాధీశ్‌ ఆలయం కూడా కృష్ణుడి మనవడు వజ్రనాభుడే నిర్మించినట్లు చరిత్ర చెప్తోంది...అసాధారణ భారతీయ ప్రతిభకు, నాగరికతకు, సంస్కృతికి ఎవరెస్ట్‌ శిఖరమంత కీర్తి -కృష్ణ ద్వారక.

ఏడు కొండల స్వామి సన్నిధికి ఏడు దార్లు...!

ఏడు కొండల స్వామి సన్నిధికి ఏడు దార్లు...!
BASETTYBHASKAR.BLOGSPOT.COM
about hindu tradition “a religion of hindu festivals” and telugu devotional channels like svbc channel,bhakti tv,om web channel,,all telugu e-news papers and…