Thursday, January 31, 2019

శ్రీకృష్ణుడు పాలించిన ద్వారక గురించిన విశేషాలు

శ్రీకృష్ణుడు పాలించిన ద్వారక గురించిన విశేషాలు:: ప్రస్తుత ద్వారక గురించి తెలుసుకోవాలని ఉందా?? అయితే పూర్తిగా చదవండి??
క్రీస్తుపూర్వం 4000 సంవత్సరాల నాటి. ద్వారక.. ఇప్పుడు సాగర గర్భంలో..
ద్వారక మహానగరం :
భారతదేశంలో ఉన్న హిందువుల ఏడు పవిత్రక్షే త్రాలలో ద్వారకాపురి ఒకటి.
"అయోధ్య మథుర మాయ కాశి కాంచి అవంతిక
పూరి ద్వారకావతి చైవ సప్తైత మోక్షదాయిక" - గరుడ పూర్ణిమ
క్షేత్రం అంటే పవిత్రమైన ప్రదేశం. దైవీక శక్తికి కేంద్రం. జీవుడికి తుది గమ్యమైన మోక్షమును అందించే మోక్షపురి. గరుడ పురాణం పేర్కొన్న ఏడు మోక్షపురాలు వరుసగా అయోధ్య, మథుర, మాయా, కాశి, కాంచి, అవంతిక, పూరి మరియు ద్వారావతి.
1980వ దశకంలో గుజరాత్ సముద్ర తీరంలో జరిగిన పరిశోధనలు భారతీయ చారిత్రక నిర్మాణంలో అపూర్వ ఘట్టాన్ని ఆవిష్కరించింది. పశ్చిమాన గోమతి నది అరేబియా సముద్రంలో కలిసే ప్రాంతంలో సాగర గర్భంలో ఒక మహానగరం బయటపడింది..
భారతీయ సంస్కృతిని సజీవంగా, వటవృక్షంగా నిలబెట్టిది. అదే ద్వారక. అయిదువేల ఏళ్ల నాడే అద్భుతాల్ని సృష్టించిన అపూర్వ నగరం... ఇవాళ సాగర గర్భంలో కనిపిస్తోంది.. అయిదు వేల ఏళ్ల తరువాత కూడా చెక్కుచెదరని మహానగరం ద్వారక.. 192 కిలోమీటర్ల పొడవు... 192 కిలోమీటర్ల వెడల్పు.. 36864 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం. నాలుగు వేల సంవత్సరాల నాడే అపూర్వ మహానగరం.. జగన్నాథుడి జగదేక సృష్టి..
చరిత్ర చెప్పినదానిని పోల్చి చూస్తె... ఈ ద్వారక నగరం గౌతమి నది అరేబియా సముద్రంలో కలిసే దగ్గర ఉన్నదని తెలుస్తూంది... కంస సంహారానంతరం శ్రీకృష్ణుడు (Feb 9, Friday , 3219 BC ) ... సముద్రుని సహకారంతో విశ్వకర్మ సారధ్యంలో 12 యోజనాల విస్తీర్ణంతో 6 సేక్టర్ల తో.... ఈ పట్టణాన్ని సువర్నమయంగా నిర్మించినదని తెలుస్తుంది... అందులో ఉండే వీధులు... ఆకాశ హర్మ్యాలు అన్నీ ఎంతో అధ్బుతంగా ఉండేవని వర్ణన... (సముద్ర మధ్యం లో ఇంత పెద్ద నిర్మాణాన్ని నెలకొల్పాలంటే ఎంత విజ్ఞానాన్ని వాడి ఉండాలి..)
మన పురాణాల ప్రకారం...అర్జునుడు శ్రీ కృష్ణుడు చనిపోయినతర్వాత ద్వారక సముద్రంలో కలిసిపోయే సమయంలో అక్కడే ఉన్నాడని.. చివరి సౌధం మునిగిపోయి మామూలు సరస్సు మాదిరి అయ్యే వరకు.. ఆ స్థలాన్ని వదలలేదట (బాధతో నిష్క్రమిస్తాడట).... ఆ సమయాన్ని పోలిస్తే సుమారు ఈ సంఘటన క్రీ. పూ. 3102 సంవస్త్సరంలో జరిగింది...
ప్రస్తుతం ఈ ప్రాంతంలో లభించిన అవశేషాలను... పురావస్తు శాస్త్రజ్ఞులు లెక్క వేసే దాని ప్రకారం ఖచితంగా కృష్ణుడి ఉనికి సూచిస్తున్నాయి.... వీటన్నిటి ఆధారాలు లభిస్తున్నాయి.... దీని వెంట ఆ చరిత్రకు సంబంధిన చిత్రాలను కూడా ఉంచుతున్నాను...
http://teluguvignanamvinodam1.blogspot.in/20…/…/part-2.html…
http://teluguvignanamvinodam1.blogspot.in/…/blog-post_17.ht…
వీక్షించండి...
సముద్రంలో పరిశోధించిన ఆ కాలానికి సంభందించిన పాత్రలు.... గంట.... వీటన్నిటిని పరిశోధిస్తే అవి (క్రీ. పూ. 3103 ) 5102 సంవత్సరాల క్రిందవని తెలిసింది.. ప్రపంచం లోహన్నే కనుగొనని సమయాన పెద్ద పెద్ద లంగరులు లభించాయంటే ఎంత పెద్ద ఓడల నిర్మాణం చేపట్టి ఉండవచు.. ఇక్కడ దొరికిన లంగరులను చూస్తే అదే తెలుస్తుంది.... ఆ కాలంలో వాడిన పాత్రలు చూస్తే అవి మిశ్రమ లోహానికి సంభందించినవి.... అప్పటికి ఇంకా అల్యూమినియం కనుక్కోలేదు.... మన శాస్త్రజ్ఞులకు సింధు నాగరికత... హరప్పా మొహంజొదారో నాగరికత కు సంబంధించిన ఆనవాళ్ళు మాత్రమే దొరికాయి.... కాని అవి క్రీ.పూ. 3200 వి కావు... అవి 1300 BC కు సంబందిచినవి...
ద్వారకకు సంభందించిన నాగరికత చాల పురాతనమయినది.... ఈ ఆనవాళ్ళు ఎవరికీ దొరకక పోవటం... చరిత్రలో ఎక్కక పోవటం .. విచిత్రం... హాస్యాస్పదం.... కాని చివరకు మహాభారత రామాయణాలు.. కేవలం కథలు అని మాత్రం చెప్తారు...
మన నాగరికత.. మన సంస్కృతి.. మన ప్రతిభకు పట్టం కట్టిన ద్వారక.
క్రీస్తుపూర్వం 4000 సంవత్సరాల నాటి. ద్వారక.. ఇప్పుడు సాగర గర్భంలో..

పురాణాలలో విశిష్టమైన త్రయాలు ...



Sri Chaganti Satsang, Vizag
పురాణాలలో విశిష్టమైన త్రియాలు ఏవి ?
బ్రహ్మ , విష్ణు , మహేశ్వరులు ----------------- త్రిమూర్తులు
సరస్వతి , లక్ష్మి , పార్వతి ---------------------త్రిమాతలు
భూలోకము , స్వర్గలోకం ,పాతాళలోకం ----------త్రిలోకాలు
భూత , వర్త , భవిష్యత్ కాలము ----------------త్రికాలాలు
సత్వ, రజో , తమో గుణము -------------------త్రిగుణాలు
పిత్రు ఋణము , ఋషి ఋణము , దేవ ఋణము---త్రిఋణాలు
ఉదయము , మధ్యాహ్నము , సాయంత్రము ------త్రిసమయాలు
కీర్తి -కాంత-కనకం--------------------------తాపత్రయాలు
కర్మత్రయం :--
ఎండ,వర్షం,చలి-----------------వాతావరణం అనే విషయాన్ని సూచించే కర్మత్రయం,
అదుపు,స్వేచ్ఛ,ఉపేక్ష------------మన అధీనుల యెడల మనం అవలంబించవలసిన వైఖరి కి సంబంధించిన కర్మత్రయం,
నిజం,అబద్దం,రహస్యం-----------మనం ఇతరులకు ఏదైనా సమాచారం చెప్పవలసి వచ్చిన సందర్భంలో కర్మత్రయం,
రాజ్యం,సమాజం,వ్యక్తి------------రాజకీయ వ్యవస్థకు సంబంధించిన కర్మత్రయం,
విశ్వాసం,శాస్త్రీయత,హేతుబద్ధత----ఆలోచనా విధానానికి సంబంధించిన
కర్మత్రయం

Sunday, January 27, 2019

2019 గణతంత్రదినోత్సవం సందర్భంగా భారత ప్రభుత్వంచే లలితకళల విభాగంలో పద్మశ్రీ పురస్కారాన్ని వరించిన శ్రీ సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారికి ఒక సహిత్యాభిమాని సాదర నమస్సులు... :)

శ్రీ వేటూరి సుందరరామమూర్తి గారు, శ్రీ (సిరివెన్నెల) సీతారామ శాస్త్రి గారు, ఈ రెండు రామనామప్రయుక్తమైన పేర్లు తెలియని తెలుగు సినిమా వీక్షకులు, తెలుగు సినీ సుసంగీతారాధకులు ఉండరనడం అతిశయోక్తి కానేరదు... అంతగా వెండితెరకు అక్షరవెలుగుజిలిగులు అలదిన పుంభావ సరస్వతీ స్వరూపులు వారిరువురు... తెలుగు సినిమా అనే బండికి 2 మేటి చక్రాలై సాగిన వారి రచనా ప్రస్థానం, భాషా మమకారం కలిగిన ఎందరెందరికో మదిలో చింతను దూరంచేసి ఎదలో స్వాంతన కలిగించేలా రచింపబడిన వన్నె తరగని పరిమళ సాహితీ పారిజాతాలు ఆస్వాదించేందుకు కలకాలం ఒక కమ్మని పాటగా నిరంతరం చెవిలో మార్మోగుతూనే ఉంటుందనడం కద్దు...!
శాస్త్రి గారి కలమునుండి జాలువారిన కవనాలు కోకొల్లలు...కాని ఆ సినిమా పేరునే తమ పేరులో కలిసిపోయేంతగా చేసిన, ఎందరెందరికో సిరివెన్నెల చిత్రంలోని ఈ క్రింది చరణాలు హృదయఫలకంపై ముద్రించుకుపోయిన శాశ్వత ఆనందలహరులు... ( ఈ పాట పాడుకుంటూ, అవి ప్రేరణగా తీసుకుని నేను ఎన్నో స్వకవనాలు రచించుకున్నాను కూడా..!  )
" నా ఉచ్ఛ్వాసం కవనం...నా నిశ్వాసం గానం...
సరసస్వర సుర ఝరీగమనమౌ సామవేదసారమిది..
నే పాడిన జీవన గీతం...ఈ గీతం...
విరించినై విరచించితిని ఈ కవనం...విపంచినై వినిపించితిని ఈ గీతం.... " ! 
2019 గణతంత్రదినోత్సవం సందర్భంగా భారత ప్రభుత్వంచే లలితకళల విభాగంలో పద్మశ్రీ పురస్కారాన్ని వరించిన శ్రీ సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారి అమరసాహితీఝరి సదా సురగంగాతరంగతురగపు పదఘట్టనమై సాగిపోవాలని అభిలషిస్తూ, వారికి ఒక సహిత్యాభిమాని సాదర నమస్సులు... 

2019 - Padma Awards ...!

Vinay Kumar Aitha
22 hrs
On the occasion of 70th Indian Republic Day celebrations, 2019 - Padma Awards have been conferred on 112 dignitaries across the nation with 2 Telugu Stalwarts each from TS & AP.
Shree Siri Vennela Seetaaraama Shaastri, Dronavalli Harika, MohanLal, PrabhuDeva, Shankar Mahadevan, Gautam Gambhir, being the well known names in the list from South India.
And the highest Indian civilian award of ' Bharata Ratna ' for 3 coveted personalities - Shree Pranab Mukherjee, Shree Nanaji Deshmukh, Shree Bhupen Hazarika 
About This Website
INDIANEXPRESS.COM
Twenty-one of the awardees are women, 11 persons are from the category of foreigners/NRI/PIO/OCI; there are three posthumous awardees and one transgender person.

Friday, January 25, 2019

సద్గురు శ్రీ త్యాగరాయులవారి 172 సంవత్సరాల ఆరాధనోత్సవాలు ...! :)

Vinay Kumar Aitha shared a post.
Just now
ప. రాగ సుధా రస పానము జేసి రంజిల్లవే ఓ మనసా
అ. యాగ యోగ త్యాగ భోగ ఫలమొసంగే (రా)
చ. సదాశివ మయమగు నాదోంకార స్వరవిదులు జీవన్ముక్తులని త్యాగరాజు తెలియు (రా) 
అని శ్రీ సద్గురు త్యాగరాయులవారు 172 సంవత్సరాల క్రితమే శాస్త్రీయ సంగీతం యొక్క ప్రాభవాన్ని నొక్కివక్కానిస్తూ, తాము రచించి స్వరపరిచిన అనేక కృతులను ఈనాటికి కూడా ఎందరో రాగయుక్తంగా ఆలపించి / ఆలకించి ఆనందించగలగడం సంగీతప్రియులెల్లరికి సంప్రాప్తించిన ఒక దివ్యమైన అయాచిత పెన్నిధి...
ప్రపంచంలో మరే విద్యకు లేని ఘనత కేవలం సంగీతానికి ఉన్నదంటూ, నవజాత శిశువుల మొదలుకొని చతుష్పదులైన జంతువులు, విశేషజీవులైన పాములవరకు, సంగీతం రంజింపజేయని జీవుడు లేడు అంటూ "శిశుర్వేత్తి పశుర్వేత్తి వేత్తి గానరసం ఫణిః..." అని మన పెద్దలు చెప్పడం వింటూనే ఉంటాం...
అస్మద్ గురుదేవులు శ్రీ చాగంటి సద్గురువుల ప్రవచనాలు విన్న వారికి తెలిసినట్టుగా,
ఈ కలియుగంలో కనీసం 18 క్షణాల పాటైనా మన మనసును ఒకే వస్తువు పై నిలపలేని చపల చిత్తులం కనుక, ఎన్ని గొప్ప గొప్ప ఆధ్యాత్మిక బోధలు చేసినా సరే అవి కొండలపైనుండి జాలువారే జలపాతంలా అనతి కాలంలోనే మనోఫలకము నుండి జారిపోవడమే తప్ప మనోస్థిరత్వాన్ని సాధించి పెట్టి జీవుడికి ఉన్నతి కలిగించే సాధనములై ఒప్పుట కల్ల...
కేవలం అనునిత్యం యెదలో ఆరాధించబడే సద్గురువుల వాక్కులు మరియు భగవద్ నామగుణవైభవ సంకీర్తనం వినా, మరే ఇతర సాధనం కూడా అంత గొప్పగా భక్తున్ని భగవంతునివైపు నడిపించలేదు అనే సత్యాన్ని దర్శించిన యోగులై, సమస్తమానవాళి యొక్క యోగక్షేమమును కాంక్షించి, భగవంతుడు / అతని పరివారము అప్పుడప్పుడు భువి పైకి సద్గురువులుగా దిగివచ్చి, తనను చేరే మార్గాన్ని తానే ఉపదేశించడం, ఆనాటి శ్రీ ఆది శంకరాచార్యులు, శ్రీ రామానుజాచార్యులతో మొదలుకొని, నిన్నటి శ్రీ అన్నమాచార్యులు, శ్రీ త్యాగరాయ - శ్రీ ముత్తుస్వామి దీక్షితర్ - శ్రీ శ్యామశాస్త్రి - సంగీతత్రయం, శ్రీ కంచర్ల గోపన్న / భద్రాచల రామదాసు, శ్రీ బమ్మెర పోతనామాత్యుల వారు, శ్రీ జయదేవుడు, శ్రీ తులసీదాస్, శ్రీ సూర్దాస్, శ్రీ కబీర్దాస్, శ్రీ మీరాబాయి, ... వరకు ఇత్యాది ఎందరెందరో సద్గురువులు భగవంతునిపై మన మనసు లగ్నమయ్యేలా పద్యాలు, దోహాలు, సంకీర్తనలు, అష్టపదులు మొదలైన వివిధ మార్గాల్లో వారు అందించిన చిరంతన సంగీతసారస్వతామృతఝరులు కోకోల్లలు....
( త్యాగరాజు - పోతరాజు - గోపరాజు, ఈ అధ్యాత్మ రాజత్రయం తెలుగు భక్తి సంగీతసాహిత్యలోకానికి మకుటం లేని శాశ్వత మహారాజులు గా కొలువైన కీర్తికాయులు అని అస్మద్ గురువుదేవులు తమ ప్రవచనాల్లో నుడివినారు....)
ఇందరి సద్గురువుల్లో, సద్గురు త్యాగరాయ స్వామి వారిది ఒక విశేషమైన స్థానంగా పెద్దలు చెప్తూఉంటారు...
అలనాటి త్రేతాయుగపు శ్రీరాముల వారే ఈనాటి కలియుగపు తమ జీవిత సర్వసంగా భావించి సేవించి తరించిన సాధువరేణ్యులు. (భద్రాచల శ్రీరామదాసుల వారిలా....)
వారి భక్తిభరిత జీవనాన్ని చూసి ఓర్వలేని సహోదరుడే కడుపులో రగిలిపోతున్న కుళ్ళుతో భార్య నూరిపోసిన చెప్పుడు మాటలు విని, త్యాగరాయులవారి సీతారామచంద్రలక్ష్మణ స్వామి నిత్యారాధన మూర్తులను రాత్రి అపహరించి కావేరి నదిలో వేసి తమ అక్కసు వెళ్ళగక్కినప్పుడు, ఆ మూర్తులకోసం ఏడిచి ఏడిచి ఊర్లన్నీ తిరుగుతూ, సాక్షాత్ బ్రహ్మ మానసపుత్రులు, త్రిలోకసంచారులు, మహతి వీణాగమకిత నిరంతర శ్రీమన్నారాయణ నామస్మరణోపాసకులైన శ్రీ నారద మహర్షులచే అనుగ్రహించబడిన స్వరార్ణవం అనే సంగీత నాదోపాసనవిద్యను అభ్యసించి ఎన్నెన్నో సశాస్త్రీయ కృతులతో పలువిధాల దైవాన్ని కీర్తించి అర్చించి తరించిన మహనీయులు శ్రీ కాకర్లత్యాగబ్రహ్మం గారు...
(ఆ తర్వాత కొంత కాలానికి అందరి కళ్ళముందే కావేరి నదిపై వారి ఆరాధ్యమూర్తులు తేలుతూ తిరిగి రావడం, భక్తభాగవత అపచారానికి సోదరుడి కుటుంబం పక్షవాతం ఇత్యాది రోగాలతో కృశించిపోవడం, తమ తప్పు తెలుసుకొని త్యాగరాయులవారి భక్తికి దాసోహం చెందడం, అలా మిగతా లౌకిక జీవిత ఘటనలు అందరికి తెలిసినవే కదా....)
ఇక్కడ గమనించ వలసిన ముఖ్యమైన విషయం ఒకటుంది... నాదోపాసనతో సంగీత సామ్రాజ్యానికి మకుటంలేని మహారాజులై వర్ధిల్లి, అద్వైత భావనతో ఆత్మారామున్ని సర్వే సర్వత్రా దర్శించే శ్రీ త్యాగరాయులవారు, కేవలం దూరమైన తమ మూర్తుల్లోనే దైవం ఉందని భావించి శోకించడం తగునా..?
అంటే ఇక్కడ మనం అర్ధం చేస్కొవలసిన విషయం ఏంటంటే, అంతటా ఉండే దైవమే, ప్రస్ఫుటంగా మనం ఆరాధించే మూర్తిలోకి వచ్చి కొలువైఉంటాడు అని...( Though the air is all around us in its own invisible form, switching on a fan makes us feel the same more vehemently. Here the fan isn't creating any air as such...It is only circulating the already present air around us when we have "asked for it...". And so is with the idol worship as well with our prayers being a fan and his grace being the cool breeze being circulated as per our plea...!  )
అస్మద్ గురుదేవులు శ్రీ చాగంటి సద్గురువుల మాటల్లో చెప్పాలంటే, అవి కేవలం ఒక గదిలో ఉన్న దేవుడి బొమ్మలు అనుకున్న వారికి అవి అంతవరకే పరిమితమవుతాయి....
కాని అవి తాము భగవద్ భక్తిని న్యాసం గావించి సేవించే, తమ సర్వ పోషక తోషక రక్షకత్వాన్ని నిర్వహించే భగవన్మూర్తులు అని నమ్మి కొలిచిన వారికి అవే సర్వస్వం...!
అందుకే త్యాగరాయుల వారు అక్కడ అంతగా బాధపడింది...అందుకే వారి భక్తికి, ఆర్తికి ఆ భగవంతుడే నీటిపై తేలుతూ వారి వద్దకు వచ్చేసాడు...!!
( ఆనాడు నలనీలురు నీటిపై శ్రీరామనామం తో బండరాళ్ళను నిలిపి ఆ శ్రీరామచంద్రున్నే తేలియాడే వంతెన పై నడిపించి కాంచనలంకకు చేర్చినట్టుగా...)
' నారం దదాతి ఇతి నారదః ' అనే వ్యుత్పత్తి ప్రకారంగా, నారం = జ్ఞ్యానాన్ని ప్రసాదించువాడు నారదుడు.... అనేది నారద శబ్దానికి సంస్కృత అమరకోశవచనార్థం...
అంటే త్యాగరాయుల వారి కృతులన్నీ కూడా పైకి సుమధురమైన కర్ణపేయమైన శాస్త్రీయసంగీత గులికలు గా ఆకట్టుకొని, ఆంతరమున జీవుడికి బ్రహ్మజ్ఞ్యానాన్ని జనింపచేసే బ్రహ్మవిద్యాభాష్యములే అని పెద్దల ఉవాచ...!!
శ్రీ అన్నమాచార్యుల వారు తమ సంకీర్తనలు సాహిత్యపరంగా రచించి, భక్తులకు ఆలాపనమునందు రాగస్వతంత్రత ప్రసాదిస్తే,
శ్రీ సద్గురు త్యాగరాయుల వారు మాత్రం, తాము దర్శించిన రాగసహితంగానే తమ కృతిరచనకు శాశ్వతత్వాన్ని ప్రసాదించారు...
ఎందుకంటే అన్నమాచార్యుల వారు ' వేంకట ' ముద్రతో తమ రచనల్లో విశిష్టాద్వైతాన్ని విశదీకరిస్తూ, శరణాగతిని ప్రపత్తిని రంగరించి ఏడుకొండలపై కొలువైన పరమాత్మను సేవించేలా కృతులను రచించి, ఆ ఏడుకొండలవాడే అంతటా నిండి ఉన్నాడు అనే భావనతో జానపదశైలిలో తమ సారస్వతాన్ని అందించారు...
సద్గురు త్యాగరాయుల వారు మాత్రం తమ నామధేయమే ముద్ర గా, అందరికి అంతరంగమున కొలువైన ఆత్మారాముడే ఆన్నిట్లో కొలువై ఉండే పరతత్వం అంటూ, హృదయపీఠంపై కొలువైన అంతర్నారాయణున్ని గుర్తించి అద్వైతభావనతో సేవించండి అంటూ సామవేదసారమైన సంగీతశక్తిని కూడా మేళవించి రచించిన కీర్తనలతో శ్రీరామ పరబ్రహ్మానికి మన మనసు చేరువయ్యేలా శాస్త్రీయ పద్దతిలో తమ సారస్వతాన్ని అందించారు...
అంటే మొదట అన్నమాచార్యుల వారు చెప్పినట్టు ఆ పరంధామున్ని ఏడుకొండలపై దర్శించి, క్రమక్రమంగా అంతటా దర్శిస్తూ, చివరకు ఆ పరతత్వమే ప్రతి ఒక్కరి యెదలో దశరథాత్మజమైన శ్రీరామ పరబ్రహ్మంగా కొలువై ఉందనే సత్యాన్ని దర్శించమని,
బుద్ధి & మనసు అనే 2 చక్రాలతో, ( 5 జ్ఞ్యానేంద్రియాలు + 5 కర్మేంద్రియాలు = 10 ) దశ ఇంద్రియాలు అనే గుర్రాల తో నిరంతరం లాగబడే మన శరీరమే రథమై ఉన్నప్పుడు, ఆ రథసారధిగా శ్రీరామున్ని నిలిపి తరించండి అని చెప్పడమే సద్గురువుల తరతరాలకూ వన్నెతరగని శాశ్వత సంకీర్తనా బోధామృతం...!! 
శ్రీరాగం లో కూర్చబడిన తమ 'ఎందరో మహానుభావులు..' అనే పంచరత్న కీర్తనలోని ఈ క్రింది చరణాలు, సద్గురు శ్రీ త్యాగరాయులవారికి సకల శాస్త్రములపై గల అసామాన్యమైన పట్టుతో, జీవుడికి ఆఖరి ఊపిరిలో భగవద్ నామస్మరణమే కైవల్యతీరానికి దరిజేర్చు నావ అనే పరతత్వపు సారాన్ని, వేదాంత రహస్యాన్ని తమ కృతిలోకి అంత సరళంగా రంగరించిన వైనాన్ని, 'న భూతో న భవిష్యద్' అని ఎవ్వరైనా సరే భావించడం కద్దు...!
చ9. భాగవత రామాయణ గీతాది
శ్రుతి శాస్త్ర పురాణపు
మర్మములను శివాది షణ్మతముల
గూఢములను ముప్పది ముక్కోటి
సురాంతరంగముల భావంబుల-
నెరింగి భావ రాగ లయాది సౌఖ్యముచే
చిరాయువుల్ కల్గి నిరవధి సుఖాత్ములై
త్యాగరాజాప్తులైన వా(రెందరో)
చ10. ప్రేమ ముప్పిరికొను వేళ
నామము తలచే వారు
రామ భక్తుడైన త్యాగ-
రాజ నుతుని నిజ దాసులైన వా(రెందరో)
ప. ఎందరో మహానుభావులందరికి వందనములు.... 🙏🙏🙏🙏🙏 

Friday, January 18, 2019

Look at the awe inspiring satellite images of the 'Triveni Sangam' @ Kumbh - 2019..! :)

While there is many a contradicting legend associated with Sun god, his wives and children, it is believed and preached by many a Sadguru that Lord Sun has 2 wives Usha Devi & Chaaya Devi ( both are the inseparable forms of Sangnya devi, the daughter of deva Shilpi Vishwakarma ) signifying light and darkness or presence/absence of Sun's energy at a given point in time. Even the well known definitions from the western research journals state that darkness is just the absence of light and is a mutually exclusive entity of the former and thus has so absolute significance on its own.
From the learning that I have had from 'SrimadBhaagawatham' discourse by my Sadguru Shree Chaaganti gaaru...,
Considering Lord Yamraj and his Sister Yami who took the form of river Yamuna.....
( it is in her house that Lord Yama will have lunch on 'Bhaidooj' day and gives boon that any one who has a lunch at their sister's home on 'Yamadweteeya', the 5th day of Diwaali celebrations shall be blessed by him appropriately ) /
and the planet Shani or Shanaishchara...
( most of us wrongly pronounce him as Shaneeshwara...
Sankrit definition of the same reads, "Shanaihi Shanaihi charaha..iti Shanaishcharaha" - that means one who moves slow both physically as a part of the astronomical solar system's revolution around the Sun and also as per the astrology in ones 'janma kundali', compared to all other active planets relative to their mass/volume ratio and their respective orbital velocities...),
as his 6 members' celestial family who run the entire eternal cosmic cycle of Time, Birth, Death, Re-birth, & Karma....,
Yami in the form of river Yamuna does hold her own significance as she was chosen by Lord Krishna ( and interestingly not the most sacred river Ganga which was already brought down to earth by then, by Bhageeratha Maharshi and I assume we all know that legend of sacred Bhaageeradhi's voyage from Mandaakini to Bhogavati...)
In this context, one day River Yamuna prays Lord Shree Krushna saying...
"Hey..Shree Krushna, you are the very 'Paramaatma' of this entire cosmos...you are the embodiment and personification of each and every celestial being in this universe, you chose to take various 'avatars' to accommodate various boons that you have bestowed your devotees out of your sheer love and compassion towards them for their prayers....
In this 'Shree Krishna paripoorNaavataara' you chose the banks of Yamuna for all your childhood plays, and many an amazing celestial 'Shree Krushna Leela'... so may I plead you to make me the most sacred river in this planet for all that you have had from me.......? "
Upon this, Lord smiles and answers her....
"My dear Yamuna, you have always been so special for me right from 'Kaaliyamardan' to 'Raasleela' and your banks would always remain equally special and sacred eternally....
'Ganga', has already been conferred with this boon of being the most sacred river on planet Earth, for that she took the blessings from the cosmic Trinity and is already being praised as ...
"Brahma kamanDala udbhaveem...."
"Vishnu Paadoadbhaveem..."
"Rudra Jataajootoadbhaveem..."
it is not feasible for you now to replace her...
However, Krushna never disappoints any one who seeks refugee in him and thus I here by confer you the boon that once you go and meet Ganga at the holy Prayaaga kshetra and merge with her to become one with the emanating river Saraswathi from beneath as well, the united form of you 3 would be considered as the most sacred waters of 'Triveni Sangam' on the planet for ever...."
and adding to this, as another legend goes, ( during the deva daanava Ksheerasaagara madhanam or Garuda's 'Amrutaapaharanam' to relieve his mother's slavery from his step mother Kadruva's bondage )
4 drops of the Ambrose, the celestial nectar / Amrutam fell in the 4 different places of Naashik, Haridwaar, Ujjaini, Prayaaga and to celebrate the significance of the same, the largest gathering on the planet, Kumbh mela is held even today...!
NaagaSadhus, the rarest of the ascetic sect even in today's modern era, living in various holy Himaalayan caves and directly worshiping Lord Shiva residing on mount Kailaash, come out in to this human world only for these Kumbh Melas, including several other ascetic groups called as "AkhaaDaas".
Thus, Kumbh mela @ Triveni Sangam holds a much greater significance than the rest of the 3 Kumbh melas and is a great feast to be one among those thousands of thousands pilgrims descending from almost all parts of the vast India ( and a few Sanaatana Dharma / Hindu Dharma believers from other countries as well ) which probably isn't possible elsewhere on the planet.
Look at the awe inspiring satellite images of the 'Triveni Sangam' @ Kumbh - 2019..!