Monday, June 29, 2020

శ్రీ చాగంటి సద్గురువుల జన్మదినోత్సవం, ఆషాఢ శుద్ధ నవమి పర్వదిన శుభాభినందనలు......😊

శ్రీ చాగంటి సద్గురువుల జన్మదినోత్సవం, ఆషాఢ శుద్ధ నవమి పర్వదిన శుభాభినందనలు.....😊

యావద్ ప్రపంచం ఎన్నడూ కనీవినిఎరుగని రీతిలో ఈ తరానికి సకలశ్రేయోమార్గ దిక్సూచిగా అలరారే కొన్ని వందల వేల ప్రవచనాలు అనే సుజ్ఞ్యాన నిధిని అధ్యాత్మ ప్రపంచానికి అందించి వారి "సద్వాక్కుల అవధరణ తో ఇహపర ఉద్ధరణ.." అనే ప్రాచీనమైన మరియు నిత్యనూతనమైన ఒరవడితో కొన్ని కోట్ల మందికి పరోక్షంగా కొన్ని లక్షల మందికి ప్రత్యక్షంగా
వర్నించనలవికాని దైవానుగ్రహాన్ని సమకూర్చి ఎల్లరి జీవితాలను ఎంతో ఘనంగా తీర్చిదిద్దుతున్న సద్గురువులు శ్రీ చాగంటి గారు......

( సత్ గురువు అనగా శాశ్వతమైన, "సత్యమైన ఆ పరబ్రహ్మ తత్త్వంలో సదా తమ చిత్తమును రంజింపజేసి ఆ అత్యంత గహనమైన తత్త్వప్రతిపాదనను ఎంతో సులభ గ్రాహ్యంగా సర్వజనోద్ధరణకై నిస్వార్ధంగా అందించే మహానుభావులు..." అని ఇక్కడ నా యొక్క అర్ధం....)

అలా సత్ యందు తమ బుద్ధిని సదా న్యాసం గావించే వారిని సన్యాసి అంటారు......

ఆ సన్యాసి ఎప్పుడైతే తనచే సాధనసాగించి సాధించబడిన ఆ సత్ విషయ విజ్ఞ్యాన సారస్వత సర్వస్వాన్ని తనను ఆశ్రయించి ఉన్న వారికి ధారాపోస్తారో అప్పుడు వారు ఎల్లరికి సద్గురువుగా అమరి విరాజిల్లుతారు.....

కేవలం ఆశ్రమధర్మానుగుణంగా గార్హస్థ్య, సన్యాస, వానప్రస్థు గా విభాగించబడడం లౌకికం.....

ఏ ఆశ్రమంలో ఉన్నాసరే సత్ యందు సదా ప్రతయ్నపూర్వకంగా తమ మనోబుద్ధులను న్యాసం గావించి రంజిల్లే వారెల్లరు కూడా సన్యాసులే.....

కేవలం వస్త్రం కాషాయం అయినంతమాత్రాన అది ధరించినవారు సత్తు యందు న్యాసం కలవారిగా చెప్పలేము......అది విరక్తితో ఆపాదించుకున్న కేవల లౌకిక సన్యాసం కూడా అవ్వొచ్చు.....

ధరించిన బట్టలతో నిమిత్తంలేకుండా పరబ్రహ్మతత్త్వ సంచయమే పరమావధిగా బ్రతికే వారే నిజమైన సన్యాసులు....

అలా ఎన్నో సంవత్సరాల పాటు పరతత్వవస్తువిషయసంచయంతో తమ జీవితాన్ని సార్ధకంగావించుకొని ఆ సార్ధకజీవితాన్ని ప్రహృష్టవచనముల సంచయమైన ప్రవచనముల ద్వారా ఎల్లరికి తమ పరతత్త్వపరాగానుగ్రహములను పంచిపెడుతున్న పవిత్రమైన సన్యాసశ్రేష్ట సమమైన గార్హస్థ్యసన్యాసులు శ్రీ చాగంటి సద్గురువులు......

2013 సంవత్సరంలో నేను కాకినాడలో జరిగిన మొట్టమొదటి టిటిడి వారి శ్రీవేంకటేశ్వరవైభవోత్సవాలకు వెళ్ళినప్పుడు అక్కడ అప్పుడు జరిగిన శ్రీమదలర్మేల్మంగాపద్మావతీసమేతశ్రీనివాసకల్యాణం
అనే క్రతువులో పాల్గొనప్పటినుండి......
నిన్నమొన్నటి (2020) ఎన్.టి.ఆర్ స్టేడియంలో గురువుగారికి జరిగిన స్వర్ణకంకణ అలంకరణ / పల్లకి ఉత్సవం వరకు......,

వారి యొక్క / వారి ఆధ్వర్యంలో జరిగిన ఎన్నెన్నో కార్యక్రమాల్లో పాల్గొన్నవారికి జీవితంలో లభించిన అనుగ్రహం, ఎవరికి వారు తరచి చూస్తే ఆ అనుగ్రహవిశేషాలు స్వానుభవసత్యాలై కళ్ళముందు సాక్షాత్కరించడం కద్దు.....

ఎందుకంటే అది కలియుగ ప్రత్యక్ష పరమాత్మ శ్రీశ్రీనివాసుడి ఆనుగ్రహంగా జరిగిన / జరుగుతున్న కార్యక్రమాలు కాబట్టి.....😊
ఎంతో భగవద్ అనుగ్రహం ఉంటే తప్ప వాటిలో పాల్గొనలేరు కాబట్టి....

అంత మందిని అక్కడికి రప్పించి ఏకతాటిపై నిలిపి భగవదనుగ్రహం పొందేందుకు మూలకారణం శ్రీ చాగంటి సద్గురువుల సద్వాక్కు....!

వాక్కులు ఎంతో శక్తివంతమైన అస్త్రాలు....

శ్రీచాగంటి సద్గురువులు మనకు బోధించినట్టు ఎనభైనాలుగు లక్షల జీవరాసుల్లో కేవలం మనుష్య ప్రాణికి మాత్రమే లభించిన మహోన్నతమైన వరం స్వరం.....

ఆ స్వరం ' సత్ చిత్ ఆనంద ' స్వరూపమైన భగవంతుడి కోసం వెచ్చించబడినప్పుడు అది పవిత్రతను, మహిమ్నతను పొంది ఆ వాక్కులు సద్వాక్కులై, ఆలపించి ఆలకించబడిన ఆ సద్వాక్కులు దివ్యాస్త్రాలై ఎంతటి అనుగ్రహమునైన సమకూర్చి పెట్టగలవు అనే అధ్యాత్మ సత్యమే మనకు యుగ యుగాలుగా జగజగాల రూఢపరచబడిన సత్యం....

" సద్వాక్కుల శ్రవణం " అనే ఒకేఒక్క ఆధారశిలపై యావద్ భారతదేశ సనాతనధర్మప్రతిపాదిత వైదికధర్మవైభవం ఆధారపడింది అంటే అది మీకు ఆశ్చర్యం కలిగించవచ్చు.....కాని అదే నిజం....

ఎన్ని మాధ్యామాలు ఉన్నా సరే శ్రీ చాగంటి సద్గురువులు వచించినట్టుగా
" శృణ్వన్ తపః " అనే ఒకే ఒక్క ఆధారమే ఎల్లరి జీవితోద్ధరణకు మూలకారణం.....

కొన్ని కోట్ల సంవత్సరాలుగా ఒక్క అక్షరం కూడా క్రమం మారకుండా ఇవ్వాళ్టికి కూడా వేదస్వరం అచ్చం అట్లే తరతరాలకు అందివ్వబడి ఆ అనుగ్రహం అందరికి అందిరావడానికి కారణం...?

అది గురువులచే ఉదాత్త, అనుదాత్త, స్వరిత సంగమమైన మంత్ర, శ్లోక రూపంలో స్వరప్రోక్తమై అనుగ్రహించబడింది కాబట్టి......

శిష్యులచే " శ్రవణం " అనే యజ్ఞ్యం యొక్క తపః ఫలంగా అందుకొనబడింది కాబట్టి అది శాశ్వత తత్త్వాన్ని గడించింది.....

అచ్చం అదే విధంగా శ్రీ చాగంటి సద్గురువులచే గత దశాబ్దం పైచిలుకు సమయంలో కావించబడిన ప్రవచనాల సారం ఇవ్వాళ్టికి కూడా అట్లే తరతరాలకు అందివ్వబడుతూ ఆ అనుగ్రహం అందరికి అందిరావడానికి కారణం...?

అది గురువులచే స్వరప్రోక్తమై సద్వాక్కులు అనే మంత్రసమమైన సారస్వతంగా అనుగ్రహించబడింది.....

శిష్యులచే " శ్రవణం " అనే యజ్ఞ్యం యొక్క తపః ఫలంగా అందుకొనబడింది కాబట్టి అది శాశ్వత తత్త్వాన్ని గడించింది.....

శాశ్వతమైనది కేవలం పరబ్రహతత్త్వం / బ్రహ్మపదార్థం మాత్రమే.....

అట్లే శాశ్వత అనుగ్రహప్రదాయకమైన  ఏ సారస్వతమైనను పరబ్రహతత్త్వం / బ్రహ్మపదార్థం లా అనుగ్రహించునదే.....

కాబట్టి శ్రీచాగంటి సద్గురువుల ప్రవచనాంతర్గతమైన అధ్యాత్మ వస్తువిషయ సామగ్రి మొత్తం కూడా బ్రహ్మపదార్థమే.....

ఒక బంగారం బిస్కెట్ సమకూర్చుకున్న వారికి, ఏ విధమైన ఆభరణం తయారు చేసుకొని ధరించి ఆనందించాలనుకుంటే వారికి ఆ బంగారు బిస్కెట్ ఆ రూపంలో అనుగ్రహిస్తుంది అన్నట్టుగా....

శ్రీ చాగంటి సద్గురువుల ప్రవచనాలచే అందివ్వబడిన
బ్రహ్మపద్దార్ధ వస్తువిషయ సామగ్రిని అందుకున్న వారు కూడా అట్లే ఒక దైవిక స్వర్ణరాశిని సమకూర్చుకున్నట్టు....

వారికి అది ఎప్పుడు ఎక్కడ ఏ విధంగా అవసరమో ఆయావిధంగా అనుగ్రహం సిద్ధింపజేసి వారు తరించేలా చేసే సుజ్ఞ్యాన నిధిభాండాగారం.....😊

శ్రీ చాగంటి సద్గురువులచే బోధించబడిన ఎన్నెన్నో వెలకట్టలేని అధ్యాత్మ విజ్ఞ్యానవిషయాల గురించి, వాటిని శ్రద్ధాభక్తితో ఆలకించిన ఎందరెందరో మాన్యులు వివిధ రీతుల వాటిని పరిశోధించి తమ తమ జీవితాలకు ఆపాదించుకొని తరించడమనే సత్యం ఎల్లరికి విదితమే కద.....

ఎన్నెన్నో గహనమైన శాస్త్రాలను ఎంతో ఘనమైన రీతిలో ఆపోశనపట్టిన మాన్యులకే కాకుండా, నాలాంటి సామాన్యులకు సైతం జీర్ణమయ్యే రీతిలో ఉండే గురువుగారి వందల వేలాది ప్రవచనాల్లో కామన్ గా ఉండే వివిధ ధ్యానశ్లోకాలు ఎందరెందరికో కంఠగతమైనవి కద....

అందులోని ఒక ధ్యానశ్లోకం ఈ విధంగా కలియుగ ప్రత్యక్ష పరమాత్మను స్తుతించడం ఎల్లరికి తెలిసిందే కద.....

***************************************
"హైమోర్ధ్వపుండ్రమజహన్మకుటంసునాసం
మందస్మితం మకరకుండలచారుగండం
బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేశముఖమాత్మనిసన్నిధత్తాం....."
***************************************

గురువుగారితో పాటుగా మనంకూడా గడగడా ఈ శ్లోకాన్ని చదవడం నేర్చుకున్నాం కద......
కాని అసలు ఈ శ్లోకంలో ఉన్న ప్రత్యేకతను ఎప్పుడైనా తరచి, ధ్యానించి, పరిశోధించారా....?

మొదట్లో నేనుకూడా గురువుగారు చదివినట్టుగా చదివేసి సంతోషపడేవాడిని......

ఆతర్వాత కొన్ని సంవత్సరాలుగా వాటిని ధ్యానం చేయడం అలవడినప్పటినుండి వాటి యొక్క ప్రత్యేకతలు జ్యోతకమై, ఓహో అందుకే గురువుగారు ఈ శ్లోకాలనే ఎన్నుకున్నారన్నమాట అని తెలిసి సంతోషించడం ప్రారంభించాను.....😊

శ్రవణం యొక్క గొప్పదనం ఎట్టిదో శ్రీనివాసుడి ఈ ఒక్క ధ్యానశ్లోకంలో మీకు వివరిస్తాను......
జాగ్రత్తగా పరికించండి......

స్వామివారి అతిలోక లావణ్యభరితమైన తిరుముఖమండలాన్ని వర్నించే ఈ ధ్యానశ్లోకంలో,
"స్వామివారి తిరునామం, నాసిక, చిరునవ్వు, మకరకుండలాలు, ఎర్రని దొండపండులాంటి అధరాలు, కృపను వర్శించే చక్కని దీర్ఘమైన మనోహర నయనారవిందాల కొసల సోయగం.......
వీటితో మెరిసిపోతున్న ఆ పరమాత్మ ముఖారవిందం నాకు ఎల్లప్పుడు ఆత్మానుసంధానమై ఉండుగాక...."

అని వచించే ఈ శ్లోకంలో

జాగ్రత్తగా గమనిస్తే,
అన్ని భ్రమలను తొలగించే బ్రహ్మజ్ఞ్యాన దాయకమైన శ్రీశ్రీనివాసుడి వదనాదవిందమును వర్నించడం అనే ప్రక్రియలో, మిగతావన్నీ కూడా తిరుముఖమండల భాగములైతే, ఒక్క  ' మకరకుండలాలు ' మాత్రమే అందులో వర్నించబడిన ఆభరణములు.....!

స్వామివారి కర్ణములను కాకుండా కర్ణాభరణములను వర్నించడంలోని ఆంతర్యమేమి అని ధ్యానిస్తే అప్పుడు శ్రవణం యొక్క గొప్పదనం మనకు తెలిసివస్తుందన్నమాట.....

కర్ణములను రక్షించునది కర్ణకుండలం అనే ఆభరణం....

ఇది బాహ్య లౌకిక సూచకం.....

మన వైదిక వాజ్ఞ్మయంలో ఎన్నో చోట్ల బోధించబడినట్టుగా,

"శృతం మే గోపాయ....."

" భద్రం కర్ణేభిశృణుయామదేవాః...."

" శృణ్వన్ తపః....:

ఇవన్నీ కూడా సద్వాక్కుల శ్రవణం యొక్క గొప్పదనం గురించి మనకు తెలిపే వాక్యములే......

వచించబడే ఆ సద్వాక్కులను,

" శరీరం --> చెవి --> మనసు --> శ్రవణేంద్రియం --> బుద్ధి --> చిత్తం --> మేధోమండల న్యాసం --> స్వాధ్యాయం --> మననం --> తన్మూలంగా జనించే తత్త్వజ్ఞ్యాననిధి.... "

అనబడే ఈ బృహత్ భవ్య ఆత్మోద్ధరణ
వ్యవస్థకి మూలం ఏంటి...?

"శ్రద్ధగా వినడం....విన్నది పదిలపరుచుకోవడం..."
కద...

కాబట్టి శ్రవణం యొక్క ప్రాముఖ్యతను చెప్పకనే చెప్పబడేలా మన పెద్దలు అలా చిన్న చిన్న సులభగ్రాహ్యమైన రీతుల్లో మనకు అందించారు....

నవవిధ భక్తుల్లో మొదటగా చెప్పబడేది కూడా శ్రవణమే....

ఇన్ని కోట్లమంది జన్మజన్మాంతరముల సాధనలు సాగించి తుదకు సాధించే మోక్షం అనే ఆ ఈశ్వరసాయుజ్య / జన్మరాహిత్య స్థితిని పరీక్షిత్ మహారాజు
( అర్జునుడు-->అభిమన్యుడు-->పరీక్షిత్ )
శుకమహర్షి వారి అనుగ్రహంతో 7 రోజుల్లో సాధించింది కూడా శ్రవణం వల్లే....

మన ప్రార్ధనలను ఆలకించడం వల్లే దేవతలు మనల్ని అనుగ్రహించేది....
( పూలు, పళ్ళు, పత్రి, ఇతర సామాగ్రి మన ప్రార్ధనలకు అనుసంధానములు మాత్రమే....)

ఇవ్విధంగా శ్రద్ధాభక్తులతో కూడిన శ్రవణ యజ్ఞ్యాన్ని ఆలంబనగా మనకు అందించి వారి సద్వాక్కుల సుస్వర మంత్రాలతో మనకు దేవతానుగ్రహమును వర్శింపజేస్తున్న శ్రీ చాగంటి సద్గురువులు ఈ నవయుగ  శ్రీశుకబ్రహ్మగా మనకు ఈశ్వర ప్రసాదంగా లభించిన
ఆచార్యవరిష్ఠులు......

శ్రీశుకబ్రహ్మ కేవలం పరీక్షిత్ మహారాజు గారి ఆర్తిని మన్నించి ఆనాడు శ్రీమద్భాగవతాన్ని అందించి తరింపజేస్తే......

సహజకవి శ్రీపోతనామాత్యులవారి ఘంటంలోకి ఎంత మహత్తుతో ఆ వ్యాసమహర్షి ప్రణీత
సంస్కృత మూలం తియ్యనైన తెలుగు భాషలోకి శ్రీరామచంద్రానుగ్రహంతో అనువదించబడిందో.....

అంతటి మహత్తుతో ఆ శ్రీమద్భాగవతం
శ్రీ చాగంటి సద్గురువుల కంఠంలోకి ఒదిగి, ఈతరానికి దైవానుగ్రహం సమకూర్చే జీవనదిగా నిత్యం భక్తజనుల హృదయసీమలలో ప్రవహిస్తూనే ఉంటుందనేది అధ్యాత్మ జగత్తుకి విదితమైన సత్యం.....
( అనగా శ్రీ చాగంటి సద్గురువుల శ్రీమద్భాగవతం విన్నవారికి......
శ్రీమద్రామాయణం కూడా శ్రీమద్భాగవతంలో అంతర్భాగం అని గురువు గారు చెప్పిన విషయం ఎల్లరికి గుర్తే కద....  )

వారి అమృతవాణి మరెన్నో మధురప్రవచనాలను ఈ అధ్యాత్మలోకానికి అందిస్తూ ఎందరెందరో శిష్యకోటికి ఎనలేని ఈశ్వరానుగ్రమును సముపార్జించేలా వారి సద్వాగ్యజ్ఞ్యం సదా సురగంగా ప్రవాహంలా సాగుతూండాలని అభిలషిస్తు, అస్మద్ గురుదేవుల శ్రీచరణాలకు ఒక వినేయుడి చిరుకవనకుసుమాంజలి భరిత, వారి 61 వ జన్మదినోత్సవ శుభాభినందనాపూర్వక, సాష్టాంగప్రాణామాలు.....😊🙏💐🍨🍕🍟🍇

🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷

నతా యయోః శ్రీపతితాం సమీయుః
కదాచిదప్యాశు దరిద్రవర్యాః
మూకశ్చ వాచస్పతితాం హి తాభ్యాం
నమో నమః శ్రీగురుపాదుకాభ్యామ్  🙏

🌹🌹🌹🌹🌹🌹🌹🌹
---------------


Sunday, June 28, 2020

శ్రీ పాములపర్తి వేంకటనరసిమ్హా రావ్ గారు, గౌ | 9 వ భారత మాజి ప్రధానమంత్రివర్యుల శతజయంతి ఉత్సవాల సందర్భంగా వారి స్మృత్యర్ధం చిరుకవనకుసుమాంజలి......😊

గౌ | 9 వ భారత మాజి ప్రధానమంత్రివర్యుల శతజయంతి ఉత్సవాల సందర్భంగా వారి స్మృత్యర్ధం చిరుకవనకుసుమాంజలి.......😊

అస్మద్ గురుదేవులు శ్రీ చాగంటి గారితో,
" ఈ భరతభూమి యొక్క సర్వోన్నతమైన శాసక పదవిలో ఉన్న నేను మీకు ఏ విధంగా సహాయపడగలనో సెలవివ్వండి....." అని సంభాషించి.....
" మీ అభిమానం చాలు....నాకు అదే చాలా సంతోషకరం....."
అనేలా సమాధానం పొంది, శ్రీచాగంటి సద్గురువులకు అభిమానపాత్రులైన ఉన్నతమైన వ్యక్తిత్వసంపన్నులుగా,
భారతదేశమే కాకుండా యావద్ ప్రపంచ యవనికపై తమ సాటిలేని రాజనీతిజ్ఞ్యతతతో చెరగని ముద్ర వేసిన అనన్యసామాన్యమైన బహుభాషా కోవిదుడు, సాహితీ స్రష్ట, అన్నిటినీ మించి తమ అధికారంతో కొన్ని కోట్లమంది భారతీయులకు ఇవ్వాళ ఒక సుస్థిరమైన, ఆర్ధిక పరిపుష్టికలిగిన భారతావనిని అందించిన మహర్షి.....!

కాసులతో బొజ్జలు బాగా బరువెక్కిన అపర కుబేరులకు మాత్రమే కాకుండా,
వారి యొక్క దూరదృష్టి తో సగటు మధ్యతరగతి సామాన్య మానవుడికి కూడా తగు రీతిలో లాభదాయకంగా ఉండేలా ఇవ్వాళ మనం చూస్తున్న ఒక భవ్య నవ్యభారతానికి నాంది పలికిన ఎన్నెన్నో ధీటైన ఆర్ధిక, పరిపాలక, విదేశిప్రత్యక్షపెట్టుబడుల (FDIs) సంస్కరణలకు పునాది వేసిన బహుముఖ ప్రజ్ఞ్యాశాలి గా మాత్రమే కాకుండా ఎంతో అనుభవశాలిగా కేంద్రంలో బహుకోణాల్లో సామాన్య జనులకు ఉపయుక్తంగా ఉండేలా ఈ దేశ శాసనాలు సరిదిద్దబడేలా చక్రం తిప్పిన తెలుగు తేజం.....తెలంగాణ వజ్రం....
శ్రీ పి.వి.నరసిమ్హారావ్ గారు......

వారి పేరులో ఎంత రాజసమో, వారి
వ్యూహాత్మక చతురతభరిత సంక్లిష్ట కార్యనిర్వాహక శైలి కూడా అంతే రాజసభరితంగా ఉండేదని అనుభవజ్ఞ్యులైన మన పెద్దలెందరో చర్చించుకోవడం ఎంతో మందికి ఎరుకలో ఉన్న విషయమే....

రాజకీయాల్లోకి ఎందరో పెద్దలు ( కేవలం వయసు రీత్యా ) వచ్చేది కోట్లు పోగెయ్యడానికి, తమ తర్వాత ఒక వంద తరాలాకు సరిపడేలా  భూములు, ధనకనకవస్తువాహనాలు, ఇత్యాది లౌకిక సంపదలను కూడబెట్టి అందరిలో ఒకరిలా ఒకనాడు నిష్క్రమించడానికి......

కాని కొందరు పెద్దలు ( వారి సద్గుణ సాంద్రత రీత్యా ) రాజకీయాల్లోకి వచ్చేది, ఎన్నెన్నో మంచి పనులు చేసి సామాన్య జనబాహుళ్యానికి అభిమానపాత్రులైన నాయకులుగా గొప్ప పేరు ప్రఖ్యాతలు గడించేలా తమ యశోచంద్రికలు ఆచంద్రతారార్కమై నిలిచి ఎల్లరిచే నమస్కరించబడే వ్యక్తిత్వ సంపన్నులుగా  చిరస్మరణీయులై శాశ్వతకీర్తికాయులై ప్రజల హృదయసీమల్లో జీవించడానికి....
అటువంటి వారి కోవకి చెందిన వారు శ్రీ పి.వి గారు...

తమ పేరుతో ఒక శిలాఫలకం అక్కడ ఉంటుంది కాబట్టి, అప్పటివరకు ఎందరో వచ్చి ఏమేమో సంక్షేమ కార్యక్రమాలకు పునాది రాళ్ళు వేసామని చెప్తారు....

కాని అవి ఎన్నో సంవత్సరాలకు గాని
కనీసం ప్రారంభానికి కూడా నోచుకోవు.....

కొందరు సంక్షేమమే ధ్యేయంగా పథకాలు రచించి ప్రారంభిస్తే కేవలం పునాదిరాళ్ళే కాదు, అవి ప్రారంభించబడి అనతికాలం లోనే ప్రజలకు అందుబాటులోకి వచ్చి వారే మళ్ళి ముఖ్య ఆహ్వానితులుగా వచ్చి వాటియొక్క జయోత్సవాల్లో పాల్గొనేలా ఉంటుంది వారి కార్యనిర్వాహక దక్షత.....

అప్పటివరకు ఎండిపోయిన చెరువులు, తటాకాలు, పంట కాలువలు, బావులు, రిసర్వాయర్లు,........
కొందరు అధికారంలోకి వచ్చిన తదనంతరం
చెరువులు అలుగు పారడం,
కాలువలు జీవనదుల పాయలు గా ప్రవహించడం,
రిసర్వాయర్లు నిండుకుండళ్ళా తొణికిసలాడడం,
రైతులకు, ప్రజలకు దాహార్తి లేకుండా రాజ్యం సుభిక్షంగా ఉండడం మనం గమనించవచ్చు......

మరి ఎందుకు ఇంతకు ముందు అలా సంక్షేమధ్యేయంగా వాటి నిర్వహణ జరగలేదు అంటే....
అది ఎల్లరికి తెలిసిన విషయమే....

సంక్షేమం పట్ల హృదయాంతర్గత జనిత శ్రద్ధాసక్తుల లేమితో,
వారి ఇళ్ళకు కోట్లకు కోట్ల కమీషన్ల కట్టలు సమకూరనందుకు,
సామాన్య ప్రజానాడిని గ్రహించి మసలుకోవడంలోని అనుభవరాహిత్యం,
వెరసి ఎక్కడవేసిన గొంగళి అక్కడే అనేలా ప్రాజెక్ట్లు, సంస్కరణలు, ఎప్పటిమాదిరే మరొకరి కోసం ఎదురుచూస్తు ఉండే స్థితిలోనే ఉండడం....

కాబట్టి ఇక్కడ ఆ అధికారం అనే అత్యున్నతమైన శక్తి కలిగి కూడా నిర్దేశిత సామాన్య ప్రజా సంక్షేమం అనే విహిత ధర్మాన్ని మరచి కేవలం  వచ్చామా, కొన్నాళ్లో కొన్నేళ్ళో ఉన్నామా, నిష్క్రమించామా......

అనేలా ఉన్న సామాన్య మాన్యులకు.....,

మరియు

ఆ అధికారం అనే అత్యున్నతమైన శక్తి లభించిన పిదప నిర్దేశిత సామాన్య ప్రజా సంక్షేమం అనే విహిత ధర్మాన్ని ఎంతో శ్లాఘనీయమైన విధంగా నిర్వహించి, 
వచ్చామా, కొన్నేళ్ళకే కాక తరతరాలకు సరిపడేలా ఎల్లరిచే నమస్కరించబడే రీతిలో ఉన్న దీక్షాదక్షతతో సాగిన కార్యనిర్వాహక పేరుప్రఖ్యాతలతో
ఎప్పటికి గుర్తుండి పోయేలా ఉన్నామా అనేలా ఉన్న అసామాన్య మాన్యులకు.....,

భేదం ఎక్కడ ఉంటుంది అంటే....
వారి చిత్తశుద్ధిలో....అంతే కద....

అటువంటి చిత్తశుద్ధి భరిత ప్రధానమంత్రుల్లో ఒకరిగా పేరు గడించిన నిరుపమాన మాన్యులు శ్రీ పీ.వీ నరసిమ్హరావ్ గారు.....

గ్లోబలైజేషన్ అనే ప్రక్రియను ఈ దేశ సర్వతోముఖాభివృద్ధికి, సుస్థిర ప్రగతికి ఒక సోపానంగా మలిచి తద్ ఫలాలను ఇప్పటి భావి తరాలు అందుకునే రీతిలో అప్పుడే రాజకీయ సేద్యం గావించిన అసామాన్య కృషీవలులు శ్రీ. పి.వి గారు....

ఒక శరీరానికి ఆరోగ్య ప్రదాయక ఆహార సంవృద్ధి ఎంతగా అవసరమో.....
దురితకాల ఆటుపోట్లను తట్టుకొని నిలిచి ఉండేలా ఎంతో ధృఢమైన రోగనిరోధక శక్తి కూడా అంతే అవసరం.....

అట్లే,

ఒక దేశానికి ఆర్ధిక పరిపుష్టిని కలిగించే సంస్కరణల నిర్వహణ ఎంత ముఖ్యమో...,
ఇతర దేశాల అవాకులు చవాకులకు
ధీటైన రీతిలో ఎవరికి ఎప్పుడు ఎక్కడ ఎందుకు ఎలా సమాధానం ఇవ్వాలో అలా ఇచ్చే విధంగా దేశం యొక్క రక్షణ వ్యవస్థను అణుశక్తితో జతపరిచి భరతభూమి వైపు కన్నెత్తి చూసే సాహసం కూడా ఎవరు చేయకుండా ఉండే రీతిలో భారత అణ్వాయుధ శక్తి సామర్ధ్యాలకు నూతన జవసత్వాలను అందించి ఈ దేశానికి ఎంతో దృఢమైన వజ్రసదృశమైన రక్షణ కవచాన్ని సమకూర్చిన రాజకీయ విశ్వకర్మ గా
శ్రీ పి.వి నరసిమ్హారావ్ గారిని అభివర్నించడం అతిశయోక్తి కానేరదు.....

మన ఉన్నతిని చూసి ఓర్వలేని కృరాత్ములు మన చుట్టూ వందమంది ఉన్నాసరే, ఆఖరికి వారు మనవారు అనబడే వరైనాసరే,
సహృదయులకు ఈశ్వరుడు ఎల్లప్పుడు ఒక మహాత్ముని బాసటను అందిస్తాడు అనే సత్యం శ్రీ పి.వి గారి జీవితంలో కూడా ఎల్లరు గమనించవచ్చు.....

సొంత కూటమి వారే శ్రీ పి.వి గారి
ప్రజాదరణను ఓర్వలేక వారికి సహాయ సహకారాలు అందివ్వడంలో విఫలమై ఉన్న పరిస్థితుల్లో,
మరో మహాత్ములు శ్రీ అబ్దుల్ కలాం గారి బాసటను ఈశ్వరుడు వారికి అందించి,

స్వామికార్యం, స్వకార్యం రెంటికి కూడా ఇబ్బంది కలగని రీతిలో ఎంతో ఘనమైన చాణక్యంతో దేశప్రయోజనాలకు ప్రాముఖ్యత ఇవ్వబడేలా తమ రాజకీయ ప్రస్థానాన్ని సాగించి, దైన్యంతో సతమతమవుతున్న భారతదేశ రాజకీయ ఎడారి జీవితంలో, ఎన్నెన్నో ఒయాసిస్ లను ఏర్పాటు చేసి వాటితో అభివృద్ధి ఫలాలను ఈ దేశం అందుకొని నిలిచి గెలిచేలా సుస్థిర భారతదేశానికి నవజీవితాన్ని ప్రసాదించిన ఆరితేరిన రాజనీతికళాదురంధరులైన, అమరజీవి శ్రీ పి.వి నరసిమ్హారావ్ గారు.....

వారి సమయస్ఫూర్తిభరిత చారిత్రాత్మక నిర్ణయాలకు ఈ దేశం వారికి సదా ఋణపడిఉంటుంది అనేది జగద్విదితమైన సత్యం.....

వారి అపారమైన కృషికి తగు రీతిలో గౌరవమర్యాదను ఆపాదించే భారతదేశ అత్యున్నత పౌరపురస్కారం " భారతరత్న " వారికి త్వరలోనే ప్రసాదించబడాలని అభిలషిస్తు వారి శతజయంతి ఉత్సవాలు ఎల్లరికి ఆదర్శదాయకమై వర్ధిల్లుగాక.....🙏😊


The unparalleled power of Lord UgraShreenivaasa....!

A few agents still seem to be 'associated' with those rogues who doesn't seem to stop their spoilsport yet.......

You cruel cunning wolves, if you don't stop pestering him and his family members,
you and your families will have to rot in hell right on this earth after you start knowing what it means to face the wrath of Lord UgraSrinivaasamoorthy, who comes out of the AanandaNilayam in a procession to give darShan only on the KaishikaDwaadashi's pre-dawn hours...... 

"Dwaadashi Tidhi" is a "paaraNatidhi"......
It means the day that will let you 'eat
sumptuously' after fasting on the day before, which is Eakadashi...
This is the worldly interpretation of the Eakadashi and Dwaadashi's speciality.......

When it comes to the cosmic equivalent for the same......

Kaarteeka Shuddha Dwaadashi / KaishikaDwaadashi is that tidhi when the angry and hungry Lord UgraSrinivasa consumes all the hardships of his devotees in the darkest month of the year going by its physical / worldly attribution because of which so many diyas / lights are lit in Kaarteekamaasam across the entire Bharatabhoomi, as an offering to the Lord in the name of KaarteekaDeepaaradhana,
and cosmically Kaarteekam is the brightest month of the year going by its celestial importance because of Moon's coalition with Krutthika Nakshatram, one of the most luminous star / constellations of the cosmic astronomy......... ( And it has other astrological significance as well...) 
It means on that day Lord UgraShreenivaasa beams up the positive celestial power of Kruttika Nakshatram shining brightly in the skies to burn away the hardships of all his devotees......

Its like all the problems that pester his devotees ( and all those ill minded crooked folks like you who harass his devotees in various intelligent ways, ) are brought down infront of Lord Rudra so that he can just reduce them down to the ashes by his 'TrinetraAagrahajwaala'.......
Such is the extreme power of Lord UgraShreenivaasa when his aura comes in to contact with any of the luminescent objects' aura shining up on him....!
And thus he remains confined to the AanandaNilayam for the rest of the 364 days in a year........

This read up should bring in a doubt about the ghee lamps inside the AanandaNilyam.....

"Will they not trigger his anger and create his burn up effect inside the AanandaNilayam....? "

The answer is " No. There won't be any such issues inside the AanandaNilayam....."

It is because of the fact that another extremely powerful ( infact his own abhinna swaroopam ! ) is present inside the AanandaNilayayam that is the biggest and strongest of all the "tirumala panchabayramoortulu......"....
The varada kaTihasta Shobhita Dhruvabayram, standing mighty on the padmapeeTham......🙏
And thus all of the cosmic powers of UgraSrinivaasa moorthy remain frozen under the magnanimous power of ShreeVenkaTeshwara SajeevaSaaligraama Dhruva Moorthy.......!

In simpler words, there is an extremely powerful celestial jammer device that doesn't allow any other objects' signals to cast their effect in it's presence and thus all sorts of powers that belong to the other 'moorthies' remain jammed in his vicinity unless he allows them to emanate thier respective celestial energies........... 

Hence Lord UgraShreenivasa cannot amplify / beam up the power of the GheeLamps inside the AanandaNilayam to create any sort of burn up effects......

Look at the heights of your cruelty, your insane mental skewedness and narrow-mindedness coupled with your unbounded headstrongness that you have done umpteen overactions by creating your crooked channels via his friends, his relatives, kin and kith......
right from mentally torturing his family in almost every possible way, 
to physically abusing him and proning him to your fabricated accidents in 4 different major incidents....

1. The deadly car door hit survived at the steep turning at Kukatpally cheruvu...

2. In the Petrol bunk behind the Narayana Jr College, Saptagiri colony....

3. In their own area as well.....

4. Instigating his father to drink and drive the bike to fall on the road so that he can get injured badly in that bike accident just a day before the Gruhapravesham ceremony was about to begin during Feb 2017, so as to stop him from entering his own house in his chosen good muhurtam in the auspicious Maaghapanchakam.....

How mean you wicked folks are that you couldn't spare some middle class guy constructing his own dream house, just like hundreds of other typical folks around do, 
with his decades' hard work's savings and loan.......

God will anyways return your Karma multifolded so that you will understand what it means to hurt others when you had absolutely nothing to put up with them to resort to such barbaric deeds....

And dare you not disturb his family members anymore just because you are unable to put up with him......

You don't need to even talk to them or reach out to them via any of his kin and kith, set aside your wolverine personal vendetta execution via them.....

Why should it bother you to define and decide what someone else should do and why should you instigate his family members to 'advise him' on what should he be doing for his well being when that person is yelling like anything that you crooked folks were / are never his well-wishers........

Should you continue to irk him on things that ideally shouldn't have any say from any of you 'duSHTachaTuSHTayam', be prepared to face his ire in various ways that you couldn't have even imagined that you would have to go through........

Should you not learn to be humble enough to refrain yourself form instigating his family members / friends / relatives and stop bothering him in the name of 'your advise',
he might very well file a law suit against you all folks and drag you to the courts to answer the hon'ble judiciary system on why should you irk someone and his family when that person isn't bothered at all about you.....

నీటిలో ఉన్న వివిధ ప్రాణులను బాగ పీక్కతిని, 

" హయ్యొ...మేము బాగా లావెక్కి నీటిలో మునిగిపోతున్నాం....
ఒడ్డున ఉన్న ఆ బక్క ప్రాణులను మా వద్దకు పంపి మమ్మల్ని ఒడ్డుకి చేర్చ మనండి....."

అని, డాలర్లకు డాలర్లు మెక్కి బాగ బలిసిన ఓ 4 మూర్ఖపు మొసళ్ళు మిమ్మల్ని అడిగితే, వాటి మాట విని ఒడ్డున ఉన్న ఆ బీద వారిని వాటికి బలివ్వడానికి మీరు మీ యొక్క అధికార, సంపద, దర్పాలను ఉపయోగించడం మూర్ఖత్వం అనే ఇంగిత జ్ఞ్యానం కూడా మీకు ఎన్ని సార్లు చెప్పినా రాదా...?

లేదా మీరు కూడా మొసళ్ళతో చేరి వాటిలా మొసలికన్నీళ్ళు కార్చడం నేర్చుకుంటున్నారా....?

మీకు ఎన్ని అతి తెలివితేటలు, అధికార, ఐశ్వర్యాలైనా ఉండొచ్చు గాక,
మీరు కూడబెట్టిన సంపదలతో మీవారు మీకు బంగారు పాడెలు కట్టి మిమ్మల్ని సాగనంపేంతగా మదించిన సంపదలతో మీ జీవితాలు ఉండొచ్చు గాక.....

మీ మీ పరిధులను దాటి ఇతరుల జీవితాలను ఇబ్బందిపెట్టి వెకిలినవ్వులు నవ్వాలని చూస్తే మాత్రం ఈశ్వరుడు ఊరికే చూస్తు ఉంటాడని మాత్రం అనుకోకండి......

గజేంద్రమోక్ష ఘట్టం లో,
మీలాగే హూహూ అనే గంధర్వుడు కొందరు అప్సరసలను నవ్వించేందుకు చేసిన వెకిలిచేష్టలకు శపించబడి మొసలి జన్మనెత్తి,
కారణాంతరములచేత శాపానుగ్రహవశాత్తు కరిగా జన్మించిన ఇంద్రద్యుమ్న మహారాజు కాళ్ళు పట్టి పీక్కతిన్నందుకు శ్రీమన్నారాయణుని సుదర్శనచక్ర ప్రతాపానికి కుత్తుక తెగిపడి కిరాతకంగా చచ్చాడు......

మీ జోలికి రానివారిని మీరు అనవసరంగా హింసిస్తే మీక్కూడా తుదకు ఆ మొసలి గతే పడుతుంది.....

శ్రీ చాగంటి సద్గురువులు చెప్పినట్టుగా, గంగానదిలో ఉన్నాసరే వాసపుణ్యం కూడా లభించని దౌర్భాగ్య ప్రాణి మొసలి....అటువంటి పుణ్యహీనులైన మొసలిలాంటి వారికోసం మీరెందుకు అనవసరంగా మీ యొక్క శక్తియుక్తులు, టైం & ఎనర్జీ వేస్ట్ చేసుకుంటారు...?

మొసళ్ళు ఏం అరిచిన పట్టించుకోకుండా ఉండాలి..... వాటి పరిధి దాటి నీటిబయటకు కూడా వచ్చి ఒడ్డున ఉన్న వారిని హింసిద్దామని చూస్తే వాటి మూతిని జ్ఞ్యానరజ్జుతో బిగించి నుజ్జు నుజ్జయ్యేలా -- పగలగొట్టాలి.....
అంతే కాని వాటి మాట విని మీరు కూడా మొసళ్ళతో ఉంటామంటే అవి ఒకనాడు మిమ్మల్ని కూడా మింగేస్తాయనే నీతిని మరవకండి.....

కాబట్టి మౌనం అనే అత్యంత గంభీరమైన ధ్వనిలో మీరు సమాలోచన గావించి సమాధానములు పొంది సమాధనపడడమే ఎల్లరికి శ్రేయస్కరం........

అట్లు కాక, ఇతరులను వారి వారి జీవిత దరి చేరకుండా అడ్డుపడుతూ పీక్కతింటామంటే మాత్రం మీరు, మీ భావితరాలు ఈశ్వరుడి క్రోధాగ్నికి ఆహుతవ్వడమే, మీకు మీరే కొనితెచ్చుకుంటున్న గతి.....
కాబట్టి తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త......

ఓం శాంతిః ఓం శాంతిః ఓం శాంతిః.....

శ్రీ చాగంటి సద్గురుపాదపద్మారవిందేన సాష్టాంగప్రణామం / ప్రణిపాతం కుర్యాత్....😊🙏


అమేయ సుజ్ఞ్యాన సింధుగళిత......

అనన్యసామాన్య వాగ్దేవతానుగ్రహగృహీత.......

నిత్య ధర్మ మార్గ ప్రవర్తక ప్రచారక ఆచార్యవరిష్ఠ.....

శ్రీవాణి హస్తకలిత అక్షమాలా అనుగ్రహ జనిత భూలోక పుంభావ సరస్వతీస్వరూపకః.....

శ్రీ చాగంటి సద్గురుపాదపద్మారవిందేన సాష్టాంగప్రణామం / ప్రణిపాతం కుర్యాత్....😊🙏

🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷....
💮
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
****************

Any metaphysical anatomy is beyond the reach of the science on the planet....😊

it only shows your disbelief / your ignorance / your arrogance / your head strongness......

If performed once it is fine, because you are trying to understand the person, his body, 
and his physical anatomy etc just to ensure that it is like any other natural human body......

But what is the point of repeating it unnecessarily when that person knows that you are simply being foolish to cause him pain in your process of "understanding" him...  

Any metaphysical anatomy is beyond the reach of the science on the planet because it has got nothing to do with the human body that holds the metaphysical soul and its supra energies...... Human body is just a mere container to hold all the aggregated stuff......

If you want to understand the hydral energies embedded in the water, isn't is foolishness to distort the container ( say a glass or a bowl )  that holds the water.....?? 

As a matter of fact, even the water that is present in the form of H2O will not reveal any thing even after multiple tests with the mere water samples...

When a water molecule is split in to the individual H + H + O atoms to collect only the H atoms and to harness them by supplying additional external energies, only then the extremely powerful hydral energy of water will be understood......

Similarly, a human body is just a mere container.....And all the 7 types of materials it is made up of, 
( known as SaptaDhaatuvulu :
Charmamu, Raktamu, Maamsamu, Asti, Shukra, Medha, Majja )
are just physical entities that cannot reveal anything about the supra energies contained within a human body that arise as a result of staunch Adhyaatmika Saadhaana or tapassu under the aegis of established sadgurus......
( which always need not mean going to forests / mountains and isolating oneself to do Tapassu. It was very well stated by Sree ChaaganTi sadguruvu gaaru,  that a saadhaka can achieve a state where in he can concentrate on even the tip of a simple needle and draw the entire universe on to it with his YogaShakti, like Swamy Vivekananda used to do.....)

If you want to measure the current and voltage that flows through an aluminum cable, ( when energized appropriately ) isn't it just utter foolishness to extract or chip off some Aluminum from the cable for tests / verifications.....?

Only a well versed engineer / scientist who knows how to use special instruments called Ammeter and Voltmeter will be able to understand the energies called Current / Voltage that can flow through that aluminum cable....

Similarly, only an established Sadguru / Saint can understand the various types of metaphysical energies that can emanate from a Yogi's human body of course when he allows them to make their presence....

His body's Sapthadhaatuvulu / 7 elements would be just like any other mere human 
body's and they cannot reveal anything about the yogic energies that can flow through it just like the above example of current cable.....

Electronic devices like hidden cameras behind the lights, and so on and so forth to continuously monitor a subject in question from a control room, can only show what is happening infront of a house and what does a simple human body does from time to time and so on and so forth...... 

No matter how much foolish and insensible one can become using these devices, they can never reveal anything about the metaphysical happenings inside a Yogi's physical & Astral body and brain..... 

Especially for an ECE engineer to whom 
'Only Sky is the Limit', all these LEDs, Diodes, Triodes, TFTs, micro cams, microphones, that were his experimental objects played at ease on a breadboard in the EDC lab,
are just a cake walk for him even if combined with IR sensors......

One can never say that they can successfully touch someone's / something's shadow unless they touch the actual person / object casting that shadow.....

Similarly, one can never successfully win a person unless his heart is won......

If you resort to measures like foul mouth, 
foul play, and don't mind going to the extremes of hurting some one's self-respect with your so called hyper intelligence, so would be the retaliatory measures from the other side.....

Two soldiers posted on either sides of the LOC, can smile, can talk, can exchange ideas / views, can establish peace, and all other optimistic / positive actions.....

If one soldier tries to execute his personal vendetta by being 'Jyaada Hoshiyaar'...,
please don't expect the other soldier to keep watching it like some television show / movie.....
It is only sensible for the soldier on the other side too to pull in all the available power to defend and launch the appropriate counter attack on the opponent.....

Peace can be restored only if both the parties welcome ceasefire and continue their respective duties without crossing each others' paths ignoring what has happened earlier......

You do your work and kindly let others do their work......
You don't have to define what others should do when that authority isn't vested with you by the concerned Global Heads / Chiefs of the Armies......

And those instigated folks who keep listening to a self declared head for everyone and everything under the Sun for no good reason, should understand that there are so many important things for them to take care of for the well being of the wider audience and stop being foolish in running after a moron.....

Afterall is it so hard to understand who is trying to establish peace and who is trying to create chaos across several lives......? 

Hmm....stange it is that a few folks are unable to understand that...
As per Cause and Effect theory,
" Nothing in this world happens without a reason......
And when you don't know all the reasons behind something that has happened to deliberately hurt someone , it would only be sensible for you to refrain from unnecessary involvement to make things much complex and catastrophic......"

Om Shaantih Shaantih Shaantih.....!

Friday, June 19, 2020

శ్రీశార్వరి నామ సంవత్సర జ్యేష్ఠ అమావాస్య / సినివాలి భానువాసర ప్రయుక్త మృగశిర నక్షత్ర ప్రభావిత పాక్షిక రాహుగ్రస్త చూడామణి ఆకార సూర్యగ్రహణం ( 2020-June-21) 😊

శ్రీశార్వరి నామ సంవత్సర జ్యేష్ఠ అమావాస్య / సినివాలి భానువాసర ప్రయుక్త మృగశిర నక్షత్ర ప్రభావిత పాక్షిక రాహుగ్రస్త చూడామణి ఆకార సూర్యగ్రహణం ( 2020-June-21) సందర్భంగా తత్ నక్షత్ర సంజాతకులు ( అనగా మిథున రాశి వారు ) తగురీతిలో తమ తమ శక్తికొలది గ్రహణకాల శాంతి జరిపించుకొని ప్రశాంతంగా జీవించగలరు.....

అని వివిధ టీవీ ఛానెల్స్ లో ప్రాజ్ఞ్యులైన పెద్దలు, జ్యోతిషశాస్త్ర విద్వాంసులు, ఆధ్యాత్మిక వేత్తలు, రాబోయే సూర్యగ్రహణం తాలుకు విశేషాలు చెప్పడం ఎల్లరికి విదితమైన విషయమే కద......

గ్రహణకాల నియమాలను ఎవరు ఎంతవరకు నమ్మి పాటిస్తారు, ఆచరిస్తారు అనేవి వారి వారి వ్యక్తిగత నమ్మకాలకు, వారి విశ్వాసానికి, వారి జ్ఞ్యాన స్థాయికి, సంబంధించిన విషయాలు......

కాబట్టి వాటి గురించి పెద్దగా చర్చించడం కాకుండా 

అసలు గ్రహణం అంటే ఏంటి...?
ఎందుకు గ్రహణాలకు ప్రత్యేకత ఆపాదించబడింది....?
గ్రహణం అంటే కేవలం ఖగోళశాస్త్ర సంబంధిత సైన్స్ ఫినామిన....గా భావించాలా,
లేదా అధ్యాత్మ శాస్త్ర పరంగా అవి ఎంతో విలువైన ఖగోళ శక్తిప్రసరణాల ప్రత్యేక పర్వములగా భావించబడాలా...?

ఒక్కొక్కరు ఒక్కోవిధంగా తమ తమ గురుబోధలకు అనుగుణంగా సమకూరిన జ్ఞ్యాన నిధికి తగ్గట్టుగా ఈ విశ్వంలోని వింతలను విశేషాలను విశ్లేషిస్తుంటారు అనేది వాస్తవం....

గ్రహణం అనేది అది కేవల భౌతికశాస్త్రం పై ఆధారపడిన సామాన్యశాస్త్రోక్త ఒక 
"సైన్స్ ఫినామిన..." అని విశ్లేషించడం చాల మంది చేసే సామాన్య R&D.....

ఇంకో అడుగు ముందుకెళ్ళి, మహత్తరమైన ప్రాచ్య అధ్యాత్మ విజ్ఞ్యానాన్ని కూడా ఆ సైన్స్ కి జోడించి, గ్రహణం అనే ఆ ఖగోళ వింతను పరిపూర్ణంగా విశ్లేషించడం లోనే గొప్పదనం ప్రత్యేకత ఉంటాయి కద....😊

So lets begin our R&D on the spectacular cosmic, astronomical, astrological, physical and meta physical phenomenon called
"An Eclipse....!"

"రాబోయే 24 గంటల్లో, మామూలు వర్షంకాదు, తూఫాన్ ప్రభావం వల్ల పెద్ద పెద్ద వడగళ్ళవాన పడబోతోంది....",
అని వెదర్ ఫోర్కాస్ట్ వారు టీవీల్లో చెప్పినప్పుడు....

1. "వడగళ్ళవాన పడితే ఏముంది.....
మామూలు వర్షంపడితే ఏముంది....
ఎప్పటిలానే నా ఇంటి ముందు నేను తిరుగుతా......
నా ఇష్టం మీకెందుకు....."
అని అనుకునే వారు సామాన్యులు......

2. "మామూలు వర్షంపడితేనే గొడుగు, రేయిన్ కోట్, తో తడవకుండా జాగ్రత్తలు తీసుకుంటాము కద.....
ఇది వడగళ్ళవాన కాబట్టి మరింత జాగ్రత్తగా ఉండాలి...."
అని అనుకునే వారు ఇంకో మెట్టు పైస్థాయిలో ఆలోచించే వారు.....

3. "మామూలు వర్షం కాకుండా వడగళ్ళవాన కాబట్టి ఆ వడగళ్ళను వృధాగా పోనివ్వకుండ వాటన్నిటిని ఒడిసిపట్టుకునే వ్యవస్థను ఏర్పాటుచేసుకొని ఒక పెద్ద హైడ్రల్ సిస్టెం ద్వారా రెగ్యులర్ రైన్ వాటర్ హార్వెస్టింగ్కి ఆ భారి వడగళ్ళను కూడా తరలించి మరింతగా ప్రాకృతిక జలసంవృద్ధిని సాధించి లాభపడాలి " 
అని అనుకునే వారు ఇంకో మెట్టు పైస్థాయిలో ఆలోచించే వారు.....

4. అరుదుగా సంభవించే వడగళ్ళవాన కాబట్టి ఆ వడగళ్ళను వృధాగా పోనివ్వకుండ వాటన్నిటిని ఒడిసిపట్టుకునే వ్యవస్థను ఏర్పాటుచేసుకొని ఒక పెద్ద హైడ్రల్ సిస్టెం ద్వారా రెగ్యులర్ రైన్ వాటర్ హార్వెస్టింగ్ కి ఆ భారి వడగళ్ళను కూడా తరలించి మరింతగా ప్రాకృతిక జలసంవృద్ధిని సాధించి లాభపడటమే కాకుండా ఆ వడగళ్ళపై తమ జ్ఞ్యాన స్థ్యాయికి తగ్గట్టుగా రిసర్చ్ జరిపి వాటిని అమూలాగ్రంగా పరిశీలించి, పరిశోధించి వాటి ద్వార ఆ మేఘమండంలో జరిగిన ఎటువంటి మార్పుల వల్ల అవ్విధంగా వడగళ్ళు భూమికి చేరాయి....
వాటివల్ల ఈ భూలోక వాసులకు ఆ వినువీధిలో ఉండే వాతావరణంలోని మూలకాల గురించిన అవగాహన, వాటికి కారణమైన రసాయన చర్య ఇత్యాది విషయాల గురించి శ్రమించేవారు ఇంకో మెట్టు పైస్థాయిలో ఆలోచించే వారు.....

5. "యత్ పిండే తత్ బ్రహ్మాండే...." అనే సూత్రానికి అనుగుణంగా ఆ వడగళ్ళలో ఉన్న 
"మైక్రోకాసం"  యావద్ వినువీధిలో వివిధ లేయర్స్ గా ఉండే  ఖగోళం యొక్క "మ్యాక్రోకాసం" కాబట్టి ఆదిశగా అత్యున్నతమైన స్థ్యాయిలో సైన్స్ యొక్క లిమిట్స్ ని సరికొత్త హద్దులకు వ్యాప్తిగావించే విధంగా తమ పదునైనమేధోమండల శక్తితో ఈ భూమండలం పై ఉండే 'భువర్' ,  'సువర్' , 'మహర్' మండలాల శక్తిని తమ గుప్పిటిలోకి ఒడిసిపట్టేలా ఆలోచించే ఇంకొందరు అతి కొద్ది మంది స్పిరిట్యుయల్ సైంటిస్ట్స్.....

ఆ 3 ప్లేన్స్ పైన ఉండే జనోలోక, తపోలోక, సత్యలోక మనబడే అత్యున్నత స్థాయి మండలాలు మానవగ్రాహ్యములు కావు కాబట్టి వాటి గురించిన అవగాహన కేవల మానుషశరీరధరకులకు దుర్లభం.....

ఇలా కేవలం వడగళ్ళ వాన అనే ఆకాశజనిత 
"అరుదైన జలశక్తి ప్రసరణ ప్రక్రియ"
అనేదానిపైనే ఒక్కో స్థాయిలో ఒక్కొక్కరు తమ తమ జ్ఞ్యాన నిధికి తగ్గటుగా పరిశోధనలు చేసి అవి సైన్స్ సూత్రాలు గా చెబితే వినడం అనేది మన కళ్ళెదుట కదలాడే సత్యమైనట్టుగా.....

అచ్చం ఇదేవిధంగా " గ్రహణ ప్రక్రియ జనిత ఖ శక్తి ప్రసరణ"
అనే అంశం పై కూడా ఎవరి జ్ఞ్యాన స్థ్యాయికి తగ్గట్టుగా వారు పరిశోధనలు గావించి 
" These are the various scientific and spiritual effects that occur on the planet earth because of the cosmic phenomenon called an Eclipse...."
అని మనకు తెలిపినప్పుడు, అవి ఎవరు ఏమేరకు ఆకళింపు చేసుకొని తరిస్తారు అనేది వారి వారి వ్యక్తిగతమైన విషయం.......

వడగళ్ళు పడుతునప్పుడు ఆకాశం పైకి చూస్తు...

"నేను ఫుల్ తోప్ ని.....చూసారా వడగళ్ళు మనల్ని ఏమిచేయవు.....మీరు కూడ వచ్చి మీ మీద వడగళ్ళు పడేలా ఆకాశాన్ని చూడండి......"

అని ఒక మూర్ఖుడు చెప్తే వాడి మాట విని ఎవరైనా ఆకాశంలోకి నేరుగా అట్లే మొహం పెడితే,
మన సున్నితమైన ముఖమండలం భరించలేని వేగంతో ఆ వడగళ్ళు వినువీధి నుండి శ్రీరామకోదండసంధిత శరప్రహారం లా వచ్చి పడితే, అప్పుడు తెలుస్తుంది ఎందుకు విజ్ఞ్యులైన పెద్దలు వడగళ్ళ వానలో బయటతిరగొద్దని మనకు బోధించారో......

"మొహం కొబ్బరి పచ్చడైనా పర్లేదు అట్లే వడగళ్ళకు అభిముఖంగా ఆకాశంలోకి చూస్తు, హేతువాదులం 
అనే పేరుతో జనాలను కూడా అట్లే చేయమని చెప్తాం....."
అనడం ఆ మూర్ఖుల హద్దెరగని మౌఢ్యానికి ప్రతీకే అవుతుంది తప్ప అదేదో వాళ్లు ఈ లోకానికి చేసిన గొప్ప ఘనకార్యం అనిపించుకోదు.....

"తా చెడ్డ కోతి వనమెల్ల చెరిచెన్....." అన్న చందంగా ఉండే ఆ మూర్ఖుల మాటలు ఎంత పట్టించుకోకుంటే అంత మంచిది.....

"మీరు...మీ మొహం....మీ ఇష్టం.....
అట్లే ఆకాశంలోకి చూస్తు ఉండండి...
మమ్మల్ని మాత్రం దయచేసి మీరు ఇబ్బంది పెట్టకండి......
మాకు మా విజ్ఞ్యులైన పెద్దల ద్వార తెలుసును ఎప్పుడు ఎక్కడ ఎట్లా ఉండాలో...
కాబట్టి మీ నయవంచక హితబోధలు ఆపండి..."

అని మరియాదగా చెప్పినా సరే వినకుండా మనల్ని కూడా ఆ వడగళ్ళ వానకు ఇబ్బందిపడేలా వారితో రమ్మని మనల్ని హింసించే వారిని
గూబ గుయ్ అనేలా ఒక పచ్కడ్ పీకి
" నీ దార్లో నువ్వు పో.....
అనవసరంగా నా జోలికి రాకు.....
ఇంకా నన్ను ఇబ్బంది పెడితే నాదైన శైలిలో నేను కొట్టే దెబ్బలకు లేవలేనంతగా పడతావ్....
జాగ్రత్త...'

అనేలా సమాధానం ఇవ్వడం సాధారణంగా ఎవ్వరైనా చేసేదే....కద......

అట్లే గ్రహణ కాలంలో మన విజ్ఞ్యులైన పెద్దలు చెప్పినవాటిని
"హేతువాదులం" అనేపేర మనల్ని పాటించకుండా పెడబోధలు చేసే మూర్ఖులపట్ల కూడా మనం అవలంబించవలసిన వైఖరి అంత దృఢంగా ఉండాలి.....లేనిచో మనకు మనమే అపకారం చేసుకున్న మూర్ఖులుగా అవుతాం....

ఇక అసలైన విషయం గ్రహణం యొక్క ప్రత్యేకత గురించి చర్చించడం...

గ్రసించునది గ్రహణం....

"ఆధ్యాత్మిక పరంగా ఛాయాగ్రహములైన రాహుకేతువులు సూర్యచంద్రులను వారి సహజ శక్తిని కోల్పోయేలా కొద్ది కాలం పాటు వారిని తమ అధీనంలోకి తీసుకొని గ్రహణానికి కారణమవ్వడం....

శ్రీచాగంటి సద్గురువులు వివరించినట్టుగా క్షీరసాగర జనిత అమృతాన్ని దేవదానవులకు తనదైన శైలిలో పంచే మోహిని రూపంలో ఉన్న శ్రీమహావిష్ణువుకు 
'అటు రక్కసుల ప్రక్కన ఉండవలసిన రాహుకేతువులు ఇటు దేవతలప్రక్కన వచ్చి చాటుగా కూర్చున్నారు....'

అని తమ ప్రక్కన ఉన్న రాహుకేతువుల గురించి తెలిపి వారి సమ్హారానికి కారకులైనందుకు ఆనాటినుండి ఈనాటి వరకు కూడా పగబట్టి సూర్యచంద్రులను గ్రహణ రూపంలో గ్రసిస్తూనే ఉన్నారు....." అనేది అధ్యాత్మిక వివరణ......

సూర్యుడి చుట్టూ భూమి, 
భూమి చుట్టూ చంద్రుడు,
తన చుట్టూ తాను భూమి,
భ్రమణం సాగించడం అనే సాధారణమైన సైన్స్ ప్రక్రియలో

అప్పుడప్పుడు ఒక సరళరేఖపైకి ఆ 3 వచ్చినప్పుడు ఒకరి నీడ ఇంకొకరిపై పడడంవల్ల,

అనగా

సూర్యుడికి భూమికి మధ్య చంద్రుడు వచ్చి సూర్యకాంతిని అడ్డుకోవడం వల్ల సూర్యగ్రహణం....

మరియు 

సూర్యుడికి చంద్రుడికి మధ్య భూమి రావడం తో, సూర్యకాంతి చంద్రుడిపై పడకపోవడం వల్ల చంద్రగ్రహణం ఏర్పడ్తాయి అనేది మనకు చిన్ననాటి నుండి సైన్స్ నేర్పిన పాఠం....

సైన్స్, స్పిరిట్యుయాలిటి అనే ఈ రెండు, రెండు భిన్నమైన ధృవాలు అనుకునే వారు మూర్ఖులు.....

ఈ రెండు కూడా సామ్యము కలిగిన సమాంతర శాస్త్రములు అని అనుకునే వారు మాన్యులు....

ఈ రెంటిని కూడా మేళవించి మానుష జీవనసాఫల్యానికి వాటి యొక్క సమ్మిళిత మహత్తును సోపానాలుగా మలుచుకోవాలి అని అనుకునే వారు మహనీయులు.....

ఇక గ్రహణకాల వైశేషిక పరిణామాలగురించి చెప్పాలంటే....

గ్రహణసమయంలో 
1. ఆలాయలను ఎందుకు మూసివేస్తారు....?
2. దేవతలందరు ఎక్కడికి వెళ్తారు...?
3. ఆహారం ఎందుకు భుజించకూడదు...?
4. నేరుగా కళ్ళతో ఎందుకు చూడరాదు..?
4. ప్రత్యేకంగా పట్టుస్నానం, విడుపుస్నానం, 
జపాలు, సహస్రనామాపఠనాలు, ఇత్యాదిగా గ్రహణకాలంలో ప్రత్యేక శ్రద్ధాపూర్వక ఆచారనియమాలు ఎందుకు...?
5. గ్రహణానంతర శాంతులు, దానధర్మాలు ఎందుకు...?

ఇత్యాది గా ఎందరికో చాలా చాల ప్రశ్నలు సందేహాలు ఉండడం సహజమే....

అవన్నీ కూడా ఇప్పుడు కొత్తగా వచ్చినవేంకాదు కద......

మన ధార్మిక పెద్దలు ఎప్పటినుండో మన క్షేమం కోరి ఆయా విధివిధానాలను ఏర్పరిచారు అని భావించి వాటిని ఆచరించడంలోనే ఎల్లరికి శ్రేయస్సు ఉంటుంది.....

వడగళ్ళవానలో ఆకాశం వైపు చూస్తూనే ఉంటాం అనే మూర్ఖులకు, గ్రహణకాల నియమాలను పెద్దగా పట్టించుకోము అనే మూర్ఖులకు పెద్దగా భేదం లేదు......

వడగళ్ళవాన అప్పటికప్పుడే మొహం పగలగొట్టి సమాధానం ఇస్తుంది....

గ్రహణకలా విషపూరిత ఖశక్తి ప్రసరణ అప్పటికప్పుడు కాకుండా మెల్లగా జీవితంలో ఆ ప్రభావాన్ని చూపుతుంది.....

గ్రహణ కాల విధివిధానాలను హేళన గావించి, ఊరంత తిరుగుతాం, ఏ అడ్డు కూడా లేకుండా మా కళ్ళతో గ్రహణం చూస్తాం.....అప్పుడే తిండి తింటాం....

అనే వెకిలి చేష్టలు గావించే వారికి

"జోర్ కా ఝట్కా ధీరేసేలగే...." 
అన్నట్టుగా ఎప్పుడో ఒకప్పుడు ఆ గ్రహణశక్తి యొక్క ప్రతాపం తెలిసివస్తుంది......

చాలా సింపుల్ గా, "ఎలెక్షన్స్"  అనే ఒక లౌకిక ఎగ్సాంపుల్ తో గ్రహణసమయ గొప్పదనం గురించి వివరిస్తాను.....

1. "ఎలెక్షన్ కోడ్ అమలులో ఉందండి....
కాబట్టి ఇష్టం వచ్చినట్టు ప్రచారాలు చేయడం, బహిరంగ సమావేశాలు పెట్టడం, ఎక్కువగా క్యాష్ క్యారి చేస్తు ప్రయాణాలు చేయడం, ఇత్యాదివి
చేయకుండా ECI మరియు గవర్నర్ యొక్క అధీనంలో రాష్ట్రం ఉన్నందున వారిచే జారీచేయబడిన నియమావళిని పాటిస్తు, ఎలెక్షన్ కోడ్ ఉల్లంఘించకుండా 5 సంవత్సరాలకు ఒకసారి జరిగే ఎలెక్షన్స్ అనే ఈ ప్రక్రియకు సహకరించి క్షేమంగా ఉండండి...."

అని చెప్పినప్పుడు,

" నా డబ్బు నాఇష్టం......బ్యాంకు కెళ్ళి ఎప్పటిలానే డ్రా చేసి నా కార్లోనే ఊపుకుంటూ వెళ్తా...."

అనే మూర్ఖుడుకి ఏం చెప్తాం...?

"అది నీదే అయినా సరే,
ఈ సమయంలో అలా తీస్కెళ్ళడం క్షేమం కాదు.....
పెద్దమొత్తం లో డబ్బులు కనిపిస్తే అవి లాక్కోవడానికి, వాటి గురించి సవాలక్ష ప్రశ్నలను వేసి విచారించడానికి,
బయట ఒక వ్యవస్థ ఉంది.....
ఎలెక్షన్ కోడ్ పూర్తయ్యేవరకు అట్లే 
ఉంటుంది.... కాబట్టి ఆ నియమావళికి తగ్గట్టుగా ఉండడమే శ్రేయస్కరం..."

అని వివరిస్తారు.....
అది వినడం, వినకపోవడం అనేది సదరు వ్యక్తి యొక్క బుద్ధికి సంబంధించిన విషయం.....

అట్లే గ్రహణ సమయంలో మీదే అయినా సరే, ఎప్పుడూ తిన్నట్టుగా ఆహారం పెద్దమొత్తంలో తినరాదు.....

దాన్ని విషంగా మార్చి ఆరోగ్యాన్ని హరించేలా బయటి వాతావరణంలో కొన్ని మార్పులు చోటు 
చేసుకున్నయి....
"గ్రహణసమయం" పూర్తయ్యేవరకు ఈ నియమావళిని పాటించాలి....

అని చెప్పినప్పుడు, విన్నవాడు ఆరోగ్యవంతుడు...
విననివాడు మూర్ఖుడు.....
అంతే కద.....

2. "ఎలెక్షన్ సమయంలో రాష్త్ర పరిపాలకులు  రాజ్యాధినేత గా ఉండే సీ.ఎం గారు, CMO లో ఉండరు...... కాబట్టి సీ.ఎం ఆఫిస్ తెరవరు.....
ఎలెక్షన్ కోడ్ పూర్తయ్యి, కౌంటింగ్ తర్వాత రిజల్ట్స్ వచ్చి, మళ్ళీ సీ.ఎం గా కే.సీ.ఆర్ గారు ప్రమాణస్వీకారం చేసేంతవరకు
ఎవరిని CMO లోకి అనుమతించరు......"

అని చెబితే దాని అర్ధం సీ.ఎం గా ఉన్న కే.సీ.ఆర్ గారు అధికారం మొత్తం గవర్నర్ మరియు EC కి ఇచ్చేసి
ఎక్కడో అమెరికాకు వెళ్ళినట్టా...??

కాదు కద.....

ఆ ఎలెక్షన్స్ అనే ప్రక్రియలో భాగంగా తాత్కలికంగా వారే గవర్నర్ గారికి తమ పరిపాలక అధికారాన్ని సమర్పించి CM అనే ఆ పదవి కొంత సమయం వరకు వర్తించని విధంగా ఆ ఎలెక్షన్ అనే ప్రక్రియకు సహకరించి CMO కు దూరంగా ఉన్నారు అని దాని అర్ధం.....

కాబట్టి ఆ ఎలెక్షన్ అనే ప్రక్రియ మొత్తం పూర్తవ్వగానే మళ్ళీ సీ.ఎం గా కే.సీ.ఆర్ గారు తమ అధికారాన్ని గవర్నర్ మరియు ECI కి నుండి తిరిగి స్వీకరిస్తారు అని దాని అర్ధం......
అప్పుడు CMO కి యథాతథంగా
అందరు వెళ్ళడం, వారి విన్నపాలను సమర్పించుకోవడం, అనే సాధారణ ప్రక్రియ పునః ప్రారంభమవుతుంది.....

అట్లే గ్రహణసమయంలో దేవతలు / అనగా దేవతాశక్తులు,
అధిదేవతా / ప్రత్యధిదేవతలుగా ఉండే శాసక దైవిక శక్తులు ఈ భూలోక వాసులకు అందుబాటులోలేని విధంగా గ్రహణప్రభావం లేని వేరొక ప్లెన్ లోకి వెళ్తారు.......

కాబట్టి గుడిలో ఎప్పుడూ ఉన్నట్టుగానే
దర్శనాలు / ప్రసాదాలు ఉండవు....

గ్రహణానంతర శుద్ధి, శౌచ ప్రక్రియల తరువాతే తిరిగి ఆయా దేవతా శక్తులను తమ తమ స్థానములలోకి రమ్మని మంత్రపూర్వకంగా ఆహ్వానించడం, ఆవహించబడడం జరిగిన తరువాతే ఎప్పటిలాగే భక్తులకు పునః దర్శనాలు / కొత్తగా వండిన ప్రసాదాలు.....

3. సీ.ఎం గారు, గవర్నర్ గారు ఇరువురు కూడా నిజానికి రాష్ట్రపరిపాలన సజావుగా సగేలా రాజ్యాంగం ఏర్పరిచిన ఇరు పరిపాలకశక్తి కేంద్రకస్థానములు.......

ఆ ఎలెక్షన్ సమయంలో ఒకరి నుండి మరొకరికి అది పూర్తైన పిదప మళ్లీ అట్లే ఒకరినుండి మరొకరికి ఆ పరిపాలక శక్తి ట్రాన్స్ఫర్ అయ్యింది....
అంతే తప్ప అసలు లేకుండా పోలేదు...

"Energy can only be transferred from one form to the other.....
Hence the involved implicit power transmission will only change its name for a while and its not that it has completely gone somewhere else....."

అట్లే ప్రకృతి / పరమేశ్వరుడు అనే ఇరు పరిపాలక శక్తికేంద్రకస్థానాలుగా ఈ లోకంలో దైవం తన శాసకత్వం నిర్వహిస్తుంది....

గ్రహణసమయంలో గుడిలో ఉన్న దేవుడు ఎక్కడికో వెళ్ళాడంటే  దాని అర్ధం 
సీ.ఎం గారు గవర్నర్ గారికి అధికారమార్పిడి గావించి కొంత సమయం అధినేత పదవినుండి దూరంగా ఉన్నట్టుగా....

పరమేశ్వరుడు/పరమేశ్వరి గా ఉండే ఆ దైవిక శాసక శక్తి గ్రహణ సమయంలో తన అధికారాన్ని ఈ పాంచభౌతిక ప్రకృతికి కట్టబెట్టి
గ్రహణప్రభావంలేని ప్లేన్ కి మాత్రమే తనను తాను పరిమితం చేసుకుందని అర్ధం.....

అందుకే గ్రహణసమయంలో ప్రకృతి చాలా పవర్ఫుల్ గా ఉంటుంది.....

ఆ గ్రహణసమయ ప్రకృతి యొక్క శక్తి అనేది వరదగోదావరి లా ఉధృతంగా ఊగిపోయే శక్తి......

ఆ వరదగోదావరికి ఎంత దూరం ఉండాలో అంత దూరాన్ని పాటిస్తు...,
ఆ అధికజలసంవృద్ధిని అనగా ఆ చరజలశక్తిని వివిధ రీతుల మనకు ఉపకరించేలా స్థిరజలశక్తిగా మార్చుకోవడంలోనే గొప్పదనం ఉంటుంది......

అనగా ఆ నీరంతా సముద్రంపాలు కాకుండా, చెరువుల్లోకి, కాలువల్లోకి, రిసర్వాయర్లలోకి,
పంటబావుల్లోకి, చేరేలా ఏర్పాట్లు చేసుకొని ఆ చరజలశక్తిని స్థిరజలశక్తిగా మార్చుకొని తదనంతర కాలంలో వాటిని ఉపయోగించుకొని లాభించడంలోనే గొప్పదనం ఉంటుంది.....

అదే విధంగా  in abundance గా ఆకాశమునుండి వెలువడే ఆ 
"ecliptic supra cosmic energy "ని 
గ్రహణానికి ఎంత దూరంలో ఉండాలో అంత దూరంలో ఉంటూనే  జప తప న్యాస రూపాల్లో సాధకులు ఒడిసిపట్టి, మామూలు సమయంలో చేసే జపానికి వచ్చే శక్తికంటే కొన్ని కోట్ల రెట్లు అధికమైన జపశక్తి సంవృద్ధిని సమకూర్చే గ్రహణసమయం కూడా
ఆ వరదగోదారిలా ఊగిపోయే ఉధృతసమయం......

గోదారికి వరదొచ్చిందని ఏదో ఒక పనికిరాని సోది కొడుతు ఆ వరదను ఒక వింతగా చూస్తూ మాత్రమే ఉంటామా....
లేదా పైన చెప్పినట్టుగా ఆ జలసంవృద్ధిని వృధా కాకుండా వివిధ రీతుల ఒడిసిపట్టుకుంటామా అనేది ఎట్లో.....

ఆకాశంలో గ్రహణమొచ్చిందని ఏదో ఒక పనికిరాని సోది కొడుతు ఆ ఖగోళ దృశ్యాన్ని ఒక వింతగా చూస్తూ మాత్రమే ఉంటామా....
లేదా పైన చెప్పినట్టుగా ఆ గ్రహణకాలజనిత
హై ఫ్రీక్వెన్సి శక్తితరంగసమృద్ధిని వృధా కాకుండా వివిధ రీతుల ఒడిసిపట్టుకుంటామా అనేది కూడా అట్లే.....😊 

అన్నమాచర్యుల వారు తమ సంకీర్తనలో సెలవిచ్చినట్టుగా.....

ప|| త్రికరణశుద్ధిగ జేసినపనులకు దేవుడు మెచ్చును లోకము మెచ్చును |
వొకటి కోటిగుణితంబగుమార్గములుండగ బ్రయాసపడనేలా ||
చ|| తనమనసే పరిపూర్ణమైన గోదావరి గంగా కావేరి |
కనకబిందుయమునాగయాది ముఖ్యక్షేత్రంబుల సంతతమున్ |
దినకరసోమగ్రహణకాలముల తీర్థాచరణలు సేసినఫలములు |
తనుదానే సిద్ధించును వూరకే దవ్వులు దిరుగగ మరి యేలా ||

గ్రహణ పర్వసమయములందు అచరించబడిన విహితకర్మలు కాలాంతరంలో తమకు తామే సిద్ధిని కలిగిస్తాయి....
అని చెప్పడంలో గ్రహణాలయొక్క ప్రత్యేకతను చెప్పకనే చెప్పినారు ఆచార్యులు....😊

http://annamacharya-lyrics.blogspot.com/2007/11/336-trikaranasuddhiga-jesinapanulaku.html?m=1


Saturday, June 13, 2020

శ్రీ సింగిరెడ్డి నారాయణ రెడ్డి గారు, సినారె గారిగా ఖ్యాతిగడించిన "మందారమకరందాలు " రచయితగారికి నమస్సుమాంజలులు...🙏💐🌻🌷🌸🏵🌼🌹💮🌺

శ్రీసింగిరెడ్డి నారాయణరెడ్డి గారు భౌతికంగా ఈ తెనుగునేలకు దూరమైనాసరే వారియొక్క రచనల రూపంలో ఇప్పటికీ ఎప్పటికీ సాహిత్యారాధకుల హృదయాల్లో వారు మరియు ఆచంద్రతారార్కమైన వారియొక్క రచనా వైదుష్యం సజీవమే కద....

ఆధ్యాత్మిక జగత్తును శాశ్వతంగా శాసిస్తు ఒక సద్గురు యొక్క స్థానంలో ఎప్పటికీ నిలిచిఉండేది శ్రీమద్భాగవతం....

సంస్కృతమూలాన్ని మనకు అందించిన అష్టాదశ పురాణకర్త శ్రీవ్యాసమహర్షి వారి అత్యద్భుతమైన గ్రంథరాజాన్ని తెనిగించి మనకు అందించి తరించిన సాటిలేని సాధుసత్పురుషులు, సహజకవి 
శ్రీ బమ్మెరపోతనామాత్యులవారు....

ఆ శ్రీమద్భాగవతంలోని కొన్ని మధురఘట్టాలను 
మందారమకరందాల పేరిట మనకు ఎంతో హృద్యమైన వివరణతో అందించి తరించిన మహనీయులు శ్రీ సీనారే గారు....

నోబెల్ ప్రైజ్ ఇచ్చే వారికి, ఆ ప్రైజ్ కోసం నామినేట్ చేసే కమిటీ సభ్యులకు తెలుగు భాషయొక్క వైభవం, మరియు ఈ త్రిలింగదేశం యొక్క గొప్పదనం గురించి ఏకొద్దిపాటి అవగాహన ఉన్నా సరే ఈ పాటికి ఎందరో మన రచయితలకు సాహితీ స్రష్టలకు ఈపాటికే ఎన్నెన్నో బహుమతులు , పురస్కారాలు వచ్చుండాలి....

కనీసం మన దేశంలోనైనా సరే కేంద్ర కమిటీలు మన తెలుగు భాషారచనలకు మరింతగా తగు రీతిలో గౌరవం ఇచ్చి పురస్కారాలు ప్రసాదించే ఆవశ్యకత ఎంతైనా ఉందని నా వ్యక్తిగత అభిప్రాయం....😊

అలా లౌకికంగా ఎవరైనా విజ్ఞ్యులైన పెద్దలకు ఏదైనా ప్రశస్తమైన పురస్కారం లభిస్తే, గౌరవ సూచకంగా ఆ బిరుదును అసలు పేరుకు ముందు పెట్టి ఉపయోగించడం అనేది ఎల్లరు సాధారణంగా పరికించే అంశమే....

ఫర్ ఎగ్సాంపుల్, అస్మద్ గురుదేవులకు
" ప్రవచనాసామ్రాట్ " , " వాచస్పతి ",
ఇత్యాది బిరుదునామాలు ఎన్నో వారికి మాన్యులచే గౌరవసూచకంగా ప్రసాదించబడినాయి......కద....

అనగా దాని అర్ధం ఇక గురుదేవులు వారి చిన్ననాటినుండి ఉన్న స్కూల్, కాలెజ్, సర్టిఫికేట్లపై గల వారి అసలు పేరుకు ముందు ఈ బిరుదులన్నీ జతచేర్చి,  
" ఇక మీరు నన్ను ఎప్పటికీ ఈ బిరుదునామాలన్నీ కూడా జతకలిపి పిలిస్తేనే పలుకుతాను....."

అని ఎప్పుడైనా అన్నారా మనతో...??

లేదే....

ఇప్పటికీ, మరియు ఎప్పటికీ కూడా 
'శ్రీ చాగంటి గారు.....' అని పిలిచిన మరుక్షణం వారు మనకు పలుకుతారు.....
అవునా...?

మరియు, అట్లే ఆ బిరుదు నామాలన్నీ కూడా జతకలిపి పిలిచినాసరే వారు పలుకుతారు..  
అవునా...?

కేవలం ఏ ఒక్క బిరుదునామానికే పలకడమో, లేదా కొన్నిటికి మాత్రమే పలకడమో అనేది ఇక్కడ అన్వయం కాని విషయం.....

మీ మీ గౌరవాభిమానంకొలది ఏ ఏ బిరుదు నామం వారి అసలు పేరైన "శ్రీ చాగంటి గారికి..." ఆపాదించి మీరు పిలుస్తారో, అవ్విధంగా వారు పలికి మనల్ని అనుగ్రహిస్తూనే ఉంటారు అనేది శాశ్వతమైన సత్యం....

కాని అన్ని బిరుదు నామాలకు ఇక్కడ పలికేది మాత్రం ఒక్క ఆ శ్రీ చాగంటి వారే....

అచ్చం ఇదే విధంగా, మీరు మీ మీ భక్తిభావనకొలది ఏ ఏ పేర్లతో ఆ శాశ్వతమైన సత్యమైన పరబ్రహ్మతత్వాన్ని పిలుస్తారో ఆయా విధంగా ఆ పరబ్రహ్మశక్తి పలుకుతుంది...

దేశకాలానుగుణంగా ఒక్కోసారి ఒక్కోవిధంగా....
వివిధ ప్రత్యేక ఐహిక పారమార్ధిక , ఉపలబ్ధికి వివిధ రీతుల....,

1. మీరు ఆ పరబ్రహ్మశక్తిని  " శ్రీదుర్గామల్లేశ్వరస్వామి " గా ప్రార్ధిస్తే....
శత్రువులను సమూలంగా నశింపజేసే తన దుర్గతిభంజక శక్తి సహితుడిగా ఆ శాశ్వతమైన పరబ్రహ్మము పలుకుతుంది...

2. మీరు ఆ పరబ్రహ్మశక్తిని 
"శ్రీమదలర్మేల్మంగాపద్మావతీసమేతశ్రీశ్రీనివాసుడిగా"  ప్రార్ధిస్తే....
సకల సంపదలను అనుగ్రహించే వరదుడిగా తన భోగభాగ్యదాయక శక్తి సహితుడిగా ఆ శాశ్వతమైన పరబ్రహ్మము పలుకుతుంది..

3. మీరు ఆ పరబ్రహ్మశక్తిని
"శ్రీరాజరాజేశ్వరిసహితరాజరాజేశ్వరస్వామి...."
గా ప్రార్ధిస్తే....
ఈ సకల చరాచరవిశ్వానికి అధినాయకి గా ఉండే
తన రాజరాజేశ్వరి శక్తి సహితుడై
అమేయమైన రాచరికత్వాన్ని
అనుగ్రహించే శ్రీరాజరాజేశ్వరుడి గా ఆ శాశ్వతమైన పరబ్రహ్మము పలుకుతుంది.....

4. మీరు ఆ పరబ్రహ్మశక్తిని
"శ్రీలక్ష్మీనారసిమ్హస్వామి...." గా ప్రార్ధిస్తే....
సకలవిధమైన అలక్ష్మిని నశింపజేసే తన దుష్టసమ్హారక శక్తి సహితుడై దురితాపహారక శ్రీ యాదగిరినృసిమ్హుడి గా ఆ శాశ్వతమైన పరబ్రహ్మము పలుకుతుంది.....

5. మీరు ఆ పరబ్రహ్మశక్తిని
"శ్రీసీతాదేవిసహిత శ్రీలక్ష్మణస్వామి సమేత శ్రీరామచంద్రమూర్తి..." గా ప్రార్ధిస్తే....
తరతరాలకు తరగని ఇష్టకామ్యార్ధ సిద్ధిని అనుగ్రహించే తన పోషక, రక్షక శక్తి సహితుడై
శ్రీ వరభద్రగిరీశుడిగా ఆ శాశ్వతమైన పరబ్రహ్మము పలుకుతుంది.....

అలా 

మీ మీ భక్తి భావం కొలది మీ ఆర్తికి తగురీతిలో ఆ శాశ్వతమైన భగవద్ తత్త్వం అనుగ్రహిస్తూనే ఉంటుంది....

అన్ని దీపాలు కూడా కాంతి / వేడి 
అనే అనుగ్రహన్ని ప్రసాదిస్తూనే,
వారి వారి సశాస్త్రీయ జ్ఞ్యాన వివేచనతో ఉపయోగించబడిన తైలం / ప్రమిద  కొలది మరి కొంత ప్రత్యేకమైన అనుగ్రహన్ని సమకూర్చినట్టుగా....

పరంజ్యోతి గా ఆరాధించబడే ఆ పరబ్రహ్మతత్త్వం,
స్వీకరించబడిన ఒక్కొక్క స్వరూపం కొలది ఒక్కొక్క ప్రత్యేక విధమైన అనుగ్రహం ప్రసాదించడం కూడా పైన
వివరించబడిన వివిధ దీపాల రీతుల ఉండడం అనేది అధ్యాత్మవిశేషం.......

అంతమాత్రంచేత,
వైవిధ్య ఈశ్వరనామరూపాత్మక అభివ్యక్తతచే ఈశ్వరభేదం ఉందనుకోవడం కేవలం మన అజ్ఞ్యానానికి కొలమానం అవుతుందే తప్ప అది ఈశ్వరానుగ్రహానికి మేయం కారాని భావన....

పరబ్రహ్మతత్వాన్ని మీరు ఏవిధంగా నుడివినా ,
ఏవిధంగా ఆపాదించినా,  ఏవిధంగా సమన్వయపరచినా, అది ఎప్పటికీ ఉండే శాశ్వతమైన నిత్యసత్యమైన దైవికతత్త్వం.....

శ్రీచాగంటి సద్గురువులు మనకు చాల చోట్ల బోధించినట్టుగా ఆ పరబ్రహ్మతత్వాన్ని అందుకే 
" పరంజ్యోతి " అనే పేరుతో అన్ని సహస్రనామాల్లో మన ఋషులు అందించారు......

అది విష్ణుసహస్రమైనా....
లలితాసహస్రమైనా.....
శివసహస్రమైనా.....
మరే భగవద్ భగవతి సహస్రమైనా సరే " పరంజ్యోతి " అనే పేరుతోనే వచించారు....

ఒక దీపం మీరు 
నేతితో వెలిగించినా,
వివిధ తైలములతో వెలిగించినా,
దీపం తత్త్వం మాత్రం ఒక్కటే కద....

వెలుగు / కాంతి ( ద్యుశక్తి )
మంట / వేడి ( ఉష్ణశక్తి )

అనె శక్తిద్వయం మీరు వెలిగించిన ఏ దీపానికైనా ఆపాదించబడే లక్షణాలు.....

మీరు నేతితో వెలిగించిన దీపం
మరియు
కొబ్బరినూనే,
నువ్వులనూనే,
ఆవనూనే,
వేపనూనే

ఇత్యాది వాటితో వెలిగించినప్పుడు మరి భేదం ఎక్కడకానవస్తుంది....???

కేవలం వాసనలో మాత్రమే మీకు ఆ భేదం అనుభవంలోకి వస్తుంది.....

అది కనిపించదు, వినిపించదు, మరియు ఘ్రాణశక్తికి తప్ప మరేవిధంగాను ఆ భేదం తన ఉనికి చూపదు.....

కాబట్టి ఎవ్వరు ఏ దీపం వెలిగించినా
సరే అందరికి కనిపించే కాంతి, మరియు అందరి చర్మంచే గ్రహించబడే వేడి ఒక్కటే రీతిలో ఉంటుంది...

కేవలం వాసన మాత్రమే మీరు వాడిన తైలానికి అణుగుణంగా మారుతుంది.....

అట్లే అద్వయమైన ఆ పరతత్త్వం కూడా
అందరికి ఒకేలా ఉండే నిత్యమైన సత్యమైన
సత్ చిత్ ఆనంద స్వరూపం.....

అది ఎల్లరిచే ఒకే రీతిలో ఆరాధించి అందుకొనబడే సత్యతత్త్వం.....

మరి వివిధ రీతుల / మార్గాల / పేర్ల / మతాల / సాంప్రదాయాల / ఆచారవ్యవహారాల ద్వార ఆ పరతత్త్వం ఒక్కొక్కిచే ఒక్కోవిధంగా భావించబడడం /
" ఆత్మానుభవంగా " అభివ్యక్తీకరించబడడం / 
ఆత్మసాక్షాత్కారంగా భ్రమించబడడం
అనే తత్త్వానికి ప్రతీకయే ఆ వివిధ తైలములతో వెలిగించబడిన దీపం యొక్క భేదాన్ని వాసన రూపంలో వేరు వేరు తత్త్వాలుగా అందుకోవడం...

కాబట్టి ఇప్పుడు చెప్పండి..

అన్ని దీపాలు ఒకేలా కాంతిని వేడిని కలిగి ఉన్నయి కాబట్టి అవన్నీ ఒకేవిధంగా భావించబడాలా..???

లేదా ఒక్కో తైలంతో వెలిగించబడినందుకు ఈ దీపం వేరు....ఆ దీపం వేరు అని భావించబడాలా...?

అది మీ మీ వివేచనకు సంబంధించిన వ్యక్తిగత విషయం...

ఎక్కడెక్కడో ఉందని చెప్పబడే ఆ పరతత్త్వాన్ని ప్రతి మనుష్యప్రాణికి గ్రాహ్యమయ్యే రీతిలో ఆ భగవంతుడు
మనలోనే నిఘూడంగా ఆ పరబ్రహ్మతత్త్వాన్ని నిక్షిప్తం గావించాడు అనేది ఎంతో ఆశ్చర్యకరమైన కేవల మనుష్యప్రాణికి మాత్రమే పాప్తించిన
మహత్తరమైన అనుగ్రహ విశేషం...

అందుకే మానవులు అనగా

" మా నవతీతి మానవః...."

అని మన పెద్దలు, గురువులు నుడివినారు...

అనగా ఆ గుప్తమైన పరబ్రహ్మతత్త్వాన్ని అనుభవైకవేద్యమైన సత్యంగా ఆధ్యాత్మిక సాధన గావించి, సాధించి సంతసించి సంచితాన్ని సమూలంగా క్షయింపజేసుకొని పునర్జన్మ యొక్క అవసరం లేని విధంగా ( మా నవతి) మళ్ళీ పుట్టవలసిన ఆవశ్యకత లేని విధంగా లేదా పుట్టవలసివస్తే ఎంతో  దైవానుగ్రహ ప్రాప్తమైన గొప్ప మహనీయుడిగా జన్మించి ఎందరెందరికో ఆ జీవితం బాసటగా నిలిచేలా జీవించగలిగే అనుగ్రహం అని ఇక్కడి అసలైన అర్ధం...!

ఎంతో గహనమైన వేదాంతం కాకుండా
చాల సింపుల్ గా ఎందరో భక్తులకు సుపరిచయమైన సాహిత్యంతో ఆ జీవగతమైన జీవేశ్వర వైభవం గురించి వివరిస్తా వినండి.....

హృదయస్థా, రవిప్రఖ్యా, త్రికోణాంతర దీపికా |
దాక్షాయణీ, దైత్యహంత్రీ, దక్షయఙ్ఞ వినాశినీ || 

 అంత’ర్బహిశ్చ’ తత్సర్వం వ్యాప్య నా’రాయణః స్థి’తః | అనంతమవ్యయం’ కవిగ్‍మ్ స’ముద్రే‌உంతం’ విశ్వశం’భువమ్ | పద్మకోశ-ప్ర’తీకాశగ్ం హృదయం’ చాప్యధోము’ఖమ్ | అధో’ నిష్ట్యా వి’తస్యాంతే నాభ్యాము’పరి తిష్ఠ’తి | జ్వాలమాలాకు’లం భాతీ విశ్వస్యాయ’తనం మ’హత్ | సంతత’గ్‍మ్ శిలాభి’స్తు లంబత్యాకోశసన్ని’భమ్ | తస్యాంతే’ సుషిరగ్‍మ్ సూక్ష్మం తస్మిన్” సర్వం ప్రతి’ష్ఠితమ్ | తస్య మధ్యే’ మహాన’గ్నిర్-విశ్వార్చి’ర్-విశ్వతో’ముఖః | సో‌உగ్ర’భుగ్విభ’జంతిష్ఠ-న్నాహా’రమజరః కవిః | తిర్యగూర్ధ్వమ’ధశ్శాయీ రశ్మయ’స్తస్య సంత’తా | సంతాపయ’తి స్వం దేహమాపా’దతలమస్త’కః | తస్యమధ్యే వహ్ని’శిఖా అణీయో”ర్ధ్వా వ్యవస్థి’తః | నీలతో’-యద’మధ్యస్థాద్-విధ్యుల్లే’ఖేవ భాస్వ’రా | నీవారశూక’వత్తన్వీ పీతా భా”స్వత్యణూప’మా | తస్యా”ః శిఖాయా మ’ధ్యే పరమా”త్మా వ్యవస్థి’తః | స బ్రహ్మ స శివః స హరిః సేంద్రః సో‌உక్ష’రః పరమః స్వరాట్ ||

అని లలితాసహస్రంలో క్లుప్తంగా, 
నారాయణసూక్తంలో విస్తారంగా,
మన హృదయంలోనే ఎప్పటికీ కొలువైఉండే ఆ పరతత్త్వం గురించి మన సనాతన మహర్షులు వివరించడం ఎల్లరికీ విదితమే కద...

బ్రతుకమ్మ ఉత్సవంలో త్రికోణవృత్తావళి గా పేర్చబడే
ఆ లఘు సుమసౌధంలో ఊర్ధ్వమున అలకరించబడే ఆ గుమ్మడిపువ్వు యొక్క పిప్పొడి తో సంకేతించబడే తత్త్వం గా ఆ " త్రికోణాంతరదీపిక " ను, నిత్యం జీవుల హృదయకోశంలో వెలిగే పరంజ్యోతిని మన సనాతన పెద్దలు అలా జానపద ఉత్సవాంతర్గతంగా మనకు బోధించారు.....
( ఆ గుమ్మడిపువ్వు యొక్క కాడ / మూలము బత్కమ్మ మధ్యలో కొలువై ఉంటుంది...
ఆ సామ్యము క్రింద  " పంచకోశాంతరస్థిత " గా 
వివరించాను.... )

ఆశ్వయుజ దుర్గగా కాలపుపగ్గలాను చేబూని దక్షిణాయణ నాయకిగా కొనసాగే ఆ జగదంబ వైభవాన్ని ఇది వరకే  
 " బత్కమ్మ ( బ్రతుకమ్మ ) వైభవం " అనే పోస్ట్లో వివరించడం జరిగింది కద....

ఇప్పుడు ఆ పరంజ్యోతి యొక్క 
వైభవాన్ని మరికొంత విశ్లేషిద్దాం......

శ్రీలలితాసహస్రం లోని " త్రికోణాంతరదీపిక " అనే నామంపై ఎపుడైనా ధ్యానం చేసారా...???

లౌకికమైన శ్రీచక్రయంత్రస్థిత నవావరణాంతర్గతమైన శాక్తేయ వైశేషిక విషయాలను వివరించడం  ఇక్కడ నా అభిమతం కాదు....

శ్రీచాగంటి సద్గురువులు బోధించినట్టుగా యంత్రాలు, శ్రీచక్రాలు, సాలిగ్రామాలు, ఇత్యాది హైవోల్టేజ్ ఆధ్యాత్మిక పరికరాల జోలికి సామాన్యులు వెళ్ళకపోవడమే మంచిది....

మోటార్ డ్రైవింగ్ స్కూల్లో రెండునెళ్ళు కార్ డ్రైవింగ్ నేర్చుకొని, ఇక నేను విమానం నడుపుతాను అనడం ఎవ్విధంగా ఉంటుందో.....

శివ విష్ణు శక్తి సహస్రాల పుస్తక పఠనం, వివిధ స్తోత్రాలు
మనకు వచ్చు కదా అని ఇక ఇంట్లో మేరుయంత్రం పెట్టేయడం, శ్రీచక్రార్చన చేసేయడం, కూడా అట్లే ఉంటుంది....

కాబట్టి టీవీలో, 1+1 ఫ్రీ అని అడ్వర్టైస్మెంట్లు వస్తే,
చాక్లెట్లు, బిస్కెట్ పాకెట్లు, గులాబ్జామూన్ పాకెట్లు మొదలైనవి కొనుక్కొని తినాలి కాని,
శ్రీచక్రాలు, స్ఫటిక యంత్రాలు కొనుక్కొని ఇంట్లో పెట్టడం అంత శ్రేయస్కరమ కాదు.....

వాటి అత్యున్నతమైన స్థాయి వేరు....,
వాటికి కావలసిన నిరంతర శౌచసాంప్రదాయిక గురోక్త పూజావిధివిధానాలు వేరు....
వాటిని హ్యాండిల్ చేయడం ఈ కలియుగ జీవనశైలిలో అందరికీ కుదరనిపని

విమానం కనిపిస్తే చూసి ఆనందించాలి....
లేదా ప్రాప్తం ఉంటే అందులో ప్రయాణించి ఆనందించాలి...

అంతేకాని పైలట్ లా గాల్లో నడిపిస్తాననడం అంతగా సమంజసం కానిది....
( Unless one has an exceptional training and command on the same ) 

యంత్రాలు చక్రాలు కూడా అంతే...

మన శరీరమే ఒక బృహత్ శ్రీచక్రం....

మన శరీరంలోని 9 కన్నాల ద్వారా 
సాగే పిండాండ బ్రహ్మాండ సమన్వయమే
( స్థూల శరీర బాహ్య ఆంతర కమ్యునికేషన్ వ్యవస్థ ) ఆ శ్రీచక్రనవావరణ లోని శక్తివంతమైన దైవిక వ్యవస్థ...

క్రమక్రంగా ఆ శక్తిమొత్తం చేరే తుది స్థానం మన హృదయకోశంలో ఒక త్రికోణవృత్తావళి గా కొలువైన పంచకోశాంతర్గత మధ్యమున కొలువైఉండే
" ఆనందమయ కోశం" అనే సూక్ష్మమైన బిందుమధ్యగత స్వప్రకాశికలోకి...

ఆ నిరంతర స్వప్రకాశక బిందువే లౌకిక ప్రపంచంలో మనం చూసే శ్రీచక్రఊర్ధ్వమున కొలువైఉండే ఆదిపరాశక్తి శ్రీచక్రేశ్వరి శివకవితేశ్వరి యొక్క నివాస స్థానం.....

ఆ పరతత్త్వ హృదయదీపికనే వివిధ రీతుల మన సనాతన మహర్షులు దర్శించి స్తుతించి మనకు వారి యొక్క ఆ జ్ఞ్యాన విశేషాన్ని సూక్త స్తోత్ర రూపాల్లో అందించారు....!

( ఇందాక పైన ఉదహరించబడిన అస్మద్ గురుదేవుల వివిధ బిరుదు నామాలు మరియు ఎప్పటికీ శాశ్వతంగా ఉండే వారి "శ్రీచాగంటి...." అనే అసల్ పేరు యొక్క సామ్యములా అన్నమాట....) 

ఇంకా చాలా సింపుల్ గా చెప్పలంటే

కింద భూమిమీద 3 చుక్కలను కలుపుతు 60 డిగ్రీల కోణంలో అమరే విధంగా ఒక సమకోణత్రిభుజం 
గీయడానికి 3 చుక్కలను పెట్టండి...

ఇప్పిడు ఆ గీసిన ట్రయాంగిల్ యొక్క భుజాలను ఊర్ధ్వముఖంగా అనుసంధానించినప్పుడు ఆ 3 భుజాలు కలిసే కొసను 4 వ చుక్కగా భావించండి....
క్రిందన ఉన్న ఆ 3 చుక్కలను కలుపగా వచ్చిన త్రికోణసమతలానికి మరియు పైన ఉన్న 4 వ చుక్కకి సమదూరంలో ఈ నాలుగు చుక్కలను నిరంతరం అనుసంధానిస్తు ధగ ధగ మని మెరుస్తుండే ఆ 5 వ చుక్కయే  ఆదిపరాశక్తి అయిన ఆ  
" త్రికోణాంతర దీపిక ".....!

( The 3D triangular shape as in the attachment, is how our Hrudaya Trikonam Hrudayapadam being explained in the post looks like.....
However the central astral self luminous cosmic energy  [' daharaakaaSa prakaaShika'  ] is not visible here in the given attachement because it lies inside equidistant to all the 4 corners of that shape connecting and illuminating all 4 of them to execute it's unparalleled, unfathomable, unlimited, indescribable, immeasurable, cosmic energy transfusion process that sustains us through all the phases of our life until it leaves us during the body's expiry day......
That is when this " Shivam " that has been doing every possible good becomes "Shavam" because it's source of energy transfusion has left the mortal coil upon the call of it's supreme master out there in the vast universe....) 

ఈ 5 చుక్కలచుట్టూ ఆవరించి ఉండేవే

1. అన్నమయ
2. ప్రాణమయ
3. మనోమయ
4. విజ్ఞ్యానమయ
5. ఆనందమయ 

కోశములు.....

కాబట్టి

ఆ " త్రికోణాంతరదీపిక " 
ఆ " అంతర్ముఖసమారాధ్య బహిర్ముఖసుదుర్లభ..."

ఇప్పుడు ఎక్కడున్నట్టు...?

ఈ పంచకోశములందు ఆవరించి ఉండే దహరాకాశామధ్యమున వెలుగుతున్నందునే ఆ పరంజ్యోతి " పంచకోశాంతరస్థిత " అనే నామంతో స్తుతించబడడం.....

ఆ త్రికోణతలానికి మూడు వైపుల ఉన్న
చుక్కలే అన్నమయ కోశ మధ్యము,  ప్రాణమయ కోశ మధ్యము, మనోమయ కోశ మధ్యము......,

ఊర్ధ్వమున ఉన్న ఆ 4వ చుక్క  విజ్ఞ్యానమయ కోశ మధ్యము....

వీటన్నిటిని నిరంతరం అనుసంధానిస్తూ వెలుగుతూండే ఆ 5వ మధ్య చుక్కయే ఆనందమయకోశ మధ్య గత శ్రీమత్సిమ్హాసనేశ్వరి.....!

ఆ 5 చుక్కల ఘనత్రికోణమే, అనగా మన హృదయపద్మమే ఆ పరాశక్తి యొక్క సిమ్హాసనం....

ఆ సిమ్హాసనంపై శ్రీమహారాజ్ఞిగా కొలువై మన జీవితాలను శాసించే పరాశక్తియే మీరు ఏ నామరూపాలతో కూడా ఆరాధించినా అనుగ్రహించే
" సత్ చిత్ ఆనంద స్వరూపాత్మక " శాశ్వతమైన నిత్యమైన సత్యమైన పరబ్రహ్మ తత్త్వం....!! 😊

ఇక ఆ ఆదిపరాశక్తి ఏవిధంగా ఈ పంచాకోశాలతో మన పాంచభౌతిక శరీరంలోనే ఆ అలౌకిక పరతత్త్వ వీచికలను సదరు సాధకుడి ఆర్తికి అనుగుణగంగా ప్రభవింపజేసి మనిషికి అసాధ్యం కానిదంటూ లేని రీతిలో యావద్ విశ్వాన్ని మన యోగశక్తితో ఒడుసిపట్టుకునేలా అనుగ్రహిస్తుందో వేరొక పోస్ట్లో వివరిస్తాను...😊

అందుకే అన్నమాచార్యుల వారు ఈ కలియుగప్రత్యక్ష పరబ్రహ్మశక్తిని ఆ శ్రీవేంకటనగముపై కొలువైన పరతత్వాన్ని

"ఎంత మాత్రమున ఎవ్వరు తలచిన అంతమాత్రమే నీవు.....అంతరాంతరము లెంచిచూడ పిండంతే నిప్పటి అన్నట్లు...."

అనే సంకీర్తనలో అన్ని దైవిక తత్త్వాలను ఆ తత్త్వాధీశునికి ఆపాదిస్తు,

" శ్రీవేంకటపతి నీవైతే మముచేకొనిఉన్న దైవమని...
ఈవలనే నీ శరణనియెదను 
ఇదియే పరతత్త్వము నాకు.....
ఇదియే పరతత్త్వము నాకు.....
ఇదియే పరతత్త్వము నాకు..... "

అని మనకు సెలవిచ్చిరి.....😊

http://annamacharya-lyrics.blogspot.com/2006/11/65entha-matramuna-evvaru-talachina.html?m=1


Monday, June 8, 2020

శ్రీవేంకటేశ్వరవైభవం.....😊

శ్రితచేతనమందారంశ్రీనివాసమహంభజేత్.....🙏😊

" శ్రీవేంకటేశ్వరవైభవం " ప్రవచనంలో శ్రీచాగంటి సద్గురువులచే బోధించబడిన అత్యద్భుతమైన శ్రీనివాస పరదైవం యొక్క కలియుగ భక్తసమ్రక్షణా వైచిత్రి గురించి ఎల్లరు విని తరించే ఉంటారు......

"ధనమూలం ఇదం జగత్..." అనే నానుడి పై ఆధారపడిన ఈ కలికాలంలో ప్రత్యక్ష దైవమైన శ్రీశ్రీనివాసుడి అనుగ్రహం వినా ప్రశాంతంగా సుఖసంతోశాలతో జీవించడం దుర్లభం....

ఎవరు ఎన్ని బోధలు గావించిన అందరి జీవితాలు నిత్యం భ్రమించేది ధనార్జనపైనే...ఇది ఈ కలియుగ వాస్తవం... 

సాక్షాత్తు స్వామివారే తన అష్టోత్తరంలో ఏ భగవంతుడికి లేని పేరు పెట్టుకొని
" ఓం ధనార్జనసముత్సుకాయనమః...." 
అని నిత్యం ఆలయాల్లో పూజింపబడుతుండడం....

అందుకు తగ్గట్టుగానే మొక్కులు / కానుకలరూపంలో ఆయన డబ్బులనే తన ధర్మహుండీల ద్వారా స్వీకరించడం, అలా భక్తులచే నిత్యం సమర్పించబడిన డబ్బులతోనే ఎన్నెన్నో భక్తసమ్రక్షణా , ధర్మసమ్రక్షణా కార్యక్రమాలను టిటిడి ద్వారా నిర్హహించడం,
ప్రతి భక్తుడి ద్వారా తిరుమల ఆలయ వ్యవస్థకు చేరిన పైకాన్ని నయాపైసలతో సహా తిరుమల పంచబేరమూర్తుల్లో ఒకరైన గర్భాలయంలో వేంచేసిఉన్న శ్రీ కొలువు శ్రీనివాసమూర్తి గారికి ప్రతి రోజు కొలువు సేవలో లెక్కాపత్రం చదివి వినిపించడం, ఎల్లరికి విదితమైన సత్యమే కద....

తిరుమల శ్రీశ్రీనివాస దర్శనం గురించి ఆలయాన్ని దర్శించిన వివిధ భక్తులు వివిధ రకాలుగా వారికి భగవద్ అనుగ్రహంగా జ్యోతకమైన ఆధ్యాత్మిక విషయాలను చెప్పడం మనం నిత్యం చూస్తూనే ఉంటాం కద....

స్వామివారి అనుగ్రహంగా భాగవతార్ శ్రీమాన్ పరిటాల గోపికృష్ణ గురువుగారి నేతృత్వంలో 2 సార్లు అనగా 7+7=14 రోజుల పాటు తిరుమల ఆలయంలో శ్రీవారిసేవక్ గా విధులు నిర్వహించిన ఆ సేవాకార్యక్రమంలో, వారంలోని ప్రతీ రోజు, అనగా ఆ 14 రోజుల సమయంలో

ఏదో ఒక షిఫ్ట్లో వారంలోని అన్ని రోజులు
కూడా ఆనందనిలయంలో భక్తుల దర్శనం Q లైన్ ని త్వరితగతిన ముందుకు నడిపించేందుకు అక్కడ విధులు నిర్వహించే సేవకుల్లో ఒకడిగా ఉండగలిగే భాగ్యం నాకు లభించడంతో.....

ఒక వైపు 

"నడవాలి గోవిందా....ముందుకు నడవాలి...."

అని భక్తుల లైన్  ముందుకు సాగేలా భౌతికంగా నా శరీరం తో సేవచేయడం, ఆ అప్రాకృత సజీవ సాలిగ్రామావేశిత దివ్యమంగళమూర్తి యొక్క స్వరూపాన్ని, ఎన్నో జన్మల పుణ్యఫలితంగా ఈశ్వరానుగ్రహంగా , ఆపాద తలమస్తకం అలా దర్శిస్తు ఉండడం తో మనసులో ఆ శ్రీవేంకటమాధవుడిని నిలుపుకోవడం.....

వీటితో పాటుగా అసలు ఇంతటి ఘనమైన శ్రీనివాసుడి దర్శన వైభవంలోని ఆంతర్యమేమి అనే జ్ఞ్యానమార్గాన్వేషణ కూడా అక్కడ స్వామి వారి అనుగ్రహంగా తర్కించడం జరిగింది....

కలియుగ వరదుడైన ఆ శ్రీభూసమేతశ్రీనివాసుడి దర్శనంలో అన్ని తత్త్వాలు ఇమిడిఉన్నాయి....

ఎవరు ఏ తత్త్వంలో ఈశ్వరుడిని అందుకోగలరో వారికి ఆయా తత్త్వాల్లో భగవంతుడు తనను తాను ఎరుకపరిచి తన దరికి వారిని చేర్చుకుంటాడు.....

కాబట్టి అన్నితత్త్వాలు ఆ పరమాత్మయొక్క లీలావిభూతులే అనేది అధ్యాత్మతత్త్వసారం....

మలయప్ప స్వామివారిని

శ్రీదేవి భూదేవి సమేత శ్రీనివాసుడి గా సేవించడంలో గల ఆంతర్యాన్ని శ్రీచాగంటి సద్గురువులు మనకు ఈ క్రింది విధంగా వివరించినారు కద.....

" అలా శ్రీదేవి భూదేవి సహితుడిగా పరమాత్మ సేవింపబడడం అంటే దాని అర్ధం ఆయన ఇద్దరు పెళ్ళాలతో తిరుగుతున్నాడు అని కాదు....

"సకల విశ్వంలో ఉన్న సంపద మొత్తం 

చర శక్తి / శ్రీ శక్తిగా....,

స్థిర శక్తి / భూ శక్తిగా...,

లభ్యమవ్వడం ఆ ఇరువురుకి ప్రతీకలైతే, ఆ ఇరు శక్తులకు కూడా అధిపతిగా ఉండి సకల విశ్వాన్ని సమ్రక్షించే విశ్వవ్యాప్తమైన విష్ణువుని నేను....."

అని సంకేతించడమే శ్రీ భూ సమేత శ్రీనివాసుడిగా మలయప్పస్వామివారిని ఆరాధించడంలోని ఆంతర్యం.....

కాబట్టి యావద్ విశ్వమే ఆ విష్ణువు.....
ఆ విష్ణువే యావద్ విశ్వం......

"యత్ పిండే తత్ బ్రహ్మాండే......" అనే సూత్రానుగుణంగా,
పిండాండమైన ప్రతి జీవిలో ఉన్నది...
బ్రహ్మాండమైన యావద్ విశ్వంలో ఉన్నది ఒకే వైశ్విక చైతన్య శక్తి....

ఆ శక్తి సాంద్రత లోని వివిధ భేదాలే ఈ యావద్ ప్రపంచంలో వివిధ నామారూపాత్మకంగా పరిఢవిల్లే జగత్తు....

6 అడుగుల మనిషి శరీరంలో ఉన్న వివిధ భాగాలకు వివిధ స్పెషలిస్ట్లు గా 
కార్డియాలజి, నెఫ్రాలజి, న్యురాలజి,
పల్మనలాజి, ఆఫ్థాల్మాలజి, అని అలా ఎనెన్నో గహనమైన శాస్త్రాలుగా మెడిసిన్ అనే సైన్స్ ని విభాగించి ఎందరెందరో అధ్యయనం గావించి,.....
వైద్యో నారాయణో హరిః......

అని ఎల్లరిచే గౌరవింపబడుతున్నారే....

మరి ఆ శ్రీహరి ఎన్నెన్ని శాస్త్రాలకు నెలవై తనలో వాటన్నిటిని ఆపాదతలమస్తకం నింపుకొని ఉంటాడో ఒక సామాన్య మనిషికి అందే విషయమేనా అది.. ?

లౌకిక వైద్యులు, మన X-రేలు, CT స్కానింగ్లు, వివిధ రిపోర్ట్లు, రోగికి ఉండే / రోగిచే చెప్పబడే 
లక్షణాలు ఇత్యాది వాటిని ఆధారంగా చేసుకొని ఆ రోగియొక్క శారీరక, మానసిక ఆరోగ్యాలను చక్కదిద్దుతారు.....

అటువంటి వైద్యులకే వైద్యుడైన భగవంతుడు,
శ్రీవేంకటహరిగా ప్రత్యక్ష పరమాత్మగా
ఆ ఆనందనిలయంలో కొలువై,
రెప్పపాటులో వందలమందిని
తన X-రే కళ్ళతోనే స్కాన్ చేస్తు, ఆ కళ్ళనే లేసర్ బీంస్ గా మార్చి తనను దర్శించే ప్రతి భక్తుడి యొక్క 
"కర్మ సిద్ధాంత ఆరోగ్యాన్ని" చక్కదిద్దే ఘనవైద్యుడు ఆ శ్రీహరి...!!

ఒక డాక్టర్ దెగ్గరికెళ్తె  అందరిని ఒక క్రమపద్ధతిలో రమ్మని చెప్తూ, అనవసరంగా ఎవ్వరు కూడా డాక్టర్ల సమయం వృధాచేయకుండా, హాస్పిటల్లో అనవసర గోల పెట్టకుండా, ఇతర రోగులకు ఇబ్బంది కలగకుండ, ఉండే రీతిలో మనల్ని వ్యవహరించమన్ అక్కడివారు మనకు చెప్పడం అందరికి విదితమే కద....

అలా O.P Q లైన్ లో కొందరు వ్యక్తులు,
" అహా....ఈ డాక్టర్ గారు చాలా బాగా ట్రీట్ చేస్తున్నారు....
నాకు ఇక్కడే చాలా సేపు ఇట్లే ఉండిపోవాలని ఉంది ఈ హాస్పిటల్లో....నన్ను ఇక్కడినుండి వెళ్ళమని అడగకండి..."

అని అనడం ఎంత విడ్డూరంగా ఉంటుందో....

ఆనంద నిలయంలో ని భక్తుల Q లైన్లో స్వామి వారి దర్శనం మన ఆర్తికి అనుగుణంగా ప్రాప్తమున్నన్ని క్షణాల పాటు గావించిన పిపద 
" ఆహ...స్వామి వారి దర్శనం ఎంత బావుందో....నన్ను తొయ్యకండి... నేను ఇక్కడే ఇట్లే ఉండిపోతా....."

అని అనడం కూడా అట్లే విడ్డూరంగా ఉంటుంది....

స్వామివారి మణిమండపంలో ప్రవేశించిన ప్రతీభక్తుడు అట్లే అంటే ఇక వెనక వైకుంఠం Q కాంప్లెక్స్ లో వేచి ఉన్న వేలాది భక్తులకు ఎట్లా మరి ఆ భవరోగవైద్యుడి అనుగ్రహం అంది తరించేది.....??

ఒక హాస్పిటల్ లో స్వేచ్ఛగా చాలా సేపు అలా ఉండిలోవాలంటే 

మనం అందులో మెడికల్ స్టాఫ్ అయినా అయ్యుండాలి....

లేదా సపోర్టింగ్/హెల్పింగ్ స్టాఫ్ అయినా అయ్యుండాలి....

లేదా O.P కాకుండా దీర్ఘకాలం వైద్యనిమిత్తమై అడ్మిట్ అయిన పేషెంట్ అయినా అయ్యుండాలి....

అవునా...?

అట్లే

తిరుమల ఆలయంలో చాలాసేపు ఉండాలంటే,

ఎన్నెన్నో జన్మల పుణ్యఫలితంగా మాత్రమే, ఈశ్వరానుగ్రహంగా లభించే వరం, టి.టి.డి ఉద్యోగి అయినా అయ్యుండాలి....

లేదా మరూన్ / గ్రీన్ కలర్ డ్రెస్ కోడ్ లో ఉండే అక్కడి సపోర్టింగ్ / హెల్పింగ్ స్టాఫ్ అయినా అయ్యుండాలి....

లేదా శ్రీవారిసేవ నిమిత్తమై వారం రోజులపాటు అక్కడ ఉండే శ్రీవారిసేవక్ అయినా అయ్యుండాలి....

కద...

శంఖనిధి, పద్మనిధి అధిదేవతలకు నమస్కరించి ఆలయ పడికావలి లోకి అడుగుపెట్టిన సదరు భక్తుడు ఒక గంటే కంటే ఎక్కువ సమయం ఆలయంలో ఉండేందుకు పైన పేర్కొన్న 3 విధాలు కాకుండా మానుష ఉపాధితో ఆక్కడ అంతకంటే ఎక్కువ సమయం ఉండగలగడం దుర్లభం....

జీవిడిని దేవుడు,
దేవుడిని జీవుడు
ఎంతో ఆర్తితో పరికించే ఆ కొద్ది క్షణాల్లోనే శ్రీనివాసుడు గావించే ఆ అక్షయమైన దైవిక మహత్తు గురించి ఎంత చెప్పినా ఇంకా ఏదో మిగిలే ఉంటుంది.....

ఎన్ని కోట్ల మేధోమండలాలు ఈ భూప్రపంచంలో ఉన్నాయో వాటికి సరిపడేలా...

ఎల్లప్పుడు అంతకంటే పది ఇంతలు ఎక్కువే ఉంటుంది ఆ శ్రీనివాసుడి దెగ్గర 
" మానుష మస్తిష్క గత మేధోమండల నిర్వాహక భవరోగ వైద్య సామాగ్రి...!"

శ్రీదేవి భూదేవి కి ప్రతీకలుగా తన విశాల వక్షస్థలంపై స్వర్ణాభరణాల రూపంలో కొలువైన తన ఇరు శక్తులతో ఉన్న శ్రీహరి అలా ఎలా ఈ విశ్వంలోని సర్వస్వాన్ని
తన అనుగ్రహ ప్రక్రియలోకి అనుసంధానిస్తాడు అనేది ఒకింత ఆశ్చర్యకరమైన దైవిక తత్త్వమహత్తే...!

పాంచభౌతికమైనది కదా ఈ యావద్ ప్రపంచం.....

శ్రీ భూ సమేతంగా కొలువైన శ్రీహరి తత్త్వంలోకి సకల పాంచభౌతిక బృహద్ విశ్వం ఎట్లొచ్చి చేరుతుంది అని మనం అనుకుంటాం.....

కాని ఆ శ్రీ భూ అనే ఇరు శక్తుల్లోనే సకల పాంచభౌతిక వైశ్విక శక్తులు అంతర్గతంగా ఇమిడిఉన్నాయి అనేది ఇక్కడ గమనించవలసిన అధ్యాత్మతత్త్వసూక్ష్మం....

అదెట్లో చెప్తా వినండి..

సకల ఐహిక సంపదలకు, చర శక్తికి ప్రతీకగా ఉండే శ్రీదేవి శక్తిలో

మరియు

సకల భూజనితమైన సంపదకు / స్థిర శక్తికి ప్రతీకగా
ఉండే భూదేవి శక్తిలో

సకల పాంచభౌతిక వైశ్విక శక్తి ఇమిడి ఉంటుంది....

1. ఆకాశం
2. వాయువు
3. అగ్ని
4. జలం
5. పృథ్వి

అనేవి పంచభూతాలు కద....

ఆకాశాత్ వాయుః
వాయోరగ్నిః
అగ్నేరాపః
అబ్ధ్యఃపృథ్వి

అనే క్రమంలో ఈశ్వరానుగ్రహంగా ప్రభవించిన పంచభూతాల్లో ఒక విచిత్రం దాగుంది....

అన్నిటికి మూలకారణమైన మొట్టమొదటిదైన ఆకాశంలో

మరియు

ఆఖరిదైన భూమి / పృథ్వి లో ఈ 5 పంచభూతాలు కూడా కొలువైఉండడం విచిత్రమైన విశేషం.....!

ఆకాశం అనగా...??

హద్దులేనిది.....
అగ్రాహ్యమైనది.....
ఎంతవరకు ఉందని మీరు భావించగలరో అంతకంటే పది అంగుళాలు ఎక్కువే ఉంటుంది...

అందుకే అది ఈశ్వరతత్త్వానికి సూచికగా చెప్పబడేది....

భూగోళం తో సహా అన్ని గ్రహమండలాలు ఎక్కడ ఎక్కడున్నాయి...??
ఆకాశంలోనే.....
కాబట్టి ఆకాశంలో భూతత్త్వం ఇమిడి ఉంది..

"ఆకాశానికి చిల్లులు పడ్డాయ ఏమి అన్నట్టుగా వారం రోజులుగా భారి వర్షాలు పడడంతో ఊరంతా గోదారైయ్యింది...."
అన్నప్పుడు ఆ జలం అంతా ఎక్కడినుండి వచ్చింది...?
ఆకాశం నుండి.....
కాబట్టి ఆకాశంలో జలతత్త్వం ఇమిడి ఉంది....

"ఆకాశమంతా మెరుపులతో ఉరుములతో భయానకంగా ఉండి ఫాలనా చోట పిడుగుపడి చెట్ట్లు నిలువునా దహించబడ్దాయి....."
అన్నప్పుడు అంతటి అగ్ని ఎక్కడినుండి వచ్చింది...??
ఆకాశం నుండి.....
కాబట్టి ఆకాశంలో అగ్నితత్త్వం ఇమిడి ఉంది....

"తూఫాన్ తాకిడికి భారి వృక్షాలు, విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి......"
అన్నప్పుడు అంతటి వాయు ప్రభంజన శక్తి ఎక్కడినుండి వచ్చింది...??
ఆకాశం నుండి.....
కాబట్టి ఆకాశంలో వాయు తత్త్వం ఇమిడి ఉంది....

అట్లే.....

"బొరింగ్ వేయగా పాతాళగంగ పెళ్ళుబికింది......"
అన్నప్పుడు అంతటి జలం ఎక్కడినుండి వచ్చింది...??
భూమి నుండి.....
కాబట్టి పృథ్విలో జల  తత్త్వం ఇమిడి ఉంది....

"అగ్నిపర్వతం బద్దలై ఇనుమును సైతం చిటికెలో కరిగించివెయ్యగల లావా ఎగిసిపడుతుంది......"
అన్నప్పుడు.....
అంతటి అగ్ని శక్తి ఎక్కడినుండి వచ్చింది....
భూమి నుండి.....
కాబట్టి పృథ్విలో అగ్ని తత్త్వం ఇమిడి ఉంది....

"సింగరేణి బొగ్గుగనుల్లో, భూమిపొరల్లోనుండి విషవాయువులు ఉత్పన్నమై చాల మందికి అస్వస్థతకు కారణమయ్యింది...."
అన్నప్పుడు.....
అంతటి వాయు శక్తి ఎక్కడినుండి వచ్చింది....
భూమి నుండి.....
కాబట్టి పృథ్విలో వాయు తత్త్వం ఇమిడి ఉంది....

"కొన్ని వందల మీటర్ల లోతు తవ్వకాలలో పురాతన ఆలయాలు, గుహలు ఆ గుహల్లో వివిధ వస్తువులు ఇప్పటికి కూడా చెక్కుచెదరకుండా లభ్యామయ్యాయి...."
అన్నప్పుడు.....
( అది ఖాళి అంటారు కొందరు...
కాని అది పూర్ణము అంటాను నేను... )
అంతటి ఆకాశం ఎక్కడ దాగుంది ఇన్నాళ్ళుగా....
భూమి లో.....
కాబట్టి పృథ్విలో ఆకాశ తత్త్వం ఇమిడి ఉంది....

కాబట్టి ఇక్కడ మనం గమనించినట్టుగా

ఆకాశంలోను మరియు పృథ్విలోను పంచభూతాత్మక పరిపూర్ణత్వం అంతర్నిహితమై ఇమిడి ఉంది.....

కాబట్టే ఆయన శ్రీ భూ సమేత శ్రీనివాసుడిగా సేవించబడుతున్నాడు....

ఎందుకంటే పరమాత్మ లా  ఆకాశం/శ్రీశక్తి మరియు పృథ్వి/భూశక్తి రెండూ కూడా పరిపూర్ణాత్మకం కాబట్టి....😊

వాటినుండి ఎవ్విధమైన తత్త్వములను సైతం సృజించవచ్చును కాబట్టి.....

ఇదన్నమాట క్లుప్తంగా ఆ శ్రీభూసమేత శ్రీనివాసుడి పరిపూర్ణాత్మక వైభవం.....

పై వివరణకు సరితూగేలా

మీరు ఆకాశం మరియు భూమిని మాత్రమే స్త్రీ వాచకం తో అనాదిగా పోల్చబడడం మిగతా 3 పంచభూతాలను పుం వాచకంతో పోల్చబడడం గమనించేఉంటారు.....

వాయు దేవుడు
అగ్ని దేవుడు
వరుణుడు / సముద్రుడు / పర్జన్యుడు

అని గాలిని, అగ్నిని, జలాన్ని, సంబోధించడం వినుంటారు గాని.....

ఆకాశ దేవుడు , భూదేవుడు అని ఎక్కడా వినుండరు.....

గీర్వాణి పలుకు, చరవాణి పలుకు, ఆకాశవాణి పలుకు, అని స్త్రీవాచకంగానే ఆకాశాన్ని సంబోధించడం వినుంటారు.....

భూదేవి ఆంశలో ప్రభవించిన సీతాదేవి,
'ఓం భూసుతాయై నమః' అని అర్చించబడే గోదాదేవి, ఇత్యాదిగా
భూమిని భూదేవిగా స్త్రీ వాచకం తోనే సంబోధించడం మీరు వినుంటారు కద.....

" భూమ్యాకాశం ఎకమైనా సరే నన్ను, నాకుటుంబాన్ని సతాయించిన వారిని అంతకు అంత సాధించి తీరేంతవరకు నా పడగ దించను.....
వారిని కాటేసేంతవరకు నా పగ చల్లారదు...."

అనేలా ఉండే సినిమా డైలాగ్లు వినుంటారు కాని.....

గాలి నీరు ఎకమైనాసరే....
నీరు నిప్పు ఎకమైనాసరే....
నిప్పు గాలి ఎకమైనాసరే....

అనేలా డీలాగ్స్ ఎప్పుడైనా విన్నర...?

పైన వివరించబడిన భూమికి ఆకాశానికి ఉన్న ప్రత్యేకత వల్ల మరియు అవి రెండు, రెండు ఎక్స్ట్రీంస్ కావడం వల్ల అలా ఆ రెంటినే వాడుకలోకి తీస్కోవడం జరిగింది... 

ఏ ఎక్స్ట్రీంస్ అయినా సరే పరమాత్మ అదుపాగ్జ్యలలోనే ఉంటాయి కాబట్టి కేవలం భూమి మరియు ఆకాశం మాత్రమే నామరూపాత్మక గ్రాహ్య శక్తులుగా శ్రీనివాసుడి ఇరుదేవేరులుగా కొలువై మనల్ని రక్షిస్తున్నాయి....

" లక్ష్మ్యతే ఇతి లక్ష్మి..." అనే వ్యుత్పత్తి ప్రకారంగా
లక్ష్మ్య అనగా గుర్తు లేదా సంకేతించబడునది....

కాబట్టి తన శ్రీ భూ సతులైన ఇరుదేవేరులతో పాటుగా పరమాత్మ యొక్క సకల శక్తులకు గుర్తుగా / సంకేతించబడే తత్త్వసూచికగా ఆ శ్రీనివాసుడు ఈ కలియుగంలో తన శక్తిని " వ్యూహలక్ష్మి " గా తన ఉరముపై వామభాగంలో కొలువైఉండేలా చేసుకొని,
కుడివైపు తన శ్రీవత్సచిహ్నం తో, వరద కటిహస్తాలతో,
పూర్ణచంద్రుని వంటి వదనంతో, మందస్మితుడై ఆనందనిలయుడిగా కొలువై ....

" శ్రీవత్సవక్షసం శ్రీశం శ్రీలోలం శ్రీకరగ్రహం
శ్రీమంతం శ్రీనిధిం శ్రీఢ్యం శ్రీనివాసం భజేదనిశం...." 

అని భక్తలోకంచే నిరంతరం వివిధ రీతుల సేవించబడుతున్నాడు ఆ శ్రీవేంకటేశపరబ్రహ్మము....😊

అందుకే అన్నమాచార్యుల వారు,
స్వామివారు ఎంత ఘనమైన గగనగంభీరమైన తత్త్వంతో అలరారే పరిపూర్ణుడిగా, శ్రీవేంకటపతిగా కొలువైనారో,

"అణోరణీయన్ మహతోమహీయన్...."

అనేంతటి గంభీరమైన తాత్వికత తనలో ఇముడ్చుకున్న్న సంకీర్తనలో

"ఆనురేణుపరిపూర్ణమైనా రూపము....
అణిమాదిసిరి అంజనాద్రిమీదిరూపము....."

అని స్తుతించారు ఆ అనంతమైన పరిపూర్ణ దైవిక తత్త్వమహత్తును.....😊

శ్రీమదలర్మేల్మంగాపద్మావతీ సమేత శ్రీశ్రీనివాసపరబ్రహ్మణే నమః...🙏

http://annamacharya-lyrics.blogspot.com/2007/04/197anurenu-paripurnamaina.html?m=1

Saturday, June 6, 2020

శ్రీకంచిమహస్వామి వారి 127 వ జయంత్యుత్సవ శుభాభినందనలు....😊


శ్రీ సద్గురువాగ్వైభవం.....

న గురోరధికం తత్వం...
న గురోరధికం తపః...
తత్వజ్ఞ్యానాత్ పరమ్నాస్తి
తస్మై శ్రీగురవే నమః...!!

అని నమస్కరిస్తోంది సద్గురువుల సాటిలేని సహృదయ వైభవాన్ని శ్రీ గురుస్తోత్రం.....

శ్రీరాముడు పరిస్థితుల దృష్ట్యా 14 సంవత్సరాల అరణ్యవాసానికి వెళ్ళాల్సివస్తే, ఇంటికి పెద్దవాడైన అన్నకు దక్కాల్సిన సిమ్హాసనం కుట్రతో కైక భరతుడికి దక్కాలనే అలా చేసిందని గుర్తించి అలా పెద్దవాడుండగా రాజ్యం తనచేతిలోకి తీసుకోవడం శ్రేయస్కరం కాదని తెలిసి అన్నను తిరిగి వచ్చి రాజ్యాన్ని స్వీకరించమని అడిగిన సంస్కారమూర్తి ఆనాటి భరతుడు.....

14 సంవత్సరాలపాటు అరణ్యాల్లోనే ఉండడం తన విహితధర్మం కాబట్టి అంతః పురానికి
తిరిగిరావడం కుదరదని సున్నితంగా తిరస్కరించిన శ్రీరాముడి పాదుకలను శిరస్సుపై ధరించి వాటిని సిమ్హాసనంపై శ్రీరాముడికి ప్రతీకగా నెలకొల్పి రాజ్యాన్ని పాలించిన సుగుణం అనాటి తమ్ముడైన భరతుడిది......

శ్రీ చాగంటి సద్గురువుల సంపూర్ణరామాయణం విన్నవారికి గుర్తున్నట్టుగా, కోసల సామ్రాజ్య సైన్యంతో ఏనుగు అంబారీలతో  శ్రీరాముడిని తిరిగి తీసుకురావడానికి, అరణ్యానికి వస్తున్న భరతుడిని సమీపంలోని ఒక చెట్టుపైకెక్కి చూసిన లక్ష్మణుడు అది భరతుడు వారిపై యుద్ధానికి వస్తున్నట్టుగా భ్రమించి, వారిపై దాడికి అనుమతించమని శ్రీరాముడిని అడిగినప్పుడు,

" అలా తొందరపాటు నిర్ణయాలతో ఎవ్వరినీ కూడా అన్యథా భావించి ఆవేశంలో పనులు చెయ్యకూడదు లక్ష్మణ....

నీ అనవసర కోపాన్ని తగ్గించి స్థిమితపడి నీ అన్న భరతుడి గురించి అలా వచించడం మానుకో....
భరతుడి మంచితనం గురించి నాకు తెలుసు......." అని 

సర్దిచెప్పిన శ్రీరాముడి మాటలను ఔదలదాల్చి అన్నమాటను గౌరవించిన సంస్కారం ఆనాటి తమ్ముళ్ళది....

అది త్రేతాయుగం నాటి మాట.....

కలి ప్రకోపం లేని కల్మష రహితమైన మనసులు కాబట్టి అన్నను గౌరవించాలి అనే సంస్కారం బాగ ఉండగలిగే అవకాశాలు అప్పటి శ్రీరామాయణ కాలం నాటివి.....

అన్నను ఓర్వలేని వారు,
అన్న ఉన్నతిని భరించలేని వారు,
జిత్తులమారి నక్కలా ఎన్నెన్నో పన్నాగాలతో
అన్నను సాధించే మూర్ఖులతో కలిసి,
అన్న పడే కష్టానికి ఏ విలువ ఇవ్వడమే కాక అన్న ఉనికికే ప్రమాదకరమైన రీతిలో వ్యవహరించే దుర్మాగులతో అంటకాగే దౌర్భాగ్యపు పస్థితుల్లో జీవించడం ఈనాటి కలియుగపు తమ్ముళ్ళకే చెల్లుతుంది......

ఎన్నో కష్టాలకు ఎదురీది ప్రశాంతమైన వాతావరణంలో,జీవితాలను నిలుపుకుంటున్న మధ్యతరగతి కుటుంబాల్లో చిచ్చు పెట్టి లాభపడాలనే ఆ దౌర్భాగ్యుల మాటలు నమ్మి, అందరి క్షేమంకోరే 
అన్న మాటకు ఎదురు చెప్పకూడదు కద అనే 
కనీస ఆలోచన కూడా రాని అత్యంత శోచనీయమైన స్థితిలో జీవించడమే ఈ కలియుగ కౄరత్వానికి ప్రతీక...!

ఒక వ్యక్తి తమ్ముడికి, బంధువులకి, స్నేహితులకి, ఆఖరికి తన భార్యకు సైతం విషాన్ని నూరిపోసి మీరు సాధించేది ఏముంటుంది.....?
మీ సర్వసం తన బాధాతప్త ఆక్రోశజ్వాలల్లో హరించుకుపోవడం మినహ...

కాలం ఆసన్నమైనప్పుడు సమూలంగా 
సర్వనాశనం అవ్వడమే మీ కౄరకర్మలకు ఈశ్వరుడి ఫలితం.....

మీలాగే నక్కలా కౄరపన్నగాలు పన్నిన
శకుని, దుర్యోధనుడు, సైంధవుడు, దుశ్శాసనుడు, వీళ్ళ పంచన చేరినందుకు కర్ణుడు, అశ్వత్థామ,
ఆఖరికి అందరిచేత పెద్దమనిషిగా నమస్కారం పొందిన భీష్మపితామహుడితో సహా సకల కౌరవ వంశం సర్వనాశనమయ్యింది....

1. మాయా జూదం బాగా వచ్చు కాబట్టి పాచికలతో ఎత్తులు వేసి పాండవులను అన్నీ కోల్పోయేలా చేసానని విర్రవీగాడు శకుని....

చిన్ని కృష్ణుడికంటే ముందే జగన్మాయ గా శ్రీకృష్ణసహోదరి గా అవతరించిన కాలస్వరూపిణి ఆదిపరాశక్తి వేసే పాచికలముందు ఎప్పటికైనా తలవంచవలసిందే అనే సత్యాన్ని మరిచాడు......
కాబట్టి అట్లే నశించిపోయాడు.....

2. దుశ్శాసనుడు నిండుసభమధ్యలో ఒక రాచకాంతను అవమానిస్తుంటే, విలపిస్తున్న ఆ పాంచాలి పక్షాన కనీసం ఒక్క మాటైనా మాట్లాడి ఆ దుర్మార్గాన్ని ఆపేందుకు కనీస మానవ ప్రయత్నమైనా చేయకుండా ఉన్నందుకు,

పైగా 

" ధర్మరాజంతటి వారే ఏమి మాట్లాడట్లేదు కాబట్టి ఇక నేనేమి మాట్లాడగలను...."

అని....

అందరికీ పెద్దమనిషిగా ఉండి కూడా ఆ తీవ్రమైన అధర్మాన్ని కనీసం ప్రశ్నించని పాపానికి, శ్రీ చాగంటి సద్గురువులు వివరించిన ధర్మసూక్ష్మ వివరణ ప్రకారంగా,

అర్జునుడి గాండీవ సంధిత శరపరంపరకి
ఒళ్ళంతా తూట్లు పడి ఇక బాణాలు కొట్టడానికి జాగలేనంతగా యుద్ధభూమిలో నేలకొరిగి బాధపడి ఆ పాపానికి లెక్కలు చెల్లించవలసివచ్చింది కద భీష్మపితామహుడికి......

3. ఎవ్వరి జోలికి వెళ్ళకుండా ఒక గృహిణి గా గౌరవంగా జీవించే స్త్రీమూర్తిని, రాచకాంతను, 
యజ్ఞ్యవేదిలో దేవతాంశలో దృపదమహారాజుకు పుత్రికగా లభించిన ద్రౌపదిని,
అత్యంత హేయమైన రీతిలో అలా జుత్తిపట్టి ఈడ్చుకొచ్చి అవమానించడం అనే మహాపాపం ఎంతో విర్రవీగుతు గావించాడు దుశ్శాసనుడు....

రాజసూయయాగానంతర అవబృథస్నానజలాలతో అభిషేకించబడిన ఆ శక్తివంతమైన జుత్తును అమర్యాదతో అలా పట్టి ఈడ్చినందుకు,

అప్పుడు ద్రౌపది చేసిన శపథం,

" నన్ను ఇంత ఘోరంగా అవమానించిన దుశ్శాసనుడి రక్తం కళ్ళజూసేంతవరకు ఈ కురులు ముడివేయను....."

దేవతాంశలో జన్మించిన రాచకాంత అలా కురులు ముడివెయ్యను అని భీష్మించుకొని వాడి మరణం కూడా అంత హేయమైన రీతిలో ఉండేలా ఆక్రోశించిది కాబట్టి,

భీముడి చేతిలో అంత కౄరంగా రక్తం ఏరులైపారేలా వధించబడ్డాడు దుశ్శాసనుడు...!

4. సైంధవుడు.....
అప్పటినుండి ఇప్పటికి కూడా మూర్ఖత్వానికి ప్రతీకగా లోకంలో అందరికి గుర్తుండిపోయిన పేరు....

" ఒక మంచి పని చేస్తుంటే....సైంధవుడిలా అలా అడ్డుపడుతున్నాడెందుకురా ఆ దౌర్భాగ్యుడు....."

అనే వాడుక గురించి అందరికి తెలిసిందే.....

ధర్మసంకల్పానికి అడుగడుగునా అలా అడ్డుపడ్డాడు కాబట్టి అంత ఘోరంగా అర్జునుడి శరప్రహారానికి తల తెగి, అది కింద భూమి మీద పడకుండా యుద్ధభూమికి దూరంగా అక్కడెక్కడో తపస్సు చేసుకుంటూ ఉన్న సైంధవుడి తండ్రి చేతిలో ఆ తల పడేలా, గాల్లో బంతి ఆటలా ఆ తలను పాశుపతాస్త్రంతో ఆడించాడు శ్రీకృష్ణపరమాత్మ.....

అర్జునుడితో అలా సమయానుగుణంగా పాశుపతాస్త్ర ప్రయోగంతో సైంధవుడి తల వాడి తండ్రి చేతిలోనే పడి, అప్పుడు అది క్రింద భూమిమీద పడేలా చేసిన శ్రీకృష్ణపరమాత్మ యొక్క చాణక్యం ముందు 
వారి ఎత్తులన్నీ చిత్తైనాయి.....

వాడి తండ్రి అతి తెలివితో గావించిన ఏర్పాటు,
" సైంధవుడి తల ఎవరు భూమి మీద పడేందుకు కారణమవుతారో వారి తల వ్రక్కలై ఉత్తరక్షణం మరణించెదరు గాక...."
అనే కుసంకల్పం బెడిసికొట్టి,
ఎవరు చేసిన " ఒవర్యాక్షన్ " కి ఫలితం వారే అనుభవించాలి అనే సిద్ధాంతానుగుణంగా, 
సైంధవుడి తల చేతిలో పడగానే ఉలిక్కి పడి అది పక్కన పడెయ్యడంతో అక్కడికక్కడే తల వ్రక్కలై మరణించాడు...

పరమాత్మ యొక్క సంకల్పం
ఇంత గొప్పగా ఉంటుంది కాబట్టే ఆయన్ని 

" దుష్టసమ్హార గోవిందా.....
దురితనివారణ గోవిందా...." అని స్తుతించడం......

అర్జునుడు ఎంతో గొప్ప వీరుడే.....

కాని అర్జునుడు గురిచూసి కొట్టేది తన రెండు కళ్ళతో మాత్రమే.....

అనగా అక్కడ అర్జునుడు శరప్రహారం తో సైంధవవధ చేయడం అతని గొప్పతనమే.....

కాని ఆ తరువాత ఎదురయ్యే దురితం కేవలం పరమాత్మకు మాత్రమే దర్శించడం సాధ్యం.....

ఎందుకంటే ఆయన యావద్ ప్రపంచాన్ని అనునిత్యం తన రెండు కళ్ళతో చూస్తూనే ఉంటాడు కాబట్టి....

" సూర్యచంద్రౌచ నేత్రే....!" కద....

అలా అత్యంత సంక్లిష్టమైన సైంధవధ లో ఒక్క దెబ్బకు రెండు పిట్టలు అనేలా సైంధవుడు మరియు మూర్ఖుడైన వాడి తండ్రి హతులైనారు....

బావకోసం బామ్మర్ది తపన అన్నట్టుగా దుర్యోధనుడికి అర్జునుడిపై గల వైరాన్ని తన వైరంగా భావించి అర్జునుడిని ఎట్లైనా సరే వధించి తీరాలని సంకల్పించి తుదకు తన వలలో తానే చిక్కి చచ్చాడు దుర్యోధనుడి సొంత బామ్మర్ది ( దుశ్శల భర్త).....

అవతలివైపు ఉన్న బావాబామ్మర్దుల జోడి సాక్షాత్ నరనారాయణులని తెలియక అలా తలలు పగలుకొట్టుకున్నారు సైంధవుడు మరియు వాడి తండ్రి...

5. ఇక అసలైన కురువంశ మూలఘాతి, శతకౌరవాగ్రేసరుడు, కలిపురుష అంశలో జన్మించినవాడు, మహాభారత సంగ్రామంలో
ఎందరో ప్రాణాలు కోల్పోవడానికి కారకుడు,
హద్దెరగని పొగరుబోతుతనానికి, దుష్టత్వానికి ప్రతీకైన
దుర్యోధనుడు, 
విజ్ఞ్యులైన పెద్దలను అవమానపరిచి మైత్రేయుడు శపించినట్టుగా భీముడి చేతిలో అత్యంత కౄరంగా తొడలు విరిగి చచ్చాడు.....

నెత్తికెక్కిన గర్వంతో ఏ తొడలను చూపిస్తూ ఒక రాచకాంతను అవమానపరిచాడో ఆ తొడలు విరిగి చచ్చిన తర్వాతగాని వాడికి ఆ గర్వభంగం కాలేదు....

"మా జీవితంలో భోజనానికి ఇబ్బంది లేకుండా ఒక 5 ఊర్లైనా ఇవ్వండి చాలు....."
అని పద్ధతిగా, వినయంతో అర్ధించిన పంచపాండవుల సంస్కరాన్ని వారి తక్కువతనానికి ప్రతీకగా భావించి
ఎంతో పొగరుతో ఇవ్వనని అవమానించాడు.....

మంచివారు మంచిగ ఉన్నంతసేపే మంచివారు.......
వారిని అనవసరంగా బాధించి హింసించిన వారికి, ఆ మంచితనమే మహాశక్తిగా మారి దుర్మార్గులను సమూలంగా సమ్హరిస్తుంది......

అదే కాలం యొక్క గొప్పదనం......

అదే కాలస్వరూపమైన ఈశ్వరుడి యొక్క గొప్పదనం....

ఇవ్వాళ నీ చేతిలో  అధికారం, ఐశ్వర్యం అన్నీ ఉండొచ్చు ఈశ్వరానుగ్రహంగా.....

కాని అవి నువ్వు వేటికోసం వెచ్చిస్తున్నావు అనే దానిపై అధారపడి ఉంటుంది నీ భవిష్యత్తు......

ఒళ్లు కొవ్వెక్కి మంది జీవితాల్లో అశాంతి కుంపట్లు రగిల్చి, ఒక కుటుంబంలో నిప్పులు పోసి సినిమా చూద్దాం అన్నట్టుగా మీ విద్వత్తును ఉపయోగిస్తే ఆ కౄరకర్మలను ఈశ్వరుడు కాల స్వరూపంగా ఎప్పుడు మీకు ఎట్లా అప్పజెప్పి బుద్ధిచెప్పాలో అట్లే చేసి మీకు కనువిప్పు కలిగిస్తాడు.....

శ్రీ చాగంటి సద్గురువుల మాటల్లో చాలా సింపుల్ గా చెప్పాలంటే

" పరోపకారమే పుణ్యం....పరపీడనమే పాపం....."

అంతే.....

నువ్వు నీదైన శైలిలో అతితెలివితో ఇతరుల జీవితాల జోలికి వెళ్ళి వాళ్ళ కన్నీళ్ళకు కారణమైనప్పుడు,

ఈశ్వరుడు తనదైన శైలిలో ఆ దుష్కర్మను కాలక్రమంలో పాపఫలితంగా  నీతో అనుభవింపజేస్తాడు....

తద్వారా నీ పుణ్యం ఎంతో త్వరగా క్షయమై , మిగిలినదంతా పాపమే కాబట్టి ఏసీ కార్లల్లో బట్టలు నలగకుండా బ్రతికిన జీవితాలు, ఆ బాధితుల ఆక్రందనకు అల్లాడిపోయేలా చేస్తాడు ఈశ్వరుడు....

ఎవరి జీవిత నిర్ణయాలు వారు తీసుకుంటారు.....

అనాహ్వానితులుగా మీరు అనవసరంగా కలగచేసుకొని సద్గురువుల స్థానంలో ఉన్నట్టుగా ఇతరులను, వారి జీవితాలను ఇట్లే ఉండాలని శాసించడం మీకు తగదు.....

వారు నమ్ముకున్న సద్గురువులు వారికి ఎల్లవేళలా తమదైన జ్ఞ్యాన మార్గంలో వారిని కించపరచకుండా, బాధించకుండా దిశానిర్దేశం గావిస్తూనే ఉంటారు....

మీరు వారి జ్ఞ్యానమార్గానికి సైంధవుడిలా అడ్డుపడకుంటే అదే మీరు చేసే మహోపకారం...!

పొగరుతో ఇతరులను ఏ విధంగా ఇబ్బందిపెట్టి అడ్డుపడినా సరే,
శ్రీకృష్ణ పరమాత్మ చేతిలో సైంధవుడికి పట్టిన గతే మీక్కూడా పడుతుంది.....

ఆనాడు ద్వాపరంలో భగవద్గీత గా తన జగద్గురుత్వాన్ని నిర్వహించాడు ఆ శ్రీకృష్ణ పరమాత్మ.....

యుగభేదాన్ని అనుసరించి ఈశ్వరుడు తనదైన నామరూపాలతో భువికి దిగివచ్చి శరణాగతులను సమ్రక్షిస్తాడు కనుక,
ఇప్పటి ఈ 21వ శతాబ్దపు నవయుగ శ్రీకృష్ణపరమాత్మ యొక్క వాణి అనగా శ్రీ చాగంటి సద్గురువుల వాణియే ఎల్లరికి క్షేమదాయక సద్గురుత్వం......

ఎందుకంటే శ్రీ చాగంటి సద్గురువుల తత్త్వం, మనస్తత్త్వం, వ్యక్తిత్వం, గురించి ఒక్కమాటలో చెప్పాలంటే వారు ఒక చక్కని పూర్ణఫలవృక్షం వంటి వారు.....( కొబ్బరి చెట్టు )

పచ్చబంగారం గా లోకంలో ప్రసిద్ధి చెందిన కొబ్బరి చెట్టు వైభవం గురించి తెలియని వారుండరు కద....😊

అందుకే అస్మద్ గురుదేవులకు ఆ ఉపమానం చక్కగా ఉంటుందని భావించాను....

తన జీవితపర్యంతంలో, ఒక కొబ్బరి చెట్టు చేసే మేలు ఎల్లరికి విదితమే కదా...

భూమి పొరల్లో ఉన్న నీటిని గ్రహించి తను ఉన్న చోటిని సారవంతంగా మార్చుతుంది.....

చక్కని చల్లని ఆరోగ్యకరమైన గాలిని అందిస్తుంది....

అలసిన కళ్ళకు విశ్రాంతినందించే ఆకుపచ్చని కొబ్బరిమట్టలతో అలంక్రితమై ఉంటుంది....

కొబ్బరి బోండాల్లో ఎల్లరికి ఆరోగ్యదాయకమైన తియ్యని నీటిని అందిస్తుంది.....
( మనం చెట్టుకు ఉప్పునీటిని పోసినా సరే కొబ్బరి బోండాల్లో తియ్యని నీరే లభిస్తుంది....)

దేహదారుఢ్యానికి ఎంతో ఘనమైన ఆహారమైన కొబ్బరిని అందిస్తుంది.....

( మా ఇంట్లో చిన్నప్పుడు 9th క్లాస్ వరకు ఒక కొబ్బరి చెట్టు ఉండేది..... 

మా అమ్మ నాటిన ఆ కొబ్బరి చెట్టు విరగకాసేది....

సాధారణంగా ఉండే ఎర్ర కొబ్బరి లా కాకుండా ఆ కొబ్బరి కాయల పెచ్చు నల్లగా ఉండేది.....
అసలు ఆ కొబ్బరి ఎంత తియ్యగా ఉండేదంటే కొబ్బరి లడ్డూల్లో చక్కెర కలపకుండానే తియ్యని లడ్డూలు చేసుకొని తినేవాళ్ళం....

ఇంట్లో పూసే వివిధ పూలు, కొబ్బరి కాయలు, దానిమ్మ కాయలు, జాంకాయలు.....ఇత్యాదివన్నీ 
ఇంటికొచ్చే మా బస్తివాళ్ళందరికి తీసుకెళ్ళమని పంచేది మా అమ్మ ...

మిగతావి పెద్దగా పట్టించుకునే వాడిని కాదు కాని,
"ఆ కొబ్బరి బోండాలు మాత్రం అందరికి కాసినవి కాసినట్టే  పంచేయకు....
నేను ఉన్నా కదా అన్నీ బోండాల పీచు ఒలిచి, కొబ్బరి నీళ్ళు మీకిచ్చి కొబ్బరి కాయలన్నీ లడ్డూలు చేసుకొని తినెయ్యడానికి....."

అని....నేను అసలు మా అమ్మ అలా అందరికి బోండాలు పంచిపెట్టడాన్ని సహించేవాడిని కాదు....
కొబ్బరి లడ్డూలంటే అంతగా ఇష్టం నాకు...

కొబ్బరిని అలా బాగ తినడానికి 
కొబ్బరి బోండాల పీచును ఇంట్లో ఉన్న స్కౄడ్రైవర్ తోనే ఒలిచేసిన చేతులు కాబట్టి కొబ్బరి ఎన్ని రకాలుగా మనకు అనుగ్రహం ప్రసాదిస్తుందో అనేది నాకు చిన్నప్పుడే అవగతమైన సత్యం....

కొబ్బరి పీచుతో అప్పుడు మాకు ఉండే దోమల బెడదకు విరుగుడుగా రాత్రి 7 అవ్వగానే ఇంట్లో ఒక ఇనుపగంపలో కొంచెం కిరోసిన్ పోసి నిప్పంటించి పొగ పెట్టి, అది ఇల్లంతా ఆవరించి ఇంటిపైన ఉన్న రేకుల సందుల్లోనుండి పొగ బయటకు వచ్చినంక అప్పుడు తలుపులు తెరిసే వాళ్ళం....ఇంట్లోని దోమలన్నీ ఒక్క గంటలో దెబ్బకు చచ్చేవి.....

విరిగిన కొబ్బరి మట్టల ఆకులను చీరి చీపుర్లు చేసుకుంటే అవే ఒక సంవత్సరానికి సరిపోయేవి....

నేను ఆ కొబ్బరి ఆకులను చీరి మధ్యలో ఉన్న ఆ పుల్లలతో బాణాలు, ధనస్సు తయారు చేసి
రాబిన్హుడ్ లా అన్ని చెట్ల ఆకులపైకి బాణాలను సంధించి ఆడుకునే వాడిని....

మా చిన్ననాటి కొబ్బరి చెట్టుతో ఉన్న అనుబంధంతో 
అలా కొబ్బరి చెట్టులోని అణువణువు మనకు ఉపకరించడం అనే సత్యం నాకు చిన్నప్పుడే గ్రాహ్యమైనందున నాకు కొబ్బరి చెట్టు తో శ్రీ చాగంటి సద్గురువుల ప్రవచనాల సద్వాక్కుల వైభవాన్ని పోల్చడం సబబు అనిపించింది....😊

ఎందుకంటే వారి ప్రవచనాంతర్గత సద్వాక్కుల వైభవం కూడా కొబ్బరి చెట్టు యొక్క వివిధ జనితములవలే ఎవ్వరు ఎంత శ్రద్ధతో ఒడిసిపట్టుకుంటారో వారికి కావలసిన ఐహిక పారామార్దిక లబ్ధికి అవి అంతగా అనుగ్రహమై వర్ధిల్లుతాయనేది నా గత దశాబ్ద కాల స్వానుభవ జీవిత సత్యం......!

ఇప్పటి ఈ కాలానికి, అప్పటి శ్రీ కంచి పరమాచార్య గారిలా, 
ఎల్లరికి భగవద్ తత్త్వం యొక్క వైభవాన్ని అందించి శిష్యులందరి జీవితాల్లో ఆ ఈశ్వరానుగ్రహం శాశ్వత ఇష్టకామ్యార్ధ సిద్ధిని వర్షించేలా అనుగ్రహిస్తున్న ఈనాటి
శ్రీ చాగంటి సద్గురువుల్లో ఆనాటి శ్రీ కంచి మహాస్వామి వారిని దర్శిస్తు.....,

ఒకనాడు కాకినాడలో శిష్యులు శ్రీచాగంటి సద్గురువులను
'"నడిపించే దైవం" గా మిమ్మల్ని బిరుదాంకితులను చేసి పిలుచుకుంటాము ....'  అని విన్నవిస్తే....

' "నడిచే దైవం" గా వినుతికెక్కిన శ్రీపరమాచార్యుల బిరుదు నామానికి దెగ్గరగా ఉండేలా మీరు అభిమానం కొలది అలా నన్ను పిలవాలనుకోవడం నేను అర్ధంచేసుకోగలను కాని అలా వద్దు....ఎప్పటిలానే గురువుగారు అని మాత్రమే పిలవండి....'
అని సున్నితంగా వారించినా,
అంతటి సహృదయ వైశాల్యమున్న శ్రీచాగంటి సద్గురువులు నిజంగానే ఈ 21వ శతాబ్దంలో మనకు ఈశ్వరానుగ్రహంగా ప్రసాదించబడిన నడిచే దైవమే అనేది శిష్యులెల్లరి హృదయ భావతరంగం అనేది అధ్యాత్మిక జగత్తుకి బాగా రూఢమైన సత్యమేకద...😊

శ్రీగురు పాదపద్మముల చెంత ఒక వినేయుడి చిరు కవనకుసుమాంజలిపూరిత సాష్టాంగప్రణామాలు....🙏😊💐🌷🌹🌼🌸🏵💮🌻