Sunday, December 21, 2025

శ్రీ విశ్వావసు 2025 మార్గశిర బహుళ ద్వాదశి ప్రయుక్త సూర్య ధనుస్సంక్రమణ పర్వసమయ శుభాభినందనలు...🙂💐


శ్రీవేంకటాచలపుణ్యక్షేత్రంలో ఏకాహ్నిక / ఒక్కరోజు బ్రహ్మోత్సవ పర్వసమయంగా బహు ప్రసిద్ధినొందిన "మాఘ శుద్ధ సప్తమి" / "సూర్య సప్తమి" అనే ప్రముఖ పండగ విజ్ఞ్యులకు విదితమైనదే....

రథసప్తమి పర్వసమయం అనగా...,
సప్తాశ్వచోదకఏకచక్రరథసారధిగా వర్ధిల్లే అనూరుడు (గరుత్మంతుడి అన్నగారు) సూర్యపరమాత్మ యొక్క రథాన్ని ఉత్తర దిశగా మళ్ళించే సమయం గా వినుతికెక్కిన ఉత్తరాయణపుణ్యకాల ప్రారంభ సమయం...,
ఇటు భూలోక వాసులకు / మనుష్యులకు ప్రత్యక్ష పరమాత్మగా భాసిల్లే సూర్యబింబం యొక్క తేజోలభ్యత వృద్ధిచెందుతూ, ఎండలు పెరిగే ఎండాకాల సమయం....
తదనుగుణంగా
అటు వివిధ దేవలోక వాసులకు / దివిజులకు సూర్యపరమాత్మ ప్రసాదించే సకలజీవచైతన్యోద్దీపక ఆత్మశక్తి తత్త్వం మెండుగా పరిఢవిల్లే "దేవతల పగటి" సమయం....
కాబట్టి ఈ ధనుర్మాసం దేవతలకు ఉషోదయకాలం....
అని సాధారణంగా ఎల్లరూ వచించే అంశం....

ఇక్కడ మనం గమనించవలసిన కొన్ని ముఖ్యమైన విషయాలు ఏంటంటే....

ఒక ట్రైన్ సికింద్రాబాద్ లో ఆగి ఉన్నప్పుడు, 
అందులో ఒక బోగీలో ఒక సీటింగ్ అరీనాలో ప్రయాణించే 9 మంది ప్రయాణికుల్లో, (అటు ముగ్గురు, ఇటు ముగ్గురు, సైడ్ కి ఇద్దరు, సైడ్ అప్పర్ బెర్త్ లో ఒకరు, మొత్తం కలిపి 9 మంది) 
ఎవరికి ఎవరు ఉత్తరంలో ఉన్నారో, ఎవరికి ఎవరు దక్షిణంలో ఉన్నారో, ఎవరికి తూర్పున ఎవరు ఉన్నారో,
ఎవరి పడమరకు ఎవరు ఉన్నారో, చెప్పడం తేలిక....
ఎందుకంటే భూగురుత్వాకర్షణశక్తికి లోబడి పనిచేసే దిక్సూచి / కంపాస్ అనే పరికరం యొక్క సహాయంతో చెప్పగలం ...

అదే ట్రైన్ నిర్దేశిత రైలుపట్టాలపై శరవేగంతో తన గమ్యం దిశగా ప్రయాణించే సమయంలో, ఎన్ని సార్లు దిశలు మారుతూ ఉంటాయో ఆ ట్రైన్ డ్రైవర్ గారికి కూడా తెలియదు..
అట్టి రైలు ప్రయాణంలో ఉన్నప్పుడు, అదే ఉత్తరం, ఇదే దక్షిణం, ఇది తూర్పు, అది పడమర అనే వాదనకు అర్ధం ఉండదు...

ఒక వేళ అట్టి రైలు ప్రయాణంలో కదులుతూ తిరుగుతూ ఉండే రైల్లో, బోగీలు కూడా నిరంతరం కదులుతూ తిరుగుతూ ఉంటే ఇక అసలు దిక్కుల ప్రస్తావన అనేది వర్తించని అంశంగా ఉండును...
(ఉదాహరణకు, వాటర్ వరల్డ్ లాంటి ప్రదేశాలకు వెళ్ళినప్పుడు అక్కడ ఉండే హైపర్స్పీడ్ రోలర్ కోస్టర్స్ / రోటేటింగ్ జాయంట్ వీల్స్, లాంటివి గమనించే ఉంటారు.....)

ఇదే సిద్ధాంతాన్ని మీరు రోదసీలో భ్రమణం గావించే గ్రహాలకు, "ఇతర ఖేచర వస్తు సముదాయానికి" వర్తింపజేసి గమనిస్తే, అసలు అంతరిక్షంలో దిక్కుల ప్రస్తావన అనేది అర్ధరహితమైన అంశం....

ఈ అంశాన్ని ఐ.ఎస్.ఎస్ లో భ్రమణం గావించే వ్యోమగాములను మీరు అడిగి తెలుసుకోవచ్చు.....
అనగా ఎవ్విధంగా పగలు, రాత్రి, క్రింద, పైన, ఇత్యాది ఏ లౌకిక అంశాలు కూడా వర్తించని వారి చిత్రవిచిత్రమైన
వ్యోమనౌకాంతర భారరహిత జీవిత ప్రయాణాన్ని...,
మరియు ఆ వ్యోమాంతరశూన్యంలో సాగే వారి ప్రయాణంలో భాగంగా సైన్స్ కి అందని ఎన్నో రోదసీ విజ్ఞ్యాన అంశాల పట్ల వారు ఏర్పరుచుకునే అవగాహన గురించి...

కాబట్టి ఒక్కసారి భూగురుత్వాకర్షణ వలయం నుండి విడివడిన భూలోక వస్తువులకు, తత్త్వాలకు, దిక్కులు, దివారాత్రములు ఇత్యాది మన భూలోక పరిభాష తాలూకా ఫినామిన / దృగ్విషయాలు అసలు వర్తించవు....

కాబట్టి సూర్యుడు జనవరి / ఫిబ్రవరి నుండి ఉత్తరదిక్కుగా ప్రయాణిస్తున్నాడు....జూన్ / జులై నుండి దక్షిణం దిక్కుగా ప్రయాణిస్తున్నాడు....
ఇత్యాది కాన్సెప్ట్స్ అన్నీ కూడా వర్తించేది మన భూలోక వాసులకే కాని, దివిజులకు, దేవతలకు, వివిధ దేవలోకవాసులకు కాదు....

కాబట్టి అసలు ఈ ఉత్తరాయణ పుణ్యకాలం దేవతలకు పగటి సమయం అంటే ఏంటి...
దక్షిణాయణ పుణ్యకాలం దేవతలకు రేయి సమయం అంటే ఏంటి...
వీటి మధ్యలో ఉండే మార్గశిర / పుష్య / మాఘ మాసాలనే సంధి సమయాల్లో ఏతెంచే ధనుర్మాసం, వైకుంఠ ఏకాదశి, మకర సంక్రాంతి, రథసప్తమి, పండగలకు అనాదిగా గల ప్రాభవంలోని ఆంతర్యం ఏంటి....

ఇత్యాదిగా సందేహాలు ఉండే అధ్యాత్మ విజ్ఞ్యాన జిజ్ఞ్యాసువులకు, శ్రీరుద్రంలో చాలావరకు సమాధానాలు లభించును....
ఎందుకంటే శ్రీ చాగంటి సద్గురువుల ప్రవచనాలు శ్రద్ధగా ఆలకించిన విజ్ఞ్యులకు తెలిసినట్టుగా...
"వ్యోమవత్ వ్యాప్తదేహాయ...." అని పరమశివుడు స్తుతింపబడుతున్నాడు...
అనగా ఈ వ్యోమం ఎక్కడివరకు వ్యాపించి ఉన్నదో / వ్యాపిస్తూ ఉండునో, అక్కడి వరకు కూడా అదంతా మహేశ్వరుడి వ్యోమమేని వైభవం అని శాస్త్రం కీర్తిస్తున్నది....

ఈ అధ్యాత్మ సత్యాన్ని గుర్తుంచిన విజ్ఞ్యులకు వ్యోమప్రయాణం అనేది శూన్యంలో ప్రయాణం కాకుండా పూర్ణంలో ప్రయాణంగా భాసిల్లును....

అనగా...

ఒక సామాన్యుణ్ణి ఈ కుండలో ఏమున్నది అని అడిగితే...
ఠక్కున వారు చెప్పే సమాధానం...
"ఇది ఖాళి కుండ...ఇందులో ఏమి లేదు..." అని....

ఇదే ప్రశ్నని మీరు ఒక సైంటిస్ట్ ని అడిగితే....
"ఈ కుండ నిండా గాలి ఉన్నది....
కావాలంటే చూడండి...నీటిలో ఈ 
కుండను ముంచితే ఎవ్విధంగా బుడుక్ బుడుక్ అనే శబ్దం తో బుడగల రూపంలో ఆ గాలి కుండనుండి బయటకి వస్తున్నదో...."
అని సమాధానం ఇస్తారు....

ఇదే ప్రశ్నని మీరు ఒక అధ్యాత్మ సైంటిస్ట్ ని అడిగితే....
"ఈ కుండ నిండా ఘటాకాశం ఉన్నది.....
(మరియు నాలోన హృదాకశం ఉన్నది.....)
అది వెలుపల పరివ్యాప్తమై ఉన్న చిదాకాశంతో ఏకీకృత భావనను కలిగి ఉన్నది....
తత్ కారణంగా శూన్యంగా అనిపించే / కనిపించే ఈ కుండలో పూర్ణత్వం దాగి ఉన్నది....
తగు సాధనతో, ఆ పూర్ణత్వం పరిపూర్ణుడైన పరమేశ్వర తత్త్వాన్ని గ్రాహ్యపరిచే సాధనమై ఒప్పారుచున్నది....
కాబట్టి ఇందులో, అందులో, అన్నిట్లో, అన్నిటా, అందరియందు, అన్నిటికీ ఆవల కూడా ఉన్నది ఒకే ఒక తత్త్వం....అదే అద్వయమైన ఆద్యంతరహితమైన, ఆశ్చర్యకరమైన, అజరామరమైన, అందీఅందని ఆకాశతత్త్వం...
అదే పరమాత్మతత్త్వం....."
అని సమాధానం ఇస్తారు....

ఇంతకుముందు ఒక పోస్ట్లో, ఆకాశతత్త్వానికి పృథ్వీతత్త్వానికి గల సామ్యము, సంబంధము, తత్త్వసమన్వయము, వివరించాను....

అవ్విధంగా, అందరాని ఆకాశతత్త్వం గురించి ఆకళింపుచేసికొని తరించాలంటే,
అందుబాటులో ఉండే పృథ్వీతత్త్వాన్ని అవగతం చేసుకోవాలి.... తద్వారా ఆకాశతత్త్వం, తన్మూలంగా పరతత్త్వం అవగతమౌను....

భూదేవి అంశలో ఆనాడు త్రేతాయుగంలో సీతమ్మతల్లి / జానకి / వైదేహి, నిన్నటి ద్వాపరయుగంలో సత్య భా మా / సత్యభామ, ఇవ్వాళ్టి కలియుగంలో శ్రీవిళ్ళిపుత్తూర్ లో కోదై / గోదమ్మ / చూడికుడుత్తనాచ్చియార్ గా పరమాత్మయొక్క శర్వతత్త్వ శక్తి భక్తులను అనుగ్రహించడానికి ప్రభవించెను.....
అని విజ్ఞ్యులకు ఎరుకే...

పరతత్త్వం శ్రీరాముడిగా వచ్చినప్పుడు పరేశి సీతమ్మ గా ప్రభవించెను...
పరతత్త్వం శ్రీకృష్ణుడిగా వచ్చినప్పుడు పరేశి సత్య భా మ / సత్యభామ గా ప్రభవించెను...
శ్రీరంగనాథుణ్ణి వరించిన శ్రీరంగనాయకిగా గోదమ్మ పరేశి గా ప్రభవించెను...
కాబట్టి శ్రీరంగనాథుడిగా ఇలకు పరతత్త్వం ఎప్పుడువచ్చెను....?

శ్రీచాగంటి సద్గురువుల "సంపూర్ణ శ్రీమద్రామాయణం" ప్రవచనాలు శ్రద్ధాభక్తులతో ఆలకించిన విజ్ఞ్యులకు గుర్తునట్టుగా...,

శ్రీరాముడు కైకేయి విధించిన 14 సంవత్సరముల
అరణ్యవాసానంతరం, పౌలస్త్యవధ అనే అవతారప్రయోజనం సిద్ధించిన తదుపరి అగ్నిపరీక్షానంతరం,
సీతమ్మగా కాంచనలంకలో బంధీయై ఉండి రావణవధకు కారణమైన వేదవతిని అగ్నిదేవుడికి అప్పగించి,
"బ్రహ్మగారి ఆజ్ఞ్యమేరకు మీకోసం కాంచన లంకలో రావణుడిచెరలో బంధీయైన సీతమ్మగా జీవించిన నన్ను కూడా మీ భార్యగా స్వీకరించండి ప్రభు..."
అని అభ్యర్ధించిన వేదవతితో,
"రాబోవు కలియుగంలో ఆకాశరాజు పుత్రికగా నీవు ప్రభవించెదవు...
శ్రీవేంకటేశ్వరుడిగా పరిఢవిల్లే నేను పద్మావతిగా ప్రభవించే నిన్ను అగ్నిసాక్షిగా పెండ్లాడి, కలియుగభక్తజనోద్ధరణకై పద్మావతీప్రియుడైన శ్రీతిరుమలేశుడిగా ఏడుకొండల శ్రీవేంకటేశ్వరుడిగా కలియుగప్రత్యక్షవరదైవమై వర్ధిల్లెదను...."
అని శ్రీరాముడు వేదవతికి అభయమిచ్చి....,
అగ్నిదేవుడి సమ్రక్షణలో ఉన్న నిజమైన సీతమ్మవారిని గైకొని, 
శ్రీ చాగంటి సద్గురువుల వివరణ విన్నవారికి గుర్తున్నట్టుగా.....,
ఎంతమంది ఎక్కినా కూడా ఇంకొకరికి ఎల్లప్పుడూ చోటు ఉండే మహిమాసిద్ధితో శోభిల్లే పుష్పకవిమానం రావణాసురుడి సొంత విమానం ఏంకాదు....వరసకు అన్నగారైన కుబేరుడి నుండి దోచుకున్న విమానం....కుబేరుడు పరమేశ్వరుడికి పరమమిత్రుడు.....అందుకే శ్రీసీతారాములు, వానరసేనతో సహా పుష్పకవిమానాన్ని అధిరోహించి అయోధ్యకు పయనమైనారు...

శ్రీసీతారాముడిగా, పుష్పకవిమానాన్ని అధిరోహించి, అయోధ్యకు తిరిగివచ్చి, 500 నదీజలాలతో కోసల మహాసామ్రాజ్య చక్రవర్తిగా పట్టాభిషిక్తుడైన సందర్భంలో,
తన అన్నదమ్ములైనా కూడా రావణకుంభకర్ణుల పంచన ఉండకుండా..,ధర్మాత్ముడైన శ్రీరాముడి తరపున ఉండడమే భగవద్ సమ్మతమై ఉండును కాబట్టి, ఇంటిగుట్టులంకకుచేటు అన్న చందంగా, శ్రీరాముడిని ఆశ్రయించి రావణాసురుడి అపజయానికి కారణమైనందున,  విభీషణుడికి శ్రీరాముడు ఏకంగా తరతరాలుగా ఇనవంశ కులదేవతయై అలరారే అపురూపమైన శ్రీరంగనాథమూర్తిని కానుకగా ఇచ్చి పంపించగా....,

ఎన్నో శతాబ్దాలుగా సాటిలేని సూర్యవంశ చక్రవర్తుల పూజామందిరంలో కొలువై ఎనలేని సౌరశక్తిసంపన్నమైన శ్రీరంగనాథమూర్తిని ఒక రాక్షసుడు తన రాజ్యానికి తీసుకొని, భరతఖండాన్ని దాటి వెళ్ళడం అంతగా నచ్చని వినాయకుడు, ఒక ఉపాయంతో, ఇప్పుడు ఉన్న శ్రీరంగంలో కావేరి నదీ మధ్యప్రాంతంలో లంకను చూస్తు దక్షిణాభిముఖంగా కొలువైఉండేలా ఒక లీలను ప్రదర్శించాడు...
ఆ కావేరి నది ప్రభవించడానికి కారకుడు కూడా తమిళనాడులో వీధివీధికి ఉండే గణపతి గుడిలో కొలువై పూజింపబడే పిళ్ళైయార్ / వినాయకుడే...

కావున, కావేరి నదీమధ్యలో అఘోరవదనంతో పరమేశ్వరుడు కొలువై ఉన్న ఒకానొక అత్యంత అరుదైన మహామహిమాన్వితమైన ప్రదేశంలో, అకాశమార్గంలో విభీషణుడు తీసుకొని వెళ్తున్న ఆ శ్రీరంగనాథమూర్తికి తన ఎనలేని పృథ్వీతత్త్వాన్ని గరిమ సిద్ధితో ఆపాదించి ఎవ్వరూ మోయలేనంత, కదిలించలేనంత బరువైన శ్రీరంగనాథమూర్తిగా అక్కడికక్కడే సద్యోప్రతిష్ట గావించగా, గణపతి యొక్క అమేయమైన పృథ్వీతత్త్వ అనుగ్రహం శ్రీరంగదివ్యదేశక్షేత్రానికి మెండుగా కలదు....

చాలా తక్కువమంది భక్తభాగవవతులకు తెలిసినట్టుగా, గహనమైన అధ్యాత్మశాస్త్రప్రకారంగా...
పరమేశ్వరపంచాస్యవదనవైభవం ఒక్కో దిక్కులో ఒక్కో ప్రశస్తమైన పంచభూతతత్త్వవైభవంతో అలరారుతూ ఉండును....

ఆకాశ తత్త్వం : ఈశాన వదన తత్త్వం
వాయు తత్త్వం : వామదేవ వదన తత్త్వం
అగ్ని తత్త్వం : తత్పురుష వదన తత్త్వం
జల తత్త్వం : సద్యోజాత వదన తత్త్వం
పృథ్వీ తత్త్వం : అఘోర వదన తత్త్వం

కావున, పరమేశ్వరుడి శర్వశక్తి వైభవంతో అలరారే శ్రీరంగక్షేత్రంలో శర్వాణి తనయుడైన శ్రీగణపతి అనుగ్రహంతో కొలువైన శ్రీరంగనాథుణ్ణే తన పరమేశ్వరుడిగా, పరేశి గా ప్రభవించిన గోదమ్మ ఎంచుకొని, భక్తభాగవతులను తరింపజేసే శ్రీవ్రతం / తిరుప్పావైని వచించి రచించి అనుగ్రహించి లోకాన్ని తరింపజేసేను...

ఇప్పుడు మనం కొన్ని అధ్యాత్మ విషయాలను గమనిద్దాం....

శాస్త్రప్రకారంగా / గరుడపురాణం ప్రకారంగా....
ఒక దేహం నుండి విడివడిన జీవుడు...
తైజసిక దేహధారియై తూర్పుదిక్కుగా ఆకాశంలో ప్రయాణిస్తే మిక్కుటమైన పుణ్యసంచయంతో ఆ జీవాత్మ ఉన్నతమైన జన్మలను అనుగ్రహంగా అందుకునే జీవప్రయాణానికై వెళ్తున్నట్టు అర్ధం.....
ఉత్తరదిక్కుగా ఆకాశంలో ప్రయాణిస్తే ఆ జీవాత్మ పుణ్యపాపరహితుడై ఉన్నతోన్నతమైన పరమపదాన్ని / కైవల్యాన్ని అందుకునే జీవప్రయాణానికై వెళ్తున్నట్టు అర్ధం.....
పశ్చిమం దిక్కుగా ఆకాశంలో ప్రయాణిస్తే ఆ జీవాత్మ తన ఆఖరి ఘడియల్లో ఉన్న కోరికలకు అనుగుణంగా ఇతర జన్మలను అందుకునే జీవప్రయాణానికై వెళ్తున్నట్టు అర్ధం.....
దక్షిణం దిక్కుగా ఆకాశంలో ప్రయాణిస్తే ఆ జీవాత్మ తన పాపాలకు ఫలితంగా అధోజన్మలను అందుకునే జీవప్రయాణానికై వెళ్తున్నట్టు అర్ధం.....

మీ నాయనమ్మో, పెద్దమ్మో, పెద్దనాన్నో, మామయ్యో, అమ్మమ్మో, తాతయ్యో / ఇత్యాది బంధువులు ఎవరో గతించినప్పుడు, వాళ్ళ పార్ధివదేహం యొక్క శిరస్సు దెగ్గర పెట్టిన దీపం యొక్క వెలుగులో ఆ దేహాన్ని త్యజించిన జీవుడి యాత్రను దర్శించినట్టుగా చెప్తున్నావు ఏంటి నాయనా....
అని కొందరికి ఈ విషయాలు విడ్డూరంగా అనిపించవచ్చేమో...

అందరికి గుండే లయ మామూలుగా వినిపిస్తదేమో...
కాని ఒక స్టెతోస్కోప్ ని ధరించిన డాక్టర్ గారికి బాగా గట్టిగా గుండే లయ ధ్వనిస్తూ వినిపిస్తది...

అందరికి నక్షత్రాలు మామూలుగా చిన్నచిన్న మెరిసే చుక్కలుగా కనిపిస్తాయేమో...
కాని టెలిస్కోప్ తో దర్శించే వారికి బాగా పెద్దగా ఒక దేదీప్యమానమైన గ్రహంగా కనిపిస్తాయ్...

అట్లే....

శ్రీగురువుల అనుగ్రహంగా స్వప్రకాశకమై భాసించే అసంఖ్యాకమైన అమేయమైన అధ్యాత్మ శాస్త్రార్ణవాన్ని విశ్వసించి దర్శించే వారికి కొన్నికొన్ని అట్లనే సవిస్తరంగా / డీటైల్డ్ గా అగపడే అంశాలుగా ఉంటాయ్....
అదంతే....

ఎందుకంటే....

నమ్మేవారికి అది శివలింగం....
ఇతరులకు అది రాతిలింగాకారం...

నమ్మేవారికి అది సగుణసాకార శ్రీహరిరూపం....
ఇతరులకు అది ఒక దేవతామూర్తి...

సరే, ఇంతకి అసల్ టాపిక్ ఏంటంటే...
గోదమ్మ ఆరాధన విశేషమైన శ్రేయస్కరమైన సిరిసంపదలను అనుగ్రహిస్తూ తుదకు పరమపదాన్ని అనుగ్రహించే సాధనంగా ఎట్లు ఒప్పారునూ అని తెలియాలంటే...

తిరుప్పావైలో ఆవిష్కరింపబడిన గోదా హృదయాన్ని / గోపికా మధురభక్తిని / గోవింద పరమాత్మ అనుగ్రహంగా లభించే పరతత్వవిశేషాన్ని, పైన పేర్కొనబడిన అధ్యాత్మవిషయాలన్నీ కూడా ఒక రీతిలో సమన్వయపరుచుకుంటూ, గోవిందుణ్ణి ఆరాధించే వారికి ఈశ్వరానుగ్రహంగా భాసించును....

గోదామధురభక్తి వైభవం అంతటి ప్రశస్తమైన అధ్యాత్మ భక్త భాగవత మధుకావ్యం కాబట్టే....

ఆనాడు శ్రీకృష్ణదేవరాయల వారు విజయనగరమహాసామ్రాజ్యాధీశులై భోగభాగ్యాల్లో మునకలాడే రాచరికజీవనంలో ఉన్నాకూడా,
" ఆముక్తమాల్యద " అనే గ్రంథాన్ని రచించి, తిరుమలేశుడైన శ్రీవేంకటేశ్వరుణ్ణి పరతత్త్వంగా ఆరాధించే కోదై గా వారిని వారు అభివర్ణించునున్నారు....

ఎన్నెన్నో పురాణ ఇతిహాస కావ్య ప్రవచనాసుధామృత లహరుల్లో తేలియాడే అధ్యాత్మవిద్యాకోవిదులుగా వర్ధిల్లే బ్రహ్మవేత్తలైన శ్రీ చాగంటి సద్గురువులు, ప్రాచీన ద్రావిడం బాగా పఠించగల ఒక బాలికతో తిరుప్పావై పాశురాలను
చదివిస్తూ మరీ "తిరుప్పావై" (శ్రీవ్రతం) అనే టాపిక్ మీద కూడా ప్రవచనాలను అనుగ్రహించారు....

పరతత్త్వం ఎన్ని నామరూపాలుగా పరిఢవిల్లుతున్నా...అవన్నీ ఒకే పరమాత్మ యొక్క వివిధ కార్యకారణసిద్ధాంత కారక
విభూతులు కాబట్టే శ్రీతాళ్ళపాక అన్నమాచార్యుల వారు ఈ క్రింది సంకీర్తనలో.....
"భూలలనాధిపం భోగిశయనం" 
అని 
శ్రీరాముణ్ణి, శ్రీరంగనాథుణ్ణి, శ్రీకృష్ణుడే అయిన శ్రీవేంకటేశ్వరుణ్ణి ఎంతో ఘనమైన సంస్కృత పదమంజరులతో 
ఆరాధించారు.....

దేవ దేవం భజే దివ్యప్రభావం
రావణాసురవైరి రణపుంగవం

రాజవరశేఖరం రవికులసుధాకరం
ఆజానుబాహు నీలాభ్రకాయం
రాజారి కోదండ రాజ దీక్షాగురుం
రాజీవలోచనం రామచంద్రం

నీలజీమూత సన్నిభశరీరం
ఘనవిశాలవక్షం విమల జలజనాభం
తాలాహినగహరం ధర్మసంస్థాపనం
భూలలనాధిపం భోగిశయనం

పంకజాసనవినుత పరమనారాయణం
శంకరార్జిత జనక చాపదళనం
లంకా విశోషణం లాలితవిభీషణం
వేంకటేశం సాధు విబుధ వినుతం

https://annamacharya-lyrics.blogspot.com/2006/10/53devadevambhajedivyaprabhavam.html


గోదమ్మ తన మెండైన అనుగ్రహంతో భక్తులెల్లరినీ ఘనంగా అనుగ్రహించాలని అభిలషిస్తూ...

ఆచార్య తిరువడిగలే శరణం....💐🙏🙂
ఆండాళ్ తిరువడిగలే శరణం....💐🙏🙂

కూడారై ఉత్సవం తరువాత మళ్ళీ ఇంకొక తిరుప్పావై వైభవం పోస్ట్ తో, గోవిందుడి పరతత్వ వైభవం గురించి సంభాషించుకుందాం.....

సర్వం గోదా సమర్పిత శ్రీతులసీశోభితపుష్పమాలాలంకృత శ్రీవేంకటకృష్ణార్పణమస్తు.....💐🙏🙂

[ నా మితృడు శ్రీ పొన్నాల వెంకటేశ్ గారు రచించి అందించిన మధురమైన గోదామంగళసంకీర్తన కామెంట్స్ సెక్షన్లో జతపరిచాను....విజ్ఞ్యులెల్లరూ ఆలకించి ఆనందించండి....🙂 ]

"ET Awards for Corporate Excellence" announces Mr. Nara ChandraBabu Naidu gaaru, hon'ble chief minister of Andhra Pradesh, as the "Business Reformer of the year"

"ET Awards for Corporate Excellence" announces Mr. Nara ChandraBabu Naidu gaaru, hon'ble chief minister of Andhra Pradesh, as the "Business Reformer of the year" for all the laudable kaleidoscopic efforts spent in rejuvenating AP's business friendly goodwill index as a harbinger of all inclusive growth and development across a spectrum of fields / sectors. 

Shree Chandrababu gaaru is fondly remembered by many Hyderabadis as one of the well known dignitaries of the Indian polity with a wise vision for a brighter, healthier and educated tomorrow's world, that has consolidated the world renowned ISB, at its current Gachibowli campus, over a cup of tea with his exceptionally strong and sharp persuasive skills...and it is quite heartening to see that he continues to have many such Hi-Tea discussions with many enthusiastic investors and industrialists all over the world to execute his dream project of Navyaandhrapradesh for a niche carved state of the art industrial corridor by promoting a harmonious horizontal growth matrix to keep the reverence of the Global Indian Business index bar higher and stronger which shall certainly promote a healthy industrial growth competition amongst the neighborhood states too for a much improved collaborative inter state growth saga...

CBN sir, many hearty congratulations to you and your executive team on achieving such global accolades and all the very best for many such kudos ahead .. .🙂💐

జీవితంలో అత్యంత ముఖ్యమైన అంశాలు ఎక్కడ ఉండాలో, ఏం తినాలో, మొదలైనవి కాదు...ఎవరితో / ఎవరెవరి సారధ్యంలో ఉండాలో, ఏఏ విజ్ఞ్యానాంశాలతో ఏ సందర్భాన్ని ఎట్లు అధ్యయనం గావించి విజయపథంలో మున్ముందుకు సాగాలో....ఇత్యాదివి....

వింటే భారతం వినాలి...
అనే పాతకాలం నాటి సామెతకు అర్ధం...,
ఊరికే గారెలు తింటూ బొర్రలు పెంచుకుంటూ బ్రతకమని....,
మహాభారతంలో వారు అలా అన్నారు.....,
వీరు ఇలా అన్నారు....,
అనే మాటలతో బ్రతకమని కాదు అర్ధం....

గారెల్లో ఉండే మినుములతో గట్టి ఆరోగ్యాన్ని గడించి...
మహాభారతంలో ఉండే పాత్రల జీవితకథనంలో జరిగిన సంఘటనల్లో ఉండే ఘనమైన లౌక్యాన్ని గడించి జీవితంలో తరించమని....ఆ సామెతకు అసలైన అర్ధం...

అందుకే సంపూర్ణ శ్రీమద్భాగవత ప్రవచనాలను అనుగ్రహించి, ఆ సమయంలో ప్రవచనకర్తలవిహితగౌరవార్ధమై బహూకరింపబడిన ఒక పంచెలచాపు స్వీకరించడానికి కూడా ఎంతో బిడియపడిన బ్రహ్మవేత్తలుగా వర్ధిల్లే బ్రహ్మశ్రీ చాగంటి సద్గురువులు అట్టి శ్రీమద్భాగవతకథాసుధామృతాస్మరణమననలహరుల్లోనే ఉండిపోకుండా....,
ఈ ఆధునిక కాలంలో కూడా ఎంతగానో వర్తించే భారత ఇతిహాస విజ్ఞ్యానం ఈతరం విజ్ఞ్యులకు కూడా అంది తరించాలని, శ్రీమహాభారతం ప్రవచనాలు కూడా అనుగ్రహించి, ఎంతో మంది అమాయకులుగా ఉండి మందిని ముంచి బ్రతికే ఆధునిక ధనబకాసుర వెధవల చేతిలో పరిహసింపబడకుండా గొప్ప మేలును ఒనరించారు...

నరనారాయణుల వృత్తాంతం, సహస్రకవచుడు, ఘటోత్ఖచుడు, శల్యుడు, కర్ణుడు, సైంధవుడు, గాంధారి, కుంతీదేవి, విరాటపర్వ ఉత్తరగోగ్రహణసమయౌచిత్యం, ఇత్యాదిగా ఎందరో / ఎన్నో మహాభారత వృత్తాంతాల నుండి అందుకొని తరించవలసిన విజ్ఞ్యానాంశములను శ్రీచాగంటి సద్గురువుల శ్రీమహాభారత ప్రవచనాల నుండి అందుకోవడం నా పురాకృత సుకృతం...

దూరం నుండి అగపడే సదరు పువ్వులను కొందరు మల్లెలు, జాజులు అని అనుకోవచ్చు...
ఇంకొందరు నందివర్ధనాలు, కాగడమల్లెలు అని అనుకోవచ్చు...
అది వారువారు పరికించే తీరు, పరికింపబడే దూరంపై ఆధారపడి ఉండే అంశం...

అదే విధంగా...

దూరంగా ఉండే సదరు వ్యక్తిత్వాలను కొందరు శ్రీకృష్ణార్జునులు అని అనుకోవచ్చు....
ఇంకొందరు దుర్యోధనకర్ణులు అని అనుకోవచ్చు....
అది వారువారు వివేచించే తీరు, విశ్లేషించే శైలిపై ఆధారపడి ఉండే అంశం...

సదరు వ్యక్తిత్వాలు శ్రీకృష్ణార్జునులుగా భావింపబడినా,
దుర్యోధనకర్ణులుగా భావింపబడినా..,
ఈ లోకంలో గుర్తించవసిన అతి ముఖ్యమైన విషయం ఏంటంటే, కర్ణశల్య వృత్తాంతం విన్నవారెవ్వరూ కూడా వారివారి జీవితాలకు శల్యుడి వంటి తోడేలు వ్యక్తిత్వాన్ని సారధిగా ఉండడానికి ససేమిరా అంగీకరించరు...
ఎందుకంటే....
సూర్యుడికి ఎదురుగా నిలవడం ఎంత దుస్సహమో....
సహజ స్వర్ణకవచకుండలధారి అయిన సూర్యపుత్ర కర్ణుడికి ఎదురుగా రణభూమిలో నిలవడం కూడా అంతటి దుస్సహమైన అంశం...
అప్రతిహత వీరుడైన కర్ణుడికే చిరాకు తెప్పించి రణభూమిలో రథచక్రాలు భూమిలో ఇరుక్కోవడంతో పరాభవం, అపజయం, నిధనం కలగడానికి కారణమైన శల్యసారధ్యంలో ఉండే వారి జీవితప్రయాణం మొత్తం పక్కలోబల్లెంలా ఉండే మూర్ఖప్రయాసే అగును...

శ్రీకృష్ణపరమాత్మ యొక్క సారధ్యంలో ఉండే పార్థునకు, విజ్ఞ్యులెల్లరినీ గౌరవించే ఫల్గుణుడికి, తన నీడను కూడా నమ్మని సవ్యసాచికి / అర్జునుడికి, దేవతలందరి అనుగ్రహం ఎల్లప్పుడూ వెంటే ఉండును...
అందుకే అర్జునుడికి గల వివిధ పేర్లను స్మరించినంతమాత్రాన ఉరిమే పిడుగులు కూడా తమంతతాముగా శాంతించును లేక మరోచోట ఉరుమును...

కాబట్టి జీవితంలో అత్యంత ముఖ్యమైన అంశాలు ఎక్కడ ఉండాలో, ఏం తినాలో, మొదలైనవి కాదు...
ఎవరితో / ఎవరెవరి సారధ్యంలో ఉండాలో, ఏఏ విజ్ఞ్యానాంశాలతో ఏ సందర్భాన్ని ఎట్లు అధ్యయనం గావించి విజయపథంలో మున్ముందుకు సాగాలో....ఇత్యాదివి....

శ్రీ అయిత హనుమయ్య గారి మనవడు, చిరంజీవి శ్రీ అయిత వినయ్ కుమార్, మీకు నమస్కరిస్తూ వచిస్తున్న సవినయ సాక్షర నమస్సుమాంజలి.....💐🙏

నేటికి మీరు శ్రీ అయిత హనుమయ్య గారిగా తనువుచాలించి 11 సంవత్సరములు.

ఎంత అవసరమో అంతవరకే తినడం,
ఎంత అవసరమో అంతవరకే మాట్లాడడం,
ఎంత అవసరమో అంతవరకే తిరగడం,
ఎంత అవసరమో అంతవరకే ఇతరులపై ఆధారపడడం,
అనే శ్రేయస్కర జీవనశైలితో,
నిత్య శ్రీరామనామస్మరణతో వర్ధిల్లిన మీరు,
కొడిమ్యాల, జమ్మికుంట వాస్తవ్యులుగా, ఆయుర్వేద / అర్.ఎం.పి డాక్టర్ గా, శ్రీమతి నగునూరి నాగమ్మ గారి భర్తగా, ఇద్దరు కూతుర్లకు, ఆరుగురు కొడుకులకు తండ్రిగా, అయిత మూడోతరమైన ఏడుగురు మనవళ్ళతో, ఏడుగురు మనవరాళ్ళతో, 
అటు ముగ్గురు మనవళ్ళతో, ముగ్గురు మనవరాళ్ళతో, 
మొత్తం ఇరవై మంది మనవలుమనవరాళ్ళతో, మాట్లాడిన తాతగారిగా, అనేక భూమికలు నిర్వహించి, చివరిశ్వాసవరకూ కూడా మీ స్వాభిమానాన్ని ఎవ్వరి వద్దా తాకట్టు పెట్టని గడసరి వ్యక్తిత్వంతో జీవించిన పెద్దలుగా, ఎప్పటికీ మా ఆరాధ్యమూర్తిగా ఉండి అనుగ్రహిస్తున్నందుకు, మీకు శతధా నమస్కరిస్తూ, నేటి మీ ఏకాదశ ఆబ్దిక తిథి సందర్భంగా, మీ యొక్క నాల్గవ మనవడు, చిరంజీవి శ్రీ అయిత వినయ్ కుమార్, మీకు నమస్కరిస్తూ వచిస్తున్న సవినయ సాక్షర నమస్సుమాంజలి.....💐🙏

సర్వం కొండగట్టు శ్రీలక్ష్మీవేంకటేశ్వర సహిత శ్రీవీరాంజనేయస్వామి శ్రీచరణారవిందార్పణమస్తు...🙏💐

Mr. Vladimir Putin, hon'ble president of the United States of Soviet Russia / USSR, is being welcomed with warmth and grace by the hon'ble first citizen of India, Smt Droupadi Murmu ji, and hon'ble Prime minister of India, Shree Narendra Modi ji, amidst arousing salute by the Indian troops.

Mr. Vladimir Putin, hon'ble president of the United States of Soviet Russia / USSR, is being welcomed with warmth and grace by the hon'ble first citizen of India, Smt Droupadi Murmu ji, and hon'ble Prime minister of India, Shree Narendra Modi ji, amidst a
rousing salute by the Indian troops.

Today's modern world's economic engine is being fuelled by the below mentioned 5 top most nations of the world via their respective global executions and good will indices as recognised by many a prudent nation.

The Republic of India,
United States of America, 
United States of Soviet Russia,
The Republic of China,
United Arab Emirates.

thus, is important for all these nations to thrive on a 
global business development model that runs on a "mutually beneficial / respectful and mutual well-being" track, connecting all these nations with the rest of the world to ensure the world at large remains a peaceful and healthy place for all of us to live and prosper amidst all sorts of inevitable diversities and barriers.
Because it is said, 
"Together Everyone Achieves More" / TEAM work always plays a pivotal role in harnessing the visible and invisible potential percolated across the united world in their respective capacities and faith of each individual nation and when a few supreme nations are being respected as team leaders for all that they have been contributing to the global well being index, their role shall be even more respectful and powerful to uphold their status quo by being the best possible benevolent nation to all other fellow nations.

The strong bi-lateral ties between India and Russia have always been a great harbinger of growth and sustainability backed up by great belief and respect  between the two top nations and Mr. Putin's current visit shall be enhancing the cordial growth equations of the two nations in a much fruitful manner.

When there are Apples, Oranges, Guavas, Mangoes, and Bananas in a plate and a person is asked to select the fruits for his / her well-being, he / she can have any or all of them without any qualms because each of them are good and great in their own respective ways and there cannot be any comparison amongst their respective goodwill indices.

Quite similarly, when there are multiple nations driving the world's growth / economy engine, and if a nation has to be selective in terms of it's allies to prosper with mutual well-being and development saga, any and every prudent nation can be it's ally and there can't be any qualms about the same for anyone for whatsoever reasons or reasoning because it takes 7 colors for a rainbow to make the skies shine and the world gleam and no single color  of the same can be omitted from that charm and glam creation process because it is essentially a team work done by all those 7 colors to create such an awe inspiring rainbow and its glittering hues... 

May the global journey of India and Russia alight at newer and higher frontiers of development for everyone to prosper in peace and serenity...💐🙂

శ్రీ విశ్వావసు 2025 మార్గశిర శుద్ధ ద్వాదశి / మత్స్యద్వాదశి / మత్స్యజయంతి పర్వసమయ శుభాభినందనలు...🙂💐


శ్రీమహావిష్ణువు స్వీకరించిన మొట్టమొదటి అవతారం శ్రీమత్య్సనారాయణావతారం...

కనురెప్పలు వెయ్యని చేపలు, కంటిచూపుతో వాటి సంతతిని అనుగ్రహించే శక్తిగల ఆశ్చర్యకరమైన జలచరాలు..

అందుకే భగవద్ తత్త్వాన్ని మీనతత్త్వం గా విజ్ఞ్యులు విశదీకరించారు...
ఎందుకంటే కనురెప్పలు వెయ్యని అనిమేశులైన దేవతలు
చూపులతో అనుగ్రహించే శక్తిసంపన్నమైన దివిజసమూహాలు...

ఒక ఆగమోక్త దేవతామూర్తిలోకి దైవికశక్తి ఏమేరకు స్థీరీకరింపబడింది అని తెలియజెప్పే అంశంగా నేత్రోన్మీలనం
అనే ప్రక్రియతో, కొత్తగా ఏదేని ఆలయంలో దేవతామూర్తి ప్రతిష్టాపన క్రతువుల్లో అచార్యులు వివరించి చూపడం విజ్ఞ్యులకు ఎరుకే....

అపౌరుషేయాలైన వేదములను అపహరించిన సోమకాసురుడి నుండి వేదాలను సంగ్రహించి లోకళ్యాణార్ధమై వాటిని తిరిగి చతుర్ముఖబ్రహ్మగారికి అప్పగించడం 
శ్రీమత్య్సనారాయణావతారం యొక్క ప్రాథమిక లక్ష్యం...

"య ఏవం వేద..."
అనే శృతివచనానికి వాచ్యార్ధం...
"ఎవరైతే ఈ విధంగా తెలుసుకుంటారో..."
అనగా
"బాగా బాగుగా తెలుసుకో..."
అని కూడా అర్ధం...

ఋగ్, సామ, యజుర్ (కృష్ణ, శుక్ల), అథర్వణ వేదములుగా
శ్రీవేదవ్యాసమహర్షి వారి అనుగ్రహంగా ఈ కలియుగంలో విభాగింపబడిన అధ్యాత్మశాస్త్ర నాలుగు వేదాలను అధ్యయనం చేసి తరించడం అందరికీ వీలైయ్యే అంశం కాదు...
కాబట్టి ప్రాపంచిక నిత్య జీవితం అనే వేదం
గురించి కొంత తెలుసుకొని తరించే ప్రయత్నం గావిద్దాం..

శ్రీకరమైన కొన్ని జీవిత సత్యాలు.....
రమారమి 39 ఏళ్ళ నా జీవితప్రయాణమంజరులన్నీ వడపోసి వచిస్తున్న కొన్ని వాస్తవ ప్రాపంచిక నైజాలు.....

1. "వాట్ గోస్ అరౌండ్...కంస్ అరౌండ్..." అనే కర్మసిద్ధాంతాన్ని ఒక్కొక్కరూ ఒక్కోపేరుతో విశ్వసిస్తూ ఉంటారు....
ఒకరు దాన్ని భగవంతుడి పట్ల భక్తిమయ జీవితం అని వచిస్తారు...
మరొకరు మనపట్ల మనకు ఉండే శ్రద్ధాభక్తిపూర్వక విశ్వాసం అని వచిస్తారు...
ఎవరు ఏ పేరు పెట్టి పిలిచినా,
సత్కర్మకు మంచిఫలితం, పుణ్యం, సుఖం...,
దుష్కర్మకు దుఃఖకారక ఫలితం,
లభించడం అనేది ఆనాటి భక్తప్రహ్లాద చరితం నుండి ఈనాటి 
కలియుగ ఇంటింటి రామాయణం వరకు ఎల్లరికీ విదితమై ఉండే అంశమే....

2. మన అభివృద్ధిని అభిలషించేవారు పరాయి వారు అని కొందరిచే పిలవబడినా సరే వారిని మనవారిగా భావించాలి....
మన అభివృద్ధిని ఓర్వని వారు మనవారే అయినా పరాయి వారిగానే భావించాలి....
ఎందుకంటే ఇంటిదీపమే కదా అని ముట్టుకుంటే కాలకుండా ఉంటదా....
వీధి దీపం కదా అని మన ఇంటికి వెలుగునివ్వకుండా ఉంటదా...

3. మనకంటూ జీవితంలో కొందరు మంచి మితృలు ఉండాలి....
ఎల్లవేళలా మన అభివృద్ధిని అభిలషించే వారు ఎవ్వరైనా అవ్వొచ్చు...ఎంత దూరంలో ఉండే వారైనా అవ్వొచ్చు....సద్గురువులు కూడా అవ్వొచ్చు...
ఎందుకంటే ఒకవ్యక్తి గతించిన వెంటనే తన భార్య అలోచించేది "బీర్వా తాళంచెవి ఎక్కడ ఉంది"  అని....
నగలు, సొమ్ములు, ఆస్తులు మొదలైనవి సర్ది తన పుట్టింటి వారి దెగ్గర దాచుకోవాలని..
తన బిడ్డలు అలోచిందేది, "మా పేర్ల మీద ఏమేం ఆస్తులు, ఎవరికి ఎంతెంత సమకూర్చిపెట్టాడు" అని....
తన మితృలు అలోచించేది, " గతించిన మా మితృడికి అన్ని మర్యాదలతో సకాలంలో అంత్యేష్టి సంస్కారం గావించడానికి తన కుటుంబసభ్యులు ఎందుకు ఇంత కాలయాపన గావించి తన మితృడి పార్ధివదేహాన్ని అవమానిస్తున్నారు" అని...
ఇది కొత్త కథేం కాదు..."ఆ నలుగురు" సినిమా లో ఉన్న కథే..

4. సద్బుద్ధితో సమకూరే సమతౌల్యం అనేది జీవితంలోని ప్రతీ అంశంలోనూ పాటించి తీరవలసిన విహిత కర్తవ్యం....

ఉప్పు ఎక్కువైతే వంట పాడైపోతది....
బి.పి ఎక్కువైపోతే ఆరోగ్యం పాడైపోతది.....
సద్బుద్ధి తక్కువైతే జీవితమే పాడైపోతది.....
ఆ సద్బుద్ధిని నిరంతరం అనుగ్రహించేది నిత్యభగవదారాధన....

5. ఓ 30 నిమిషాల పాటు వండే వంటలో, బిర్యాని వండేటప్పుడు మనం ఏమేం కూరగాయలు, మసాలా దినుసులు ఎంత పరిమాణంలో వేస్తామో,
వండిన తదుపరి ఓ 300 నిమిషాల నిడివిలో అ భోజనపదార్ధం ఆరగింపబడే సమయంలో అవే కూరగాయలు, అదే మసాలా యొక్క రుచి లభించును...
వండేటప్పుడు క్యారెట్ ముక్కలను వేయకుండా క్యాప్సికం ముక్కలు వేసి తినేటప్పుడు మాత్రం క్యారెట్ ముక్కలే రావాలంటే అది అసమంజసమైన అపేక్ష....

జీవితం కూడా అంతే....

దైనందిన జీవితంలో దేనికోసం ఎక్కువగా పరిశ్రమిస్తున్నామో, జీవితంలో వాటి తాలూకా "రుచి" మాత్రమే ఎక్కువగా ఉండును....
జీవిత సిమ్హభాగమంతా ఇతరులను ఇబ్బంది పెట్టి, పీడించి, దోచుకుంటూ బ్రతికే వారికి, జీవిత చరమాంకంలో ప్రశాంతత, ఆరోగ్యం, ఆనందం, లభించమంటే అది ఎండమావిలో జలాన్వేషణలా ఉండును...

అనగా, గొప్పపనులు, గొప్పవ్యాపకాలు, ధర్మబద్దమైన ఆర్జన, వివేకభరిత వినిమయం, తో పరిఢవిల్లే జీవితంలో, 
చరమాంకంలో ప్రశాంతత, ఆరోగ్యం, ఆనందం, లభించును అనే జీవిత సారంశం ఎల్లప్పుడూ స్మృతిపథంలో ఉండవలసిన జీవితసత్యం....

6. మన చుట్టూ ఉండే లోకం అనేది ఒక పెద్ద భోజనశాల అయితే...
అందులో మన జీవితం అనేది మనం భుజించే విస్తరి వంటిది...
ఏఏ పదార్ధం, ఎంతెంత, ఎవరెవరితో వడ్డింపజేయించుకొని, ఎవ్విధంగా ఆరగిస్తామో, అదే మనకు మనం మన బుద్ధితో ఏర్పాటు చేసుకున్న భోజనం గా పిలువబడుతుంది...
(ఆరగించిన భోజనంలో ఆరోవంతు మన మనసు అవుతుంది.
ఆ మనసే అన్ని రకాలుగా జీవితాన్ని శాసించే అగోచర ఆంతర ఇంద్రియం...)

పదార్ధం విస్తరిలోకి రానంతవరకు అది భోజనశాలకు సంబంధించిన పదార్ధం, అంశం...
పదార్ధం విస్తరిలోకి వడ్డింపబడిన తదుపరి అది మన జీవితానికి సంబంధించిన అంశం...

అది భుజింపవలసింది మనమే....
తత్ భోజనం తాలూకా ఆరోగ్యాన్ని / అనారోగ్యాన్ని అందుకునేది కూడా మనమే...
అందుకు ఇతరులు, వడ్డించిన వారు, ఎంతమాత్రమూ బాధ్యత వహించరు, కాజాలరు....

మన నిత్య ప్రాపంచిక జీవితం కూడా అంతే....

ఈ లోకంలో మన చుట్టూ ఎందరో వ్యక్తులు, వ్యక్తిత్వాలు, తత్త్వాలు, వస్తువులు, వాస్తవాలు, విషయాలు, ఉండడం లోకనైజం.....

వాటిలో, ఎవరెవరిని, ఎట్టివారిని, ఎట్లాంటివాటిని, వేటిని, మనం మన దైనందిన జీవితంలో భాగంగా 
ఎంతవరకు, ఎప్పుడెప్పుడూ, ఎందుకు, ఎట్ల
ఆహ్వానిస్తూ, ఆస్వాదిస్తూ, ఆరగిస్తూ, 
ఉంటామో, మన జీవితం అనేది వాటి యొక్క సమ్మిళిత సమాహార స్వరూపంగా రూపుదిద్దుకుంటూ ఉంటుంది....

ఎల్లరి జీవితాల్లోనూ....

ఒక డాక్టర్, ఒక పోలీస్ ఆఫిసర్, ఒక ఎంజినీర్, ఒక లాయర్, ఒక ఆర్టిస్ట్, ఇలా ఎందరో వ్యక్తులు....

ఒక శాంతస్వభావి, ఒక నేర్పరి, ఒక ముక్కోపి, ఒక సౌమ్యస్వభావి, ఇలా ఎందరో వ్యక్తిత్వాలు...

లౌకికతత్వం, అధ్యాత్మతత్త్వం, ఆంతరతత్త్వం, బాహ్యతత్త్వం, ఉష్ణతత్త్వం, శీతలతత్త్వం, ఇలా ఎన్నో తత్త్వాలు...

సైకిల్, బైక్, కార్, పెన్, మొబైల్, చైర్, స్టవ్, ఇలా ఎన్నో వస్తువులు...

ఇత్యాదిగా తారసపడుతూ ఉంటారు, ఉండును, ఉంటాయి..

వీరందరూ కూడా ఎవరికివారు, వారివారి మార్గాల్లో, వారివారి శైలిలో, వారివారి పరిధిలో, వారివారి ఔన్నత్యానికి తగ్గట్టుగా, మనతో బాంధవ్యం కలిగి ఉంటారు....
ఇట్టి ప్రాపంచిక యవనికలో ఎవరి జీవితంలో ఎవరి పాత్ర ఎట్టిది, ఎవరికి ఎవరు ఎందుకు మితృలౌతారు, ఎవరి పట్ల ఎవరు ఎందుకు కృతజ్ఞ్యతాపూర్వక వైఖరితో ఉండాలి, ఇత్యాదిగా ఎవరికి వారే వారివారి ఈశ్వరానుగ్రహ విజ్ఞ్యతతో వివేకభరిత యోచనతో నిర్దేశించుకొని తరించవలసి ఉంటుంది..
అంతే కాని ఇతరుల ఉన్నతిపై ఏడుస్తూ బ్రతకడం అనేది నిష్పయోజకరమైన, అర్ధరహితమైన, జీవితప్రాయాస..

సర్వే సుజనాః సుఖినోభవంతు...💐

సర్వం వక్షస్థలశ్రీవ్యూహలక్ష్మీ సహిత శ్రీవేంకటకృష్ణార్పణమస్తు........💐🙂🙏

ShreemadBhagawadGeetaJayanthi / 2025 Shree Vishwaawasu MaargaShira Suddha Ekadashi wishes to one and all...🙂💐


Thanks to IIT Kanpur's technical team for maintaining and distributing the essence of ShreemadBhaagawadGeeta and its various commentaries provided by multiple eminent spiritualists.....

श्लोकः
యద్యద్విభూతిమత్సత్త్వం శ్రీమదూర్జితమేవ వా.
తత్తదేవావగచ్ఛ త్వం మమ తేజోంశసంభవమ్ ৷৷10.41৷৷

https://www.gitasupersite.iitk.ac.in/srimad?language=te&field_chapter_value=10&field_nsutra_value=41&show_mool=1&show_purohit=1&show_tej=1&setgb=1&fbclid=IwdGRjcAOawT5jbGNrA5rBN2V4dG4DYWVtAjExAHNydGMGYXBwX2lkDDM1MDY4NTUzMTcyOAABHlsQhIlJIP0zqA8oFBqe9h9fa9TqFlk4HdGoMvq5l4tsImtCJQsKKUPFu0MZ_aem_9dsdJP4XOIcArNgQAmymlA

10.41 Whatever is glorious, excellent, beautiful and mighty, be assured that it comes from an amSha / micro manifest of my splendour.

The above ShreemadbhagawadGeeta shlokam essentially talks about the essence of the below Shree Naaraayana Sooktam's mighty verse....

yacca kiñcijjagatyasmin dṛśyate śrūyate'pi vā,
antarbahiśca tatsarvaṁ vyāpya nārāyaṇaḥ sthitaḥ.

Meaning: Whatsoever object is seen or heard in this world, Narayana resides pervading all these objects internally and externally...

The concept of God looks very much interesting yet very much complicated and vast as that of the mighty unfathomable universe around us because the very nature of God is infinity.

Have you ever observed the symbol of infinity that resembles a 90 degree flipped numeral 8 also referred to as a lemniscate curve...?

As explained by sathguru Shree Chaaganti gaaru in various discourses, spiritual science attributes the number 8 to "Parameshwara Ashtamoortitwam" that is extolled by the below 8 phrases...

1. ఓం భవాయ దేవాయ నమః
2. ఓం శర్వాయ దేవాయ నమః
3. ఓం ఈశానాయ దేవాయ నమః
4. ఓం పశుపతయే దేవాయ నమః 
5. ఓం రుద్రాయ దేవాయ నమః
6. ఓం ఉగ్రాయ దేవాయ నమః
7. ఓం భీమాయ దేవాయ నమః
8. ఓం మహతే దేవాయ నమః

1. Om Bhavaaya Devaya Namaha
2. Om Sharvaaya Devaya Namaha
3. Om Eeshnaaya Devaaya Namaha
4. Om Pashupathaye Devaya Namaha
5. Om Rudraaya devaya namaha
6. Om Ugraaya Devaya Namaha
7. Om Bheemaaya Devaya Namaha
8. Om Mahathe Devaya Namaha

with each of them having a significance attributed to a specific tattwam / philosophical nature that governs the functioning of several unfathomable universes referred to as a multiverse. 

1. Om Bhavaaya Devaya Namaha : Water 
2. Om Sharvaaya Devaya Namaha : Earth 
3. Om Eeshnaaya Devaaya Namaha : Sky
4. Om Pashupathaye Devaya Namaha : Soul
5. Om Rudraaya devaya namaha : Fire
6. Om Ugraaya Devaya Namaha : Sun
7. Om Bheemaaya Devaya Namaha : Air
8. Om Mahathe Devaya Namaha : Moon

If one can observe carefully, all these 8 cardinal elements governing the universe took the forms of 
God's 8 wives (Ashta pattamahishulu of lord Dwarakaadheesh) when God took the form of Paripoornaavataaram / Shree Krushnaavataaram on the 8th day in the waning phase of Shraavana 
Maasam...
Lord Shiva is the governing deity of the 8th day in the waning lunar phase / the bahula Ashtami tidhi...and lord Vishnu is the governing deity of the Shravana constellation in whose conjunction with moon Shraavana Pournami and thus Shraavana maasam occurs.

Thus, the paripoornaavataram of Shree Krushna Paramaatma is essentially a refined avataara of Shree Dakshinaamoorthi swaroopam / Shree AadiYogi swaroopam of lord Parameshwara and thus lord Shree Krushna Paramaatma is extolled as Jagadguru Shree Krushna Paramaatma....

Hence, while exuding the ShreemadBhagawadGeeta bodhaamRtam to the confused warrior Arjuna in the battle field DharmaKshetre Kurukshetre, lord told that it is indeed him who is executing the entire universal timeline and thus it is indeed himself that is waging the war with Arjuna's opponents and all other demons in the Kaurava Sena....
And so on and so forth lord Shree Krishna explains to Arjuna his trimoortyaamaka vaishwika tattwam and displays his Vishwaroopam....

Arjuna, extols lord Krushna with the below shlokam 

https://www.holy-bhagavad-gita.org/chapter/11/verse/39/

వాయుర్యమోఽగ్నిర్వరుణః శశాంకః
ప్రజాప్రతిస్త్వం ప్రపితామహశ్చ ।
నమో నమస్తేఽస్తు సహస్రకృత్వః
పునశ్చ భూయోఽపి నమో నమస్తే ।। 11 - 39 ।।

वायुर्यमोऽग्निर्वरुण: शशाङ्क:
प्रजापतिस्त्वं प्रपितामहश्च |
नमो नमस्तेऽस्तु सहस्रकृत्व:
पुनश्च भूयोऽपि नमो नमस्ते || 11 - 39||

vāyur yamo ’gnir varuṇaḥ śhaśhāṅkaḥ
prajāpatis tvaṁ prapitāmahaśh cha
namo namas te ’stu sahasra-kṛitvaḥ
punaśh cha bhūyo ’pi namo namas te 
।। 11 - 39 ।।

You are Vāyu (god of wind), Yamraj (god of death), Agni (god of fire), Varuṇ (god of water), and Chandra (moon-god). You are the creator Brahma, and the Great-grandfather of all beings. I offer my salutations unto You a thousand times, again and yet again!

One can observe a similar shlokam extolling apara RudraamSha sambhoota Shree Veeraanjaneya in the 35th verse of the 5th canto of 5th kaanda , Shree Sundarakaanda of ShreemadRaamaayanam....

given below.....

https://www.valmiki.iitk.ac.in/sloka?field_kanda_tid=5&language=te&field_sarga_value=54

వజ్రీ మహేంద్ర స్త్రిదశేశ్వరో వా సాక్షాద్యమోవా వరుణోనిలోవా!
రుద్రోగ్నిరర్కో ధనదశ్చ సోమో న వానరో అయమ్ స్వయమేవ కాలః!! 5-54-35

వజ్రము ధరించినటువంటి దేవపతియైన ఇంద్రుడా లేక యముడా లేక వరుణుడా లేక వాయువా లేక ఈశానుడా లేక అగ్నిదేవుడా లేక కుబేరుడా లేక సూర్యుడా లేక చంద్రుడా
ఇతడు వానరుడు కాడు. ఇతడు సాక్షాత్తు కాలస్వరూపుడే...!!

vajrī mahendrastridaśeśvaro vā |
sākṣādyamo vā varuṇo.anilo vā |
rudrognirarko dhanadaśca somo |
na vānaro.ayam svayameva kālaḥ | 5-54-35

'Is this the wielder of thunderbolt Indra, who is the king of gods? Is it Yama himself? Is It the Wind-god, or Fire-god, or Varuna or Rudra? Is it Kubera or Sun or Moon or is it the god of Kaalam (the Time-spirit) himself..! ? He cannot be a mere monkey, indeed...

As explained by sathguru Shree Chaaganti gaaru in multiple discourses, the viraat vishwaatma is extolled as 5 faced universal lord of Parameshwara 
/ Panchaasya Parameshwara moorthy
[ Sadyojaata : facing West, Aghora : facing South, Vaamadeva : facing North, Tatpurusha : facing East, Eeshaana : facing upward / towards skies ] whose North faced Vaamadeva face is essentially the ShreeMahaaVishnu Swaroopam that takes many avataars from time to time for dushta shikshana and shistarakshana.....

The oneness of paramaatma that takes multiple diverse names and forms, took Shree Krushna paramaatma swaroopam to bless the world with 
ShreemadBhagavadGeetaamrutam and may we all be blessed by the essence of the same on the occasion of the SheemadBhagawadGeetaajayanti..💐🙂

సర్వం వక్షస్థలశ్రీవ్యూహలక్ష్మీ సహిత శ్రీవేంకటకృష్ణార్పణమస్తు........💐🙂🙏

sarvam vakShasthalaSreevyoohalakShmee sahita SreevaenkaTakRSHNaarpaNamastu........💐🙂🙏

Annamacharya Bhavana Vahini celebrated its 42nd "Dedication day" today amidst the invited dignitaries, artists, singers, devotees and audience in a blissful spiritual musical environment for one and all...💐🙂

Annamacharya Bhavana Vahini celebrated its 42nd "Dedication day" today amidst the invited dignitaries, artists, singers, devotees and audience in a blissful spiritual musical environment for one and all...💐🙂

Every noble person has a profession to live with and a passion to live for that unites them with God while being in the pursuit of the same. 
Dance, poetry, essay writing, singing, painting, composing music, and so and so forth.
A few blessed stalwarts make their profession and passion go hand in glove to create a thriving ecosystem for the well-being of the wider global world and Padmasri, Shreemati Shobha Raju gaaru is one such dignitaries that has been rendering diligent efforts in pursuing her profession of being a devotional singer and passion of practicing, preaching, propagating and sustaining the mighty legacy of Shree Taallapaaka Annamaacharya and his mystically captivating compositions on lord Shree Venkateshwara and his universal magnanimity well-known as Shree Taallapaaka Annamayya Sankeertanams.

Ma'am has been making several laudable strides since the past 4 decades because of which today "Annamaacharya Sankeertana" has become a well-known household concept not only amongst many musically educated elite groups / families, but also for every decently educated common man aspiring to be blessed by lord Shree Venkateshwara via Annamaacharya Sankeertanaa kainkaryam...! 

Many are born to live their noble professions and passions and a few are born to live on eternally in the hearts of several folks via their globally applauded noble professional passions that are a harbinger of higher order spiritual peace and wealth in the lives of many by creating a holistic positive impact to live a peaceful and fruitful life filled with abundance of inner peace and happiness that are nowadays very rare to obtain owing to the hectic lives devoid of that much required spiritual tinge in a mundane daily life's routine in our respective life journeys.

Dr. ShobhaRaju ma'am is one such versatile dignitary filled with compassion towards creating society devoid of thought pollution via her Shree Taallapaaka "Annamaacharya Bhavana Vahini" project, hobby, passion, profession, service by involving every prudent personality blessed to take part in the lord Shree Venkateshwara Sankeertana yagnyam in their respective capacity and interest.

On the occasion of 42nd dedication day, may lord Shree Venkateshwara bless ABV and Shree Shobha Raju ma'am abundantly to keep going with several such celebrations / events to propagate the esteemed spiritual legacy and glory of Shree Taallapaaka Annamaacharya and his celestial compositions in an endeavour to make this world a spiritually prosperous and humanely kind and considerate one for the well-being and happiness of one and all....

As it was since 2013 across several events, being one amongst many enthusiastic typical audience / participants, for me, today's event too was really a cherished time savouring several rich cultural performances singing and dancing to the rhythm of Shree Taallapaaka Annamaarya and his unparalleled devotion towards lord Shree Venkateshwara....

A special thanks to Shree Saandip Bakchu gaaru,
(https://en.wikipedia.org/wiki/Saandip) for a such a scintillating rendition amongst all other 
mellifluous renditions by all the singers and students of ABV that have decorated the dias at the feet of lord Shree Venkateshwara of Annamayyapuram in the 'Annamaacharya sadanam' to wholeheartedly welcome one and all to savour the blissful musical delicacies of Shree Taallapaaka Annamaacharya sankeertanams....💐🙂

Om Namo AnnamaaryaGuravay Namaha....🙏💐
Om Namo Naaraayanaayaa......🙏💐
Om Namo Venkatesaaaya......🙏💐

Telangana Mobile MeeSeva / Online Mobile Digital MeeSeva Portal

While traveling in a metro train today, I came across an advertisement regarding the official launch of the "Telangana Mobile MeeSeva" on a dedicated portal accessible on the mobile number "8096 95 8096" facilitating various G2C services by leveraging state-of-the-art AI-assisted built-in features. 

I ran a sample query with the string 
"Please display all the available services..."  
and received the response attached in the comment. I have also queried to book a seva ticket in a prominent temple and found that it routes the transaction handler to the requisite integrated temple ticket booking service portal in an asynchronous manner to complete the specified request while maintaining the originating embedded ReST web-service transaction handler's outbound token intact in order to successfully revert to the service flow and perform any changes in the inbound transaction tracing stream. 

Congratulations to all the technical and the government personnel involved in launching this new-age digital mobile service to ease the lives of citizens and varied service providers by uniting them under one umbrella of "Online Mobile Digital MeeSeva Portal". 🙂💐

శ్రీ 2025 విశ్వావసు మార్గశిర శుద్ధషష్ఠి శ్రీసుబ్రహ్మణ్యషష్ఠి పర్వసమయ శుభాభినందనలు...💐


మీలో ఎవరికైనా శ్రీసుబ్రహ్మణ్యవైభవం గురించి తెలుసుకోవాలంటే, కర్ణాటకలోని కుక్కే / కుక్షి శ్రీసుబ్రహ్మణ్యక్షేత్రాన్ని దర్శించండి......
(కుక్కే ఆదిశ్రీసుబ్రహ్మణ్య ఆలయాన్ని ముందుగా దర్శించండి).

స్ఫటికసదృశమైన స్వచ్ఛని కుమారధార నదిలో తీర్థస్నానం గావించి ఇప్పటికీ స్వామివారు మయూరవాహనారూఢులై
విహరించే అక్కడి కుమారపర్వతసానువుల్లో కొంతదూరం పాదయాత్ర గావించండి......
అక్కడి ప్రకృతిమొత్తం "ఓంశరవణభవ" అని నిత్యం ప్రతిధ్వనిస్తూ ఉంటుంది......
షట్కోణాకార రాళ్ళతో అలరారే అక్కడి రమణీయమైన ప్రకృతితో మమేకం అయ్యి ధ్యానించండి......

కేవలం శివపుత్రుడి చేతిలో మాత్రమే నిహతుడయ్యేలా వరాన్ని పొందిన తారకాసురుడి సమ్హారానంతరం చాలా అలసిఉన్న దండాయుధపాణిని సేదతీర్చిన అక్కడి ప్రకృతి ఒక పురివిప్పిన నెమలి విన్యాసంలా ఉండి మయూరారూఢ సాకార సుబ్రహ్మణ్యమూర్తిగా ఆ కుమారపర్వతం శ్రద్ధాపూర్వక విజ్ఞ్యతగల భక్తులకు గోచరించును......

సర్పాన్ని తన పాదముల క్రింద దమించిన నెమలిని అధిరోహించే కార్తికేయ స్వరూపాన్ని ధ్యానించండి......
నెమలి అతిలోకసౌందర్యానికి ఆలవాలమైన భూగతపక్షిజాతికి చెందిన ప్రాణి...
(కోడి, పావురం, పిట్ట, నెమలి, ఇత్యాదివి ఎప్పుడూ భూమికి దెగ్గరగా మాత్రమే విహరించే పక్షిజాతి ప్రాణులు... 
అనగా లోవర్ ట్రోపోస్ఫియర్ ని దాటి వెళ్ళని పక్షులు...)

వీటన్నిట్లోకి నెమలి పెద్దది మరియు అత్యంత ఆకర్షణాత్మక పక్షి....
అటువంటి నెమలి ఎంతో అందమైన నిత్యవికసిత భూలోక
ప్రకృతికి ప్రతీక....
సర్పం ప్రాకృతిక దోషానికి ప్రతీకగా ఉటంకింపబడే సరీసృప ప్రాణి...

ఫర్ ఎగ్సాంపుల్...,
"సదరు వ్యక్తికి జాతకంలో కాలసర్పదోషం ఉందండి...ఫలాన పూజ చేస్తే నివారింపబడును...
ఓ 2000 పూజకు మరియు ఓ 500 పూజా సామాగ్రికి అవుతాయ్....."

అనే క్యాజువల్ డైలాగ్స్ విని ఉంటారు గాని...

ఫర్ ఎగ్సాంపుల్...,
"సదరు వ్యక్తికి జాతకంలో కోడి, పావురం, పిట్ట, ఎలుక, దోషాలు ఉన్నాయ్...ఫలాన పూజ చేస్తే నివారింపబడును..."
అనే క్యాజువల్ డైలాగ్స్ ఎవ్వరూ అనరు...

ప్రాకృతిక దోషాలకు నివారణ కూడా ప్రకృతినుండే లభించును...
అనగా ఫలాన చోట తిరుగుతుండగా ఫాలాన కలుపు మొక్క తగలడంతో ఒళ్ళంతా దురదతో ఇబ్బందిగా ఉంది...
అనే ప్రాకృతిక సమస్యకు...
ఫాలాన మొక్క ఆకులని నూరగా వచ్చే లేపనంతో ఉపశమనం లభించును...
అనే సమాధాన్ని జాగ్రత్తగా పరికిస్తే....

సమస్యకు కారణం ఒకవిధమైన ప్రకృతి...
సమస్యకు పరిష్కారం మరోవిధమైన ప్రకృతి...
అనగా ప్రకృతితో పొటమరించే సమస్యకు ప్రకృతిలోనే పరిష్కారం లభించును....
అనేది సాధారణ లౌకిక ప్రకృతిధర్మానికి సంబంధించిన అంశం...

ఇదే అంశాన్ని అధ్యాత్మకోణంలో పరికిస్తే...
దోషకారకమైన సకల తత్త్వములకు సర్పం ప్రతీక అయితే....
తత్ దోషాలను దమించి, లయించి, హరించే శక్తికి ప్రతీక నెమలి...
అట్టి మయూరాన్ని అధిరోహించి ఉండేది శక్తి అనే ఆయుధాన్ని ధరించిన శివపుత్రుడైన కార్తికేయస్వామి...
ఎవ్విధంగా కృత్తికా నక్షత్రం అగ్ని తత్త్వంతో అలరారుతూ ఉండునో......
అవ్విధంగా మయూరారూఢ కార్తికేయస్వామి కూడా అగ్ని తత్త్వంతో అలరారుతూ ఉండే పరబ్రహ్మస్వరూపం....
అనగా కార్తికేయస్వామి యొక్క ఆరాధన అగ్ని ఆరాధన యొక్క ఫలితాన్నే ఒసగును...
సకల అశుభాలను హరిస్తూ, శుభాలను ఒనరిస్తూ ఉండేదే మన సనాతనధర్మానికి జీవగర్రగా భాసిల్లే అగ్ని ఆరాధన....

అగ్నితత్త్వం / అగ్ని అరాధన యొక్క ప్రత్యేకతకు ఆలవాలమైన గౌణములతో ఉండే ఈ క్రింది నామములను మీరు
శ్రీసుబ్రహ్మణ్య అష్టోత్తరశతనామావళిలో గమనించవచ్చు...

ఓం అగ్నిజన్మనే నమః
ఓం పావకాత్మజాయ నమః
ఓం అగ్నిగర్భాయ నమః
ఓం తేజోనిధయే నమః
ఓం రోగనాశనాయ నమః

https://vignanam.org/telugu/subrahmanya-ashtottara-sata-namavali.html

శ్రీచాగంటి సద్గురువుల ప్రవచనాల్లో ఆలకించిన విజ్ఞ్యులకు తెలిసినట్టుగా, ఈ లోకంలో సనాతనవిజ్ఞ్యులెల్లరూ నిత్యం శ్రీసుబ్రహ్మణ్యస్వామి వారిని పరోక్షంగా ఆరాధిస్తూనే ఉంటారు....

ఎందుకంటే...
1.గాణాపత్య
2.శైవ
3.శ్రీవైష్ణవ
4.శాక్తేయ
5.సౌర
మనబడే షణ్విధ దేవతారాధనా సంప్రదాయాన్ని అనుగ్రహించి షణ్మతస్థాపనాచార్య గా బిరుదాంకితులైన శ్రీఆదిశంకరాచార్యులు వ్యవస్థీకరించి అనుహ్రహించిన పంచాయతన దేవతామూర్తులు కొలువై ఉండే పూజగది సిమ్హాసనం ముందు ప్రతిఒక్కరూ దీపారాధనలో వెలిగించే త్రివర్తిసమ్యుక్త దీపం 6వ సంప్రదాయమైన కౌమారసంప్రదాయాధిదైవమైన కార్తికేయ స్వరూపమే కాబట్టి...

శ్రీచాగంటి సద్గురువుల ప్రవచనాల్లో ఆలకించిన విజ్ఞ్యులకు తెలిసినట్టుగా, శ్రీఅరుణాచలేశ్వరుడి నిత్యాంతరారాధనతో మూర్తీభవించిన చరరూప శ్రీఅరుణగిరి స్వరూపంగా ప్రభవించిన శ్రీ అరుణాచల రమణమహర్షి గారు కుమారస్వామి అంశతో ఈ కలియుగంలో ప్రభవించి వారి విహితకర్తవ్యాచరణను ఆచరించి వారి అంత్యకాలమున తనువుచాలించిన సమయంలో ఒక దేదీప్యజ్యోతిశిఖ వారినుండి వెలువడి పంచభూత అగ్నిలింగక్షేత్రమైన అరుణాచలేశ్వరుడి ఆలయం మీదుగా పయనించి అరుణగిరిశిఖరంలో ఐక్యమైన సంఘటనను దర్శించిన ఎందరో తిరువణ్ణామలై వాసులకు తెలిసినట్టుగా శ్రీఅరుణాచల పర్వతం మొత్తం కార్తికేయస్వరూపమైన అగ్నితత్త్వకారకపర్వతం....
ఈ కలియుగంలో ఈశ్వరానుగ్రహంగా జ్ఞ్యానాగ్నిగిరిగా శ్రీఅరుణాచలం భాసిల్లుతూ భక్తులకు విశేషమైన
అధ్యాత్మజ్ఞ్యానాన్ని ఆత్మజ్ఞ్యానంగా ఒసగుతూ "అరుణాచల గిరిప్రదక్షిణం" అనే అత్యంత అరుదైన అనుగ్రహంతో ఎందరో భక్తుల జీవితాల్లో అఘనాశక అనుగ్రహాన్ని ఒనరిస్తూ,
"స్మరణాత్ అరుణాచలే" అనే ఘనమైన నానుడితో ఎల్లరినీ విశేషంగా అనుగ్రహించే వరదైవం శ్రీసుబ్రహ్మణ్యస్వామి వారు.......

మయూరాధిరూఢం మహావాక్యగూఢం
మనోహారిదేహం మహచ్చిత్తగేహమ్ ।
మహీదేవదేవం మహావేదభావం
మహాదేవబాలం భజే లోకపాలమ్ ॥ 

సర్వం శ్రీవల్లీదేవసేనాసమేతశ్రీసుబ్రహ్మణ్యస్వామి శ్రీచరణారవిందార్పణమస్తు......💐🙂🙏

శ్రీశారదాంబాపాదపద్మముల చెంత వినయభరిత చిరు కవనకైంకర్యనమస్సుమాంజలి...🙏💐

వ్యవస్థీకృత వినిమయాంతర్భాగంగా ఓ నాలుగు ధర్మదానం గావించు వత్సా .....
అని సాక్షాత్తు శ్రీజగద్గురు సంస్థానం నుండి అనుగ్రహం లభించగా....
అందలి శ్రేయస్కరమైన ఆంతర్యాన్ని, అంతరార్ధాన్ని, అర్ధంచేసుకొనే మేధోపరిణతి లేని వారు...,
ఎదుట సాక్షాత్తు పరమేశ్వరప్రసాదిత శ్రీచంద్రమౌళీశ్వర స్ఫటికశివలింగానికి శ్రీజగద్గురువులు శ్రీరుద్రాభిషేకం గావిస్తూ భక్తులెల్లరినీ అనుగ్రహిస్తూ ఉంటే, మనోలగ్నత వేదిక దిశగా కాక...,
ముందువరుసలో కూర్చున్న సదరు భక్తుడు, ఏం చేస్తున్నాడు, ఏం దర్శిస్తున్నాడు, శ్రీరుద్రసూక్తం ఎట్ల చదువుతున్నాడు...,
ఇతడిమీద నిఘా పెట్టమని మనల్ని ఒక భక్తుడి రూపంలో ఇక్కడికి పంపించిన వారికి ఇతడు ఏమౌతాడు...,
అని పనికిమాలిన డిటెక్టివ్ వేషాలు వేసేవారికి, 
కనీసం శ్రీరుద్రనమక అష్టమానువాకం కూడా సరిగ్గా పఠించడంరాని వారికి,
కళ్ళెదుట అపర శ్రీదక్షిణామూర్తి స్వరూపులై ఆసీనులైన శ్రీజగద్గురువులకు పద్ధతిగా నమస్కరించడం కూడా రాని వారికి...,

"ఓం మౌనవ్యాఖ్యా ప్రకటిత పరబ్రహ్మతత్త్వం యువానం
వర్షిష్ఠాంతే వసదృషిగణైరావృతం బ్రహ్మనిష్ఠైః ।
ఆచార్యేంద్రం కరకలిత చిన్ముద్రమానందమూర్తిం
స్వాత్మారామం ముదితవదనం దక్షిణామూర్తిమీడే ॥ "

అనే ఉన్నతమైన స్థాయిలో, శ్రీగురుశిష్యుల మధ్య జరిగే మౌనసంభాషణ గురించి, అందలి ప్రతిపాదిత సారాంశం గురించి, విచారించడం కొందరు మూర్ఖులకు "అవసరమా..." ?

శ్రీజగద్గురువుల మౌన అనుగ్రహ ఆశీర్వాదాన్ని వివేచించి వారివారి అభిప్రాయాలను, స్పందనలను తెలియజేసేంతటి స్థాయి ఈ లోకంలో "ఎవ్వరికీ" కూడా ఉండదు అని అనడం నిర్వివాదాంశం....
ఎందుకంటే శ్రీజగద్గురువులు అలంకరించి ఉన్నది సాక్షాత్తు శ్రీసరస్వతిదేవితో సంభాషించి, చర్చోపచర్చలు గావించి,
కాశ్మీర సర్వజ్ఞ్య పీఠాన్ని అధిరోహించిన శ్రీఆదిశంకరాచార్యుల అనుగ్రహంతో పరిఢవిల్లే శ్రీశారదాంబాపీఠం....
అట్టి పీఠాన్ని అలంకరించి ఉండే మాన్యుల బోధ, సాక్షాత్తు శ్రీఆదిశంకరాచార్యుల బోధయే అగును...

కావున, కొంగలు వచ్చి హంసలకు క్షీరనీర న్యాయం గురించి వచించాలని అనుకోవడం అత్యంత హాస్యాస్పదమైన అంశంగా ఉండును అనే విజ్ఞ్యతతో మసులుకోవడం ఎల్లరికీ మంచిది...

"భద్రకాళ్యై నమో నిత్యం సరస్వత్యై నమో నమః |
వేద వేదాంగ వేదాంత విద్యాస్థానేభ్య ఏవ చ ||

భద్రమైన అనుగ్రహాన్ని ప్రసాదించే ఓ భద్రకాళీ నీకు నిరంతర నమస్కారాలు! వేదములకు,వేదాంగములకు,వేదాంతాలకు,, మరియు అన్ని ఇతర విద్యలకు నీవు మూలమూర్తివి. 
ఓ విద్యా దేవత, నీకు నమస్కారాలు."
అని శ్రీశాదదాదేవిని నమస్కరిస్తున్నది శ్రీఆదిశంకరవిరచిత శ్రీశారదాస్తోత్రం....

అనగా..,

ఋగ్, సామ, యజుర్, అథర్వణం అనే 4 వేదాలు....

శిక్ష, ఛందస్సు, వ్యాకరణం, నిరుక్తం, కల్పం, జ్యోతిషం అనే 6 వేదాంగాలు....

1. ఈశావాస్య ఉపనిషత్తు (శుక్ల యజుర్వేదం)
2. కేన ఉపనిషత్తు (సామవేదం)
3. కఠ ఉపనిషత్తు (కృష్ణ యజుర్వేదం)
4. ప్రశ్న ఉపనిషత్తు (అథర్వవేదం)
5. ముండక ఉపనిషత్తు (అథర్వవేదం)
6. మాండూక్య ఉపనిషత్తు (అథర్వవేదం)
7. తైత్తిరీయ ఉపనిషత్తు (కృష్ణ యజుర్వేదం)
8. ఐతరేయ ఉపనిషత్తు (ఋగ్వేదం)
9. ఛాందోగ్య ఉపనిషత్తు (సామవేదం)
10. బృహదారణ్యక ఉపనిషత్తు (శుక్ల యజుర్వేదం) 

అనే ప్రధానమైన 10 ఉపనిషత్తులు / వేదాంతాలు

[
11. శ్వేతాశ్వతర ఉపనిషత్తు (కృష్ణ యజుర్వేదం)
12. కౌషీతకీ ఉపనిషత్తు (ఋగ్వేదం) 
]

మరియు ఇతర అన్నీ విద్యలను సాకారస్వరూమైన / మూలమూర్తియైన శ్రీశారదాదేవికి నమస్కారం...

అని శ్లోక తాత్పర్యం...!

"అట్టి శ్రీశారదాదేవి ఉపాసకుల వాగ్వైభవానికి, జ్ఞ్యానమార్గనిర్దేశిత్వానికి, శ్రేయోకారకవిద్యాప్రకాశత్వానికి,
ఎవరు ఈ లోకంలో సాటిరాగల వారు....?"
అని ఎవరికి వారు వివేచన గావించడం విజ్ఞ్యత అనబడును..

***** ***** ***** ***** ***** ***** ***** ***** *****
రాకచంద్రాభాసమానవారిజవదనాం
రాచకీరస్థపాణిపద్మశోభితకంబుకంఠీం
రజనీశకళాధరాంచితశిరోభూషణాఢ్యాం
రమాగిరిసుతనుతవైరించిశక్తిస్వరూపాం

నమామిచిన్ముద్రధరసకలసుజ్ఞానదాం
నమామినాదస్వరూపనందివిద్యాప్రదాం
నామామిసంతతసకలసురసేవితపాదపద్మాం
నమామిశ్రీశారదాపరమేశ్వరీంశర్వసహోదరీం

శ్రీశారదాంబాపాదపద్మముల చెంత వినయభరిత చిరు కవనకైంకర్యనమస్సుమాంజలి...🙏💐

***** ***** ***** ***** ***** ***** ***** ***** *****

సర్వే సుజనాః సుఖినోభవంతు...💐

ఎవరి జీవితాభ్యున్నతికి ఎవరు చుక్కాని గా ఉన్నారు....అనే అంశంలో వివేచన సాగించి అభివృద్ధి బాటలో పయనించవలసిన విహిత కర్తవ్యం ఎవరికి వారే తెలుసుకొని తరించవలసి ఉంటుంది...

1. "నారు పోసిన వాడే నీరూ పోస్తాడు"
అనే సామెతను వివిధ రీతుల అన్వయం చేసుకోవడంలో
విజ్ఞ్యత ఉండును....

2. "వెన్నెల దీపం కొందరిదా అడవిని సైతం వెలుగు కదా..." 
అని అన్నారు శ్రీ సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు "రుద్రవీణ" చిత్రంలోని 
"తరలి రాద తనే వసంతం....
తన దరికి రాని వనాల కోసం..." 
అనే పాటలో....

3. "నీ ధైర్యాన్ని దర్షించి దైవాలే తలదించగా
నీ అడుగుల్లో గుడి కట్టి స్వర్గాలే తరియించగా
నీ సంకల్పానికి ఆ విధి సైతం చేతులెత్తాలీ

అంతులేని చరితలకీ ఆది నువ్వు కావాలీ

మౌనంగానే ఎదగమనీ మొక్క నీకు చెబుతుంది
ఎదిగినకొద్దీ ఒదగమనే అర్ధమందులో ఉంది "

అని అన్నారు శ్రీ చంద్రబోస్ గారు "నా ఆటోగ్రాఫ్" సినిమాలో

4. "పట్టెడన్నమిచ్చి పులకించే నేలతల్లి వంటి మనసల్లే
కొందరికే హృదయముంది నీ కొరకే లోకముంది
నీకు తోడు ఎవరంటూ లేరు గతములో
నేడు చెలిమి చెయి చాపే వారే బ్రతుకులో"

అని అన్నారు వనమాలి గారు "శివపుత్రుడు" సినిమాలోని "చిరుగాలి వీచెనే..." అనే పాటలో....

5. "ఏడుకొండల శ్రీనివాసా
మూడు మూర్తుల తిరుమలేశా

అడుగడుగునా వేదాంతమున్నది 
నీ ఆరాధనలో సాధనున్నది...."

అని అన్నారు అచార్య ఆత్రేయ గారు 
" శ్రీ వేంకటేశ్వర వైభవం" సినిమా పాటలో...

కావున, ఎవరి జీవితాభ్యున్నతికి ఎవరు చుక్కాని గా ఉన్నారు....అనే అంశంలో వివేచన సాగించి అభివృద్ధి బాటలో పయనించవలసిన విహిత కర్తవ్యం ఎవరికి వారే తెలుసుకొని తరించవలసి ఉంటుంది...

శ్రీకరమైన శ్రీ విశ్వావసు 2025 మార్గశిర శుద్ధ తదియ పరశివస్వరూపమైన / పరమశివస్వరూపమైన చంద్రరేఖ 💐🙂

అత్యంత ప్రశస్తమైన సౌరమాన ధనుర్మాసం ప్రారంభమయ్యేది కూడా ఈ చాంద్రమాన మార్గశిరమాసం లోనే...

ఒకానొక సందర్భంలో, ఆరాధించడానికి శివలింగం గురించి వెతుకుతున్న తన ప్రియబాంధవుడైన అర్జునుడికి శ్రీకృష్ణపరమాత్మ తన కుడిమోకాలిచిప్పలో శివలింగాన్ని దర్శింపజేయించిన సంఘటన శ్రీచాగంటి సద్గురువుల ప్రవచనాల్లో ఆలకించడం కొందరు విజ్ఞ్యులకైనా గుర్తుండే ఉంటుంది...
అనగా పరమాత్మ శివకేశవ అభేదదర్శనాన్ని ఒనరించాడు అని అర్ధం....
"మాసానాం మార్గశీర్షోహం..." అని సెలవిచ్చాడు గీతాచార్యుడు....!
అట్టి హేమంతఋతు మార్గశిర శుద్ధ తదియ చంద్రరేఖ ఎంతో చల్లని శ్రీచంద్రమౌళీశ్వరానుగ్రహాన్ని వర్షించే పరలోక పరావర్తన సాధనం...

గౌరీప్రియాయ రజనీశ కళాధరాయ
కాలాంతకాయ భుజగాధిప కంకణాయ ।
గంగాధరాయ గజరాజ విమర్ధనాయ
దారిద్ర్యదుఃఖ దహనాయ నమశ్శివాయ ।।

శ్రీ విశ్వావసు 2025 ధనుర్మాస పావన శ్రీవ్రత పర్వసమయ శుభాభినందనలు...🙂💐 [ Dec-16-2025 thru Jan-13-2026 ]


మార్గశిరమాసం / ధనుర్మాసం అనగానే తిరుప్పావై పాశురానుసంధానం / పఠనం తో ప్రతిధ్వనించే శ్రీవైష్ణవాలయాల ప్రాభవం కడుమధురమైనది....

సాక్షాత్తు భూదేవి అంశలో కోదై / గోద / చూడికుడుత్త నాచ్చియార్ గా,  శ్రీవిళ్ళిపుత్తూర్ తులసివనంలో పెరియాళ్వారులకు అనుగ్రహింపబడిన ఆదిపరాశక్తి ఆండాళ్ తల్లి....

జీవజీవేశ్వర మధురభక్తికి ప్రత్యక్షతార్కాణంగా తన జీవితయాత్రను శ్రీరంగనాథుని ఆరాధనామంజరిగా గావించి శ్రీరంగనాయకిగా అధ్యాత్మ జగత్తులో శాశ్వత సర్వోత్తమ శ్రీవైష్ణవభక్తిలోకచింతామణి గా రూపాంతరం చెంది, పన్నిద్దరాళ్వారుల్లో ఏకైక మహిమాన్వితశ్రీమహిళామణి గా పరిఢవిల్లే పరమపదనాథుడి ప్రియసఖి...

" శ్రీవైష్ణవభక్తిలోకచింతామణి " అని ఆండాళ్ తల్లిని అభివర్ణించడంలోని ఆంతర్యం ఏమనగా....

గోదమ్మ దర్శించి రచించి అందించిన ముప్పది ద్రావిడ పాశుర సారస్వతం, ద్రావిడవేదంగా భాసిల్లే నాళాయిరదివ్యప్రబంధసారస్వత మహిమ్నతను తనలో నిక్షిప్తం చేసుకున్న సంక్షిప్తద్రవిడవేదసారం.... అని విజ్ఞ్యుల ఉవాచ....

ఈ కలియుగానికి లభించిన 5వ వేదంగా శ్రీవేంకటేశ్వరసంకీర్తనా వేదాన్ని అభివర్ణించిన శ్రీతాళ్ళపాక అన్నమార్యుల అంతరంగమే, ఆనాడు ఆండాళ్ తల్లి తన శ్రీవ్రత / తిరుప్పావై 30 పాశురాల్లో నిక్షిప్తం గావించి పరమాత్మను సంకీర్తించి తరించారు.....

అందుకే శ్రీ నమ్మాళ్వార్ రచించిన తమిళ గ్రంథం "తిరువాయిముడి" అనే పదంతో గౌరవించి 
శ్రీవేంకటేశ్వరసంకీర్తనా వేదాన్ని అన్నమాచార్యులవారు మనకు సెలవిచ్చారు ఈ క్రింది అరుదైన సంకీర్తనలో...

తమిళనాట శ్రీనమ్మాళ్వారుల "తిరువాయ్ముడి" ఎంతగానో ప్రశస్తిని పొందిన శ్రీవైష్ణవభక్తిసారస్వతరాజం...!
మీకు "తిరువాయ్ముడి" యొక్క మహిమ గురించి తెలియాలంటే, ఆరోజుల్లో ఒక సాధారణ సింగర్ అయిన శ్రీమతి శోభారాజు గారిని, పద్మశ్రీ, అన్నమయ్యపదకోకిల శ్రీమతి డాక్టర్ శోభారాజు గారిగా, తీర్చిదిద్దిన "శ్రీ నమ్మాళ్వార్" ఆలయం,
[ తిరుపతి శ్రీకామాక్షి సమేత కపిలేశ్వర స్వామి వారి సన్నిధికి వెళ్ళే మార్గంలో, శ్రీ అభయాంజనేయస్వామి వారి ఆలయం తర్వాత కొలువుతీరిన ఆలయం ] లో ధ్యానించి తెలుసుకోగలరు...

కలియుగంబునకు గలదిదియే
వెలసిన పంచమ వేదమె కలిగె ||

పరమగు వేదము బహుళము చదివియు
హరి నెరిగిన వారరుదనుచు
తిరువాయిముడియై దివ్య మంత్రమై
వెలసిన పంచమ వేదమె కలిగె ||

బింకపు మనుజులు పెక్కులు చదివియు
సంకెదీర దెచ్హుట ననుచు
సంకీర్తనమే సకల లోకముల
వేంకటేశ్వరుని వేదమె కలిగె ||

అంతటి మహాత్మ్యభరిత ద్రావిడ పాశురసారస్వతం కాబట్టే, శ్రీచాగంటి గారు తిరుప్పావై ని ఒక ప్రత్యేక ప్రవచన టాపిక్ గా ఎంచుకొనిమరీ, ప్రాచీన తమిళం బాగా చదవగల ఒక అమ్మయితో తిరుప్పావై పాశురాలను చదివింపజేయిస్తూ అప్పట్లో ప్రవచనాలు కూడా అనుగ్రహించారు..

అంతటి మహిమోపేతమైన తిరుప్పావై పాశుర వేదానికి తలమాణికమైన పాశురంగా అలరారే 27వ పాశురం / కూడారై పాశురంలో నిక్షిప్తమైన పరమపదసోపానతత్త్వం గురించి శ్రీవేంకటేశ్వర స్వామివారి ఆనందనిలయంలో తిరుప్పావై పఠనం ప్రారంభైన తదుపరి, స్వామివారి అనుగ్రహంతో, మార్గళి ప్రారంభమై సూర్యుడి ధనూరాశిలోకి ప్రవేశించిన తదుపరి వివరిస్తా.....

సర్వం శ్రీమదలర్మేల్మంగాపద్మావతీ సమేత,
శ్రీభూసహితశ్రీశ్రీనివాస శ్రీచరణారవిందార్పణమస్తు....🙏🙂💐

శ్రీకరమైన నవగ్రహాల వైభవం గిరించి కొంత పరికిద్దాం...


1.
గ్రహం : సూర్య
గ్రహదేవత : శ్రీసూర్యనారాయణుడు
అధిదేవత : అగ్నిదేవుడు 
ప్రత్యధిదేవత : శివుడు

2.
గ్రహం : చంద్ర
గ్రహదేవత : సోముడు 
అధిదేవత :  వరుణదేవుడు 
ప్రత్యధిదేవత : గౌరీదేవి

3.
గ్రహం : అంగారక
గ్రహదేవత : కుజుడు 
అధిదేవత :  పృథ్వీ 
ప్రత్యధిదేవత : క్షేత్రపాలుడు

4.
గ్రహం : బుధ
గ్రహదేవత :  బుధుడు 
అధిదేవత : శ్రీవిష్ణుదేవుడు 
ప్రత్యధిదేవత : శ్రీమన్నారాయణుడు

5.
గ్రహం : గురు
గ్రహదేవత : దేవగురు బృహస్పతి 
అధిదేవత : దేవేంద్రుడు 
ప్రత్యధిదేవత : చతుర్ముఖ బ్రహ్మగారు

6.
గ్రహం : శుక్ర 
గ్రహదేవత : శుక్రుడు 
అధిదేవత : శచీదేవి 
ప్రత్యధిదేవత : దేవేంద్రుడు

7.
గ్రహం : శని 
గ్రహదేవత : శనైశ్చరుడు 
అధిదేవత : ప్రజాపతి 
ప్రత్యధిదేవత : ధర్మదేవత, సమవర్తి, శ్రీ యమధర్మరాజుగారు

8.
గ్రహం : రాహు 
గ్రహదేవత : రాహువు 
అధిదేవత : పితృదేవతలు 
ప్రత్యధిదేవత : దుర్గామాత

9.
గ్రహం : కేతు 
గ్రహదేవత : కేతువు 
అధిదేవత : చతుర్ముఖ బ్రహ్మగారు 
ప్రత్యధిదేవత : న్యాయదేవుడైన శ్రీచిత్రగుప్తులవారు

ఏ నాయనా... ఇతఃపూర్వం ఒక పోస్ట్లో 
"శ్రీచాగంటి సద్గురువులు గ్రహాలకు ఈశ్వరత్వం లేదని నుడివారు...."
అని అన్నావ్ కద....మళ్ళీ ఇవన్నీ ఏంటి..?
అని అనుకునే కొందరికి..చిన్న వివరణ ఏంటంటే....

గ్రహాలకు ఈశ్వరత్వం లేదనేది వాస్తవమే....
ఈశ్వరానుగ్రహం వివిధ గ్రహాలకు వివిధ రీతుల సమకూరిఉండును అనేది కూడా వాస్తవం..., 
నవగ్రహ దేవతలను వివిధ రీతుల ఆరాధించే విజ్ఞ్యులకు, ఆయా గ్రహాలకు అమరే అట్టి వివిధ ఈశ్వరానుగ్రహ వైభవాలు వర్షింపబడును అనేది కూడా వాస్తవం...

ఫర్ ఎగ్సాంపుల్, ప్రతీరోజు అగ్ని ఆరాధన గావించే వారికి అగ్నిహోత్రులు గా వర్ధిల్లే అనుగ్రహం లభించును....
సూర్యగ్రహానికి అధిదేవత అగ్నిదేవుడు కాబట్టి, వివిధ రీతుల సూర్యోపాసన గావించే విజ్ఞ్యులు అగ్నిదేవుడి ఆరాధన యొక్క ఫలితమే అందుకొని తరింతురు అని అర్ధం....
అందుకే...
రామరావణ యుద్ధం తిలకించడానికి దేవతలతో కూడి అచ్చటికి విచ్చేసిన పూజ్య అగస్త్య మహర్షి వారు శ్రీరాముని సమీపించి నుడివిన సకల ఆరోగ్యదాయకమైన శ్రీఆదిత్యహృదయం లోని 23 వ శ్లోకంలో, 

ఏష సుప్తేషు జాగర్తి భూతేషు పరినిష్టితః !
ఏష ఏవాగ్ని హోత్రం చ ఫలం చైవాగ్ని హోత్రిణాం !!

అని చెప్పబడింది...

రిసర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియ (RBI)కి తప్ప, మరే బ్యాంకుకు కూడా కరెన్సి నోట్లను ముద్రించే అధికారం లేదు...అనేది వాస్తవమే.....
కాని వివిధ బ్యాంకులు వివిధ రీతుల అర్.బి.ఐ వారిచే ముద్రించి అందించబడిన కరెన్సి నోట్లను ఋణాలు, లోన్స్ రూపంలో వారివారి కస్టమర్లకు అందించుకునే వీలున్నది అనేది వాస్తవం...

అది బైక్ లోన్ అయినా, కార్ లోన్ అయినా, హోం లోన్ అయినా, పర్సనల్ లోన్ అయినా, మరే ఇతర విధమైన లోన్ అయినా, అది ఏ బ్యాంక్ నుండి లభించినా కూడా,
ఆ లోన్స్ తాలూకా ధనం అంతా కూడా ఆర్.బి.ఐ వారు ముద్రించే అధికారిక కరెన్సి నోట్ల ధనమే అని అర్ధం...

అందరూ అన్ని సేవలకు ఆర్.బి.ఐ వారి దెగ్గరికే వెళ్ళడం అన్ని వేళలా కుదరకపోవచ్చు.....
మనకు సమీపంలో ఉన్న బ్యాంక్ కు వెళ్ళి, ఆర్.బి.ఐ వారి ఆదేశాలకు అనుగుణంగా వ్యవహరించే సదరు బ్యాంక్ లో మనం లావదేవీలు గావించి వివిధ రీతుల తరించడం ఎవ్విధంగా ఒక లౌకిక వ్యవస్థో...,
అవ్విధంగానే, వివిధ గ్రహాలు వివిధ ఈశ్వరానుగ్రహన్ని సాధికారికంగా భక్తులకు అందించే మాధ్యమాలు గా వర్ధిల్లడం అనేది ఒక అలౌకిక ఖగోళ వ్యవస్థ యొక్క విశేషం.....అని విజ్ఞ్యులకు విదితమే..... 

అందుకే నవగ్రహహోమం, నవగ్రహశాంతి, నవగ్రహ నమస్కార ప్రార్ధనా శ్లోకాలు, నవగ్రహసంబంధిత నవధాన్యాలు, నవగ్రహసంబంధిత విలువైన రంగురాళ్ళు, ఇత్యాదిగా ఈ లోకంలో వివిధ రీతుల నవగ్రహారాధాన అనేది అనాదిగా ఆచరింపబడుతున్న ఒక అధ్యాత్మవిశేషం....

అట్టి గౌరవనీయ నవగ్రాహాలు, కొన్ని ఖగోళ విశేష అమరిక కారణాల రీత్యా భూలోక వాసులకు అప్పుడప్పుడు ప్రత్యక్షంగా వినువీధిలో దర్శనీయమైన రీతిలో ప్రకాశిస్తుండగా, వాటిని దర్శించి, నమస్కరించి తరించడం అనేది విజ్ఞ్యులకు ఈశ్వరానుగ్రహకారకమైన హర్షదాయక వ్యాపకం...

మనం శ్రీరమాసమేతసత్యనారాయణస్వామి వారి వ్రతాన్ని ఆచరించే ముందు, నవగ్రహాలను ఆరాధించడంలో ఆంతర్యం ఏంటంటే, ఆ క్రతువులో అప్పుడు అక్కడ మనం గావించిన కల్పోక్త ప్రకారేన ఈశ్వరారాధన, స్వామివారి అనుగ్రహంగా, నిత్యం మన కళ్ళెదుట ఆకాశంలో ప్రకాశించే నవగ్రహానుగ్రహంగా వర్షింపబడేందుకు కావలసిన ఈశ్వరానుగ్రహవైభవప్రోది అని అర్ధం....

సర్వం శ్రీమదలర్మేల్మంగాపద్మావతీ సమేత,
శ్రీభూసహితశ్రీశ్రీనివాస శ్రీచరణారవిందార్పణమస్తు....🙏🙂💐

సూర్యేందు భౌమ బుధ వాక్-పతి కావ్య-సౌరి
స్వర్భానుకేతు దివిస్సత్-పరిశత్-ప్రధానాః ।
త్వద్దాసదాస చరమావధి దాసదాసాః
శ్రీ వేంకటాచలపతే తవ సుప్రభాతమ్ ॥

అర్థం:

1.సూర్యుడు (సూర్యుడు), 
2.ఇందు (చంద్రుడు), 
3.భౌముడు (కుజుడు), 
4.బుధుడు (బుధుడు), 
5.వాక్పతి (వాక్కుల ప్రభువు లేదా బృహస్పతి ), 
6.కావ్యుడు (శుక్రుడు), 
7.సౌరి (శని)

8.రాహువు
9.కేతువు
(ఛాయాగ్రహాలుగా రూపాంతరం చెందిన అమృతాశనుడైన స్వర్భాను.)

అనబడే నవగ్రహాలు / దేవసభాసభ్యులు
నీకు దాసానుదాసూలై నమస్కరించుచున్నారూ...
ఓ గోవిందా, శ్రీవేంకటాచలప్రభు....
ఈ అందమైన ఉదయకాలంలో నీకు నమస్కారం....

శ్రీ విశ్వావసు 2025 కార్తీక మాస బహుళత్రయోదశి పూర్వక ఇందువాసర ఈశ్వరారాధనాశుభాభినందనలు...🙂

ఈనాటి నాల్గవ కార్తీక సోమవారం నాడు,
చతుర్విధపురుషార్ధములను ఘనమైన రీతిలో అనుగ్రహించే
దేవేంద్రప్రతిష్టిత, సోమప్రతిష్టిత, శ్రీ సోమేశ్వరాలయం, కోటిఫలి (కాలక్రమంలో కోటిపల్లి), శివాలయ వైభవాన్ని కొంత పరికిద్దాం...
https://en.wikipedia.org/wiki/Kotipalli

4 అమెరిక డాలర్ కాసులు ఖర్చు పెడితే అక్కడ ఒక్క స్టార్ బక్స్ కాఫీ వస్తుంది.....
అవే 4 అమెరిక డాలర్ కాసులు ఇండియాకి ట్రాన్స్ఫర్ చేసుకొని మన ఇండియన్ కరెన్సి లోకి మార్చుకుంటే, రమారమి 350 రూపాయలతో ఫుల్ ప్లేట్ అరటాకు బ్రాహ్మణ భోజనం తో పాటుగా ఓ 10 కాఫీలు కూడా వస్తాయ్......
దీన్నే దేశకాలవైభవం అని వచింతురు....
అనగా ఏ భూలోకప్రాంతంలో, ఏ కాలంలో ఎట్టి శక్తియుక్తివిత్త వినిమయం ఎట్టి ఫలితాలను అనుగ్రహించును....
అనే అంశంలో ఆరితేరిన ప్రజ్ఞ్యను ఈశ్వరానుగ్రహంగా కలిగిఉండడం....

శ్రీ చాగంటి సద్గురువులు వివరించినట్టుగా,
మన ఇంటిదెగ్గర ఉన్న శివాలయంలో చేసుకున్న సదరు పుణ్యం మనకు 100 మార్కుల పుణ్యసంచయాన్ని అనుగ్రహిస్తే...
అదే పుణ్యకర్మాచరణ కోటిఫలి శ్రీసోమేశ్వరాలయంలో గావిస్తే అందుకు కోటిరెట్ల ఫలితాన్ని ఈశ్వరుడు అనుగ్రహించడం అనేది ఈ మహిమాన్వితమైన కోటిఫలి తీర్థక్షేత్రవైభవం...

ఏ నాయన నీకు ఎక్కువగా అక్కడెక్కడో ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ఆలయాల గురించి మాత్రమే దర్శనాలు, వ్యాఖ్యానాలు, జ్యోతకమౌతూ ఉంటాయా ఏంటి....అని కొందరు అనుకోవచ్చు....

దానికి గల కొన్ని కారణాలను కొంత వివరిస్తాను....

1. శ్రీ చాగంటి సద్గురువుల ప్రవచనాలు శ్రద్దగా విన్నవారికి గుర్తున్నట్టుగా,
దక్షిణభారతావనిలో జీవనదులు సముద్రసంగమానికి దెగ్గరగా ఉన్న ప్రదేశాల్లో ఉండే ఆలయాలు బహువిశేషమైన మహిమ్నతతో వర్ధిల్లుతూ ఉంటాయ్..
ఉత్తరభారతావనిలో జీవనదుల ఉద్భవప్రదేశాల్లో ఉన్న ఆలయాలు బహువిశేషమైన మహిమ్నతతో వర్ధిల్లుతూ ఉంటాయ్..
అందుకే ఎక్కువగా అందరూ ఉత్తరాన చార్ ధాం యాత్ర అని గంగోత్రి, యమునోత్రి, బదరి, కేదార పుణ్యక్షేత్రాలను దర్శించడం....
మరియు దక్షిణాన ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, లో ప్రవహించే జీవనదులైన, గోదావరి, కావేరి, నదుల సముద్రసంగమానికి దెగ్గరగా ఉండే పుణ్యక్షేత్రాలను దర్శించడం పారిపాటి...

2. అసంఖ్యాక పూర్వజన్మల స్మృతులు, వాసనలు, అనుగ్రహాలు, ప్రయాణాలు అట్టే ఎవ్వరినైనా లాగుతూ ఉంటాయ్ కద...
[
నాగార్జున గారు, విజయశాంతి గారు, నటించిన ఆనాటి ఆల్ టైం హిట్ మూవి "జానకిరాముడు" సినిమాలోని ఒకపాటలో ఉన్న ఈ క్రింది చరణపంక్తులహృదయంగా....

"కడలిలో అలలుగా కడలేని కలలుగా నిలిచిపోవాలనీ
పాడవే (పాడవే) కోయిలా పాడుతూ పరవశించు జన్మజన్మలా
నా గొంతు శృతిలోనా (నా గుండె లయలోనా)"

3. భోక్త ఎవ్వరైనా, ఏ రాష్ట్రంవారైనా సరే...,
సంధ్యవార్చే సత్బ్రాహ్మణపాచకబృందం వండివార్చిన సన్నబియ్యం, బాస్మతి బియ్యం, తో అమృతమయమైన షడ్రసోపేత భోజనం చేసిన వారికి, ఇతర బియ్యం వంగడాలు అంతగా రుచించవు కద...
అందుకే, గోదావరి జీవనదీపరీవాహక ప్రాంతాల్లో, మరియు
గోదావరి జీవనది యొక్క సముద్రసంగమానికి దెగ్గరగా ఉండే ప్రాంతాల్లో, నెలకొన్న మహిమాన్విత స్వయంభూ ఆలయాలంటే విజ్ఞ్యులకు బహుప్రీతి....

ఈ కోటిఫలి క్షేత్రంలో, శివలింగాభిషేకానికి నిత్యం గంగ ఊరుతూ ఉండడం, ఎంత గంగాజలం బయటకు తీస్తే మళ్ళీ అంత గంగాజలం ఊరుతూ ఉండడం ఒక విశేషం...!

ప్రారబ్ధం తో పాటుగా సాగే విహితకర్మాచరణ ఆగామి కర్మసంచయరూపంలో నిత్యం మన సంచితకర్మసూచీని సవరిస్తూ ఉండును...
అనగా చేసుకున్న పుణ్యపాపాలకు ఫలితంగా సుఖదుఃఖాలు అనుభవించడానికి నిత్యం వివిధ జన్మలను ఎత్తుతూ ఉండే ప్రాణికోటి యొక్క కర్మచట్రవైభవాన్ని మనకు ఈ నిత్యం ఊరే గంగాజలం తెలియజేయును...

అలా ఎన్నోజన్మల్లో చేసుకున్న పుణ్యపాపాల ఫలితంగా ఈ జన్మలో, ఒక సంపన్నుడి ఇంట్లో ఉన్న ఒక కుక్క కూడా రాజభోగాలను అనుభవిస్తూ తన గత జన్మల పుణ్యాన్ని అనుభవించేస్తున్నది....
కాని కొత్తగా పుణ్యకర్మాచరణ గావించేందుకు వీలులేని జంతుజన్మలో ఆ జీవుడు ఉన్నది...

అట్టి స్థితి కలగకుండా, అనగా పుణ్యపాపముల ఫలితాలను అనుభవించడానికి ఎట్టి ఉపాధి లభించినా కూడా, కొత్తగా పుణ్యకర్మాచరణ గావించడానికి ఎల్లప్పుడూ వెసులుబాటు ఉండేలా, తగిన ఉన్నతమైన జన్మలను అనుగ్రహించేందుకు, శ్రీ సోమేశ్వరుడిగా పక్కనే గర్భాలయంలో ఈశ్వరుడు కొలువై ఉన్నాడు....

ఏ మంచికార్యం నిర్వహించాలన్నా, ఏ పుణ్యకార్యం గావించాలన్నా అందుకు అత్యంత ఆవశ్యకమైనది మంచి మనసు...
"చంద్రమా మనసో జాతః..."
అని వేదవాక్కు...
అందుకే ఈశ్వరుణ్ణి సోమేశ్వరుడిగా ఆరాధించే వారికి, సోమవారం నాడు ఆరాధించే వారికి, సోమసంబంధమైన పుణ్యక్షేత్రాల్లో ఆరాధించేవారికి, విశేషమైన మంచి మనసు లభించడం, తద్వారా ఎన్నో మంచి కార్యాలకు వారి శక్తియుక్తివిత్తములు వినియోగమౌతూ ఉండును.....

ఎన్నో మంచి కార్యాలను నిర్వహించేందుకు మంచి మనస్సును, మనోబలాన్ని అనుగ్రహించే ఈశ్వరుడే మన ఏదో ఒక మంచి పుణ్యకర్మాచరణయందు గల చిత్తశుద్ధిని పరికించి,
సాలోక్య, సామీప్య, సారూప్య, సాయుజ్య, మనెడి చతుర్విధ మోక్షాల్లో మనకు నచ్చే, తను మెచ్చే అత్యంత దుర్లభమైన మోక్షానుగ్రహాన్ని కూడా ఆ సోమేశ్వరుడు అనుగ్రహించును....
అని విజ్ఞ్యుల ఉవాచ...!

అందుకే, ఎన్నో నిగూఢమైన గహనమైన శక్తివంతమైన గౌణముల సమూహంగా ఉండే శ్రీరుద్రనమకఅష్టమానువాకం "నమః సోమాయచ" అనే ప్రారంభమయ్యేది....!!

నమః॒ సోమా॑య చ రు॒ద్రాయ॑ చ॒
నమ॑స్తా॒మ్రాయ॑ చారు॒ణాయ॑ చ॒
నమః॑ శం॒గాయ॑ చ పశు॒పత॑యే చ॒
నమ॑ ఉ॒గ్రాయ॑ చ భీ॒మాయ॑ చ॒
నమో॑ అగ్రేవ॒ధాయ॑ చ దూరేవ॒ధాయ॑ చ॒
నమో॑ హం॒త్రే చ॒ హనీ॑యసే చ॒
నమో॑ వృ॒క్షేభ్యో॒ హరి॑కేశేభ్యో॒
నమ॑స్తా॒రాయ॒
నమ॑శ్శం॒భవే॑ చ మయో॒భవే॑ చ॒
నమః॑ శంక॒రాయ॑ చ మయస్క॒రాయ॑ చ॒
నమః॑ శి॒వాయ॑ చ శి॒వత॑రాయ చ॒
నమ॒స్తీర్థ్యా॑య చ॒ కూల్యా॑య చ॒
నమః॑ పా॒ర్యా॑య చావా॒ర్యా॑య చ॒
నమః॑ ప్ర॒తర॑ణాయ చో॒త్తర॑ణాయ చ॒
నమ॑ ఆతా॒ర్యా॑య చాలా॒ద్యా॑య చ॒
నమః॒ శష్ప్యా॑య చ॒ ఫేన్యా॑య చ॒
నమః॑ సిక॒త్యా॑య చ ప్రవా॒హ్యా॑య చ ॥ 8 ॥

ఎన్నో పుణ్యక్షేత్రాల్లో సోమసంబంధంగా కొలువైన 
శ్రీసోమేశ్వరుడి అనుగ్రహంతో, 
ఈ నాల్గవ కార్తీక సోమవారం నాడు విజ్ఞ్యులెల్లరూ విశేషంగా అనుగ్రహింపబడి తరించెదరు గాక అని అభిలషిస్తూ,
ఓం నమఃశివాయ.....🙏💐🙂

నమః శివాభ్యాం పరమౌషధాభ్యాం
పంచాక్షరీపంజరరంజితాభ్యామ్ ।
ప్రపంచసృష్టిస్థితిసంహృతాభ్యాం
నమో నమః శంకరపార్వతీభ్యామ్ ॥ 5 ॥

సర్వం శ్రీసోమేశ్వర, శ్రీరాజరాజేశ్వర స్వామి శ్రీచరణారవిందార్పణమస్తు...💐🙂🙏


Shree Sadguru Tyaagaraaya Aaraadhana Music Festivels...

A soulful invitation to all the connoisseurs and admirers of the mighty carNatic music, a sacred form of music that has its roots embedded in the ancient subject named "SwaraarNavam" blessed by HH triloka sanchaari Shree Naarada Maharshi vaaru to sathguru Shree Kaakarla Tyaagabrahmam gaaru / Shree Tyaagaraaya swami vaaru in order to establish and propagate a holy musical traditon that has several divine soothing and healing properties based on the singers' / listeners' affection filled diligence towards the same...
Several erudite musical organizations all over the world have recognized and started admiring the same by conducting such "Shree Sadguru Tyaagaraaya Aaraadhana Music Festivels" with the onset of the pious Pushya maasam....🙂💐

ప. రాగ సుధా రస పానము జేసి
రంజిల్లవే ఓ మనసా

అ. యాగ యోగ త్యాగ భోగ ఫలమొసంగే (రా)

చ. సదాశివ మయమగు నాదోంకార స్వర
విదులు జీవన్ముక్తులని త్యాగరాజు తెలియు (రా)

https://thyagaraja-vaibhavam.blogspot.com/2007/09/thyagaraja-kriti-raga-sudhaa-raga.html?m=1

శ్రీ పులపాక సుశీలమ్మ గారికి హార్దిక జన్మదినశుభాభినందనా నమస్సుమాంజలి...💐🙂

పద్మశ్రీ, కళైమామణి బిరుదాంకిత శ్రీ పులపాక సుశీల గారు, సుశీలమ్మ గా భారతీయసంగీతపరిశ్రమకళామతల్లిసిగలో కొలువైన అత్యంత అరుదైన మధురగానవిద్వన్మణి గా ఖ్యాతి గడించిన లలితకళాభిజ్ఞ్యసామ్రాజ్యమైన విజయనగర తెనుగు తేజం అని విజ్ఞ్యులెల్లరికీ విదితమే...

వారి అనన్యసామాన్య గాత్రవైభవానికి తార్కాణంగా, ఇప్పటికీ ఎవర్ గ్రీన్ సాంగ్ గా ఎందరో విజ్ఞ్యుల ఇళ్లల్లో 
ఆలకింపబడే లాలిపాట అయిన
"వటపత్రశాయికి వరహాల లాలి.." అనే అన్నమాచార్య కృతి ఒక్కటి చాలు....

మనిషి యొక్క పరిపూర్ణారోగ్యానికి అత్యంత ఆవశ్యకమైన ప్రాణాయామశక్తిని ప్రోదిగావిస్తూ, ఉన్నతమైన బుద్ధివైభవాన్ని వికసింపజేయిస్తూ, సామన్య మనుష్యులను మాన్యులైన మహనీయులుగా తీర్చిదిద్దే సామవేదశాస్త్రానుబంధలలితకళలో ఆరితేరిన
సంగీతశాస్త్రశిఖామణి గా పరిఢవిల్లే వారి గాత్ర వైభవం గురించి వివరించేంతటి ప్రౌఢిమ చాలా తక్కువ మంది సంగీతశాస్త్ర రసజ్ఞులకు, కోవిదులకు మాత్రమే కుదురును....

మీరు 90వ పడిలోకి అడుగిడుతున్న సందర్భంగా...,
భగవంతుడి చిరంతన అనుగ్రహంతో మీరు నిండు నూరేళ్ళు ఆయురారోగ్యైశ్వర్యాలతో వర్ధిల్లాలని అభిలషిస్తూ, మీకు హార్దిక జన్మదినశుభాభినందనా నమస్సుమాంజలి...💐🙂

శ్రీ 2025 విశ్వావసు కార్తీక బహుళ పంచమి ప్రయుక్త భానువాసర పర్వసమయంలో,సంకల్పసహిత భానువాసర గౌతమీతీర్థస్నానానంతరం,సౌమిత్రి సహిత శ్రీభద్రాచలసీతారామచంద్రస్వామి వారి ఆలయ సందర్శనం...,శ్రీ యోగనారసిమ్హ ఆలయం....,గోదావరి తీర స్థిత సద్యోజాత శివలింగక్షేత్రం,శ్రీ అన్నపూర్ణ సమేత కాశి విశ్వేశ్వర స్వామి వారి ఆలయ సందర్శనంతో తరించిన ఈశ్వారానుగ్రహవిశేషానికి ప్రణమిల్లుతూ,....

శ్రీఆదిశంకరాచార్యుల వారిచే.....

వామాంకస్థితజానకీపరిలసత్ కోదండదండంకరే
చక్రంచోర్థ్వకరేణబాహుయుగళేశంఖంశరందక్షిణే
భిభ్రాణంజలజాతపత్రనయనంభద్రాద్రిమూర్ధ్నిస్థితం
కేయూరాదివిభూషితంరఘుపతింసౌమిత్రియుక్తంభజే

అని స్తుతింపబడిన వరదైవం, అరుదైన కలియుగ శ్రీరామనారాయణుడు, శ్రీవైకుంఠరాముడు, శ్రీభద్రగిరీషుడు, సౌమిత్రి సహిత శ్రీసీతారామచంద్రస్వామి వారు...

అనుపమానమై అతిసుందరమై
తనరు చక్రమది ధగ ధగ మెరిసెడి || అదిగో ||

https://te.wikisource.org/wiki/%E0%B0%85%E0%B0%A6%E0%B0%BF%E0%B0%97%E0%B1%8B_%E0%B0%AD%E0%B0%A6%E0%B1%8D%E0%B0%B0%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D%E0%B0%B0%E0%B0%BF_%E0%B0%97%E0%B1%8C%E0%B0%A4%E0%B0%AE%E0%B0%BF_%E0%B0%87%E0%B0%A6%E0%B0%BF%E0%B0%97%E0%B1%8B_%E0%B0%9A%E0%B1%82%E0%B0%A1%E0%B0%82%E0%B0%A1%E0%B0%BF

అని ఎంతో పారవశ్యంతో శ్రీభద్రాచలరామదాసు (కంచర్ల గోపన్న) గారిచే సన్నుతింపబడిన అత్యంతమహిమాన్వితమైన సుదర్షనచక్రం ఆలయగోపురోపరికలశంగా కొలువైన అపురూపమైన ఏకశిలాలయం, దక్షిణ అయోధ్య గా భాసిల్లే, కలియుగ నవయుగ మోక్షారామం, గోదావరితీర స్థిత
శ్రీభద్రాచల శ్రీసీతారామచంద్రస్వామివారి ఆలయం...

శ్రీశైల అభయారణ్యాల్లో ఏ ఆగమాలకు చెందని స్వరూపంతో స్వయంవ్యక్తమూర్తిగా శ్రీఇష్టకామేశ్వరీదేవి అమ్మవారు ఎవ్విధంగా  కొలువై ఉన్నారో......,
భూగృహం నుండి శ్రీఆదిశంకరులవారు వెలికితీసేంతవరకు ఈ అమ్మవారిగురించి ఇక్కాలపు విజ్ఞ్యులెవ్వరికీ తెలియదు అని శ్రీచాగంటి సద్గురువులు వివరించడం కొందరికైనా గుర్తుండే ఉంటుంది...

అవ్విధంగానే
1620 వ సంవత్సరంలో జన్మించిన శ్రీకంచర్లగోపన్న గారు నిర్మించిన ఇప్పటి భద్రాద్రి ఆలాయంలో కొలువైన శ్రీసీతారామచంద్రస్వామి వారిని, రమారమి 820 వ సంవతసరంలో అనగా 800 సంవత్సరాలక్రితం, యావద్ భారతదేశాన్ని వారి ధర్మవిజయయాత్రలో భాగంగా పాదచారులై పర్యటించిన శ్రీఆదిశంకరాచార్యులవారు అంత రమ్యంగా స్తుతించారంటే, స్వామివారు ఎప్పుడు గోదావరి తీరంలో శ్రీవైష్ణవసాలగ్రామకృష్ణశిలారూపంలో ప్రభవించి కొలువైయ్యారో ఎవ్వరికీ తెలియదు...

శ్రీరమ సీతగాగ నిజసేవక బృన్దము వీరవైష్ణవా
చార జనమ్బుగాగ విరజానది గౌతమిగా వికుణ్ఠ ము
న్నారయభద్ర శైలశిఖరాగ్రముగాగ వసిఞ్చు చేతనో
ద్ధారకుడైన విష్ణుడవు దాశరథీ కరుణాపయోనిధీ. ॥ 20 ॥

అనే పద్యం యొక్క తాత్పర్యాన్ని శ్రీచాగంటి సద్గురువులు ఎంతో రమ్యంగా వివరించడం కూడా కొందరికైనా గుర్తుండే ఉంటుంది...

సాక్షాత్తు శ్రీరామసౌమిత్రులే మోసుకొని వచ్చిన పేద్ద గుండిగలు రెండు ఇప్పటికీ శ్రీ పమిడిఘంటంవేంకటరమణహరిదాసు గారి నిరతాన్నదానసత్రంలో (అంబ సత్రం) ఎంతో ఠీవితో కొలువై ఉండడం విజ్ఞ్యులకు విదితమే...

కాశీక్షేత్రంలో వెయ్యిమందికి గావించే అన్నసమారాధన అనుగ్రహఫలం, భద్రాచలంలో ఒక్కరికి గావించే అన్నసమారాధన అనుగ్రహఫలంతో సమానం అని అంటే 
శ్రీవరభద్రగిరిక్షేత్రం యొక్క ప్రాశస్త్యం ఎట్టిదో విజ్ఞ్యులకు విదితమే...

జీవనదిగా నిత్యం గలాగలా ప్రవహించే దక్షిణభారతగంగానది   గా వాసికెక్కిన గౌతమి, విశాలగోదావరిగా విశ్వరూపాన్ని సంతరించుకోవడం ప్రారంభమయ్యే పరమపావనతీర్థక్షేత్రమే శ్రీభద్రాచలం...

కొన్ని తినాలన్నా, కొన్ని చూడాలన్నా, కొన్ని తిరగాలన్నా, కొన్ని ఆచరించాలన్నా...
ఎంతో గొప్ప పుణ్యముంటేనే సాధ్యమయ్యేది....

కాశి అన్నపూర్ణ అన్నప్రసాదం మరియు
పురి జగన్నాథుడి అన్నప్రసాదం తినాలన్నా...,

తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామివారిని దర్శించాలన్నా...,
సద్యోజాత శివలింగక్షేత్రాన్ని దర్శించాలన్నా..., 

అరుణాచల అగ్నిలింగ క్షేత్రం,
శ్రీశైలం జ్యోతిర్లింగ / శక్తిపీఠ క్షేత్రం పర్యటించాలన్నా...,

భానువాసరం నాడు సంకల్పసహిత శ్రీభద్రాచల తీర గోదావరి తీర్థస్నానం ఆచరించాలన్నా...,
గంగానదీ స్నానం ఆచరించాలన్నా....,

ఎంతో గొప్ప పుణ్యముంటేనే సాధ్యమయ్యేది....
ఎందుకంటే ఇవి ఎంతో మహిమాన్వితమైన పుణ్యసంచయకారకాలు అని విజ్ఞ్యుల ఉవాచ....

(పురి జగన్నాథుడు తమ అమృతమయమైన అన్నప్రసాదాన్ని నాకు త్వరలోనే అనుగ్రహించుగాక....అని ఆకాంక్షిస్తూ...)

శ్రీ 2025 విశ్వావసు కార్తీక బహుళ పంచమి ప్రయుక్త భానువాసర పర్వసమయంలో,
సంకల్పసహిత భానువాసర గౌతమీతీర్థస్నానానంతరం,
సౌమిత్రి సహిత శ్రీభద్రాచలసీతారామచంద్రస్వామి వారి ఆలయ సందర్శనం...,
శ్రీ యోగనారసిమ్హ ఆలయం....,
గోదావరి తీర స్థిత సద్యోజాత శివలింగక్షేత్రం,
శ్రీ అన్నపూర్ణ సమేత కాశి విశ్వేశ్వర స్వామి వారి ఆలయ సందర్శనంతో తరించిన ఈశ్వారానుగ్రహవిశేషానికి ప్రణమిల్లుతూ, సర్వం భద్రగిరి మూర్ధ్ని స్థిత
శ్రీసీతారామచంద్రపరబ్రహ్మార్పణమస్తు...🙏💐🙂