1. "నారు పోసిన వాడే నీరూ పోస్తాడు"
అనే సామెతను వివిధ రీతుల అన్వయం చేసుకోవడంలో
విజ్ఞ్యత ఉండును....
2. "వెన్నెల దీపం కొందరిదా అడవిని సైతం వెలుగు కదా..."
అని అన్నారు శ్రీ సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు "రుద్రవీణ" చిత్రంలోని
"తరలి రాద తనే వసంతం....
తన దరికి రాని వనాల కోసం..."
అనే పాటలో....
3. "నీ ధైర్యాన్ని దర్షించి దైవాలే తలదించగా
నీ అడుగుల్లో గుడి కట్టి స్వర్గాలే తరియించగా
నీ సంకల్పానికి ఆ విధి సైతం చేతులెత్తాలీ
అంతులేని చరితలకీ ఆది నువ్వు కావాలీ
మౌనంగానే ఎదగమనీ మొక్క నీకు చెబుతుంది
ఎదిగినకొద్దీ ఒదగమనే అర్ధమందులో ఉంది "
అని అన్నారు శ్రీ చంద్రబోస్ గారు "నా ఆటోగ్రాఫ్" సినిమాలో
4. "పట్టెడన్నమిచ్చి పులకించే నేలతల్లి వంటి మనసల్లే
కొందరికే హృదయముంది నీ కొరకే లోకముంది
నీకు తోడు ఎవరంటూ లేరు గతములో
నేడు చెలిమి చెయి చాపే వారే బ్రతుకులో"
అని అన్నారు వనమాలి గారు "శివపుత్రుడు" సినిమాలోని "చిరుగాలి వీచెనే..." అనే పాటలో....
5. "ఏడుకొండల శ్రీనివాసా
మూడు మూర్తుల తిరుమలేశా
అడుగడుగునా వేదాంతమున్నది
నీ ఆరాధనలో సాధనున్నది...."
అని అన్నారు అచార్య ఆత్రేయ గారు
" శ్రీ వేంకటేశ్వర వైభవం" సినిమా పాటలో...
కావున, ఎవరి జీవితాభ్యున్నతికి ఎవరు చుక్కాని గా ఉన్నారు....అనే అంశంలో వివేచన సాగించి అభివృద్ధి బాటలో పయనించవలసిన విహిత కర్తవ్యం ఎవరికి వారే తెలుసుకొని తరించవలసి ఉంటుంది...
No comments:
Post a Comment