Vinay Kumar Aitha's Personal blog. :)
Viewers may feel free to read thru / copy from / comment on any of my posts as I draft/save them for universal peace.. :)
Tuesday, February 2, 2021
Many hearty congratulations to Chitra chechi for being conferred with PadmaBhushan-2021 and may her music journey towards PadmaVibhushan continue to enthral thousands of audience..! 😊🍟🍨🍕💐
Friday, January 29, 2021
శ్రీ వేటూరి గారి 85వ జయంత్యుత్సవ సందర్భంగా వారికి ఒక సాహిత్యాభిమాని సవినయంగా సమర్పించే చిరు కవనకుసుమాంజలి....🙏😊💐🍟🍨🍕
Shree Vishnu Educational Society SVES, includes another feather in the cap of its universal glory.....!
ఈశావాస్యమిదగుం సర్వం....!
Wishing one and all a very happy 72nd Indian Republic Day......!🍕🍟🍨😊🌷🌷🌷🌷🌷🌷💐💐💐💐💐💐💐💐
Monday, January 25, 2021
శ్రీ పుష్య శుద్ధ ద్వాదశి / కూర్మ ద్వాదశి వ్రత పర్వదిన శుభాభినందనలు....😊🍨🍕🍟
Sunday, January 24, 2021
Happy Shree Paushya Ekaadashi 2021...😊🍕🍟🍨
Saturday, January 16, 2021
శ్రీ శార్వరి నామ సంవత్సర మకర సంక్రమణ 2021 శుభాభినందనలు....😊🍨🍕🍟
Thursday, January 7, 2021
శ్రీ శార్వరి ధనుర్మాస శ్రీవ్రతం / తిరుప్పావై ప్రత్యేకత మరియు రాబోయే భోగి నాటి శ్రీగోదారంగనాథ తిరుక్కల్యాణమహోత్సవ శుభాభినందనలు........🍕💐🍟🍨😊
Friday, January 1, 2021
Wishing one and all a very happy and prosperous New Year 2021...🍨🍕💐😊
Wednesday, December 30, 2020
శ్రీ శార్వరి మార్గశిర పౌర్ణమి / శ్రీదత్తజయంతి శుభాభినందనలు.....😊🍕💐🍨🍟
శ్రీ శార్వరి మార్గశిర పౌర్ణమి / శ్రీదత్తజయంతి శుభాభినందనలు...😊🍕💐🍨🍟
మన సనాతన ధర్మంలో దాదాపుగా ప్రతినెల ఏదో ఒక పండుగ, ఉత్సవం వస్తూనే ఉంటాయి... ( శూన్యమాసం గా భావించబడే ఆషాఢంలో ఆదిపరాశక్తి యొక్క జాతరలు ( నైసర్గికప్రాంతీయాచారానుగుణంగా ) మరియు గురుపౌర్ణమి / వ్యాసపౌర్ణమి ఉత్సవాలు గా జరుపుకోవడం వల్ల ఆ నెలలో కూడా పంచాంగ వ్యవస్థ యొక్క పారమార్ధిక స్థిరత్వం ఎట్లు మన పెద్దలు సమకూర్చినారో ఇతహ్పూర్వం ఒక పోస్ట్లో వివరించాను )
ప్రతి పండుగ వెనక ఒక ఐతిహ్యం, ఒక పౌరణికప్రాశస్త్యం, ఒక దేవుడి అవతార వైశిష్ట్యం, ఒక చారిత్రక సంఘటన యొక్క సంస్మరణ, ఇలా ఏదో ఒక నేపథ్యం తో ఆ పండుగ జరుపబడి, మనుజానీకానికి ఒక చక్కని సందేశం / తత్సంబంధ దైవానుగ్రహం అందించి మనల్ని తరించేలా మన సనాతన ధర్మావలంబిత సదాచార సంపన్నులు అనుగ్రహించారు....
అనాదిగా ఉన్న దైవిక వ్యవస్థను ఒకసారి గమనిస్తే,
"పూర్వజాత్రిపురాంబిక" గా ఎప్పటినుండో చెప్పలేన్నప్పటినుండి ఉన్న ఆదిపరాశక్తి, ఆ ఆదిపరాశక్తి యొక్క విశ్వపరిపాలనావ్యవస్థ కొరకు సృజించబడిన త్రిమూర్తులు
బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు
మరియు వారి వారి శక్తి ఉద్దీపక స్త్రీసామ్యములు అనగా
సరస్వతి, లక్ష్మీ, సతీదేవి / పార్వతీ
గా నిత్యం త్రిమూర్తులతో ఉండే వారి శక్తికేంద్రములు....
అనగా వారి యొక్క శక్తి నిత్యం ప్రవర్ధమానమై ఉండడానికి కారణభూతులు గా ఉండే వారి వారి అర్ధాంగులు....
లౌకికంగా అర్ధాంగి అంటే జీవితభాగస్వామి అని అర్ధం...
దేవ పరిభాషలో వారి అర్ధాంగులు అనగా వారి వారి శక్తిప్రకటనకు కారణమై ఉండే వారు....
తన చతుర్వదనములపై ఆ సరస్వతి దేవిని ఆవహించుకొనే బ్రహ్మ గారు తన సృజన శక్తిని కొనసాగించేది....
తన వక్షస్థలమున లక్ష్మీ దేవిని కొలువైఉండేలా చేసుకొనే ఆ విష్ణుదేవుడు స్థితికర్తగా తన పరిపాలనను కొనసాగించేది....
తన వామభాగంలో శక్తిని కొలువైఉండేలా చేసి అర్థనారీశ్వరుడిగా ఉండి ఆ లయకారకుడు ప్రళయ ప్రక్రియను నిర్వహించేది...
వారి శక్తి స్థిరీకరణ లేనిచో ఆ స్థిరత్వం సంభవించదు....
అందుకే వారి వారి శక్తులు వారి నుండి దూరమైన సంఘటనల్లో వారు ఆల్మోస్ట్ పిచ్చివారిలా ఉగ్రులై, దశాదిశా తెలియని ఉన్మత్తులుగ అవ్వడం
మనం గమనించవచ్చు.....
దక్షప్రజాపతి అవమానం భరించలేక తనను తాను యోగాగ్నికి ఆహుతి చేసుకున్న సతీదేవి దేహన్ని భుజాన వేసుకొని ఉగ్రుడై, ఉన్మత్తుడై ఆ మహేశ్వరుడు సంచరించడం....
మరలా మేనకాహిమవత్ పుత్రికగా హైమవతిగా ప్రభవించి పార్వతీ కళ్యాణం తో
"శివవామభాగనిలయాం శ్రీచక్రసంచారిణీం..." గా శక్తిస్థిరీకరణ జరిగిన తదుపరి
శ్రీకంఠుడు సంతసించినాడు...
భృగుమహర్షి అవమానం భరించలేక తన నివాస స్థానమైన శ్రీహరివక్షసీమను వీడి భూలోకానికి పరిమితమైనప్పుడు, ఆ హరి పిచ్చివాడిలా కొండల్లో కోనల్లో తిరుగుతూ పుట్టలో తపస్సు గావిస్తు ఒక పసులకాపరి / గొల్ల చేతికర్రతో నెత్తికి గాయమై రక్తమోడే దయనీయ స్థితికి వచ్చి ఎన్నో కష్టాలు పడి, మళ్ళీ శ్రీపద్మావతీ దేవి / అలర్మేల్మంగై గా స్వర్ణకమలం నుండి ఉద్భవించి తన వక్షసీమను చేరగా, శ్రీవేంకటేశ్వరుడిగా స్వామి రూపాంతరం చెంది భూలోక వైకుంఠమైన తిరుమలలో కొలువైతే ఆవిడ వ్యూహలక్ష్మి గా శ్రీహరివక్షసీమను
అలంకరించి శ్రీశ్రీనివాసుడిగా స్వామి వారి శక్తిప్రకటనను అనుగ్రహాన్ని భక్తులకు అందించడం మనం గమనించే సత్యం...
ఇవ్విధంగా సాధారణ లౌకిక / పారలౌకిక చట్రం, అనగా భువరాది ఊర్ధ్వ లోకాల్లో నివసించే సదరు దేవతా ఉపాధికి ఆదిపరాశక్తిచే నిర్దేశించబడిన కర్తవ్యపాలన ఆ దేవతాస్థానంలో కొలువై ఉన్న ఉత్తమోత్తమ కేవల పుణ్యసంచయ జీవుడు నిర్వహించడం....
మరియు పుణ్యపాప సమ్మిళిత సంఘాతంతో భూలోకంలో జన్మమెత్తిన జీవులు తమ ప్రారబ్ధాన్ని అనుభవిస్తూ ఆగామిని కూడబెడుతూ మరలా మరలా సంచితాన్ని సవరిస్తూ తుది లేని జీవ చట్రంలో నిరంతర ప్రయాణం గావిస్తూ ఉండడం.....
ఇది సర్వసాధారణ వైశ్విక కర్మ వ్యవస్థ....
అది ఎవ్వరైనా సరే.....
రోడ్లను శుభ్రపరుస్తు జీవితాన్ని కొనసాగించే సదరు స్వీపర్ ఉపాధికైనా....
ఆ రోడ్డుపై రోల్స్ రాయిస్ కార్లో ప్రయాణించే ఒక సంపన్న వ్యక్తికైనా సరే.....
కర్మ సిద్ధాంతం అనేది ఎల్లరికీ ఒకేవిధంగా వర్తించే ప్రక్రియ....
మరి రంగులరాట్నంలా కర్మచక్రం తన పని తాను చేస్కుంటూ పోతే,
దేవుడు / ఈశ్వరుడు / దైవ కార్యాలు /
ఆధ్యాత్మికం, ఇవన్నీ ఏంటీ, ఎందుకు, అసలు ఎవరికోసం...?
ఇక్కడే ఉంది అసలైన కర్మసిద్ధాంత మౌళిక సూత్ర లోతుపాట్ల యొక్క ఉనికి పట్టు.....
దైవం / ఈశ్వరుడు / దేవతా సంబంధిత కార్యక్రమములు / ఆధ్యాత్మికత.....
ఇవన్నీ కూడా మనుష్యుల జీవితాలను తద్వారా ఆ మనుష్యోపాధి లో కొలువైన సదరు జీవుడి ఉత్తర జన్మ ప్రయాణాలను ఘనంగా ఉద్ధరించే పాసిటివ్ కెటలైటిక్ ఎలిమెంట్స్.....
చాలా సింపుల్ గా చెప్పాలంటే హైద్రబాద్ల మంచి పెద్ద పెద్ద యాపిల్లు కొనాలంటే 100 రూపాయలకు 5 వరకు బేరమాడి కొనుక్కొని తినొచ్చు....
అదే కశ్మీర్లోని యాపిల్ తోటలో ఐతే
అవే యాప్పిల్లు 100 రూపాయలకు కి 100 పండ్లు కొనుక్కొని తినొచ్చు....కద...
అట్లే ఎండాకాలంలో ఎన్నో రకాల మామిడిపండ్లు కొనుక్కొని తినొచ్చు....
అదే చలికాలంలో అయితే ఎక్కడో తిరుమల లాంటి ప్రదేశాల్లో మాత్రమే కొన్ని రకాల మామిడి పండ్లను మాత్రమే కొనుక్కొని తినొచ్చు....కద...
మరి ఇక్కడ భేదం ఎక్కడున్నట్టు...??
దేశము మరియు కాలము....కద.....
అచ్చం అట్లే దేశకాలానుగుణంగా ఆచరింపబడిన కర్మ,
ప్రత్యేకించి ఈశ్వరప్రీత్యర్ధమై
ఆచరింపబడిన కర్మ, ఈశ్వరానుగ్రహంగా కోటి రెట్ల మేటి ఫలితాన్ని ప్రసాదిస్తుంది....
అన్యములైనవి సాధారణ కర్మసిద్ధాంతానుగుణంగా తమ ఫలితాలను తాము ఇవ్వడం కర్తవ్యం గా సాగిపోతుంటాయి.....
ఇది తిరుగులేని ఈశ్వర శాసనం....
తన అవతారాల ద్వారా,
తన ఉపాసకుల ద్వారా,
తన భక్తుల ద్వారా,
ఈశ్వరుడు వివిధ ఆధ్యాత్మిక విధివిధానాలను ఈ లోకానికి అందించాడు.....
వేదం...
ఉపనిషత్తు...
శాస్త్రం...
ఇతిహాసం....
పురాణం...
కావ్యం....
స్తోత్రం....
పద్యం....
శ్లోకం...
నామం...
అక్షరం...
ఇవ్విధంగా ఈశ్వరానుగ్రహంగా ఈ లోకంలోకి
వివిధ దేవతా ఉపాధుల ద్వారా....
మహర్షుల ద్వారా....
యతీంద్రుల / ఆచార్యుల / పీఠాధిపతుల / జగద్గురువుల ద్వారా....
కవుల ద్వారా...
ఎంతో గొప్ప ఆధ్యాత్మిక వస్తువిషయ సామాగ్రి అనుగ్రహింపబడింది....
అందలి ప్రతిపాదిత ముఖ్యమైనవి, అన్నివిధాల హితకరమైనవి, లోకక్షేమకరమైనవి....
జీవనోద్ధారకమైనవి.....
సద్వర్తన గల పెద్దల ద్వారా,
సహృదయులైన గురువుల ద్వారా...
సదాచారసంపన్నులైన
ఆచార్యశిఖామణులద్వారా...
మరియు స్వాధ్యాయం తో తెలుసుకొని
ఆకళింపుచేస్కొని ఆచరించి తరించడంలో మానుష జన్మ యొక్క గొప్పదనం దాగున్నది.....
అవ్విధంగా
రోడ్లు శుభ్రపరిచే సదరు వ్యక్తి మరుజన్మలో ఆలయ పరిసరాలు శుభ్రపరిచే వ్యక్తిగా జన్మించినప్పుడు, దేశకాలానుగుణంగా ఆచరింపబడిన విహితకర్మమైనా సరే అది ఈశ్వర సంబంధంగా, ఈశ్వర ప్రీతికరంగా సాగింది కాబట్టి ఆ వచ్చే జన్మలో అటువంటి ఒక 100 ఆలయాలకు అన్నదాతగా తను, తన తరతరాల వారు జీవించేంతటి సౌభాగ్యహేతువుతో జన్మించి అదే రోడ్డుపై రోల్స్ రాయ్స్ కార్లో ప్రయాణిస్తూ వెళ్ళగలడు......
ఇదే కర్మ సిద్ధాంతంలో ఆధ్యాత్మికతకు గల గొప్పదనం....
మరలా అదే వ్యక్తి లేదా అతని తరంలోని వారు ఈశ్వరుడిని విస్మరించి, ఈశ్వర ప్రసాదిత భోగాసక్తులై మాత్రమే జీవిస్తే ఆ పుణ్యాలన్నీ క్షయమై మళ్ళీ రోడ్లు శుభ్రపరిచే జన్మలోకి ఆ జీవ ప్రయాణం యొక్క గతి వెళ్ళగలదు.....
అట్లు కాక, ఈశ్వర ప్రసాదిత భోగములను విహితప్రాప్తములుగా అనుభవిస్తూనే, తామరాకుమీద కొలువైన నీటిబిందువువలె వాటినుండి
ఉత్తరక్షణం నివృత్తి చెందగల సమర్ధతతో, ఈశ్వర ప్రీత్యర్ధమై, చిత్తశుద్ధి తో కర్మాచరణ గావిస్తూ ఉంటే అది క్రమక్రమంగా ఉన్నతమైన జన్మలకు జీవుడి ప్రయాణాన్ని సువ్యవస్థీకరిస్తూ ఏదో ఒక జన్మలో, ఒక మహానుభావుడి ప్రత్యక్ష సాన్నిధ్యంలో / సాన్నిధ్యంతో జీవితం తరించి అది మోక్షార్హతకు ఎంపికై ఈశ్వరుడి లీలలో ఒక భాగమైన ఉపాధిని గైకొని ఉత్తర జన్మలో ఈశ్వరుడినే చేరుతుంది....!
శ్రీ చాగంటి సద్గురువుల అత్యత్భుతమైన ఉదాహరణల్లో చెప్పాలంటే,
ఒక వేదవేదాంగ ఉపాసకులైన విద్వణ్మూర్తులకో,
ఒక పీఠాధిపతులకో, ఒక యతీంద్రులకో ఒక సిద్ధపురుషులకో, ఒక జగద్గురువులకో,
ఒక నాదోపాసకులకో,
సన్నిహితమైన జీవనం లభించి వారి
సమక్షంలో జీవనం దేశకాల ఆశ్రమధర్మానుగుణంగా పరిపూర్ణతను సంతరించుకొని ఈశ్వరుడిని చేరుతుంది....
సముద్రపు నీటి నుండి ప్రభవించి,
ఒక సముద్రం యొక్క లోతును కనిపెట్టాలని ప్రయాణం మొదలుపెట్టిన ఒక ఉప్పుబొమ్మ సముద్రంలో కరిగి సముద్రమే అయినట్టుగా...
ఈశ్వరానుగ్రహంగా జన్మించిన ఒకానొక జీవుడు, ఈశ్వర సంబంధంగా జీవిస్తూ, ఈశ్వర తత్త్వచింతనతో సాగే సుదీర్ఘజీవప్రయాణంలో ఒకానొక జన్మలో ఈశ్వరుడిలోకే లయించిపోయే అనుగ్రహం పొందడమే
ఆధ్యాత్మికత యొక్క గొప్పదనం....
ఆదిపరాశక్తి అమేయమైన సృజనలో...
నారాయణం ( శ్రీ మహావిష్ణువు )
పద్మభువం ( వారి నాభికమలజులైన బ్రహ్మగారు )
వశిష్ఠ మహర్షి
శక్తిమహర్షి
పరాశరమహర్షి
వ్యాసమహర్షి
శుకమహర్షి
గౌడపాదులు
గోవిందభగవద్పాదులు
శంకరభగవద్పాదులు మరియు వారి నలుగురి శిష్యులచే మొదలై కొనసాగే చతురామ్నాయ పీఠాధిపతుల వ్యవస్థ ద్వారా కొలువైఉండే జగద్గురువులు...
( అనగా ఇప్పటి శ్రీ దక్షిణామ్నాయ గురుపీఠాలంకృత శ్రీశృంగగిరి జగద్గురువరేణ్యులైన శ్రీ భారతీతీర్థమహాస్వామి వారు మరియు శ్రీ విదుశేఖరభారతీస్వామి వారి వరకు గల గురుపరంపర...)
మరియు
దక్షిణామూర్తి గా గురుస్వరూపమై కొలువైన సదాశివుని నలుగురు శిష్యులుగా సనక, సనందన, సనత్కుమార, సనత్సుజాతుల వరకు గల గురుపరంపర....
మరియు
శ్రీ అత్రి అనసూయాల కుమారులై త్రిమూర్త్యాత్మకంగా శ్రీదత్తాత్రేయ స్వామిగా ప్రభవించి
వారి పరంపరగా ఇప్పటి షిరిడీ సాయిబాబా వరకు గల గురుపరంపర....
( శ్రీపాదశ్రీవల్లభ స్వామిగా ఈ కలియుగంలో జన్మించి పిఠాపుర శ్రీక్షేత్రంలో కొలువైన వారి సన్నిధిలో ఇప్పటికీ శ్రీదత్తమహిమ ఈ లోకానికి అనుగ్రహన్ని ప్రసాదిస్తూనే ఉన్నది....)
ఇవ్విధంగా ఎందరో మహానుభావుల ద్వారా అనాదిగా ఆదిమధ్యాంతరహితమైన ఆ భగవద్ తత్త్వాన్ని, సందేశాన్ని, అనుగ్రహన్ని, ఈ మర్త్యలోకానికి అందించి జీవులను అమరత్వంవైపునకు మార్గనిర్దేశనం గావిస్తు సదా ఉద్ధరించే ఆ పరతత్త్వపు ప్రాపంచిక ప్రాశస్త్యం అప్పుడూ ఇప్పుడూ ఎల్లప్పుడూ తన ప్రాభవాన్ని ప్రదర్శిస్తూ భక్తులను పరిపరివిధాల పరిరక్షిస్తూ అనుగ్రహించడమే ఆ దైవానికి గల గొప్పదనం...
అలనాటి త్రిమూర్త్యాత్మక
శ్రీదత్తాత్రేయస్వామి వారే ఈనాటి శ్రీవేంకటేశ్వరస్వామి వారు కూడా....
అంటూ శ్రీ తాళ్ళపాక అన్నమాచార్యుల వారు, వారు కృతిపరిచిన ఒక చక్కని సంకీర్తనలో మనకు తెలిపి
అనుగ్రహించినారు కద.....😊
http://annamacharya-lyrics.blogspot.com/2007/09/306tane-tane-yimdari-gurudu.html?m=1
ప|| తానె తానే యిందరి గురుడు | సానబట్టిన భోగి జ్ఞాన యోగి ||
చ|| అపరిమితములైన యజ్ఞాల వడిజేయ | బ్రపన్నులకు బుద్ధి వచరించి|
తపముగా ఫలత్యాగము సేయించు | కపురుల గరిమల కర్మయోగి ||
చ|| అన్నిచేతలను బ్రహ్మార్పణవిధి జేయ | మన్నించు బుద్ధులను మరుగజెప్పి ||
ఉన్నతపదమున కొనరగ గరుణించు | పన్నగశయనుడే బ్రహ్మయోగి ||
చ|| తనరగ గపిలుడై దత్తాత్రేయుడై | ఘనమైన మహిమ శ్రీ వేంకటరాయడై |
వినరగ సంసార యోగము గృపసేయు | అనిమిషగతుల నభ్యాసయోగి ||
Saturday, December 26, 2020
శ్రీ శార్వరి ధనుర్మాసాంతర్గత వైకుంఠ ఏకాదశి / ముక్కోటి ఏకాదశి 2020 పర్వదిన శుభాభినందనలు....😊🍕💐🍨🍟
శ్రీ శార్వరి ధనుర్మాసాంతర్గత వైకుంఠ ఏకాదశి / శ్రీ శార్వరి ధనుర్మాసాంతర్గత వైకుంఠ ఏకాదశి / ముక్కోటి ఏకాదశి పర్వదిన శుభాభినందనలు....😊🍕💐🍨🍟
తెలుగు సంప్రదాయం లోని అన్ని పండుగలు చాంద్రమానాన్ని ఆధారంగా చేసుకొని జరుపబడే ఉత్సవములు....
అశ్విన్యాది 27 నక్షత్రములు మరియు ప్రతీ నక్షత్రానికి గల 4 పాదాలు వెరసి 27×4=108 నక్షత్రపాదముల్లోనే ఈ భూప్రపంచంపై ప్రభవించే సర్వజీవకోటి యొక్క గమనాన్ని మన పెద్దలు స్థిరీకరించారు.....
9 పాదాల చొప్పున యావద్ కాలాన్ని ఆ కాలగమనాన్ని శాసించే సూర్యచంద్రుల భ్రమనాన్ని మన సనాతన మహర్షులు మేషాది వివిధ పేర్లతో సూచించబడే 12 రాశులలోకి క్రోడీకరించారు....
శ్రీ చాగంటి సద్గురువులు ప్రవచనాల్లో పలుమారు వివరించినట్లుగా ఈ 108 నక్షత్రపాదాల్లోనే / 12 రాశుల్లోనే ఏ జీవైనా సరే ఈ భూమిపై జన్మించి జీవించి తన జీవయాత్ర ముగించి మరో జీవయాత్రకు పయనమయ్యేది....
108 సంఖ్యకు మన సంప్రదాయంలో గల ప్రాధాన్యత కూడా ఇందుకే...
అష్టోత్తరశతనామాలు....
108 పూసల జపమాలలు....
108 ప్రదక్షిణలు.....
108 దివ్యదేశాలు....
108 శక్తిపీఠాలు ( 18 ప్రముఖమైనవి మనం ఆరాధించే అష్టాదశ శక్తిపీఠాలు...)
దక్షారామ భీమమండలం లోని 108 శివాలయాలు...
ఇలా 108 గల ప్రాముఖ్యత మనకు బహుధా ప్రకటితము కద....
ఈ 27 నక్షత్రాల్లో చంద్రుడి గమనం, 12 రాశుల్లో సూర్యుడి గమనం విచారించి కాలాన్ని, కాలాంతర్భాగమైన వివిధ పండగలు, ఉత్సవాలు, ఇత్యాదివి అనాదిగా మన సనాతన మహర్షులు మనకు అందించినారు....
అన్నీ పండగలు చంద్రుడి గమనాన్ని ఆధారంగా చేస్కొని ఉండే చాంద్రమానాన్ని అనుసరించి ఉంటే,
కొన్ని ప్రత్యేకమైన పర్వదినాలు కేవలం సూర్యుడి గమనాన్ని ఆధారంగా చేస్కొని ఉండేవి....
రథసప్తమి, వైకుంఠ ఏకాదశి, మకర సంక్రాంతి, ఇవన్నీ కూడా సౌరసంబంధ పర్వములు....
మేషాది 12 రాశుల్లోని సూర్యుడి గమనం ధనూ రాశిలో ఉన్నప్పుడు వచ్చే శుద్ధ ఏకాదశినే ముక్కోటి ఏకాదశి / వైకుంఠ ఏకాదశి పర్వదినంగా మన పెద్దలు మనకు అందించి తరించమని దీవించినారు....
సూర్యుడు ధనస్సులో సంచరించే ఈ కాలాన్నే ధనుర్మాసంగా నిర్వచించి విశేషమైన శ్రీమహావిష్ణ్వారాధనకు శ్రీహరి అనుగ్రహపాత్రతకు మన పెద్దలు మనకు అందించినారు....
శ్రీవిళ్ళిపుత్తూర్లో తులసీ వనంలో భూదేవి అంశలో ప్రభవించి పెరియాళ్వారుల పుత్రికగా వినుతికెక్కిన ఆండాళ్ తల్లి తను రచించిన దైవిక పాశురాలను తిరుప్పావై / శ్రీవ్రతం పేరిట ధనుర్మాస ఉత్సవంగా మనకు అందించి, తన సర్వస్వం ఆ శ్రీరంగనాథుడే అని భావించి సేవించి తుదకు ఆ రంగడిలోకే ఐక్యమైన రోజుని శ్రీగోదాకళ్యాణంగా ధనుర్మాస ఆఖరిరోజున మనం జరుపుకోవడం ఎల్లరికీ ఎరుకలో ఉన్న విషయమే....
జీవుడు దేవుడిలోకి ఐక్యమవ్వడమే జీవాత్మ పరమాత్మల సమ్యోగమైన కైవల్యసిద్ధి.....
అలా ఐక్యమవ్వడం సంపూర్ణచేతనతో తాత్కాలికం అయినప్పుడు అది ధ్యాన స్థితిలో లభించే పరమాత్మసమ్యోగ సిద్ధి అని నిర్వచించారు మన పెద్దలు...
అలా ఐక్యమవ్వడం ఈశ్వరశాసనంగా/అనుగ్రహంగా శాశ్వతమైనప్పుడు అదే అద్వైత సంప్రదాయ ప్రతిపాదిత సర్వోత్కృష్ఠ ఈశ్వరానుహ్రమైన కైవల్యసిద్ధి అనబడుతుంది....
సరే ఇంతకీ ఈ కైవల్యసిద్ధికి, చాంద్రమాన, సౌరమాన, 27 నక్షత్రాలకు, 12 రాశులకు, ముక్కోటి/వైకుంఠ
ఏకాదశికి, ఏంటి సంబంధం అనేది ఇప్పుడు డిస్కస్ చేద్దాం..
మన సంప్రదాయం ప్రకారంగా ప్రత్యక్షపరమాత్మ గా ఆరాధింపబడే సూర్యుడు ఆత్మశక్తి కారకుడు.....సకల ఆరోగ్య ప్రదాత...సకల అనారోగ్య నాశకుడు...
సూర్య శక్తిని ఆధారంగా చేసుకొని భూమి చుట్టూ పరిభ్రమిస్తూ జీవులకు మనోశక్తిని ప్రసాదించడం చంద్రుడి పని.....
అందుకే కద
" చంద్రమామనసోజాతః " అని శృతివాక్యం....
ఆ మనసు అని పిలువబడే అగోచర శక్తి నిజానికి మన చేతనలో ఉద్భవించే అసంఖ్యాక సంకల్పవికల్పాల సమూహం...
ఆ సంకల్ప శక్తే మన మనోశక్తి....
ఆ సంకల్ప బలమే మన మనోబలం....
అందుకే కద సాధారణంగ మనం వినే డైలాగ్స్ లో,
" నా మనసు మనసులో లేదండి....నన్ను ఒంటరిగా కాసేపు ప్రశాంతగా ఉండనివ్వండి....."
" నా మనసుకు తెలుసండి....ఎవరు మంచివారో...ఎవరు ముంచే వారో....ఎవరో అయినవారో...ఎవరు కానివారో..."
" సంతలో కొన్న తియ్యని నాటు దోర జాంకాయలు కొన్నప్పటినుండి నా మనసంతా వాటిపైనే ఉంది....ఎప్పుడు తింటానో అని...."
" నా శారీరక బలం అంతగా గొప్పదేంకాదని నన్ను తక్కువ అంచనావేసి అవమానించారు.....చూసారా నా మనోబలంతో అన్ని మెట్లు ఎట్ల ఎక్కోచ్చానో ఈశ్వరానుగ్రహంగా...."
" గురోక్త సంకల్పశక్తికి నా సాటిలేని మనోశక్తిని జతపరిచానంటే ఈ విశ్వంలో నా ఎదురుగా నిలిచి గెలిచే మొనగాడే లేడు..."
" కొండలను సైతం పిండిచేసే మనోశక్తి హనుమంతులవారి అనుగ్రహంగా లభిస్తుంది...."
ఇవ్విధంగా అన్ని రకాల సినిమా డైలాగ్స్ లో చెప్పబడే మనసుయొక్క శక్తి నిజానికి మన చేతన యొక్క సంకల్పశక్తి....అది ఎంత దృఢమైనదో కొలిచేందుకు ఎవ్వరికీ సాధ్యపడని అంశం....
శ్రీ ఆదిశంకరాచార్యుల నుండి ఈనాటి ఆధునిక తత్త్వవేత్తలవరకు ఎందరెందరో మహానుభావుల తత్త్వపరిశోధన మొత్తం మనిషి మనసు గురించే, ఆ మనోశక్తిజనిత అసంఖ్యాక సంభ్రమాశ్చర్యకర కార్యక్రమాల గురించే....
ఇక లౌకిక ప్రాపంచిక పోకడల గూర్చి ఉండే లక్షలాది సినిమా పాటాల్లో సిమ్హభాగం మొత్తం మనసు మీద రచించినవే.....
"మనసంతానువ్వే...."
దెగ్గరినుండి
" పడి పడి లేచే నా మనసు...."
వరకు ఏ సినిమాలోని యుగళగీతాలను విన్నా అన్నీ మనిషి మనసు యొక్క ప్రత్యేకతను తెలుపుతూ రచింపబడి పాడబడినవే....
( ఆ " నువ్వే " ఈశ్వరుడైనప్పుడు ,
ఆ పడి పడి లేచే మనసు పడే తపన ఈశ్వరానుగ్రహం గూర్చి అయినప్పుడు ఆ మనసు విముక్తి పొందే దిశగా జీవుడి ప్రయాణాన్ని ఉన్నతంగా తీర్చిదిద్దుతోందని అర్ధం.....
అట్లు కాక ఈశ్వరుడిని విస్మరించి ఇతరత్రా గూర్చి మాత్రమే పరిభ్రమించడంలోనే ఉండి పోతే ఉన్న బంధనాలకు తోడుగా మరిన్ని బంధనాలను పెనవేసుకుంటూ విముక్తికి దూరంగా జీవుడి ప్రయాణాన్ని భ్రమింపజేస్తుందని అర్ధం....
"మహామాయావిశ్వంభ్రమయసిపరబ్రహ్మమహిషి..."
అనే వాక్యాన్ని ఉటంకించే శ్రీ చాగంటి సద్గురువుల ఆదిపరాశక్తి వైభవం గురించిన ప్రవచనాల్లో
" తిరోధానకరీశ్వరి...సదాశివానుగ్రహదా...." గా తనను ప్రార్ధించినవారికి ఆ మాయ అనే తెరను ఎవ్విధంగా తోలగించి జీవుడికి తన స్వస్వరూపానుసంధాన సిద్ధిని అనుగ్రహిస్తుందో సద్గురువులు తెలిపియున్నారు....
అత్యంత శక్తివంతమైన జ్యోతిష శాస్త్ర విజ్ఞ్యాన విషయాలను గూర్చి కాసేపు పక్కనపెడితే,
సూర్యుడు ధనూరాశిలో ఉన్నప్పుడే వైకుంఠ / ముక్కోటి ఏకాదశి పర్వదినం జరుపుకోవడంలో గల విశేషం పరికిద్దాం.....
ధనస్సు యొక్క గొప్పదనం గూర్చి మన శాస్త్రపురాణ వాజ్మయంలో ఎన్నో చోట్ల ఎంతో గొప్పగా అభివర్నించారు......
తన ధనస్సు శారంగం కోసం ఏకంగా ఒక అవతారమే ఎత్తి " కోదండ రాముడి " గా తన ధనస్సుకు చిరకీర్తిని ప్రసాదించాడు ఆ శ్రీమహావిష్ణువు...
" అయ్యా నీకో దండం.....నీ చేతిలో ఉన్న పినాకం అనే నీ ధనస్సుకోదండం....." అంటూ పలుమారు
ఈశ్వరుడుకి నమస్కరిస్తూ
" నమొస్తుధన్వనేబాహుభ్యాం...." అంటూ మొదలయ్యే శ్రీరుద్రం ఆ పరమేశ్వరుడి ధనస్సు యొక్క వైభవం మనకు తెలియచెప్తూనే ఉంది.....
శ్రీ చాగంటి సద్గురువులు వివరించిన ఈ "పినాకహస్తాయా సనాతనాయ...." వివరణ నాకు చాల ఆశ్చర్యకరమైన ధ్యానసిద్ధిదాయకమైనది.....
అర్జునుడి సాటిలేని గాండీవానికి శ్రీకృష్ణ పరమాత్మ వల్ల లభించిన ఖ్యాతి ఎట్టిదో మత్స్యయంత్రభేదనం మొదలుకొని పాశుపతాస్త్రప్రయోగం వరకు ఎన్నెన్నో సార్లు మహాభారతం మనకు తెలియజేస్తుంది....
గురుమూర్తిని ఎదుటనిలిపి
ద్రోణాచార్యులను తమ మానసిక గురువులుగా ఉపాసనగావిస్తూ ఏకంగా సవ్యసాచినే మించిన ధనుర్విద్యాకౌశలాన్ని గడించిన ఏకలవ్యుడి ధనుర్వేదోపాసన యొక్క గొప్పదనం,
కొత్తగా ధనుర్విద్యను అభ్యసిస్తూ అందులో ఎదురులేని వీరుడిగా ఎదగాలని తను ప్రాక్టీస్ చేస్కుంటుంటే అరిచి డిస్టర్బ్ చేసిందని ఒక అడవికుక్క నోట్లోకి ఏ ధనుర్ధారి సంధించలేనంతటి నైపుణ్యంతో ఆ కుక్క ఇంకెప్పుడు తనపైకి పొగరుతో నోరు తెరిచి అరవకుండా, ఆ తెరిచిన నోరు మూయలేనివిధంగా, బాణాలను సంధించి ఎక్కడికక్కడ ఆ కుక్కనోటిని కట్టిపడేసిన వైనంలో
ఆ బోయ యొక్క విలువిద్యాఘనత మనకు తేటతెల్లమౌతుంది.....
ఒకేసారి ఒకటికంటే ఎక్కువ బాణాలను
సంధించే " ద్వే...మణిబంధనం...." సీన్లో ప్రభాస్ సూపర్బ్ యాక్టింగ్ తో బాహుబలి సినిమా బద్దలుకొట్టిన రికార్డ్లు అందరికి తెలిసిందే.....
ఇవ్విధంగా ధనస్సు చాలా గొప్ప ఆయుధం.....
ఎంతో దూరంలో ఉన్న ఎంతటి శతృవునైనను మట్టికరిపించగల శక్తి ధనుర్వేదవిద్యది....
అది అమంత్రక శస్త్రంగా సంధించబడిన శరమైనాసరే.....
సమంత్రక అస్త్రంగా అభిమంత్రించబడి సంధించబడినా సరే....
ధనుర్వేదశక్తి అనన్యసామాన్యమైనది......
ఒక ధనస్సుకు గల లౌకిక, పారామార్ధిక శక్తి, ప్రత్యేకత,
ఎట్టిదో ధ్యానసిద్ధిగా ఒడిసిపట్టాలంటే, శ్రీభద్రాచల సీతారామచంద్రస్వామి వారి ఆలయంలో, స్వర్ణతులసీఅర్చన ఇత్యాది అంతరాలయ పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నప్పుడు స్వామివారు ధరించిన ధనుర్బాణాములపై ధ్యానం గావించండి.....
ఆత్మారాముడిగా ఆ అయోధ్యారాముడిని శాస్త్రములు కీర్తించడం, ఇనకులసంజాతుడై ఉత్తమ క్షత్రియుడిగా ఒక సాధారణ మనిషివలే భువిపై జన్మించి
కౌసల్యానందనుడిగా దశరథతనయుడిగా తన కీర్తిని ఆచంద్రతారాత్కం చతుర్దశభువనాలు శ్లాఘించేవిధంగా జీవించి తన జీవిత అయనం శ్రీమాద్రామాయణ ఇతిహాసమై, వేదోపబృహ్మణమై, పౌలస్త్యవధగా, సీతాయాశ్చరితమ్మహత్త్ గా శాశ్వతమై అప్పుడూ ఇప్పుడూ ఎలప్పుడూ
భక్తులను ఎంతో ఘనంగా ఉద్ధరించి అనుగ్రహించే
" శ్రీ వాల్మికీ కోకిల కూజిత శ్రీరామ తారక మంత్రమహిమార్ణవమై"
వెలుగొందే రామాయణ మహాకావ్యంలో ఆ కోడండరాముడి చేతిలో ఒదిగిన కోదండం యొక్క మహిమ ఎంత ఘనమైనదో ఇంతని అంతని వర్నించనలవి కానిది.....
సూర్యవంశతేజమై అవతారం దాల్చిన ఆ శ్రీరాముడు సకల జీవుల ఎదలోనే కొలువైఉండే ఆత్మారాముడు.....
శ్రీరాముడిని పరమాత్మ గా ఆరాధించే మన భక్తే ఆ ఆత్మారాముడిచే ధరింపబడిన కోదండం అనే ధనస్సు....
అసంఖ్యాక సంకల్పవికల్పాల సమూహమైన మన మనసనే ఆ అక్షయబాణతూణీరంలోని శరసమూహం, శ్రీరాముడి కోదండానికి సంధింపబడేలా చిత్తము పాత్రతను సమకూర్చుకున్నప్పుడు,
శ్రీరాముడి కరకమలముల
అమృత స్పర్శతో సంధించబడే మన మనసు దైవికాస్త్రంగా మారి, హనుమంతులవారి అనుగ్రహంగా సరాసరి రావణుడనే ప్రాపంచిక మాయలో కుంభకమైఉండే అజ్ఞ్యాన లంపటాన్ని భేదించి జీవుడు ముక్తిని బడయుట అనే విశిష్ట తత్త్వసామ్యమే
అద్వైత సంప్రదాయ ప్రతిపాదిత కైవల్య సిద్ధి....!
ఆ శ్రీకరమైన శాశ్వతదైవానుగ్రహసముపార్జనకు
జీవుడిని సంసిద్ధం గావించేలా భక్తిసంస్కారమును అలది వచ్చే మకర సంక్రమణంతో మొదలయ్యే ఉత్తరాయణ పుణ్యకాల విశేషబలంచేత సకల దైవిక శక్తిసంఘాతమై జీవుడికి ఎనలేని ఆత్మశక్తి సమకూరేలా ఈ వైకుంఠ ఏకాదశి పర్వదివసాన్ని మన పెద్దలు ఏర్పాటుచేసారు.....
అవ్విధంగా ఒక జీవితపర్యాయంలో వచ్చే 100 వైకుంఠ ఏకాదశుల్లో
( 'శతమితిశతందీర్ఘమాయుహు' అనే సాధారణ శృతి వాక్యానుగుణంగా )
ఎదో ఒక ఏకాదశి మనకు నిజంగా మోక్షద ఏకాదశిగా ప్రభవించి ఈశ్వరుడి ద్వాదశి పారణగా మన ఆత్మ ఆ పరమాత్మలోకి లయించి జీవుడుకి శాశ్వత ప్రశాంతత లభించడమనే గంభీరమైన తత్త్వసారాన్ని ప్రతిపాదించే ఈ వైకుంఠ ఏకాదశి పర్వం భక్తులెల్లరికి
ఆ శ్రీమదలర్మేల్మంగాపద్మావతీసమేతశ్రీవేంకటేశ్వరుడి అనుగ్రహాన్ని మరింత మెండుగా లభించేలా చేసి ఎల్లరూ సుఖశాంతులతో ఆయురారోగ్యైశ్వర్యాలతో జీవించాలని ఆకాంక్షిస్తూ అందరికి
వైకుంఠ ఏకాదశి / తిరుమల శ్రీస్వామిపుష్కరిణీ తీర్థముక్కోటి / వైకుంఠ ద్వాదశి పర్వదిన శుభాభినందనలు....☺🍨💐🍕
దక్షిణాన ఉండే యమపురికి కాకుండా, జీవుడి గమ్యం ఉత్తరాన ఉండే వివిధ ఊర్ధ్వలోకాలవైపుగా సాగి తుదకు 108వ దైన ఆఖరి దివ్యదేశమైన పరమపదం చేరుకోవడంతో మన జీవ తీర్థయాత్ర సంపూర్ణమైయ్యేలా విశేష దైవానుగ్రహ సంపాకకారకమైన శ్రీ వైకుంఠ ఏకాదశి / ద్వాదశి ఉత్తరద్వార దర్శనం భక్తుల్లెలరికి సంవత్సరంలో
ఒక్కసారి మాత్రమే సంప్రాప్తించే అరుదైన అనుగ్రహం....
తిరుమల ఉత్తరద్వార దర్శనంలో స్వామివారి గర్భాలయ ప్రాకారానికి మరింత దెగ్గరగా సాగి ప్రదక్షిణనమస్కారం చేస్కునే భాగ్యం పొందిన భక్తులెల్లరు తమ తమ జీవితాల్లోని తిరుమలయాత్రను
ఒక చిరకాల అమూల్యమైన మధురస్మృతిగా మలిచి ప్రతీ వైకుంఠ ఏకాదశి / ద్వాదశికి నెమరువేసుకోవడం శ్రీశ్రీనివాసుడి భక్తుల్లెల్లరికి సంప్రాప్తించే ఒకానొక దైవికానుభవ పెన్నిధి...
కళ్ళు మిరుమిట్లు గొలిపేలా ఉండే వివిధ మనోహర పుష్పసముదాయంతో అలకరించబడి ఉండే ఆ శ్రీవైకుంఠద్వారంలోకి మానసికంగా ప్రవేశించి ఆ పురాతన ఆలయవైభవాన్ని, ఆ పూలమొక్కలను, రంగురంగుల లైట్లను, ఆ పరిమళాలను, ఆస్వాదిస్తూ స్వామివారి హుండీ దెగ్గర బయటికి వచ్చాక పైన ఉండే ప్రాగీశాన్యాభిముఖ శ్రీమహాలక్ష్మీ అమ్మవారికి నమస్కరించి ఆ సిరులతల్లి అమేయ కరుణాకటాక్షవీక్షణాలను ప్రసాదంగా గైకొని ఎల్లరూ తరించి ఆనందించెదరుగాక......
శ్రీతాళ్ళపాక అన్నమాచార్యుల వారి
అత్యత్భుతమైన ఈ క్రింది సంకీర్తనలో తిరుమలను దర్శించడం భక్తులకు మరింతగా ముదావహం....😊💐🍨🍕🍟
Ragam : Brindavani, composer : G.Balakrishnaprasad
Audio link :PriyaSisters
Archive link :
ప|| కంటి నఖిలాండ (తతి) కర్తనధికుని గంటి | కంటి నఘములు వీడుకొంటి నిజమూర్తి గంటి ||
చ|| మహనీయ ఘన ఫణామణుల శైలము గంటి | బహు విభవముల మంటపములు గంటి |
సహజ నవరత్న కాంచన వేదికలు గంటి | రహి వహించిన గోపురములవె కంటి ||
చ|| పావనంబైన పాపవినాశము గంటి | కైవశంబగు గగన గంగ గంటి |
దైవికపు పుణ్యతీర్థములెల్ల బొడగంటి | కోవిదులు గొనియాడు కోనేరి గంటి ||
చ|| పరమ యోగీంద్రులకు భావగోచరమైన | సరిలేని పాదాంబుజముల గంటి |
తిరమైన గిరిచూపు దివ్యహస్తము గంటి | తిరు వేంకటాచలాధిపు జూడగంటి |
http://annamacharya-lyrics.blogspot.com/2007/03/167kamti-nakilamda.html?m=1
