Friday, July 30, 2021

శ్రీ ప్లవ నామ సంవత్సర భరణి నక్షత్ర ప్రయుక్త ఆషాఢ బహుళ అష్టమ్యోపరినవమి భానువాసర ఆషాఢ బోనాల జాతర శుభాభినందనలు.....🍕💐😊🍨( మా కూకట్పల్లి ఏరియాలో ఆగస్ట్-01-2021 కి బోనాలు )

శ్రీ ప్లవ నామ సంవత్సర భరణి నక్షత్ర ప్రయుక్త ఆషాఢ బహుళ అష్టమ్యోపరినవమి భానువాసర ఆషాఢ బోనాల జాతర శుభాభినందనలు.....🍕💐😊🍨

( మా కూకట్పల్లి ఏరియాలో ఆగస్ట్-01-2021 కి బోనాలు )

శ్రీ ఆషాఢ జాతర గా అన్ని చోట్లా జరుపబడుతూ,
బోనాల ఉత్సవం గా యావద్ రాష్ట్రంలో వినుతికెక్కి అమ్మవారి ఆషాఢ నివేదనోత్సవం
అంగరంగవైభవంగా నిర్వహింపబడుతూ
మొదటి బోనం గోల్కొండ/గొల్లకొండ జగదాంబిక అమ్మవారికి...,
రెండో బోనం సికింద్రాబాద్ ఉజ్జైని మహంకాళికి అమ్మవారికి...,
మూడో బోనం ఓల్డ్ సిటి లాల్దర్వాజ సిమ్హవాహిని మహంకాళి అమ్మవారికి....
ఆ తరువాత ఇతర అన్ని అమ్మవారి ఆలయాల్లో సమర్పింపబడడం అనే నైసర్గికాచారవైభవంతో హైదరాబాద్ / భాగ్యనగరం ఎన్నో వందల సంవత్సరాలుగా పరిఢవిల్లే అధ్యాత్మ నగరంగా జదగ్విఖ్యాతమైన కీర్తిని గడించడం ఎల్లరికీ తెలిసిందే....

ఒక్కో నగరానికి ఒక్కో నగర అధిదేవత, ప్రత్యధిదేవత, ఉపాలయ దేవతలు, ఉండి ఒక్కో విధమైన వైభవంతో వర్ధిల్లడం అనేది అనాదిగా ఉన్న సంప్రదాయం...

గ్రామాలకు గ్రామ దేవతల లాగ, నగరాలకు నగరాధిదేవతలు ఉండి వారి అనుగ్రహంతోనే ఆ నగర ప్రజలు  సుఖశాంతులతో జీవించడం అనేది ఎప్పటినుండొ మన దేవభూమి పై ఎల్లరూ గమనించే సత్యం...

శ్రీచాగంటి సద్గురువుల శ్రీమద్రామాయణ ప్రవచనాల్లో ఉటంకించబడినట్టుగా,

ఆనాటి రాజులకు / పాలకులకు గల ఉపాసనాబలం, శౌచసిద్ధి, వల్ల ఆయా నగరదేవతలు వారితో సంభాషించడం గురించి మన పురాణాల్లో తెలపడినట్టుగా ఇప్పటికీ ఆ సంప్రదాయం అట్లే ఉంటుందనడం అతిశయోక్తి కానేరదు....

ఆనాడు భరతుడు కోసల మహాసామ్రాజ్యానికి రాజధానిగా ఎప్పటినుండో ఉన్న అయోధ్యా నగరాన్ని కాదని వేరే నగరానికి పరిపాలనను మార్చినప్పుడు, అయోధ్యా నగర అధిష్ఠాన దేవత తనతో నేరుగా మాట్లాడి, తరతరాలుగా వస్తున్న సంప్రదాయాన్ని మార్చకూడదు...అని వారించి అయోధ్యకే రాజధాని మరలా మార్చబడడం....

ఒక వైపు ఎంతో అస్తవ్యస్తమైన స్లం ఏరియాలతో, మరో వైపు ఆకాశహర్మ్యాలతో అలరారే బాంబే / ముంబై నగరాధిదేవత శ్రీముంబామాతా అనుగ్రహం వల్లే ఇప్పటికీ ముంబైలో రోజుకు అంతమందికి అన్నం లభించి, దేశ ఆర్ధిక రాజధానిగా ముంబై వినుతికెక్కడం ...

గురించి శ్రీచాగంటి సద్గురువులు మనకు తెలిపిఉన్నారు...

అట్లే హైదర్ అలి నిజాం రాజు యొక్క హయాంలో తనపేరు మీద, మరియు తన ప్రేయసి భాగమతి పేరుమీద
హైదరాబాద్ / భాగ్యనరం
అనే సువిశాల నగరంగా విస్తరింపబడిన నాటి నుండి ఈనాటి వరకు కూడా, ఈ నగరంలోని దైవత్వ వైభవం ఎంతో విశేషమైనది...

సాక్షాత్ శ్రీ ఆదిశేషుడు / శ్రీ మహావిష్ణువులే ఈ కలియుగంలో ఆనాటి శ్రీరామలక్ష్మణ యోద్ధులుగా
నడయాడి తానీషా రాజు యొక్క అంతహ్పురానికి వచ్చి త్రేతాయుగం నాటి రామమాడలతో పైకాన్ని కట్టి శ్రీరామదాసు గారిని చెర నుండి విడిపించిన ఘటన ఎల్లరికీ విదితమే కద...

భాగ్యలక్ష్మి అమ్మవారిగా చార్మినార్
వద్దే ఇప్పటికీ ఈ భాగ్యనగర అధిదేవత కొలువై ఉందనే సంగతి ఎంత మందికి తెలుసు..?
నగరం నలువైపులా విస్తరింపబడి
మహానగరంగా రూపుదిద్దుకోవడంతో
ఆయా గ్రామాల్లో / పురాల్లో గ్రామదేవతలుగా వెలసి అనాదిగా కొలవబడుతున్న దేవతలందరూ కూడా
ఈ మహానగరాన్ని సమిష్టిగా అనుగ్రహిస్తూ, కాపాడుతూ, ఉండడంతో ఒక్కో ప్రముఖ ఆలయంలో కొలువైన నగరపాలక శక్తికి ఒక్కో వారం ఆషాఢ జాతరగా బోనాల ఉత్సవంగా ఈ ఉత్తరాయణ / దక్షిణాయణ సంధి సమయమైన ఆషాఢమాసంలో విశేష ఆరాధనను నిర్వహించి ప్రీతిని కలిగించి అనుగ్రహాన్ని బడసి తరించడంలో ఎన్నో ఎన్నెన్నో నిగూఢ విశేషాలు ఉండడమనేది వాటియొక్క ప్రాభవాన్ని తెలపకనే తెలుపుతూ మనకు అధ్యాత్మ పరిపుష్టితో జీవించే అనుగ్రహాన్ని ప్రసాదిస్తున్నాయి.....

శ్రీ చాగంటి సద్గురువులు బోధించినట్టుగా,
మనం ఎవరు, ఏం చదువుకున్నాం, ఎంత సంపన్నులం, ఎంత ఉన్నతాధికారులం,
అనే దానితో నిమిత్తం లేకుండా
విధి అనే వింత ఎవరిని ఎప్పుడు ఏవిధంగా " ఆపద " రూపంలో బాధిస్తుందనేది ఆ దైవానికి తప్ప ఎవ్వరికీ తెలియనిది...

మన బుద్ధికి అందని రీతిలో ఎదురయ్యే
కష్టమే ఆపద ...

పక్కింటి వారు పరాకుగా ఉండి ఒక చెట్టు కొమ్మలను కొట్టేయడంలో అక్కడే  ఆడుకుంటున్న తన పిల్లలపై ఆ కొమ్మ విరిగి పడి గాయాన్ని కలిగించబోతోందని గ్రహించిన మరుక్షణం ఆ తండ్రి తన ప్రాణాలను కూడా అడ్డు పెట్టి తనపై ఆ చెట్టు కొమ్మ పడేలా అడ్డుపడి తన పిల్లలను సమ్రక్షించుకుంటాడు....

ఇది లౌకికమైన ఇతరుల పరాకుతో / తప్పిదంతో కంటికి కనిపించేలా కలిగిన ఆపద కాబట్టి ఆ తండ్రి తనపైకి ఆ ఆపదను ఆపాదించుకొని
తన సంతానన్ని కాపాడుకోగలిగేలా వ్యవహరించాడు....

మరి అలౌకికమైన, కొన్ని లైట్ ఇయర్ల దూరంలో ఉండి రాబోవు సమయంలో దురితంగా ఎదురయ్యే ఆపదను జ్యోతిష శాస్త్ర వైదుష్యంతో ముందుగానే గ్రహించి ఆ ఆపద తనకు సంభవించి తన సంతానం సురక్షితంగా ఉండగలిగేంతటి యోగ్యతతో సదరు తండ్రి ఉండగలగాలి అంటే అది దైవానుగ్రహం వినా ఎలా సాధ్యం..??

అందుకే మన సనాతన పెద్దలు, ఋషులు కాల ద్రష్టలై ఈశ్వరానుగ్రహం కోసం అహర్నిశలు ఉపాసన / సాధన గావించిన మహర్షులై జీవించి ఎన్నో శాస్త్రాలను వారు దర్శించి మనకు అందించి జీవించి తరించారు....

పంచాగ వ్యవస్థానుగుణంగా శూన్య మాసంగా పరిగణింపబడే ఆషాఢ మాసం తో ప్రారంభమయ్యే దక్షిణాయణ కాలం విశేషమైన ఉపాసనా కాలం...మరియు చీడ పీడలు కూడా ఒకింత అధికంగా ఉండే సమయం...

కాబట్టి ఈ మాసంలో దేవతారాధన
అనేది ఎన్నో రకాలుగా చాలా ఆవశ్యకమైన అంశం..

బాగా ఖర్చుతో, వ్యయప్రయాసలతో కాకుండా,
ఎల్లరికీ అందుబాటులో ఉండే పసుపు, కుంకుమ, వేపాకు, నీళ్ళు, పువ్వులు, బెల్లమన్నం / పసుపన్నం / పులిహోర (హరిద్రాన్నం), నువ్వుల నూనే / వేప నూనే / నెయ్యి దీపం తో ప్రీతి చెంది విశేషంగా భక్తులను అనుగ్రహించే స్వరూపంగా అమ్మవారిగా / ఆదిపరాశక్తిగా ఈశ్వరారాధనను ఈ ఆషాఢ మాసంలో విశేష గ్రామ దేవత జాతరగా ఏర్పాటుగావించి,  గ్రామ / పుర ప్రజలెల్లరూ ఆయురారోగ్యైశ్వర్యాలతో వర్ధిల్లే విధంగా ఉండేలా సంప్రదాయన్ని మన పెద్దలు మనకు అనుగ్రహించినారు....

అమ్మవారు ఎంతటి కారుణ్యమూర్తో, కాస్త పసుపుకుంకుమతో గావించిన పూజలతో ఎంతో ప్రీతిచెంది అనుగ్రహించే వైచిత్రి శ్రీచాగంటి సద్గురువులు మనకు తెలిపిఉన్నారు...

అలంకారప్రియః విష్ణుః
అభిషేకప్రియః శివః
హరిద్రాప్రియః శక్తిః
నమస్కారప్రియః సూర్యః

అని అనాదిగా మన పెద్దలు,గురువులు మనకు నేర్పించి మనం తరించేలా మన జీవితాల్లో వివిధ సంప్రదాయార్చారాధనలను / నైసర్గికాచారకట్టుబాట్లను నెలకొల్పి ఉన్నారు...

క్రిమిసమ్హారక / రోగనాశక / యాంటిసెప్టిక్ ఎలిమెంట్ గా ఉండే అమ్మవారికి అత్యంత ఇష్టమైన పసుపును, వేపాకులను ఎక్కువగా ఈ బోనాల జాతరలో వాడడం గమనించే ఉంటారు....

దక్షిణాయణం మొదలవ్వడంతో సూర్యుడికి దూరంగా జరుగుతూ భూమి దీర్ఘ వృత్తాకార కక్ష్య ( ఎలిప్టికల్ ఆర్బిట్ ) లో తన భ్రమణం సాగించడం తో అటు అధ్యాత్మ పరంగా జీవులకు అత్మశక్తి ఇటు లౌకికంగా రోగనిరోధక శక్తి సన్నగిల్లడంతో,
ప్రాణులకు ఆంతర బాహిర శ్రేయస్సును ఒనరించడంలో పసుపుది, వేపాకులది కీలకపాత్ర...

అటువంటి పసుపును, వేపాకును తన పూజా ద్రవ్యంగా భక్తులు ఉపయోగించేలా చేసి,
(పసుపు రాయనిదే, వేపాకు కట్టనిదే అమ్మవారికి బోనం ముట్టదు...)
ఎల్లరికీ అధ్యాత్మ / లౌకిక ఆరోగ్యాన్ని ప్రసాదించే ఈ బోనాల పండుగలో ఇంకా ఎన్నో ఎన్నెన్నో అధ్యాత్మ ఆంతర్యములు కలవు....

ఇప్పుడంటే స్టైల్ గా ఉంటాయని, గ్యాస్ పొయ్యిపై వంటకు వాడడానికి, బాసాన్లు తోమడానికి ఈజిగా ఉంటాయని వివిధ లోహ పాత్రల్లో బోనాలు సమర్పిస్తున్నారు కాని,
మన పూర్వులు అందరికి అందుబాటులో ఉండే మట్టి కుండల్లో, పాత్రల్లో, బోనాలను సమర్పించేవారు....

నా రుద్రో రుద్రమర్చయేత్.....
నా దేవో దేవమర్చయేత్.....
అన్నరీతిగా...

అమ్మవారికి ప్రీతిగ బోనం ఎత్తే మహిళామణి, తను శుచిస్మితయై, చక్కని అలంకారవైభవంతో అమ్మవారిగా మారి అమ్మవారికి బోనం సమర్పించడంలో...

ఎత్తబడిన బోనానికి...ఎత్తుకున్న వ్యక్తికి /జీవుడికి, సమర్పింపబడే దైవానికి అభేద భావనతో సాగే బోనం సమర్పణలో...

ద్వైత --> అద్వైత --> విశిష్టాద్వైతంగా
వ్యవహరింపబడే త్రిమతసంప్రదాయములు క్రమముగా ఆదేశమగుచు తుదకు అర్చింపబడే అమ్మవారు ఆవేశించడం తో సంభవించే పూనకం అనబడే జీవజీవేశ్వర అభేద స్థితిలో జీవుడు దేవుడై నిలిచి శ్రీఆదిశంకరాచార్యులచే ప్రబోధింపబడిన అద్వైతతత్త్వంలో తన స్వస్వరూపానుసంధాన స్థితిని గ్రహించి...

ఆ విశిష్టమైన పరతత్త్వాన్ని విశేషంగా ఎల్లప్పుడూ అరాధిస్తూ శ్రీభగవద్రామానుజాచార్యులచే ప్రబోధింపబడిన విశిష్టాద్వైతసంప్రయాదాన్ని నిత్యం ఆరాధిస్తూ ఎల్లప్పుడూ దైవానుగ్రహాన్ని బడసి తరించేది...

బెల్లమన్నం, పసుపన్నం, నీరు, వేప కొమ్మలు, పసుపు, కుంకుమ, ఇత్యాది సాత్విక పదార్థాలతో తయారుచేయబడిన నివేదన / భోజనం / బోనం అనే వ్యవస్థలో..

పెద్దమట్టికుండను ఆధారంగా గావించి ఉండే చిన్నమట్టికుండ పై ప్లేట్లోని దీపం తో కలుపుకొని...

పరమాత్మ యొక్క వైశ్విక అష్టమూర్తితత్త్వం మొత్తం ఈ బోనాల సమర్పణలో దాగుంది...

చక్కని మట్టికుండలతో తయారుకావింపబడిన బోనాన్ని నెత్తిపైకి ఎత్తిన తదుపరి గమనిస్తే
పెద్దకుండపైన ఉండే చిన్న కుండ పైన వెలిగే దీపం
8 అనే సంఖ్య యొక్క ఆకారం పై వెలిగే పరంజ్యోతిగా భాసిస్తుంది.....

1. ఆకాశం ( కుండలోని ఘటాకాశం )

2. గాలి ( వెలిగే దీపానికి ఆధారం గాలి)

3. అగ్ని ( వెలిగే దీపం అగ్ని)

4. నీరు ( ఉపయోగింపబడిన నీరు )

5. పృథ్వీ ( మట్టి కుండ / పాత్ర) 

6. సూర్యుడు (  సూర్య శక్తి / సూర్య కారక ఆత్మశక్తి అజరత్వానికి ప్రతీక... వేపకొమ్మల్లోని అమ్మవారి శక్తి అజరత్వానికి ప్రతీక...)

7. చంద్రుడు ( చంద్ర శక్తి / చంద్ర కారక మనో శక్తి  అమరత్వానికి ప్రతీక... పసుపుతో కలిసిన వేపనీరు ఒక సూక్ష్మ స్థాయిలో అమృత తత్త్వానికి ప్రతీక )

8. జీవుడు ( బోనాన్ని ఎత్తుకున్న వ్యక్తిలో ఉన్నది జీవుడు...ఎత్తబడిన బోనంలో గల నైవేద్యంలో ఉన్నది జీవశక్తి )

ఈ 8 తత్త్వముల సమ్మిళిత సమాహారంగా ఉండే అష్టవిధ ప్రకృతిలో అంతర్భాగమైన పరమాత్మ తత్త్వం మనకు బోనంలో ప్రస్ఫుటంగా దర్శనీయము....

శ్రీ చాగంటి సద్గురువులు చమత్కరించిన ఒక విషయం గుర్తుండిఉంటే...

ఇంట్లోని ఈశ్వర పూజానుగ్రహం 5 మార్కులకు బరాబర్...
ఆలయంలోని ఈశ్వర పూజానుగ్రహం 95 మార్కులకు బరాబర్...

కాబట్టి మొత్తం కలిపి 100 మార్కులు అవుతాయ్...

అదేవిధంగా

ఇంట్లోని ఈశ్వరి పూజామందిరంలో ఎత్తబడిన బోనం 5 మార్కులకు బరాబర్...
ఆలయంలోని ఈశ్వరి పూజగా సమర్పింపబడిన బోనం 95 మార్కులకు బరాబర్...

కాబట్టి మొత్తం కలిపి 100 మార్కులు అవుతాయ్...

ఇవ్విధంగా జీవితాన్ని నూటికి నూరుపాళ్ళు దైవానుగ్రహంతో పరిపుష్టంగావించే ఈ బోనాల ఉత్సవం అమ్మవారి అమేయానుగ్రహానికి బాటలు పరిచి మన జీవితాలు తరించేందుకు కారణమై వర్ధిల్లడంలో ఇంతటి ఆధ్యాత్మిక సందేశం కూడా దాగుందన్నమాట....

భక్తి ప్రపత్తులతో ఒక సువాసిని సమర్పించిన  3 సంవత్సరాల ఆషాఢ బోనాలను స్వీకరించిన ఆ శ్రీకరి నాలుగో బోనాల పండుగ వచ్చేసరికి....
నిత్యం కాదంబరిగా కళ్ళెదుటే భాసించే  కారుణ్యమూర్తియైన ఆ కదంబవనవాసిని...
ఆ సువాసిని ఇంట వారి పుణ్యాలపంటైన సిరుల చిన్నారి తల్లిగా, వారి కన్నకూతురుగా తరలి వచ్చి అనుగ్రహిస్తుంది....
శ్రీభువనేశ్వరిగా చతుర్దశభువనాలను తన క్రీగంటి చూపులతో శాసించే ఆ ఆదిపరాశక్తి....!

ఇంతటి ఉత్కృష్టమైన ఆషాఢ బోనాల జాతర భక్తులెల్లరిని ఘనంగా అనుగ్రహించి సమ్రక్షించుగాక.....

( బోనాల ఉత్సవ వైభవం గురించిన మరింత సమాచారాన్ని ఈ క్రింది నా పాత పస్టుల్లో రాసాను..
https://m.facebook.com/story.php?story_fbid=10222907250163120&id=1033694038 )

ప్రగతినగర్ గ్రామదేవత శ్రీపోచమ్మ తల్లి...

అస్బెస్టాస్ కాలని గ్రామదేవతలు
శ్రీఎల్లమ్మ తల్లి / శ్రీనల్లపోచమ్మ తల్లి....

కూకట్పల్లి గ్రామ దేవత శ్రీచిత్తారమ్మ తల్లి...

అమ్మవార్లకు నమస్కరిస్తూ

సర్వం శ్రీ బల్కంపేట రేణుకా హేమలాంబ ( ఎల్లమ్మతల్లి ) శ్రీచరణారవిందార్పణమస్తు.....
🙏🙏🙏🙏🙏


Tuesday, July 27, 2021

Remembering Shree Abdul Kalaam ji, the "Missile man of India"...💐🙏

Shree Adbul Kalaam Ji, HH "BharataRatna,"

[ Avul Pakir Jainulabdeen Abdul Kalam, an Indian aerospace scientist, and the 11th President of India from 2002 to 2007 ] departed this KarmaBhoomi 6 years ago by leaving an unparalleled legacy via leading a life that has set an example of exceptionally high patriotic fervor enriched with a tinge of spiritual affability in all of his executions all along his life...

He was a great believer and a follower of BhagawadGeeta and was a great Veena artist too apart from being the very well known "Missile Man of India" and one of the most admired faculty of Space Engineering discipline so much so that he breathed his last while teaching the subject to his students....

While its true that there are many such other stalwarts in the Space Engineering and polity that he had his stint in, only a few have had that zeal and zest to be a true Indian to live their life for the well being of their Nation and that of it's citizens though they had red carpet welcome from many countries to become their citizen and to strengthen their country's Technological Ammunition in the fields of Missile Engineering and Space Technology.

Of the many great innovative services offered to the Nation his immaculate intelligence in making the Pokhran Nuclear Tests highly successful by maintaining a strategic military grade operational acumen in securing it's executions from the hawk eyes of the other nation's satellites that kept a constant vigilant watch on all the Indian Space and Nuclear explorative executions to hinder their executions in every possible way citing some global issues etc....

When an X Nation can conduct umpteen Nuclear & Space exploratory executions on and underneath their land without providing any of it's details to others and can call it their right to do so, then why can't some other Y nation do the same to strengthen it's supremacy to make a bold statement that we too are second to none in our very own created native Technological and Scientific strength to advance our Nation's presence and preparedness to shield ourselves from any and every kind of Nuclear hostility and then, if required, to annihilate the opponents' inappropriate executions in order to protect and sustain the peace of it's citizens...?

Dr. Abdul Kalaam ji was significantly simple in following the above latter point to make India a supreme nation that is prudent enough to respect the technological advancements and the greatness of other nations by whole heartedly congratulating them and at the same time is intelligent enough to provide a befitting response should it be undermined and disrespected by anyone for whatsoever absurd reasons, by being equally, if not much more, stronger and sharper to take up appropriate retaliatory measures to secure it's supremacy and status quo in preaching
" Jeeyo aur Jeenay do... "...
agar doosro ka Shaanti ko chot pahunchaatayho tho
" sahi waqt mei sahi jawaab diyaajaayeya..." so that the opponents, if any, can learn being humble and sober enough to keep up the respect being given.

It was another equally strong patriotic good Samaritan, Shree P.V.NarasimhaaRao gaaru, the then hon'ble PM of India, who went hand in glove with Kalaam ji to make an indelible global impact by successfully establishing India's supremacy in the Nuclear Arena by making sure that all the in-house preparations and executions were perfectly shielded under the military cover to make sure that they aren't an eye sour for a few cunning crooks who don't withstand others' well being and success in their respective paths.

My Guruji, Shree ChaaganTi sathguru gaaru, has explained how great his executions and messages to the world are from the latter's work named
" The Wings of Fire".

It was indeed a great honor to have him seen and listen to his golden words directly on the dias of my college BVRIT's annual cultural fest during our engineering days to which he was invited as the chief guest for the event...

May his spirit reverberate across every Indian to make them much stronger from inside out so that India as a nation becomes much more stronger to strengthen it's global supremacy in every given field....

Om Shaantih..Om Shaantih..Om Shaantih...🙏💐...🙏💐


Saturday, July 24, 2021

శ్రీ ప్లవ నామ సంవత్సర ఆషాఢ పౌర్ణమి / వ్యాస పౌర్ణమి / గురుపౌర్ణమి పర్వదిన శుభాభినందనలు.....😊💐

శ్రీ ప్లవ నామ సంవత్సర ఆషాఢ పౌర్ణమి / వ్యాస పౌర్ణమి / గురుపౌర్ణమి పర్వదిన శుభాభినందనలు.....😊💐

మన చాంద్రమానం ప్రకారంగా సూర్యోదయానికి,
కలియుగ ప్రత్యక్ష శ్రీమహాలక్ష్మీ అమ్మవారైన
శ్రీ పద్మావతీ దేవి అలర్మేల్ మంగమ్మ జన్మ నక్షత్రమైన ఉత్తరాషాఢ నక్షత్రం తో ఉన్న పౌర్ణమి తిథి తో వెలుగొందే ఆషాఢ పౌర్ణమి శుభదిన శుభాభినందనలు...

శ్రీఆంజనేయ స్వామి వారి మహాభక్తులైన శ్రీ పరాశర మహర్షి వారి పుత్రులైన శ్రీ వ్యాస మహర్షి వారిని సద్గురువులుగా మరియు సకల గురుపరంపరాగతమైన సద్గురువులను విశేషంగా అర్చించే ఈ ఆషాఢ పౌర్ణమి శుభ తిథి
వ్యాసపౌర్ణమి / గురుపౌర్ణమి గా వినుతికెక్కడం ఎల్లరికీ విదితమే...

కాకినాడ ( కోకనదా పట్టనం ) లో ఉండే చాలామంది అధ్యాత్మ జిజ్ఞ్యాసువులకు తెలిసినట్టుగా,

భానుగుడి జంక్షన్ లోని, శ్రీహరిహరసుత అయ్యప్ప స్వామివారి ఆలయ ప్రాంగణంలో
ఇవ్వాళ్టి ఉదయం గురుమండల పూజామహోత్సవంలో యావద్ గురుపరంపరను అక్కడి తండూల ( బియ్యం ) రాశి పైన గల
బిల్వ దళాలు, పువ్వులు, నిమ్మకాయలు,
తమలపాకులు, అరటి, దానిమ్మ, కొబ్బరి, యాపిల్లు, సంత్రాలు, ఇత్యాది వివిధ ఫలాలు మరియు ఇతర శాస్త్రోక్త పూజాద్రవ్యములపైకి సవైదిక మంత్రోచ్ఛారణ / స్వరంతో ఆవహింపజేసి.,

వారికి ప్రదక్షిణ నమస్కారాలు అర్పించిన తదుపరి ఆ బియ్యాన్ని ప్రసాదంగా అక్కడికి విచ్చేసిన భక్తుల్లెల్లరికి శ్రీ సుబ్రహ్మణ్యశర్మగారు పంచిపెట్టడం చాలా మందికి తెలిసే ఉంటుంది....

తదనంతరం, సాయంత్రం ఒక మహోన్నతమైన వ్యక్తిత్వాన్ని గురుపూజను స్వీకరించేందుకు ఆహ్వానించి ఆ గురుదంపతులకు గురుసేవ గా

పుష్పమాలికా అలంకరణ,
చందన లేపనం,
సుగంధపరిమళ ద్రవ్య సమర్పణం,
ఇత్యాది సశాస్త్రీయ ఉపచారాలను సమర్పించి,
వారు సలిపిన అధ్యాత్మ కృషిని / ఉపాసనను కొనియాడి వారికి నమస్కరించడం అనే సత్సంప్రదాయాన్ని శ్రీ చాగంటి సద్గురువులు ఎన్నో సంవత్సరాలుగా అక్కడ నిర్వహింపజేయడం అనేది చాలామందికి ఎరుకలో ఉన్న విషయమే..

గురువులకే సద్గురువులై భాసిల్లే శ్రీ చాగంటి సద్గురువులే ప్రతి సంవత్సరం ఒక్కో మహనుభావులను అక్కడికి గురుస్వరూపంగా ఆహ్వానించి సత్కరించి గౌరవించడం అంటే ఈ గురుపూజామహోత్సవం ఎంతటి మహోన్నతమైనదో ఇట్టే మనం తెలుసుకోవచ్చు....

"ముఖే ముఖే సరస్వతీ...." అన్నట్టుగా ఆ శ్రీవాణి ఒక్కో మనిషికి వారి వారి పూర్వజన్మ సుకృతంగా ఒక్కో విద్వత్తును కటాక్షించి ఈ లోకానికి జ్ఞ్యానప్రభలను వారిచే వెదజల్లబడేలా అనుగ్రహించి తన ప్రత్యేకతను తెలియజేస్తుంది....

ఒక్కో పువ్వుది ఒక్కో పరిమళం...
ఒక్కో రంగు...ఒక్కో ప్రత్యేకత....ఒక్కో విచిత్రం....
ఒక్కో మకరంద రుచి...

అది ఈ సృష్టిలోని పరమాత్మ వైచిత్రి...

అట్లే ఒక్కో మహానుభావుడిది ఒక్కో విద్వత్తు....

ఒక పిల్లనగ్రోవి ఎదుట ఉన్నప్పుడు....

ఒక మహానుభావుడు అవే 7 కన్నాల నుండి సమ్మేళనాత్మకంగా హృదయం మైమరచే విధంగా అంతులేని స్వరాలను ఆలపించి ఔరా అనిపించడం...

ఇంకొక సామాన్య వ్యక్తి అవే 7 కన్నాల నుండి కనీసం
సా పా సా కూడా సరిగ్గా ఆలపించలేకపోవడం...

ఒక మనిషికి ఉండే వేళ్లు, నోరు, మూతి, పిల్లన గ్రోవిని పట్టుకొని ఊదడం, ఇలా అన్నీ కూడా ఈ ఇరువురికి కామన్ గా ఉన్నవే...

మరి ఒకరేమో వారి మూతి నుండి వదిలే గాలినుండి అనన్యసామాన్యమైన గాంధర్వశక్తిని సృజించి
ప్రకృతి తత్వం నుండి పరమాత్మ తత్త్వాన్ని ఆవిష్కరించి ఔరా అనిపించడం....

ఇంకొకరేమో అదే ప్రకృతి నుండి ప్రకృతిగా, అనగా లోపల ఉన్న మన శరీరం నుండి వదలబడే గాలి బయట వాతావరణం లోని గాలి లోకి కలపడం.....

అనగా సామాన్య పిండాండ బ్రహ్మాండ సమన్వయంగా ప్రకృతిలో ప్రకృతిగా ఉండిపోవడం.....

ఒకరు అలా ఒక లలితకళావాద్య పరికరం అందుకోగానే కళామయి గా / నాదమయి గా
ఆ సరస్వతీ వచ్చి కొలువై ఉండడం...

ఒకరు మైకు అందుకోగానే
రాగమయి గా / స్వరమయి గా / వేదమయి గా / వాగ్దేవి గా
ఆ సరస్వతీ వచ్చి కొలువై ఉండడం...

ఒకరు ఘంటం అందుకోగానే అక్షరమయి గా
ఆ సరస్వతీ వచ్చి కొలువై ఉండడం...

ఒకరు కళ్ళు మూసుకుని వివిధ యోగభూమికలను స్మరించగానే యోగమయి గా
ఆ సరస్వతీ వచ్చి కొలువై ఉండడం

ఒకరు నీళ్ళు అందుకొని ఆచమనం గావించి మంత్రపఠనం గావించగానే మంత్రమయి గా
ఆ సరస్వతీ వచ్చి కొలువై ఉండడం..

ఇలా ఒక్కో మహానుభావుల వద్ద గల పరమాత్మ అనుగ్రహ సంపాకంతో ఒక్కో విధంగా ఆ ఆదిపరాశక్తి,
వారు సంకల్పించి స్మరించగానే ఒక్కో నామ రూపాత్మక ఈశ్వర చైతన్య శక్తిగా వారి వద్దకు వచ్చి ప్రకృతిని పరతత్త్వంగా మార్చి ఎల్లరినీ అనుగ్రహిస్తున్నది కదా...

పూర్వజన్మ సుకృతం తో అబ్బిందా..
పుట్టుకతో అబ్బిందా....
సాధనతో / ఉపాసనతో అబ్బిందా...

అనేదానికంటే.....వారికి గల గురుకాటాక్షమే వారి యావద్ విద్వత్ వైదుష్య వైభవానికి మూల కారణం...

"హుం....ఆ మంద బుద్ధి మనిషి రావడం కోసం గురువుగారు మనకు ఇంకా పాఠం మొదలు పెట్టకుండా ఎదురుచూస్తున్నారు....ఆయన వచ్చినా అంత గొప్పగా నేర్చేదేముంది..."

అంటూ ఏదో నసుగుతూ కూర్చున్న తమ ముగ్గురు శిష్యుల అంతరంగాన్ని అర్ధంచేసుకున్న శ్రీ ఆదిశంకరాచార్యుల వారు గంగా నదికి ఆవలి వైపున గురుసేవగా శ్రీఆదిశంకరుల వస్త్రాన్ని ఉతకడం / శుభ్రపరచడంలో నిమగ్నమై ఉన్న తోటకాచార్యుల వారిని ఒక్క సారిగ పిలవగానే....
గురువుగారు వెంటనే రమ్మని ఆజ్ఞ్యాపించారు అనే తొందరలో అది నదీ అనే విషయాన్ని మరిచి నీటిపైనే అడుగులను మోపుతూ త్వరత్వరగా తరలివచ్చిన ఆ సందర్భంలో వారి ప్రతీ పాదస్పర్శకు ఒక పద్మాన్ని వికసింపజేసి అందులో వారి పాదం మోపబడేలా గంగమ్మ అనుగ్రహించి ఆవలి తీరానికి చేర్చడం,

గురువుల ఎదుట తక్షణం ఏతెంచగా....

"నా శిష్యునకు సకల వాంజ్ఞ్మయం సద్యో కటాక్షంగా భాసించుగాక..."

అని శ్రీఆదిశంకరులు ఒక్క సంకల్పంతో
తోటకులను పద్మపాదాచార్యుల గా అనన్యసామాన్యమైన పాండిత్యంతో వర్ధిల్లే విధంగా అనుగ్రహించిన ఆ సందర్భంలో శ్రీతోటకాచార్యులచే
లోకానికి అందివ్వబడిన " తోటకాష్టకం " తోనే కదా ఇన్ని శతాబ్దాలు గడిచినా ఆ శక్తివంతమైన స్తోత్రంతోనే ఇప్పటికీ మరియు ఎప్పటికీ గురుపౌర్ణమి రోజున గురువందనం ఆచరించి ఎల్లరూ తరించేది.....

ఇంతకంటే గురువైభవం గురించిన ఉదాహరణ ఇంకేముంటుంది...

గురువులు ప్రసన్న హృదయంతో తమ తపోశక్తిని శిష్యులకు ధారపోసిన నాడు....
గులక రాయి వంటి వారైనను గుణించలేనంతటి జ్ఞ్యాన రత్నమై శాశ్వత వైభవాన్ని గడించి తరించడం ఈ తపో భూమి పై ఎందరెందరో మహానుభావుల జీవితాల్లో తేటతెల్లమైన గురువైభవం....

శ్రీ చాగంటి సద్గురువుల మాటల్లో...

" గురువులు ఏమి ఇవ్వగలరు...?
అని అడిగితే
" గురువులు ఏమైనా ఇవ్వగలరు...!"
అనేది సమాధానం...

గురుకృప అంతటి ఉత్కృష్టమైనది కనుకనే

యుగయుగాలుగా ఈ దేవభూమి పై
గురుకులాల్లో / పాఠశాలల్లో విద్యార్థులందరికి తప్పకుండా నేర్పింపబడే శ్లోకం...

"
గురుర్ బ్రహ్మా..
గురుర్ విష్ణుః...
గురుర్ దేవో మహేశ్వరహః....
గురుర్ సాక్షాత్త్ పరబ్రహ్మ.....
తస్మై శ్రీ గురవే నమః......"

ఆతరువాతే...

"సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణీ...
విద్యారంభం కరిష్యామి సిద్దిర్భవతుమే సదా...."

అంటూ వివిధ ప్రార్ధనా శ్లోకాలు నేర్పించారు మన చిన్నప్పుడు స్కూల్లో...

మనం ప్రయాణించే మార్గంలోని అజ్ఞ్యానమనే అంధకారన్ని రూపుమాపే జ్యోతీస్వరూపాలే గురువులు...
( గు కారః అంధకారశ్చ....
రు కారన్ తన్నిరోధకహః...
అనే శృతివాక్యానుగుణంగా...)

పలకా బలపం చేబట్టి

ఓనమాలు / ABCD లు దిద్దిన ఆ నాటి నుండి

కంప్యుటర్ / మొబైల్ కీ బోర్డ్ పై నిరంతర అక్షర సేద్యాన్ని గావిస్తూ బ్రతికే ఈనాటి వరకు...

నా విద్యా / ఉద్యోగ / అధ్యాత్మ మార్గాల్లో నాకు దిక్సూచియై ఉండి నడిపించిన ప్రతి ఒక్క గురుస్వరూపులను నా అధ్యాత్మ సద్గురువులైన శ్రీ చాగంటి సద్గురువుల శ్రీ చరణాల్లో దర్శించి స్మరించి నమస్కరిస్తూ...

సహృదయులైన వారందరికీ ఇదే నా గురువందనం...
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏💐😊

विदिताखिल शास्त्र सुधा जलधे
महितोपनिषत्-कथितार्थ निधे ।
हृदये कलये विमलं चरणं
भव शङ्कर देशिक मे शरणम् ॥ 1 ॥

करुणा वरुणालय पालय मां
भवसागर दुःख विदून हृदम् ।
रचयाखिल दर्शन तत्त्वविदं
भव शङ्कर देशिक मे शरणम् ॥ 2 ॥

भवता जनता सुहिता भविता
निजबोध विचारण चारुमते ।
कलयेश्वर जीव विवेक विदं
भव शङ्कर देशिक मे शरणम् ॥ 3 ॥

भव एव भवानिति मे नितरां
समजायत चेतसि कौतुकिता ।
मम वारय मोह महाजलधिं
भव शङ्कर देशिक मे शरणम् ॥ 4 ॥

सुकृते‌உधिकृते बहुधा भवतो
भविता समदर्शन लालसता ।
अति दीनमिमं परिपालय मां
भव शङ्कर देशिक मे शरणम् ॥ 5 ॥

जगतीमवितुं कलिताकृतयो
विचरन्ति महामाह सच्छलतः ।
अहिमांशुरिवात्र विभासि गुरो
भव शङ्कर देशिक मे शरणम् ॥ 6 ॥

गुरुपुङ्गव पुङ्गवकेतन ते
समतामयतां न हि को‌உपि सुधीः ।
शरणागत वत्सल तत्त्वनिधे
भव शङ्कर देशिक मे शरणम् ॥ 7 ॥

विदिता न मया विशदैक कला
न च किञ्चन काञ्चनमस्ति गुरो ।
दृतमेव विधेहि कृपां सहजां
भव शङ्कर देशिक मे शरणम् ॥ 8 ॥


Sunday, July 18, 2021

శ్రీ ప్లవ నామ సంవత్సర ఆషాఢ శుద్ధ నవమి ( 1959 జులై 14 నాటి తిథి ప్రామాణికంగా ), శ్రీ చాగంటి సద్గురువుల 62 వసంతాల జన్మదినోత్సవ శుభాభినందనానమస్సులు....😊🍨🍕💐

శ్రీ ప్లవ నామ సంవత్సర ఆషాఢ శుద్ధ నవమి
( 1959 జులై 14 నాటి తిథి ప్రామాణికంగా ),
శ్రీ చాగంటి సద్గురువుల 62 వసంతాల జన్మదినోత్సవ శుభాభినందనానమస్సులు....😊🍨🍕💐

శ్రీ చాగంటి గారు...

ఒక మంచి మనసుగల వ్యక్తి అని కొందరు....
ఒక చక్కని భాగవతోత్తములు అని కొందరు...
ఒక గొప్ప ప్రవచనకర్తలు అని కొందరు...
ఒక అద్వితీయమైన సద్గురువులు అని కొందరు...
ఒక అనన్యసామాన్యమైన అధ్యాత్మ శాస్త్రవేత్త అని కొందరు...

ఇలా ఒక్కొక్కరూ ఒక్కోలా
తమ తమ భక్తి కొలది, జ్ఞ్యాన సముపార్జనాసక్తి కొలది,
అభిమానం కొలది వారిని భావిస్తూ సేవిస్తూ తరిస్తుంటారు...

అది వారి వారి వ్యక్తిగత జీవితాలకు ఆ సద్గురువుల సద్వాక్కులు ఆపాదించబడి ఒసగబడిన అనుగ్రహానికి అనుగుణంగా సమకూరిన భావమంజరుల లహరి గా అభివర్ణించడం అతిసయోక్తి కానేరదు...

అప్పటివరకు అది వాగులో పడిఉన్న ఒక సామాన్య బండరాయి...

ఎండకు ఎండి...
వానకు తడిసి..
అట్ల పడిఉన్న ఆ రాయి ఒక చక్కని శిల్పశాస్త్ర కోవిదుడి వద్దకు చేరిన, చేర్చబడిన నాడు...

ఆ రాయి ఒక చక్కని ఆగమోక్త భగవణ్మూర్తిగా మలచబడి ఒక ఆలయంలో కొలువైన నాడు...

ఆహా... ఓహో... ఎంత చక్కని మూర్తి...
అని ఎందరినుండో నమస్కారాలు పూజలు అభిషేకాలు అందుకుంటూ తరించి ఎల్లరినీ తరింపజేస్తుంది...

ఎవరో కొద్ది మంది మాత్రమే ఆ శిల్పి యొక్క గొప్పదనం గురించి కూడా మాట్లాడతారు....
ఆ గొప్ప శిల్పి మాత్రం వారి విహిత ధర్మంగా అలాంటి ఎన్నో ఎన్నెన్మో శిల్పాలు చెక్కుతూ ఎందరెందరో తరించడానికి వారి జీవితాన్ని వెచ్చించి బ్రతికేస్తుంటారు...

ఆ శిల్పి వారి జీవితపర్యంతంలో కొన్ని వందల వేల శిల్పాలు చెక్కడం తో, ఏ ఏ గుడిలో తనచే మూర్తిగా మలచబడిన శిల్పం దేవతామూర్తిగా మారి ఏ వైభవం అమరి తరిస్తూందో అనే విషయం గురించి పెద్దగా పట్టించుకోకపోయినా దేవతా మూర్తిగా మారిన ఆ శిల్పం మాత్రం నిత్యం ఆ అమరశిల్పికి తన కృతజ్ఞ్యతను తెలియజేస్తూనే ఉంటుంది...
ఎందుకంటే అది గౌరవం, ప్రేమాభిమానం, మరియాద, బంధం, బాంధవ్యం, ఇత్యాది ఏ భావానికి కూడా అందని ఒక అపురూపమైన అవ్యక్త ఆదర భావన..

ఈశ్వరానుగ్రహం తో కొంత విద్వత్తు, అధికారం, ఐశ్వర్యం, లభించగానే ఒక్కొక్కరూ ఒక్కోలా వారికి అనుగ్రహింపబడిన సంపత్తును వినియోగించి లౌకిక ప్రయోజనాలను ఈప్సితములను ఈడేర్చుకోవడానికి మాత్రమే ఉపయోగించుకొని వారి పిల్లలకు, మనవలు మనవారాళ్ళకు, ఆ యావద్ లౌకిక సంపత్తును వదిలేసి గతిస్తారు....

కోట్లు కూడబెట్టి ఇచ్చినా సరే,
గతించిన తరువాత వారి పిల్లలు, మనవలు,
గోదానం కాకపోయినా కనీసం ప్రతిసంవత్సరం పద్ధతిగా, శ్రద్ధగా ఆబ్దీకములను నిర్వహించి నమస్కరించి గౌరవించేంతటి సంస్కారంగా జీవించగలరని చెప్పడం ఈ కలియుగంలో ఎల్లవేళలా కుదరదు...అంతటి కేవల భౌతికవాదానికి బంధీలై బ్రతికే జీవనం ఈ కలియుగ వాసులది...

అసలు గోదానం అనేది ఒకటి ఉంటుందని..
అది నిర్వహించి పితరులకు వైతరణీ యాతన లేకుండా చేయడం విహిత ధర్మం అనే విషయం కూడా తెలియని అధ్యాత్మరాహిత్యతతో బ్రతికే జీవితం ఈ కలియుగవాసులది...

పురోహితులు ఆ ప్రస్తావన తెస్తే 5 రూపాయలిచ్చి గోదానం అయిపోయిందని ' మమ ' అనిపించే వారికోసం జీవితాంతం కూడబెట్టినది వదిలేసి పోవడం అనేది అసలు అర్ధమేలేని జీవితం...

ఇటువంటి ముఖ్యమైన విషయాల దెగ్గరినుండి ఎన్నో ఎన్నెన్నో శాస్త్రోక్త / పురాణోక్త గొప్ప గొప్ప విషయాలవరకు, అవన్నీ ఎల్లరికీ అందించేందుకే వారి యావద్ జీవితంలోని సిమ్హభాగం వెచ్చించిన శ్రీ చాగంటి సద్గురువులు ఈ కలియుగ ప్రజలకు లభించిన ఒక అనన్యసామాన్యమైన "ఆత్మోద్ధరణ " అనే అధ్యాత్మ శిల్పశాస్త్ర కోవిదులు...

ఇవ్వాళ్టి మన ఉరుకుల పరుగుల దైనందిన జీవితానికి వారి అమృతప్రవచనాలు కొన్ని వందల వేల పుస్తకాల పఠనంతో సమానం...

ఒక పుస్తకం చదివినతదుపరి మనమే ఆ పుస్తకమైపోవడానికి చాలా సమయం పట్టొచ్చు...

అది అవగాహన చేసుకొని ఆకళింపుచేసుకొనేంతటి మేధో పటిమ అందరికీ ఉండొచ్చు ఉండకపోవచ్చు....

కాని శ్రీచాగంటి సద్గురువుల ప్రవచనం శ్రద్ధగా ఆలకించడం అనేది ఒక ప్రత్యేకమైన పుస్తక పఠనం వంటిది..

దేశవాళి ఆవునేతిలో దోరగా వేయించిన క్యారెట్ హల్వా ని ఆరగించిన వారికి మాత్రమే ఆ వంటకం యొక్క గొప్పదనం అవగతమైనట్టుగా....

వారి ప్రవచనం ఎంతటి సాటిలేని ధీటైన మేటి విధంగా సదరు శ్రోతను తన అధీనంలోకి తీసుకొని తన అనుగ్రహాన్ని సమకూర్చుతుందనేది వాటిని శ్రద్ధగా ఆలకించిన వారికి మాత్రమే ఎరుకలో ఉండే విషయం...

ఐ.డి.పీ.ఎల్ బస్టాప్ లో ఎక్కిన పల్లె వెలుగు బస్ నర్సాపూర్ లో దిగి, విష్ణుపూర్ లోని మా బీ.వీ.ఆర్.ఐ.టి కాలేజ్ కి వెళ్ళడానికి ఇంకో బస్సు కోసం ఎదురుచూస్తూ ఒళ్ళు హూనమై ఉండే ఆ ప్రయాణబడలిక నుండి కాస్త ఉపశమనం పొందడం కోసం

( ప్రతీరోజు షేర్ ఆటోలో వెళ్ళగలిగేంతటి ఆర్థిక స్థోమత లేక, నెలకు 500 రూపాయల బడ్జెట్లో, 360 రూపాయలు రూట్ బస్పాస్ కి పోను మిగతా 140 రుపీస్ లో ఇంజనీరింగ్ విద్యాభ్యాస సంబంధిత ఇతర ఖర్చులన్నీ నెట్టుకొస్తున్న రోజులవి... )

ఏదో క్యాజువల్ గా వారి ప్రవచనాలను అడపా దడపా వినడం మొదలుపెట్టిన 2007:2008 నాటి నుండి ఈనాటి వరకు....

అంతంతమాత్రంగా ఉన్న ఇంటి ఆర్ధిక పరిస్థితితో
లౌకికంగా ఎన్నో ఈతిబాధల మధ్యన కష్టపడుతూ,
కాలేజ్లో ప్రభుత్వం వారిచ్చే ఫీస్ రీఇంబర్స్మెంట్ స్కాలర్షిప్ సహాయం తో చదివి బి.టెక్ చదువుల బండిని ఒక గట్టెక్కించి, మా కాలేజ్ లోని విద్యాగణపతి అనుగ్రహంగా ఆనాడు టీ.సీ.యస్ / అక్క్సెంచర్ / కంప్యూటర్ అసోసియేట్స్ అనే 3 బహుళజాతీయసంస్థల కంపెనీల ఆఫర్లను సాధించడానికి కావలసిన పర్సనాలిటి డెవెలప్మెంట్ స్కిల్ల్స్ ని అనుగ్రహించినదిమొదలు 2008 నుండి నా 21వ పడిలో మొదలైన ఉద్యోగ / లౌకిక జీవిత ప్రయాణంలో ఎప్పుడు ఎక్కడ ఏవిధంగా ఉండి ఎవరిని నమ్మాలో, ఎవరిని నమ్మకూడదో, ఎవరితో ఎప్పుడు ఎక్కడ ఎందుకు ఎలా వ్యవహరించాలో ఇత్యాది కార్యసాధక దీక్షాదక్షతతో మనగలిగే మానసిక / మేధో సమర్ధతను కటాక్షిస్తూ,
ఇప్పుడున్న 2021 వరకు నాకు లభించిన
ఒక దైవిక మితృలుగా
( స్నేహితులు ఎందరో ఉంటారు...
కాని మితము నుండి ఋతమునకు నడిపించే నిస్వార్ధమైన మితృలు చాలా అరుదుగా ఉంటారని బోధించిన వారి సద్వాక్కే ) నాకు నిజ నేస్తమై నిలిచి నన్ను అడుగడుగునా గెలిపించే జ్ఞ్యానాలంబనై నిలిచింది వారి ప్రవచనా సద్వాక్కు...

వారి శ్రీవేంకటేశ్వర వైభవం ప్రవచానాల్లో ఉదహరింపబడిన
" ఉన్నాడయా...దేవుడున్నాడయా...."
అనే జానపద గేయంలో బోధింపబడిన రీతిలో

ఇనచంద్రులున్నంతవరకు జగత్తులో శాశ్వతంగా మహత్తును ప్రసరింపజేస్తూ ఎల్లరినీ అనుగ్రహించే రీతిలో ఈశ్వర మాహాత్మ్యాన్ని ఆనాడు శ్రీమద్రామాయణంగా శ్రీవాల్మీకి మహర్షి ఎవ్విధంగ లోకానికి అందించి అనుగ్రహించినారో...

ఈ నేలపై తెలుగు భాష వాడుకలో ఉన్నంతవరకు శ్రీ చాగంటి సద్గురువుల అమృతప్రవచనాలు శ్రీమద్రామాయణ సుజ్ఞ్యాన మంత్రమహార్ణవమువోలే,
అధ్యాత్మ ప్రవచనామంత్రమహార్ణవమై అవధరించిన వారెల్లరినీ తరింపజేస్తూ ఉంటాయనడం ఏమాత్రం అతిశయోక్తి కానేరదు...

వారి అమృతప్రవచనాల అనుగ్రహంగా మా మూడేళ్ళ వైవాహిక జీవితానికి పరిపూర్ణతను కటాక్షిస్తూ, శ్రీభువనేశ్వరి అమ్మవారి అనుగ్రహంగా ప్రభవించిన నా కూతురుకి ఇక రాబోయే రోజుల్లో నేనే గురువై వారి ప్రవచనా విశేషాలను బోధించడంలో
( మరీ ముఖ్యంగా వారి  " రుక్మిణీ కల్యాణం " ప్రవచనం / తత్సంబంధ శ్రీమద్భాగవత పద్యాలు నా కూతురికి కంఠస్థమైతే నాకు కాస్త మనఃశాంతి గా ఉంటుంది కద...😊 )
వారి ప్రవచనాలన్నీ కూడా మళ్ళీ మళ్ళీ వినే భాగ్యం తో ఉండే,
నా జీవిత నౌకకు చుక్కానివలె అమరిన వారి అమర ప్రవచనాల యొక్క మహత్తు గూర్చి ఒక చక్కని సినిమా పాటలో ​చెప్పాలంటే....
ఈ క్రింది పాట నాకు స్ఫురించింది...

********************
Movie : Santosham
Song : Nuvvante naakishtamani
Singers : Rajesh, Usha
Lyrics : Sirivennela
Music : RP Patnayak

అ:నువ్వంటే నాకిష్టమని అన్నది నాప్రతి శ్వాస
ఆ:నువ్వేలే నా లోకమని అన్నది నాప్రతి ఆశ
అ: నీ నవ్వులో శృతి కలిపి పాడగా
ఆ:నీ  నీడలో అణువణువు ఆడగా
ఇ: అనురాగం పలికింది సంతోషం స్వరాలుగా      అ:||నువ్వంటే||
అ:చ: నువ్వునా వెంట ఉంటే అడుగడుగునా నడుపుతుంటే
ఎదురయే నా ప్రతి కలా నిజమల్లే.... కనిపించదా
ఆ: నిన్నలా చూస్తూఉంటే మైమరపు నన్నల్లుతుంటే
కనపడే నిజమే ఇలా కలలాగ అన్పించదా
అ:వరాలన్ని సూటిగా యిలా నన్ను చేరగా
ఆ: సుదూరాల తారక ....సమీపాన వాలగా
అ: లేనేలేదు.... యింకే కోరిక......                        ఆ:||నువ్వంటే||
ఆ:చ ఆగిపోవాలి కాలం ,మన సొంతమై ఎల్లకాలం
నిన్నగా సనసన్నగా చేజారి పోనీయకా
అ: చూడునా యింద్రజాలం వెనుతిరిగి వస్తుంది కాలం
రేపుగా మనపాపగా పుడుతుంది సరికొత్తగా
ఆ: నువ్వు నాకు తోడుగా నేను నీకు నీడగా
అ:ప్రతీ రేయి తీయగా పిలుస్తోంది హయిగా
ఆ: ఇలా ఉండిపోతే చాలుగా.....                   
అ:||నువ్వంటే||

********************

వారి ప్రవచానాలను త్రికరణశుద్ధిగ నమ్మి ఆరాధించే ఎందరెందరో శిష్యులను వారు మరింతగా అనుగ్రహిస్తూ వారి అజారమరమైన ప్రవచనా ప్రస్థానం నిరంతర గంగాప్రవాహమై ఆచంద్రతారార్కం
యశోచంద్రికలతో ఎల్లరి జీవితాలు వర్ధిల్లే విధంగా అనుగ్రహిస్తూ ఉండాలని అభిలషిస్తూ...

వారి శ్రీచరణాలకు ఒక వినేయుడి చిరుకవనకుసుమాంజలి ప్రయుక్త వారి 62 వ జన్మదినోత్సవ మరియు రాబోయే గురుపౌర్ణమి ఉత్సవ శుభాభినందనాపూర్వక సాష్టాంగ నమస్సుమాంజలులు.....
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏😊💐🍕🍨


Tuesday, July 13, 2021

శ్రీ (ప్లవనామ సంవత్సర) ఆషాఢ జాతర గా వినుతికెక్కిన ఆదిపరాశక్తి యొక్క వైభవవర్నన.... 😊💐🍕🍨


శ్రీ చాగంటి సద్గురువుల ప్రవచనాల్లోని అమృత గుళికల వంటి అధ్యాత్మ విశేషాలను,
" భద్రంకర్ణేభిః శృణుయామదేవాః " అనే శృతివాక్యానుగుణంగా తమ తమ మస్తిష్కాలలో పదిలంగా పొదివిపట్టి భద్రపరుచుకున్న శిష్యులకు అవతగతమైనట్టుగా....

ఆ ఆదిపరాశక్తి ఒకానొక సందర్భంలో దేవతలకు సైతం కలిగిన అతిశయాన్ని నిర్మూలించి వారి యందు భక్తి భావన, మరియాద/వినమ్రత, ఇత్యాది సద్గుణసంపదను ప్రోది చేసి కరుణించేందుకు గాను ఒక గడ్డి పరకను అడ్డుగా పెట్టి దేవతలను వారికి గల సర్వ శక్తులతో ఆ గడ్డిపరను అక్కడినుండి కదిలించమని  చెప్పినప్పుడు, ఒక్కరు కూడా ఆ గడ్డిపరకను కదిలించలేని తమ అశక్తతను గుర్తించి 

అనగా వాయుదేవుడు ఎంతగా విజృంభించినా ఆ గడ్డిపరకను రవ్వంతైనను జరపలేకపోవడం...

అగ్ని దేవుడు ఎంతగా తన ప్రతపాన్ని చూపినా ఆ గడ్డిపరకను రవ్వంతైనను కాల్చలేకపోవడం.. 

వరుణ దేవుడు ఎంతగా హోరెత్తించినా ఆ గడ్డిపరకను రవ్వంతైనను తడపలేకపోవడం....

ఇత్యాదిగా సకలదేవతలు కూడా తమకు ఒసగబడిన  విహిత శక్తులన్నీ కూడా ఆ ఆదిపరాశక్తి యొక్క అనుగ్రహమే అని తెలుసుకొని భక్తితో
అమ్మవారికి నమస్కరించిన ఆ వృత్తాంతంలో జ్యోతకమైన విధంగా....

"సహస్రాపరమాదేవి శతమూలాశతాంకురా సర్వగుమ్హరతుమేపాపం దూర్వాదుస్స్వప్ననాశినీం...."

అనే శాస్త్రోక్త శ్లోకంలో నుతించబడినట్టుగ ఆ ఆదిపరాశక్తి  గడ్డిపరకను సైతం గగనసదృశమైన గంభీర తత్త్వ పదార్ధంగా మనగలిగేలా అనుగ్రహించే ఆద్యంతరహితమైన శక్తి...

సైన్స్ చెప్పినట్టుగానే
"Energy can neither be created nor can be destroyed but can only be transformed from one form to the other...."

ఆధ్యాత్మికత కూడా అదే సూత్రానుగుణంగా 

" ఆది పరాశక్తి అను తత్త్వం ఆద్యంతరహితమై...
అణువుకన్ననూ చిన్నగా ఉండగల...
ఆకాశంకన్ననూ పెద్దగా ఉండగల...
లెక్కింపశక్యంకానంతటి వివిధ నామరూపాత్మక గ్రాహ్య అగ్రాహ్య శక్తికేంద్రక వ్యవస్థగా యావద్ విశ్వంలో నిండి నిబిడీకృతమై ఉండే సకలాధార చైతన్య శక్తి....

ఒక నామం, రూపం, తత్త్వం నుండి
మరో నామం, రూపం, తత్త్వం లోకి
దేశకాల ఆవశ్యకతానుగుణంగా నిత్యం రూపాంతరం చెందుతూ ఈ విశ్వపరిపాలనను సర్వదా సర్వజీవకోటికి అనుగ్రహదాయక రీతిలో కొనసాగించడమే ఆ శక్తి యొక్క నిరంతర కార్యాచరణాత్మక ఉనికికి గల విశేషం..

" గురుమండలరూపిణి "
" గురుమూర్తి "

అనే నామాలతో శ్రీలలితాసహస్రంలో 
అమ్మవారు ఆరాధింపబడడం గమనించేఉంటారు....

న గురోరధికం తత్త్వం...న గురోరధికం తపః...

అనే వాక్యం గురించిన వ్యాఖ్యానం శ్రీచాగంటి సద్గురువుల సద్వాక్కులో విన్నవారికి గుర్తున్నట్టుగా...

గురువుగారి ముందు ఎల్లరూ లఘువులే...

కాబట్టి ఆవిడ 
"గురుమూర్తిగా కూడా ఉన్నది నేనే..."
" యావద్ గురుమండలాన్ని అధివసించి ఉండే బృహత్ వ్యక్తావ్యక్త అమేయ తత్త్వ సంచయం కూడా నేనే..."

అంటూ

" ఓం గురుమూర్త్యై నమః... "
" ఓం గురుమండలరూపిణ్యై నమః... "

అంటూ పూజలు అందుకొని అనుగ్రహిస్తూన్నది...

ఈ కరోనా కారణంగా ఈసారి కూడా కుదరదేమో కాని,
కాకినాడ భానుగుడి జంక్షన్ లోని 
అయ్యప్పస్వామి వారి ఆలయంలో 
శ్రీచాగంటి సద్గురుదంపతుల ప్రత్యక్ష పర్యవేక్షణలో,
శ్రీ సుబ్రహ్మణ్యశర్మ గారి గళసీమలో కొలువైన వేదమయి, వారు చదివే నామావళికి ప్రసన్నురాలై అక్కడి గురుమండల పూజ అందుకోవడానికి వివిధ సూక్ష్మ తలాల్లో వచ్చి కొలువైఉండే ఆ ఆదిపరాశక్తి యొక్క వైభవం అక్కడుండే ఎందరో నమ్మికొలిచే భక్తులకు / శిష్యులకు సుగ్రాహ్యమే....

నేను ఇదివరకే ఒక పాత పోస్ట్లో,
 
శూన్యమాసం గా పిలువబడే ఆషాఢ మాసంలో విశేష గురుపూజ / వ్యాసపూజ నిర్వహింపబడే గురుపౌర్ణమిని ఆషాఢ పౌర్ణమి ఉత్సవం గా జరుపుకోవడంతో ఏ విధంగా పంచాంగ వ్యవస్థకు ఒక విధమైన  
" cosmic balance to adjust the almanac drift due to the void caused by the AashaaDha maasam..." 
సమకూరుతుందో ఆయా విశేషాలను క్లుప్తంగా వివరిస్తూ రాసినట్టుగా...

దేవశయన ఏకాదశి కి శ్రీమన్నారాయణుడు యోగనిద్రలోకి జారుకోవడం మరియు ఆషాఢ శక్తిగా ఆదిపరాశక్తి నారాయణి మేల్కోవడం లోని ఆంతర్యం అధ్యాత్మ లోకానికి అందివ్వబడే అనుగ్రహవిశేషం....

అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ
చాలపెద్దమ్మ ఆ దుర్గమ్మ,
మా ఇంటి బాలగా వచ్చి కొలువైనందుకు
ఈ సంవత్సరం యొక్క ఆషాఢ జాతర 
నాకు మరింత విశేషమైనదే...

ఎందుకంటే అప్పుడెప్పుడో 2009 లో అనుకుంటా...

శ్రీచాగంటి సద్గురువుల అనుగ్రహమైన ఈ క్రింది శ్లోక మంత్రాన్ని నిత్యం స్మరణ మనన నిధిధ్యాసన గావించడంతో...

" సర్వదా సర్వదేశేశు పాతుః త్వాం భువనేశ్వరి...
మహామాయా జగ్గధాత్రి సత్ చిత్ ఆనంద రూపిణీం..."

ఆ హ్రీం బీజాక్షర అధిదేవత శ్రీభువనేశ్వరి అమ్మవారి అనుగ్రహంగా మా జీవనజ్యోతిగా ఆ పరంజ్యోతి ఈ ఆషాఢ జాతరకు మా ఇంట బాలగా వచ్చి కొలువయ్యింది....😊

కూకట్పల్లిలోని మా శ్రీచైతన్య కాలేజ్ పక్కన ఉండే శ్రీద్వాదశజ్యోతిర్లింగేశ్వర స్వామివారి శక్తిగా స్వామివారి వామభాగాన శ్రీచక్రాభిముఖియై కొలువైన స్థిర శ్రీభువనేశ్వరి అమ్మవారే ఇప్పుడు మా ఇంట తిరుగాడే చిన్నారి గా వచ్చి కొలువై మమ్ము అనుగ్రహించింది...

శ్రీవాణి గా, శ్రీ గౌరి గా, శ్రీ లక్ష్మి గా...
త్రిశక్తి సంఘాతమై యావద్ భూమండలానికి నాభి స్థానంలో ఉండే, దక్షిణ భారత ఎకైక మోక్షపురి, కాంచీపురానికి అధిదేవతయై ఎల్లరినీ అనుగ్రహించే ఆ శ్రీకంచికామాక్షి పరదేవత,

పంచభూతాత్మక ప్రతీకలుగా చెప్పబడే 5 లింగాల్లో ఒకటైన కంచి పృథ్వీ లింగంగా ఉండే
ఏకామ్రేశ్వరుడి శక్తిగా కొలువై ఉండి,
తన సన్నిధిలోని బిలాకాశం / బిలాహాసం ద్వారా యావద్ విశ్వంలోని శక్తికేంద్రాలకు తానే అధిదేవతగా భాసిల్లుతూ, అసంఖ్యాక నామా రూపాలతో భక్తుల్లెలరిచే అర్చింపబడే ఆ ఆది పరాశక్తిని ఆషాఢ శక్తిగా అర్చిస్తూ విశేష ఉత్సవం జరపడంలో మనం గమనించగలిగితే...

1. పంచభూతాల్లో పృథ్వికి / పృథ్వి తత్త్వ పదార్థాలకు మాత్రమే ఇతర పంచభూతాల సమ్మేళనంతో వివిధ నామరూప ధారక శక్తి కలదు...

అప్పటివరకు చెరువులో ఎండిన మట్టి దిబ్బ గా ఉన్న బంక మన్నుకి వర్షం రూపంలో నీరు జతైన తదుపరి 
గణేష ప్రతిమగా మారి మృణ్మయం
చిన్మయమౌతుంది....

ఆతదుపరి అగ్ని,.వాయు, ఆకాశం అనే ఇతర పంచభూత తత్త్వ సమాగ్రితో జతై ఒక చూడచక్కని సశాస్త్రీయ గణేష మూర్తిగా మారి పూజ గదిలో 
ఈశ్వరుడిగా మారి పూజలు అందుకొని అర్చించిన భక్తులను అనుహ్రహిస్తున్నది.....

పృథ్వి వినా,
ఆకాశం, వాయు, అగ్ని, ఆపః ( నీరు ) ,
ఈ నాలుగు సమ్మిళితమైనను ఈ ప్రక్రియ సాధ్యపడదు...

12 మాసాల నిరంతర కాలచక్రాన్ని
5 భాగాలుగా విభాగిస్తే
అనగా గాయత్రి మహామంత్ర బీజాక్షర సంఖ్య 24 కు ప్రతీకగా

24 × 5 భాగాలు = 12 మాసాలు...

అనగా రమారమి 72 రోజుల కాలాన్ని ఒక భాగంగా భావిస్తే 

72 రోజులు × 5 భాగాలు = 360 రోజుల సంవత్సర కాలం...

అనగా రమారమి 5 పక్షాల కాలం ఒక భాగంగా భావిస్తే... 

అటువంటి 5 భాగాల్లోకి కుదురుకునే ఒక సంవత్సరకాలం లో 

ఆకాశం
వాయువు
అగ్ని
ఆపః ( నీరు ) 
పృథ్వి

తమ తమ శక్తిని ప్రస్ఫుటంగా పరివ్యాప్తి గావించే విధంగా కాలం ఉండడం మనం గమనించవచ్చు...

చైత్రం
వైశాఖం
జ్యేష్టం
ఆషాఢం
శ్రావణం
భాద్రపదం
ఆశ్వయుజం
మార్గశీర్షం
కార్తీకం
పుష్యం
మాఘం
ఫాల్గుణం

అగ్ని, నీరు, పృథ్వి, తమ తమ శక్తిని పరివ్యాప్తం గావించే

చైత్రం, వైశాఖం, జ్యేష్ఠం, ఆషాఢ ప్రారంభం, వచ్చేసరికి
పృథ్వి తత్వం కాలం పై తన పట్టును కలిగి ఉండే సమయం...

అందుకే ఆషాఢ మాసం వచ్చిందనగానే వివిధ ప్రాంతాల్లో వివిధ రీతుల ఆయా ప్రాంతీయ ఆచారానుగుణంగా అమ్మవారికి విశేష నైవెద్యాలతో జాతర / ఉత్సవాలు జరపడం మనం గమనించవచ్చు.....

నైవేద్యంలో అమ్మవారికి ఏ తత్త్వ పదార్థలు సమర్పిస్తాం...??

ఆకాశం..?
వాయు..?
అగ్ని..?

కాదు...
జలం మరియు పృథ్వి తత్త్వ భరిత పదార్థాలు...

ఎందుకంటే మన శరీరం కూడా సిమ్హభాగం జల మరియు పృథ్వీ తత్త్వ భరితం కాబట్టి...

నిలవదోషం లేని బెల్లం ముక్కని ఈశ్వరుడి నైవేద్యానికి వాడడంలో గల ఆంతర్యం..??

శ్రీరాజరాజేశ్వరి గా, శ్రీలలితాంబిక గా, చెరుకు విల్లును అమ్మవారు ధరించి ఉండడంలో గల ఆంతర్యం..??

ఎటువంటి పృథ్వి నుండైనా ఒక సాధారణ మొక్కను తియ్యని చెరుకు గడగా మార్చి అందునుండి మధురమైన  బెల్లము, చక్కెర ని మనకు అందించే చెరుకు మొక్క మనకు ఈ పృథ్వీ తత్త్వం యొక్క విశేషం తెలియచెప్తుంది....

అనగా మన శరీరం అనే మృణ్మయం నుండే అధ్యాత్మ సాధన ద్వారా చిన్మయ వీచికలను ప్రభవింపజేసుకొని మధురమైన బెల్లము వంటి పరమాత్మ తత్త్వానుభూతిని మనలోనే ఉద్భవింపజేసుకోవడంతో ఈ కేవల పృథ్వీ ఘటం.... అమేయమైన చిదాకాశమై సర్వేసర్వత్రా పరివ్యాప్తమై ఉండే పరత్తత్వ పదార్థం గా పరిణమిస్తుంది...

అప్పుడు " తత్ త్వం అసి "  అనే శృతివాక్యానికి నిదర్శనంగా మన పాంచ భౌతిక శరీరమే, ఒక దివ్య అప్రాకృత పరమాత్మ పదార్ధానికి నెలవుగా మారి అప్పుడు " సోహం " అనే స్థితిలో జీవుడు జీవేశ్వరుడితో ఓలలాడుతూ ఉండే ఆ తురీయావస్థలో
ని తత్త్వానుభూతినే  " అద్వైత స్థితి " గా శ్రీఆదిశంకరాచార్యుల వారు ప్రబోధించినారు....

అంతటి ఉత్కృష్టమైన ఈ పృథ్వీ తత్వ మహాత్మ్యాన్ని
శర్వ శర్వాని గా ఉండి ఆ ఆదిదంపతులు ఎవ్విధంగా విశ్వపరిపాలనను గావిస్తుంటారో శ్రీ చగాంటి సద్గురువులు మనకు వారి ప్రవచనాల్లో బోధించి ఉన్నారు....

ఆ శర్వాని తన సకల శక్తులను మరింత ప్రస్ఫుటంగా ఉద్దీపన గావించి దక్షిణాయణానికి నాయకిగా కాలచక్రం యొక్క పగ్గాలను శ్రీమన్నారాయణుడి నుండి తన అధీనంలోకి తీసుకొని ఎల్లరినీ ప్రత్యక్షంగా పరిపాలించే పరాశక్తిగా సిమ్హాసనారూఢురాలై ఉండే కాలం కనుక ఈ ఆషాఢ జాతర ను అమ్మవారికి ప్రీతికరంగా ఒక్కో చోట ఒక్కో విధంగా జరుపుకోవడం ఎల్లరికీ విదితమే...

యావద్ తెలంగాణ లో "బోనాల జాతర" గా
ఈ ఆషాఢ జాతర వినుతికెక్కడంలో గల ఆంతర్యం ఇదివరకే నా ఈ క్రింది పాత పోస్ట్లలో వివరించాను....

https://shreeguravenamah-aithavk.blogspot.com/2020/07/blog-post_12.html?m=1

https://shreeguravenamah-aithavk.blogspot.com/2018/09/blog-post_16.html?m=1

https://shreeguravenamah-aithavk.blogspot.com/2019/07/2019-bonaalu.html?m=1

https://shreeguravenamah-aithavk.blogspot.com/2019/06/blog-post_20.html?m=1

ఉజ్జైని నుండి భాగ్యనగరానికి తరలి వచ్చిన సికింద్రాబాద్ శ్రీ ఉజ్జైని మహంకాళి,

స్వయంభువై కొలువైన బల్కంపేట శ్రీ రేణుకా హేమలాంబ (ఎల్లమ్మ),

మంచి హృదయంగల ప్రజానేతగా చిరకీర్తిని గడించిన పీ.జే.ఆర్ గారు నెలకొల్పిన జూబ్లీ హిల్ల్స్ పెద్దమ్మతల్లి,

ఇత్యాదిగా హైదరాబాద్ లోని వివిధ
ప్రాంతాల్లో కొలువైన మహాశక్తిగా ఆ ఆదిపరాశక్తి, బెల్లమన్నం బోనాలతో పాటుగా భక్తుల మనోప్రార్థనలను కూడా స్వీకరించి, ఎల్లరినీ చల్లగా అనుగ్రహించుగాక....

శ్రీమచ్ఛఙ్కరసద్గురుర్గణపతిర్వాతాత్మజః క్షేత్రపః
ప్రాసాదే విలసన్తి భూరి సదయే నిత్యస్థితే హ్రీంమయి ।
యుష్మత్స్నేహకటాక్షసౌమ్యకిరణా రక్షన్తి దోగ్ధ్రీకులం
శ్రీవల్లీం భువనేశ్వరీం శివమయీమైశ్వర్యదాం తాం భజే || ౫ ||

Saturday, June 19, 2021

Shree N.V.Ramana gaaru, HH hon'ble CJI, visits the Pearl City. .😊🍟🍨👏💐

Shree N.V.Ramana gaaru, HH hon'ble CJI, makes his august presence a great addition to the glory of the Pearl City by being the second Telugu speaking person adorning the nation's highest authoritative throne of CJI....

And the fact that he, 
as "BhaarataDeshaDharmaDevata", 
has graced the city soon after having Lord ShreeVenkateshwara Swamy's darshan in Tirumala,
is sure to bring smile and happiness in to the lives of many amongst the approx 31.47 million population of the state by making this year, "2021", a very memorable year for many....😊💐👏🍨🍟

Hyderabad will always remember your kindness Sir...🙏😊

Thursday, June 17, 2021

శ్రీ యాదాద్రి లక్ష్మీనారసిమ్హుడి ఆలయ అపురూప దృశ్యమంజరి.......!

శ్రీ యాదాద్రి లక్ష్మీనారసిమ్హుడి ఆలయ ఈ అపురూప దృశ్యమంజరి.......!

ఆహా అని అనిపించకమానదు కద....!

శ్రీపాంచరాత్ర ఆగమోక్త విధంగా ఆలయ ప్రాకార స్థిరీకరణ....
తరతరాలకు తరగని వన్నెలలదబడి
యుగయుగాలకు జగజగాలకు శాశ్వతంగా శ్రీలక్ష్మీనారసిమ్హుడి దేదీప్యదివ్యదైవికప్రభలను వెదజల్లే విధంగా ఎంతో ఘనమైన రీతిలో ఆలయ నవీకరణ జరిగి బాలాలయం నుండి గర్భాలయానికి వేంచేసి భక్తులను ఘనంగా అనుగ్రహించేందుకు సంసిద్ధమౌతున్న శ్రీలక్ష్మీనారసుమ్హుడి వైభవం అంతని ఇంతని వర్నించనలవి కానిది కద....

ఒక హాస్పటల్కో, స్కూల్కో, హోటల్కో వేళ్ళాలంటేనే ఆ ప్రాంతం ఎంత పరిశుభ్రంగా ఉంది, ఎంత పద్ధతిగా ఉంది, ఎంత గొప్పగా ఉంది, ఎంత సప్రామాణికంగా ఉంది, ఇత్యాదివన్నీ చూసి ఏది చాలా బావుందో వాటి దెగ్గరికే వెళ్ళడానికి మనం సమ్మతిస్తామే...

మరి అటువంటిది

నమ్మి కొలిచే ఎందరెందరో భక్తులకు
ఆరోగ్యం,విద్య/జ్ఞ్యానం,పుణ్యం/ఐశ్వర్యం, ఇత్యాదివన్నీ కూడా అనుగ్రహించే దేవాలయం
ఎంత ఘనంగా ఉండాలి..?
ఎంత సప్రామాణికంగా ఉండాలి...?
ఎంత దృఢంగా ఉండాలి...?
ఎంతటి శాస్త్రీయ వైభవంతో అలారారే విధంగా ఉండాలి...?
ఎంతటి షోడశకళాత్మక దైవత్వం ఉట్టిపడేలా ఉండాలి..?

అనేది ఎవరో కొందరు మహనీయులకు మాత్రమే స్ఫురించే వైజ్ఞ్యానిక అంశం...

అవ్విధంగా ఒక ఆలయాన్ని తీర్చిదిద్దాలనే
సంకల్పం, సంపత్తి, అధికారం, తీరిక, చిత్తశుద్ధి, కార్యాచరణ ప్రణాళిక, ఇత్యాదివన్నీ ఉండడం ఒకెత్తు...
వాటన్నిటినీ ఒక క్రమపద్ధతిగా ఆచరణాత్మక దృక్కోణంలో ఆహ్వానించి, అమలుపరిచి భక్తులకు / లోకానికి అందివ్వడం ఒకెత్తు ..

ఈ ఇరు పార్శ్వములను సమన్వయపరుస్తూ ఇన్నాళ్ళుగా సాగిన ఎందరో శ్రామికుల శ్లాఘనీయమైన శ్రమ ఒక అత్యత్భుతమైన దేవాలయంగా రూపాంతరం చెంది ఇవ్విధంగా కళ్ళెదుట సాక్షాత్కరించే సత్యమై నిలిచి ఎందరో జీవితాలకు దైవిక ఆపన్న హస్తాన్ని అందించే అమరుల ఆలంబనగా భక్తలోకానికి అందిరావడం నిజంగా ఎంతో హర్షించవలసిన విశేషం...

శ్రీలక్ష్మీనారసిమ్హ స్వామివారు అతిత్వరలో వారి గర్భాలయంలో షోడశకళాప్రపూర్ణులై కొలువై,
ఈ కలియుగ భక్తుల ఈతిబాధలను ఛీల్చి చెండాడే ఉగ్రనారసిమ్హుడిగా ఒకవైపు,
భక్తుల పాలిటి కొంగుబంగారమై ఉండే సౌమ్య నారసిమ్హుడిగా మరోవైపు,
వర్ధిల్లుతూ,
దేవాదాయధర్మాదాయ శాఖచే
కొత్తగా ప్రవేశపెట్టబడిన బెల్లం లడ్డూల ప్రసాదం కూడా భక్తుల్లెల్లరికి బాగా అందుబాటులోకి
రావాలని ఆకాంక్షిద్దాం...😊👏🍨💐🤨🍟🍕

లక్ష్మీపతే కమలనాభ సురేశ విష్ణోః
యఙ్ఞేశ యఙ్ఞ మధుసూదన విశ్వరూప
బ్రహ్మణ్య కేశవ జనార్ధన వాసుదేవ
లక్ష్మీనృసింహ మమ దేహి కరావలంబమ్...🙏

https://twitter.com/KTRTRS/status/1403923427245780994?s=19



Monday, June 14, 2021

The power of altruistic communication...!

Shree, some abc person, talks to another xyz person say for some 30 mins or so, to assess / judge the person on the other side...

and many people often forget the fact that the person on the other side too is assessing / judging the former internally, albeit in silence, while he/she responds to all the queries...

Most of the people, be it in an official interview or a professional discussion or a generic group discussion or as a matter of fact even in a very casual gossip, exchange not only ideas and opinions about a multitude of topics via their talks but also knowingly or unknowingly create an impression of the others in-line to the 
on-going discussion or gossip.....

which can go to the extent of judging a person's suitability to consider or believe them for whatsoever situational requirements...

One can understand this very well from

The very first communication between Lord Hanuman and  
Lord ShreeRaama/Lakshmana...

The discussion between the king of apes, Sugreeva and Lord ShreeRaam/Lakshman when he doubts the latter's abilities to kill his brother Vaali as promised during the friendship treaty arranged by Lord Hanuman...

and many other explanations from ShreemadRaamaayana Pravachanams as explained by sadguru ShreeChaaganTi gaaru.... 

I would like mention a few points, specifically about 

Accommodative
Assertive 
Dictative

communicative patterns....

that play a vital role in many a situation,
especially when it is important to arrive at crucial decisions that govern the lives of many based on the decision taken with the available ideative metrics gathered from all the discussions...

1. When a person is called in for a professional discussion or an interview in general terminology....

A superior, say A,  on the other side says 
" Sit Down..."

Another superior, say B,  on the other side says
" Have your seat...."

This very first phrase uttered tells
whether that superior is

Accommodative or 
Assertive or 
Dictative

in their personality... 

" Take your seat...." reflects an "Accommodative communication pattern"
 
" Sit Down..." reflects a
"Dictative communication pattern"

So, if one says that the lady who has exhibited her superiority by uttering
" Take your seat...." 
can be accommodative in most of her executions, it isn't any exaggerated statement for that it is a proven fact in many a case studies...

and if one says that the man who has exhibited his superiority by uttering
" Sit Down...." is dictative in most of his executions, it certainly would be so...

2. When a superior, say C, addresses a large group of people reflecting many a statement of dictative communication patterns,
and another superior, say D,  
addresses a large group of people reflecting many a statement of Accomodative and Assertive communication patterns, 

it is indeed a sufficient amount of yardstick available for someone to assess their credibility and style of handling a situation and of course that of the people involved in it...

For a normal person, it may be difficult to understand these advanced processes of 
" Arriving at the behavioral executions based on the communicative patterns.."

However, for a few, it is a subject that they have mastered to the extent of using it as an efficient tool to filter and extract the good out of the generic...

In the well known Shree Rudra Chamakam,  the phrases 

" Vaakchamay " 
and 
" DakShashchamay" 

have embedded the power of this communicative science to bless the devotees who listen to / recite them
(with the appropriate ShRuthi required to recite them) all that is needed to extract the honey of " behavioral gist " from the flowers of  " communicative patterns "...

ॐ अग्ना॑विष्णो स॒जोष॑से॒माव॑र्धन्तु वां॒ गिरः॑ । द्यु॒म्नैर्-वाजे॑भिराग॑तम् । वाज॑श्च मे प्रस॒वश्च॑ मे॒ प्रय॑तिश्च मे॒ प्रसि॑तिश्च मे धी॒तिश्च॑ मे क्रतु॑श्च मे॒ स्वर॑श्च मे॒ श्लोक॑श्च मे॒ श्रा॒वश्च॑ मे॒ श्रुति॑श्च मे॒ ज्योति॑श्च मे॒ सुव॑श्च मे प्रा॒णश्च॑ मे‌உपा॒नश्च॑ मे व्या॒नश्च॒ मे‌உसु॑श्च मे चि॒त्तं च॑ म॒ आधी॑तं च मे॒ वाक्च॑ मे॒ मन॑श्च मे॒ चक्षु॑श्च मे॒ श्रोत्रं॑ च मे॒ दक्ष॑श्च मे॒ बलं॑ च म॒ ओज॑श्च मे॒ सह॑श्च म॒ आयु॑श्च मे ज॒रा च॑ म आ॒त्मा च॑ मे त॒नूश्च॑ मे॒ शर्म॑ च मे॒ वर्म॑ च॒ मे‌உङ्गा॑नि च मे॒‌உस्थानि॑ च मे॒ परूग्ं॑षि च मे॒ शरी॑राणि च मे ॥ 1 ॥

So, someone is not supposed to be called some random haphazard decision maker when it comes to taking important decisions or making crucial statements, based on the available, even if meagre, resources of any and every kind because one need not taste the entire dish to state what would it be like up until it's last scoop in most of the cases... ( barring any exceptions...)

So when some E has asked,

" I can see an Oasis over there at a distant horizon... Could you please tell me if the path I am treading is the most effective path to reach the same to quench my thirst..."

and when some F has answered 

" I don't know whether you would be able to reach any water ponds if you travel this way... Even if you reach it, there would be many crocodiles and snakes in the pond...
So why don't you simply go elsewhere and search for another pond to quench your thirst..."
 
and when some G has answerd,

" I have never seen anyone being unable to reach it... It is a matter of patience and perseverance that takes you there successfully to quench your thirst...
And do remember to be careful with some hostile entities in-there while you quench your thirst...."

the delta difference between the aforementioned communicative patterns is the most viable source of arriving at the well wishers to listen to and to be successful...

Science always remains a Science whether it is Rocket Science or Matchstick science...

Magnitudes may differ, Methods may differ, Mediums may differ, but matter always remains the same...!

Friday, June 4, 2021

శ్రీ తన్నీరు హరీష్ రావ్ గారికి,(గౌ || రాష్ట్ర ఆర్ధికశాఖామాత్యులు) హార్దిక 50వ జన్మదినోత్సవ శుభాభినందనలు....😊🍟🍨💐🍕

శ్రీ తన్నీరు హరీష్ రావ్ గారికి,
(గౌ || రాష్ట్ర ఆర్ధికశాఖామాత్యులు) హార్దిక 50వ జన్మదినోత్సవ శుభాభినందనలు....😊🍟🍨💐🍕

5 పదుల మీ జీవితంలో, యావద్ భారత దేశంలోనే రికార్డ్లను సృష్టించిన మీ అసామాన్య ప్రజాదరణగల రాజకీయప్రాస్థానం ఒకెత్తైతే,
ఎన్నో ప్రాంతాల్లో ముఖ్యంగా మీరు ప్రాతినిధ్యం వహించే సిద్ధిపేట నియోజకవర్గంలో మీకు గల నిఖార్సైన గౌరవమరియాదలు మీ యొక్క నీతి, నిజాయితి, నిస్వార్ధత, నిబద్ధతకు, కొలమానాలుగా ఎంతోమంది చేత కొనియాడబడే సత్యం,
మీయొక్క అలుపెరగని నిరంతర ప్రజాసంక్షేమ కాంక్షిత రాజనీతి ప్రస్థానానికి గీటురాయి.....

ఒక ఉన్నత స్థాయి అధికారం ఐశ్వర్యం ఎంతో మందికి దైవానుగ్రహంగా, వారి వారి పూర్వుల, పెద్దల పుణ్యపరిపాకమై లభిస్తాయి....

వాటిని ఆలంబనగా గావించి కొన్ని కోట్ల మంది హృదయాల్లో గౌరవమరియాదలను సంపాదించుకోవడం అనేది అటువంటి
జీవితానికి సార్ధకతను ప్రసాదించే జీవనరీతి....

' ది మోస్ట్ ఎఫిషియెంట్ ట్రబుల్ షూటర్ ' గా వాసికెక్కిన మీ రాజనీతిచతురత, ఎల్లరినీ ఆకట్టుకునే మీ సలలిత మృదువాక్యసరళి, ఎల్లరికీ అందుబాటులో ఉండే సాధారణ జీవనశైలి,
అవతలి వ్యక్తి ఎవరు ఏంటి అనేదానితో సంబంధం లేకుండా ఇతరుల్లో ఉండే గొప్పదనాన్ని మనస్ఫూర్తిగా అభినందించగల విశాలమైన మనోసంస్కారం,
ఇత్యాదిగా ఉండే మీ సుగుణసంపద 
మీ వ్యక్తిత్వాన్ని మరింతగా ఇనుమడింపజేస్తూ,
మీ యశోచంద్రికలు కలకాలం వర్ధిల్లుగాక అని ఆకాంక్షిస్తూ, మీకు హార్దిక పంచవింశతి జన్మదినోత్సవ శుభాభినందనా నమస్సులు...👍😊🍟🍨💐🍕👏

Wishing the dynamic THR, a very happy and prosperous 50th birthday....
May God bless you and your family with everlasting Health, Happiness, Peace and
Prosperity to make you a much trusted and dependable source for many people and thus let your glory reach those heights of
eternal admiration cherished by one and all for all the years to come.....👏🍕💐🍨🍟😊👍 



శ్రీ ప్లవనామ సంవత్సర వైశాఖ బహుళ దశమి పూర్వాభాద్ర నక్షత్ర ప్రయుక్త శ్రీహనుమజ్జయంత్యుత్సవ శుభాభినందనలు....😊👏🍕💐🍨🍟

శ్రీ చాగంటి సద్గురువులు శ్రీమద్రామాయణ ప్రవచనంలో బోధించినట్టుగా

శ్రీమహావిష్ణువుయొక్క దశావతారాల్లో 5వ అవతారమైన శ్రీవామనమూర్తి విశ్వరూపాన్ని దాల్చి త్రివిక్రమాకృతితో యావద్ విశ్వాన్ని తన కుడి పాదంతో పాదాక్రాంతం గావించిన సమయంలో ఆ ఆబ్రహ్మాండపర్యంత శ్రీపాదానికి ప్రదక్షిణ నమస్కారము ఆచరించిన ఘనులుగా వినుతికెక్కిన జాంబవంతులవారే మేఘనాథుడి మాయాయుద్ధాంతర్గత నాగాస్త్ర బంధన సమయంలో యావద్ శ్రీరాముడి వానరసేన రామలక్ష్మణులతో సహా
అత్యంత విషపూర్తిమైన నాగబంధనములతో బాధించబడుతున్న సమయంలో

అంతటి జాంబవంతుల వారు విభీషణుడిని
" హనుమంతుడు క్షేమమేనా...? " అని
అడిగినప్పుడు....

విభీషణుడు
"అదేంటి ఇంతటి ఘోరమైన విపత్కర పరిస్థితుల్లో మీరు 'శ్రీరామలక్ష్మణులు క్షేమమేనా ' అని అడుగుతారనుకుంటే....
హనుమంతుల వారి గురించి అడుగుతున్నారేంటి...?" అని తిరిగి ప్రశ్నించగా....

" హనుమంతుడు క్షేమంగా ఉంటేనే శ్రీరామలక్ష్మణులతో సహా మిగతా అందరు క్షేమంగా ఉండగలరు...."

అని జాంబవంతుల వారు విభీషణుడినికి  ఇచ్చినసమాధానంలో ఆంజనేయస్వామి వారి గొప్పదనం ఏంటో మనకు శ్రీవాల్మీకి మహర్షి వారు ఎంతో ఘనమైన రీతిలో శ్లోకపరచగా శ్రీ చాగంటి సద్గురువులు అంతే ఘనమైన రీతిలో విశదపరిచినారు....

అగ్నిసాక్షిగా కపిరాజు సుగ్రీవుడితో శ్రీరామలక్ష్మణుల మైత్రిని నెరపిన ఘట్టం నుండి
శ్రీరాముడి 14 సంవత్సరాల వనవాస సమయం ముగిసిన వెంటనే తన అన్న అయోధ్యకు తిరిగి చేరుకోకుంటే దేహత్యాగం చేస్తానని వచించిన
భరతుడు ఇక తనువుచాలిద్దాం అని ప్రాయోపవేశం చేయబోయే భరతుడి దెగ్గరికి టైంకి చేరుకొని శ్రీసీతారామలక్ష్మణుల పుష్పక విమానాగమన సందేశాన్ని విన్నవించి భరతుడిని కాపాడి శ్రీసీతారాముడు
లక్ష్మణభరతశతృఘ్ణ సహితుడై శ్రీకోసలామహాసామ్రాజ్య చక్రవర్తిగా సిమ్హాసనారూఢుడై కొలువయ్యేంత వరకు
శ్రీరామాయణం మొత్తం నిజానికి
శ్రీహనుమాయనమే...!

ఎందుకంటే తనకంటే అభిన్నమైన తేజస్సైన హర తేజస్సు, సూర్యవంశ సాంజాతుడై దేవకార్యం నిమిత్తమై నరుడిగా కౌసల్యానందనుడిగా దశరథతనయుడిగా జన్మించిన శ్రీరాముడి యొక్క హరి తేజస్సుతో సమ్మిళితమై హరిహరులిరువురుకి కూడా తన శక్తి నుండి సృజించబడిన త్రిశూల / సుదర్షన ఆయుధాలను అందించిన సూర్యనారాయణుడి తేజస్సు భువిపై సుగ్రీవ కపిరాజు గా ఉన్నందువలన,

శ్రీరాముడు, శ్రీఆంజనేయుడు, శ్రీసుగ్రీవుడు ఈ ముగ్గురూ ఒక్క జట్టుగా ఏర్పడిన తదుపరి మాత్రమే పౌలస్త్యవధ సాధ్యమయ్యేది....

అనాడు హరి హరునకు దివ్యశరమై సమకూరినప్పుడే త్రిపురాసుర వధ సంభవమైన రీతిగ
ఇక్కడ
హరిహరసూర్య తేజస్సుల అంశలో ప్రభవించిన శ్రీరామశ్రీఆంజనేయ
శ్రీసుగ్రీవ కూటమి ఏర్పడిన తదుపరి మాత్రమే
నరవానర సంఘాతంగా రావణుడు సమూలంగా
నశించిపోవడం జరిగేది.....

కాని ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే
ఆంజనేయుడు చిన్నప్పుడే సూర్యుడిని మధురఫలం గా భావించి మింగుదామని నింగికెగసిన ఆ వృత్తాంతం లో ఇంద్రుడి వజ్రాయుధ ప్రహారంతో వాయుదేవుడి ప్రకోపంతో స్తంభించిన లోకాన్ని కాపాడేతరుణంలో సకల దేవతలు ఆంజనేయుడికి తమ తమ శక్తులను అందించి సకల దేవతా శక్తిసంఘాతంతో అలరారే ఏకైక భూగత ప్రాణిగా వానరుడిగా ఉన్న అనిర్జిత అమేయ శక్తి  పుంజము ఆంజనేయుడు....!!

కాబట్టే కేవలం వయసులో మాత్రమే కాకుండా ఎంతో జ్ఞ్యానవృద్ధుడైన జాంబవంతుల వారు విభీషణుడిని అట్లా అడిగారు....

నిజానికి కాంచన లంకకు శ్రీరాముడి దూతలుగా వెళ్ళిన ఆంజనేయ అంగదులు
రావణుడిని ఆనాడే సమ్హరించగల బలసంపన్నులు...
కాని రాజాజ్ఞ్య, రామాజ్ఞ్య లేనందున
వెళ్ళిన పని మాత్రమే సంపూర్ణం గావించి తిరిగివచ్చారు.....

1. భరతఖండం యొక్క దక్షిణ తీరం నుండి లంకకు....

2. లంకనుండి భరతఖండం యొక్క దక్షిణ తీరానికి...

మరియు

3. లంకనుండి హిమాలయ పర్వతసానువుల్లోని
సంధానకరణి, సావర్ణకరణి, విశల్యకరణి, సంజీవని ఓషధీ మూలికలు గల గంధమాధన పరిసర పర్వతప్రాంతానికి....

4. అక్కడి నుండి ఆ పర్వతాన్ని పెకిలించి లంకకు...

5. మళ్ళీ లంకనుండి గంధమాధన పరిసర పర్వతప్రాంతానికి ఆ ఓషధీ పర్వతాన్ని పెకిలించిన స్థానంలోనే పునః స్థాపించడానికి....

ఇవ్విధంగా ఆజనేయుడు 5 సార్లు సముద్రాన్ని లంఘించడం మనం శ్రీమద్రామాయణంలో గమనించే సత్యం......

మరియు చివరి సారిగా భరతుడికి రావణవధానంతరం శ్రీరామాగమన వార్తను తెలియజేయడానికి శ్రీరామసేన తో విచ్చేస్తున్న పుష్పకవిమానం కంటే ముందే అయోధ్యకు చేరుకోవడం....

సొ మొత్తం 6 సార్లు హనుమంతులవారు సముద్రాన్ని లంఘించారు అనే సత్యం మనకు శ్రీరామాయణం తెలియజేస్తుంది....

ఇదంతా బానే ఉంది....

ఏ మూలికలను సంగ్రహించి తీసుకొనిరావాలో అనే సందేహంలో ఉన్న హనుమంతుల వారు ఏకంగా ఓషధీ పర్వతాన్నే అవలీలగా తీసుకొచ్చి తిరిగితీసుకెళ్ళగల విరాట్రూపధారులైనప్పుడు....

అసలు అంత కష్టపడి భరతఖండమునుండి కాంచనలంకకు వారధి కట్టడం ఏంటి....

నలుడికి గల సిద్ధమహిమతో నీటిపై తేలే శ్రీరామ నామ ముద్రాంకిత రాళ్ళ దొంతరగా ఉన్న వారధిపై మెల్లగా నడుచుకుంటూ సముద్రాన్ని దాటి లంకకు చేరుకోవడం ఏంటి....

కొన్ని వేల మైళ్ళ దూరంలో ఉన్న పర్వతాన్నే అటు నుండి ఇటు... ఇటు నుండి అటు తీసుకెళ్లిన హనుమంతుల వారు
శ్రీరామసేనను అట్లే తన విరాడ్రూపంపై కొలువై ఉండేలా చేసి నిమిషాల్లో లంకకు తరలించి ఉండొచ్చు కద..??

అనే సందేహం అధ్యాత్మ జిజ్ఞ్యాసాపరులైన కొందరికైనా వచ్చి ఉండాలి...

ఇక్కడ ఉన్న అధ్యాత్మ తత్త్వ విశేషాలేంటో చూద్దాం...

రుద్రాంశ సంభూతుడైన ఆంజనేయ స్వామి వారు  భువిపై వానరుడై ప్రభవించిన తదుపరి

1. శ్రీరాముడి నుండి సీతమ్మవారికి అభిజ్ఞ్యానంగా అందివ్వబడిన శ్రీరాముడి అంగుళీయకం అందుకున్న హనుమంతుల వారి శక్తి ఒక స్థాయి...

2. ఆదిపరాశక్తి భూదేవి అంశగా అయోనిజగా జనకుడి పుత్రికగా జానకిగా ప్రభవించి,
బాల్యంలోనే ఎవ్వరికీ సాధ్యమవ్వని పని, శివధనస్సు గల మంజూషను ( ధనస్సును భద్రపరిచే పెట్టె లాంటి వస్తువు ) అవలీలగా చేతితోనే లాగి పక్కకు పెట్టిన అసామాన్య శక్తిసంపన్నురాలైన సీతాదేవిని అశోక వనంలో సందర్శించిన తదుపరి
సీతమ్మ తన చూడామణిని శ్రీరాముడికి అభిజ్ఞ్యానంగా ఇవ్వమని హనుమంతులవారికి అందించిన తరువాత
హనుమంతుల వారి శక్తిది మరొక స్థాయి..

:
ఒకసారి శ్రీరుద్ర లఘున్యాసంలోని ఈ క్రింది సరళిని మీరు గమనించగలిగితే

"
ఆత్మని దేవతాః స్థాపయేత్ ॥

ప్రజననే బ్రహ్మా తిష్ఠతు ।
పాదయోర్-విష్ణుస్తిష్ఠతు ।
హస్తయోర్-హరస్తిష్ఠతు ।
బాహ్వోరింద్రస్తిష్టతు ।
జఠరేఽఅగ్నిస్తిష్ఠతు ।
హృదయే శివస్తిష్ఠతు ।
కంఠే వసవస్తిష్ఠంతు ।
వక్త్రే సరస్వతీ తిష్ఠతు ।
నాసికయోర్-వాయుస్తిష్ఠతు । నయనయోశ్-చంద్రాదిత్యౌ తిష్టేతాం ।
కర్ణయోరశ్వినౌ తిష్టేతాం ।
లలాటే రుద్రాస్తిష్ఠంతు ।
మూర్థ్న్యాదిత్యాస్తిష్ఠంతు ।
శిరసి మహాదేవస్తిష్ఠతు ।
శిఖాయాం వామదేవస్తిష్ఠతు ।
పృష్ఠే పినాకీ తిష్ఠతు ।
పురతః శూలీ తిష్ఠతు ।
పార్శ్యయోః శివాశంకరౌ తిష్ఠేతాం ।
సర్వతో వాయుస్తిష్ఠతు ।
తతో బహిః సర్వతోఽగ్నిర్-జ్వాలామాలా-పరివృతస్తిష్ఠతు ।
సర్వేష్వంగేషు సర్వా దేవతా యథాస్థానం తిష్ఠంతు ।
మాగ్ం రక్షంతు ।
"

15 వ న్యాసస్థానమైన శిఖ స్థానమునకు అధిదేవతగా కొలువైఉండే వామదేవుడి,
( అనగా రుద్రుడి పంచముఖ తత్త్వంలో
ఉత్తరాభిముఖమైన వామదేవ వదనానికి ప్రతీక )
శక్తిని తనలో ఇముడ్చుకున్న సీతమ్మవారి చూడామణిని స్వీకరించిన హనుమంతుల వారిలో

హర శక్తి ( హస్తయోర్-హరస్తిష్ఠతు )

హరి శక్తి ( శిఖాయాం వామదేవస్తిష్ఠతు )

ప్రత్యక్షంగా సమ్మిళితమై హరిహరాత్మక శక్తిపుంజమై వెలుగొందిన హనుమ యొక్క స్థాయి ఏ యోగభూమికలకు కూడా అందనంత ఉన్నతమైనది...

అందుకే, సీతాదేవి గా ఉన్న తన శక్తి దూరమైన శ్రీరాముడు ఇచ్చిన ఉంగరం ఉన్నప్పుడు..
" హుం....నేనా ఇంత పెద్ద సముద్రం దాటగల ధీరుడను....
అని ఒకింత నిరాశానిస్పృహతోనే ఉన్న హనుమంతుల వారిని జాంబవంతుల వంటి మహావీరులు ఉత్తేజపరిచి తన శక్తిని ప్రకటింపజేసారు...

"అయ్యో..కుయ్యో...ఇప్పుడెట్లా...హుం...ఉం"
ఇత్యాదిగా ఒక భూగత ప్రాణికి సహజంగా ఉండే నిరాశానిస్పృహలు.....
వానరుడిగా ఉన్న హనుమంతులవారికి కూడా అంతే సహజంగా ఆపాదించబడినవి....

అశోకవనంలో బంధీగా ఉన్న 
సీతమ్మ తన శిఖ స్థానంలో ధరించిన ఆ చూడామణిని శ్రీరాముడికి అందివ్వమని హనుమంతులవారికి అనుగ్రహించిన తరువాత మీరు హనుమంతుల వారి శక్తిని గమనిస్తే ఒక్కసారిగా వారిలో
అంతర్గతంగా సమ్మిళితమైన హరిహరాత్మక శక్తులకు శ్రీ శక్తి అనగా ఆదిపరాశక్తి యొక్క శక్తి సంఘటితమై ఆ శాక్తేయ శౌర్యంతో రెచ్చిపోయిన హనుమంతుల వారిని ఏ వీరుడు పట్టలేనంతటి అరివీరభయంకరుడిగా శ్రీఆంజనేయుడి శక్తి రూపాంతరం చెందడం...

"నేనా సముద్రము దాటగల ధీరుడను..."
అన్న హనుమంతుడు...,

"ఎవడ్రా నాకు ఎదురునిలిచి గెలిచేది ఈ భువిపై...." అనే స్థాయిలో విరుచుకుపడి రావణుడి మంత్రుల వధ, అక్షకుమార వధ, కాంచనలంకా దహనం లో ప్రదర్శించిన చండప్రచండ శాక్తేయశౌర్యప్రతాపాలకు ఎవ్వరైనా సరే ఔరా అని అనితీరవలసిందే...

ఇక్కడ హనుమంతుల వారు పైకి కథాంశంగా శ్రీరామాయణంలోని ఒక ముఖ్య వక్తిగా, శ్రీరాముడి దూతగా, బంటుగా, తన విహిత కర్తవ్యాలను సాధించుకుంటూ ముందుకు వెళ్తున్న వైనంలో అంతర్లీనంగా బోధించబడే అధ్యాత్మ తత్త్వ జ్ఞ్యానమంజరులను సద్గురుబోధాంతర్గతంగా సాధనలో ఒడిసిపట్టగలిగితే శ్రీమద్రామాయణం నిజంగా ఒక అత్యద్భుత అధ్యాత్మ యోగార్ణవం....

శ్రీచాగంటి సద్గురువులు వివరించినట్టుగా ఆదిపరాశక్తిగా పురుషకారిణిగా

అమ్మవారి దయతోనే అయ్యవారి కరుణ సంపూర్ణంగా లభించి తరించడం సంభవమయ్యేది...

"నేను వెతుకుతున్నాను..." అని అనుకున్నంతసేపు సీతమ్మ దర్శనం లభించలేదు...

"వెతికేది నేనే అయినా శ్రీరామకార్యంలోని ఈ వెతుకులాట నీ అనుగ్రహం వినా సఫలీకృతం కానేరదమ్మా..."
అని ఆ ఆదిపరాశక్తికి, సీతాదేవికి
నమస్కరించిన తదుపరి మాత్రమే సీతమ్మ దర్శనం లభించడం జరిగింది....

అదే విధంగా

అన్నమయ
ప్రాణమయ
మనోమయ
విజ్ఞానమయ
ఆనందమయ

కోశములనబడే జీవుడి పంచకోశాల ఆంతరమున స్వప్రకాశ శక్తిపుంజమై వెలుగొందే ఆ త్రికోణాంతరదీపిక....

మనంగావించే శరణాగతికి తన స్వస్వరూపానుసంధానంతో జీవుడిని అనుగ్రహించడం సంభవిస్తుంది....

చతుర్దశ భువనాలను శాసించే శ్రీభువనేశ్వరి బీజాక్షరమైన హ్రీంకారోపాసనతో నిత్యం ఒక జ్వలించే శక్తిపుంజమై వెలిగే హనుమంతులవారు శివశక్త్యాత్మక
దేవతామూర్తి...

అందుకే శ్రీ చాగంటి సద్గురువులు మనకు ఉపాసనాపరమైన 2 విశేషాలను బోధించి అనుగ్రహించారు...

1. అమ్మవారు మరియు హనుమంతులవారు...
ఈ ఇరువురు కూడా అత్యంత వేగంగ, శక్తివంతంగా  భక్తులను అనుగ్రహించే దేవతా స్వరూపాలుగా శాస్త్రం బోధించి అనుగ్రహించింది...

2. కేవలం చేతివేళ్ళతో "హనుమ" అని భూమి మీద వ్రాసి నమస్కరించినంత మాత్రాన
హనుమదనుగ్రహం సద్యోలభ్యమై భక్తులను సమ్రక్షిస్తుంది..

ఇక తిరుగులేనిది, అత్యంత శక్తివంతమైన పంచముఖ ఆంజనేయస్వామి వారి ఆరాధన యొక్క
విశేషం ఎల్లరికీ తెలిసిందే...
శ్రీసమర్ధరామదాసుగారిని అనుగ్రహించి ఛత్రపతి శివాజీమహరాజ్ గారితో భారత సనాతన ధర్మవైభవాన్ని దేశం నలుచెరగులా మళ్ళీ దేదీప్యమానంగా ఉజ్జీవింపజేసిన ఘనత ఆ పంచముఖ ఆంజనేయునిదే కద....

ఇవ్విధంగా శ్రీఆంజనేయస్వామి వారు
నాడు, నేడు మరియు ఎల్లప్పుడూ భక్తులను సమ్రక్షించే ఘనదైవమై సప్తచిరంజీవుల్లో ఒకరై శాశ్వతత్వాన్ని , అమరత్వాన్ని, దేవత్వాన్ని, దివ్యత్వాన్ని సంతరించుకున్న మహాయోగీశ్వరుడైన రీతిని శ్రీతాళ్ళపాక అన్నమాచార్యుల సంతతి వారు ఎంతో ఘనంగా ఈ క్రింది సంకీర్తనలో భక్తులెల్లరికి అందించడం విదితమే....

సర్వం శ్రీలక్ష్మీవేంకటేశ్వర సమేత
శ్రీకొండగట్టు వీరాంజనేయస్వామి శ్రీచరణారవిందార్పణమస్తు.....🙏😊🍟🍨💐

http://annamacharya-lyrics.blogspot.com/2020/05/875-hariki-lamkini-hamtaku.html?m=1

hariki lamkiNI hamtaku amtarameTTunnadi - హరికి లంకిణీహంత కంతర మిట్టున్నది
Tuned & Sung by Sri Sathiraju Venumadhav in Raga : Hamsadhwani,
Album : Nivugaliginachalu

హరికి లంకిణీహంత కంతర మిట్టున్నది
కరుణ నింత మన్నించె కమలావిభుఁడు  

విశ్వరూపు చూపినాడు విష్ణుఁడు దొల్లి యట్టె
విశ్వరూపాంజనేయుఁడు వీఁడె చూపెను
శాశ్వతుఁడై యున్నవాఁడు సర్వేశ్వరుఁడు వీఁడే
శాశ్వతుఁడై యున్నవాఁడు జగములో నీతఁడు  

ప్రాణవాయుసంబంధి పరమాత్మఁడు అట్టె
ప్రాణవాయుసుతుఁడు పవనజుఁడు
రాణింప రవివంశుఁడు రామచంద్రుడు తాను
నాణెపు రవిసుతుని నమ్మిన ప్రధాని  

దేవహితార్థముసేసఁ ద్రివిక్రముఁడు అట్టె
దేవహితార్థమే జలధిలంఘనుఁడు
శ్రీవేంకటేశుఁడు చిన్మయమూర్తి తాను
కోవిదుఁడు జ్ఞానమూర్తి గొప్పహనుమంతుఁడు


Thursday, June 3, 2021

ShreeVaiShaakha bahuLa daShami poorvaabhaadra nakShatra prayukta Sreehanumajjayanti Subhaabhinandanalu....🍨👏🍕😊🙏💐


While there are many days in a year that are being celebrated as Hanumajjayanthi across various locations as per their local traditions and customs, as per Shree ChaaganTi sathguru gaaru, 
" ParaasharaSamhita " is the authorized literary treasure that is ought to be considered as the standard when one has to state or refer anything related to Lord ShreeHanumaan ji....

Because each individual according to his or her interest / hobby / spend a lot of time in the research saga of a given subject and thus they end up holding the most comprehensive and authoritative information / database that is an embodiment of A to Z regarding the entity / subject / person in question....

Likewise, Shree ParaasharaMaharshi 
( sage VedaVyaasa's father ) has done an extensive research on Lord Hanuman and all of his great historical and spiritual endeavours as explained by Shree Vaalmiki Ramayanam and all the other available spiritual literatti to house the magnanimity of Lord Hanuman in his work titled "ParaaSharaSamhita" as per which the Vaishaakah Bahula Dashami Poorvaabhaadra Nakshatram is considered as HanumadJanmadiwas and thus the same is celebrated as Hanumajjayantyutsawam.. 

We have many famous historical / spiritual personalities amongst whom lord Hanuman is the most celebrated personality for everything that he was and he is and he would be....

A mystical ape who suddenly appears in the disguise of a Saadhu in the Kishkindha kaanDa of ShreeVaalmiki SundarakaanDa and approaches ShreeRaama and Lakshmana who were walking their way to find out the wherabouts or Seetaamaata, and asks them about their details and many other questions about their forest voyage....

Lord ShreeRaama looks at this so called Saadhu and smiles at him for his exceptionally strong communicative skills embedded with utmost respect and honor and then and there itself cautions his brother Lakshmana to be extremely careful with this magnanimous personality who is a personified intellect of 4 Vedas and an embodiment of all the wisdom one can talk about.....

The below ShreeVaalmikiRaamaayana Shlokam from Kishkindha kaanDa tells us how much of equal respect did Lord Shree Raam gave Hanuman while talking to Lakshmana about explaing the magnanimity of the so called Saadhu....

**********************************************
< Copied the following excerpt from a Raamayana Blog ( @ http://yathirajanidhi.blogspot.com/2013/01/ungal.html )
When separated from godess SrI sithai and when looking for Her in the forests, SrI rAma and SrI lakshmaNa arrived at a place called pampA saras. Upon detecting the presence of the two mighty brothers, thinking they might be sent by vAli, sugrIva sent SrI hanumAn to check on them. When hanumAn saw the two brothers, he introduced himself saying that he was the son of vAyu, the minister of sugrIva and was sent to inquire about who the two brothers. Hearing this, SrI rAma turned to lakshmaNa, asking him to respond carefully (with jAagratta). Our AchAryAs question why SrI rAma should ask lakshmaNa to respond carefully when hanumAn was actually talking to SrI rAma. It is beautifully explained here that this was so because per conventions, a minister (manthri) must always be reciprocated by a person commensurate to his level, i.e. another minister. Hence, lakshmaNa was asked to respond. Moreover, he was asked to respond with care. SrI rAma said so because the utterances of hanumAn reflected extraordinary brilliance. SrI rAma celebrates the vAk vaibhavam of hanumAn, saying –
“nAn rigvEda vinItasya nA yajurvEda dhArina:|
nA sAma vEda viduSha: shakhyam Evam vibhAsitum ||”
SrI rAma says that not a non-scholar of the rig, sAma and yajur vEda can speak like this (na arigvEda…na ayujurvEda…). This double negation implied the positive. SrI hanumAn was an exemplified scholar marked by the knowledge of all the vEdAs and his speech was illustrative of this. Thus, SrI rAma, who is glorified as “vAkmi SrImAn”, glorifies the vAk vaibhavam of SrI hanumAn.
AchAryAs comment here is that a vidvAn celebrates another vidvAn!
**********************************************

Now let's discuss some interesting facts that heralds the magnanimity of 3 super heros of ShreeRaaamaayanam....

Lord ShreeRaama
Lord Lakshmana
Lord Hanuman

Q 1. Why did Lord ShreeRaam smile at and extolled Hanuman in such a majestic way that he hasn't used to praise anyone in the entire ShreemadRaamaayanam...?

Q 2. How did he already knew that the so called Saadhu is Lord Hanumaan...??  

Q 3. If they both already knew very well about each other, then why didn't lord Hanuman ji made his entry sometime earlier itself and why only in that moment 
of the KishkindhakaanDa when he was sent by his ape master Sugreeva to find out the details of those 2 young charming dudes venturing out alone in the danDakaaranyam in a rather bizzare attire of Rishis / Saadhus / Santh folks yet holding the mighty weapons of bow and arrows which would confuse one and all to ascertain whether they are warriors or just wanderers..?

1. Why did Lord ShreeRaam smile at and extolled Hanuman in such a majestic way that he hasn't used to praise anyone in the entire ShreeRaamaayanam...?
&
2. How did he already knew that the so called Saadhu is Lord Hanumaan...??  

While the episode of "Tripuraasuravadha" already makes it very clear that both Hari, ( who took the form of a magnanimous arrow to slay down the Tripuraasura ) and Hara ( who thanked Hari saying that he would serve ShreeHari's avataar as his master for all the help rendered in moulding himself in to that powerful cosmic arrow )
have exchanged words about the Shree Raama and Shree Hanuman avataaraavirbhaavam in the treataayugam itself to put an end to the Raavanaasura,
it is to be understood that Hari and Hara are always that non-dual entity of the all pervading SadaaShiva parabrahma tattwam...
 
In one of my previous posts, I have explained the analogy of a Railway track's equidistant parallel running rails comparable to the Hari and Hara tattwam...
Just like those 2 so called individual rails together form a single railway track for a train to run properly,
the abhinna Hari Hara tattwam together establish the firm base required for a train called Universe to be run by them... 

One can figure out the approx distance of a train to be arrived on to the railway track from it's certain location by a few advanced acoustic procedures based on the magnitude of the vibrations running though them...

This is applicable to both the rails equally because a running train levies equal entropy on the both the rails that together form it's track and thus the metrics collected from both the rails would show the same results...

It's similar to the DNA structure of a father and a son that share the same helical pattern and the allied metrics....

If dad is a spider man then son too would be a spider kid....
If dad is an ant man then son too would be an ant kid....
If dad is a bat man then son too would be a bat kid....
If dad is an iron man then son too would be an iron kid....
If dad is a snake man then son too would be a snake kid....
and so on and so forth....

Anyways jokes apart....😁

So, going by the laws of the nature, 
the similarities across the entities of singularity will always be identically identifiable....Hence the relative equality amongst the entities sharing the same matrix of singularity will always be balanced.... 

Thus Lord ShreeMahaaVishnu in his ShreeRaamaavataaram has the same cosmic matrix of singularity that is embedded in Lord Hanuman....
Hence they know each other very well and thus have identified each other in a silent smile of their cosmic connectivity...

Hara Tejassu is like pressurised LPG where the high concentration of Methane would make it lethal and thus supposed to be handled much carefully....

Hari Tejassu is like the BioGas that has relatively less percentage of Methane however it remains equally powerful in terms of the fire form....

Should we speak in normal terminology,

Hara Tejassu will instantly burn down the target like what has happened in ManmadhaDahanam....
It's like hero Prabhaas chopping off a head instantly once the target is ascertained as shown in the BaahuBali movie....

Hari Tejassu can carry out the annihilation in a rather smooth fashion like what has happened in the BhruguMaharshidarpadahanam.....
If the target's hostility doesn't subside then Hari Tejassu will start gaining momentum and when the time is right in a smooth yet powerful manner the target's annihilation would be carried out...

Hence Lord ShreeRaam asks Lakshmana to remain extremely careful with the Hanuman, a person possessing HaraTejassu for that the latter would be like a sword sharpened on all the sides...

Now coming to Q3, 

ShreeVaiShaakha bahuLa daShami poorvaabhaadra nakShatra prayukta Sreehanumajjayanti Subhaabhinandanalu....🍨👏🍕😊🙏💐

While there are many days in a year that are being celebrated as Hanumajjayanthi across various locations as per their local traditions and customs, as per Shree ChaaganTi sathguru gaaru, 
" ParaasharaSamhita " is the authorized literary treasure that is ought to be considered as the standard when one has to state or refer anything related to Lord ShreeHanumaan ji....

Because each individual according to his or her interest / hobby / spend a lot of time in the research saga of a given subject and thus they end up holding the most comprehensive and authoritative information / database that is an embodiment of A to Z regarding the entity / subject / person in question....

Likewise, Shree ParaasharaMaharshi 
( sage VedaVyaasa's father ) has done an extensive research on Lord Hanuman and all of his great historical and spiritual endeavours as explained by Shree Vaalmiki Ramayanam and all the other available spiritual literatti to house the magnanimity of Lord Hanuman in his work titled "ParaaSharaSamhita" as per which the Vaishaakah Bahula Dashami Poorvaabhaadra Nakshatram is considered as HanumadJanmadiwas and thus the same is celebrated as Hanumajjayantyutsawam.. 

We have many famous historical / spiritual personalities amongst whom lord Hanuman is the most celebrated personality for everything that he was and he is and he would be....

A mystical ape who suddenly appears in the disguise of a Saadhu in the Kishkindha kaanDa of ShreeVaalmiki SundarakaanDa and approaches ShreeRaama and Lakshmana who were walking their way to find out the wherabouts or Seetaamaata, and asks them about their details and many other questions about their forest voyage....

Lord ShreeRaama looks at this so called Saadhu and smiles at him for his exceptionally strong communicative skills embedded with utmost respect and honor and then and there itself cautions his brother Lakshmana to be extremely careful with this magnanimous personality who is a personified intellect of 4 Vedas and an embodiment of all the wisdom one can talk about.....

The below ShreeVaalmikiRaamaayana Shlokam from Kishkindha kaanDa tells us how much of equal respect did Lord Shree Raam gave Hanuman while talking to Lakshmana about explaing the magnanimity of the so called Saadhu....

**********************************************
< Copied the following excerpt from a Raamayana Blog ( @ http://yathirajanidhi.blogspot.com/2013/01/ungal.html )
When separated from godess SrI sithai and when looking for Her in the forests, SrI rAma and SrI lakshmaNa arrived at a place called pampA saras. Upon detecting the presence of the two mighty brothers, thinking they might be sent by vAli, sugrIva sent SrI hanumAn to check on them. When hanumAn saw the two brothers, he introduced himself saying that he was the son of vAyu, the minister of sugrIva and was sent to inquire about who the two brothers. Hearing this, SrI rAma turned to lakshmaNa, asking him to respond carefully (with jAagratta). Our AchAryAs question why SrI rAma should ask lakshmaNa to respond carefully when hanumAn was actually talking to SrI rAma. It is beautifully explained here that this was so because per conventions, a minister (manthri) must always be reciprocated by a person commensurate to his level, i.e. another minister. Hence, lakshmaNa was asked to respond. Moreover, he was asked to respond with care. SrI rAma said so because the utterances of hanumAn reflected extraordinary brilliance. SrI rAma celebrates the vAk vaibhavam of hanumAn, saying –
“nAn rigvEda vinItasya nA yajurvEda dhArina:|
nA sAma vEda viduSha: shakhyam Evam vibhAsitum ||”
SrI rAma says that not a non-scholar of the rig, sAma and yajur vEda can speak like this (na arigvEda…na ayujurvEda…). This double negation implied the positive. SrI hanumAn was an exemplified scholar marked by the knowledge of all the vEdAs and his speech was illustrative of this. Thus, SrI rAma, who is glorified as “vAkmi SrImAn”, glorifies the vAk vaibhavam of SrI hanumAn.
AchAryAs comment here is that a vidvAn celebrates another vidvAn!
**********************************************

Now let's discuss some interesting facts that heralds the magnanimity of 3 super heros of ShreeRaaamaayanam....

Lord ShreeRaama
Lord Lakshmana
Lord Hanuman

Q 1. Why did Lord ShreeRaam smile at and extolled Hanuman in such a majestic way that he hasn't used to praise anyone in the entire ShreemadRaamaayanam...?

Q 2. How did he already knew that the so called Saadhu is Lord Hanumaan...??  

Q 3. If they both already knew very well about each other, then why didn't lord Hanuman ji made his entry sometime earlier itself and why only in that moment 
of the KishkindhakaanDa when he was sent by his ape master Sugreeva to find out the details of those 2 young charming dudes venturing out alone in the danDakaaranyam in a rather bizzare attire of Rishis / Saadhus / Santh folks yet holding the mighty weapons of bow and arrows which would confuse one and all to ascertain whether they are warriors or just wanderers..?

1. Why did Lord ShreeRaam smile at and extolled Hanuman in such a majestic way that he hasn't used to praise anyone in the entire ShreeRaamaayanam...?
&
2. How did he already knew that the so called Saadhu is Lord Hanumaan...??  

While the episode of "Tripuraasuravadha" already makes it very clear that both Hari, ( who took the form of a magnanimous arrow to slay down the Tripuraasura ) and Hara ( who thanked Hari saying that he would serve ShreeHari's avataar as his master for all the help rendered in moulding himself in to that powerful cosmic arrow )
have exchanged words about the Shree Raama and Shree Hanuman avataaraavirbhaavam in the treataayugam itself to put an end to the Raavanaasura,
it is to be understood that Hari and Hara are always that non-dual entity of the all pervading SadaaShiva parabrahma tattwam...
 
In one of my previous posts, I have explained the analogy of a Railway track's equidistant parallel running rails comparable to the Hari and Hara tattwam...
Just like those 2 so called individual rails together form a single railway track for a train to run properly,
the abhinna Hari Hara tattwam together establish the firm base required for a train called Universe to be run by them... 

One can figure out the approx distance of a train to be arrived on to the railway track from it's certain location by a few advanced acoustic procedures based on the magnitude of the vibrations running through them...

This is applicable to both the rails equally because a running train levies equal entropy on the both the rails that together form it's track and thus the metrics collected from both the rails would show the same results...

So, going by the laws of the nature, 
the similarities across the entities of singularity will always be identically identifiable....Hence the relative equality amongst the entities sharing the same matrix of singularity will always be balanced.... 

Thus Lord ShreeMahaaVishnu in his ShreeRaamaavataaram has the same cosmic matrix of singularity that is embedded in Lord Hanuman....
Hence they know each other very well and thus have identified each other in a silent smile of their cosmic connectivity...

Hara Tejassu is like pressurised LPG where the high concentration of Methane would make it lethal and thus supposed to be handled much carefully....

Hari Tejassu is like the BioGas that has relatively less percentage of Methane however it remains equally powerful in terms of the fire form....

Should we speak in normal terminology,

Hara Tejassu will instantly burn down the target like what has happened in ManmadhaDahanam....
It's like hero Prabhaas chopping off a head instantly once the target is ascertained as shown in the BaahuBali movie....

Hari Tejassu can carry out the annihilation in a rather smooth fashion like what has happened in the BhruguMaharshidarpadahanam.....
If the target's hostility doesn't subside then Hari Tejassu will start gaining momentum and when the time is right in a smooth yet powerful manner the target's annihilation would be carried out...

Hence Lord ShreeRaam asks Lakshmana to remain extremely careful with the Hanuman, a person possessing HaraTejassu for that the latter would be like a sword sharpened on all the sides...

Now coming to Q3, 

As stated by Sadguru ShreeChaaganTi gaaru in the highly magnanimous "SampoorNa Raamaayanam" Pravachanaalu,
Poulasthya vadha isn't some ordinary task for that the magnitude of his ShivaBhakti was so strong that the entire nature has become his servant....

He stares at the sun and sighs him to lessen his shine when he feels it's getting hot....

He stares at the wind and sighs him to cast his breeze in a slower than it's usual pace when he feels it's disturbing him...

and so on and so forth....

Such was the mantra siddhi attained by Raavana by the virtue of his ParameshwaraAaraadhana....
and thus ShreeVaalmiki stated,
" RaamaRaavanaYuddham....
raamaraavanayoriva....,"

So it's not just lord Shree Raam and Raavana that are the holders of various power elements, their army too is made up of such highly powerful soldiers...

In order to balance the power factors on either sides, Gods had to send their power elements in the form of various ape warriors of whom the ape king Sugreeva holds the power of the Sun God...
And everyone knows that incident of Lord Aajaneya in his childhood trying to gulp in Sun assuming it to be some big apple fruit and after being hit by Lord Indra with his Vajraayudha because of a disformed lower jaw he got the name of Hanumaan.... 
Lord Hanuman though couldn't gulp in Sun as if the latter were to be a fruit, 
later on he became his disciple and learnt many a Shaastra after which he got the name
" Om Nava VyaakaraNa panDitaaya Namaha..." 

Hence he humbly made himself a servant and a minister to the ape king Sugreeva for the latter being Sun's representation in an ape form and kept serving him until the real master Lord ShreeRaam came in to the picture... 
( " Om SugreevaSachivaaya Namaha..,")

Now coming to the 3rd point of why did the moment of Lord ShreeRaam / Hanuman / ape king Sugreeva getting united occur only in the KishkindhaKaanDa....

As per Lord Brahma's boon, only Humans and Apes are the two species that are excluded / ignored by Raavana.
So the gods are left with the only option of using apes and humans to create and execute the stupid Raavan's death matrix in the hands of the most powerful of the humans and apes.....

Until and unless a Guru orders his disciple to go and connect with another entity so that they all become a much more powerful united entity, a Shishya wouldn't generally focus on other unrelated stuff...

Thus Hanuman has to remain tied to the confined matrix of " An ape being just with the other apes..." until those destined super humans cross their path to become one with them so that they all together become a much more powerful entity destined for a much greater and a magnificent journey ahead....

Hence only after Sugreeva asks his minister Lord Hanuman to go and find out the details of those 2 young charming dudes coming their way assuming that they were sent by Vali to search his whereabouts so as to take revenge on him...

( I am not getting in to all those details of Vali : Sugreeva, the ape brothers fighting with each other to adorn the throne of the Kishkindhaa Saamanta raajyam etc... 
But I would like to quote a phrase from sadguru Shree ChaaganTi gaari pravachanam which is a power house of knowledge and wisdom....
" Taara maaTlaaDutundi....meeru vini teeraali...."
Such is her exceptionally erudite prowess while trying to subside an angry Vaali )

And thus this mystical ape maestro makes his all of a sudden presence in the KishkindhaKaanDa only and becomes the cynosure of the entire ShreemadRaamaayanam to get extolled as
"Raamaayana Mahaamaala Ratnam vanday Anilaathmajam...."

May Lord Hanuman bless all the devotees with abundance of Health, Happiness Peace and Prosperity and keep guiding them to make their lives fulfilled and complete... 😊👍🍟👏🍨💐

वन्दे वानरनारसिहखगराट्क्रोडाश्ववक्रान्वितं दिव्यालंकरणं त्रिपश्चनयनं दैदीप्यमानं रुचा । हस्ताब्जैरसिखेटपुस्तकसुधाकुम्भांकुशादि हलं खटांगं फणिभूरुहं दशभुजं सर्वारिवीरापहम्‌ ॥ 🙏😊