Monday, March 25, 2024

శ్రీ 2024 క్రోధి నామ సంవత్సర (ఏప్రిల్ 13 చైత్ర శుద్ధ పంచమి నుండి 17 చైత్ర శుద్ధ నవమి వరకు)హైదరాబాద్, కూకట్పల్లి, వివేకానందనగర్ కాలని, వాటర్ ట్యాంక్ పరిసరాల్లో, బిల్వవృక్ష ఛాయలలో కొలువుదీరి 33 సంవత్సరాలుగా భక్తభాగవతుల పట్ల అమేయ వాత్సల్యదైవిక వైభవంతో అలరారుతున్న శ్రీమదలర్మేల్మంగా పద్మావతీ ఆండాళ్ సమేత శ్రీవేంకటేశ్వర స్వామి వారి త్రయస్త్రింశత్ (33వ) వార్షిక పాంచాహ్నిక బ్రహ్మోత్సవ పర్వసమయ విశేషం ఆసనమవ్వబోతున్న తరుణంలో....స్వామి వారి విశేషానుగ్రహంతో భక్తులెల్లరూ తరించెదరు గాక అని ఆకాంక్షిస్తూ శ్రీనివాస శ్రీపాదపద్మముల చెంత చిరుకవనకుసుమాంజలి...🙂💐

హైదరాబాద్, కూకట్పల్లి, వివేకానందనగర్ కాలని, వాటర్ ట్యాంక్ పరిసరాల్లో, బిల్వవృక్ష ఛాయలలో కొలువుదీరి 33 సంవత్సరాలుగా భక్తభాగవతుల పట్ల అమేయ వాత్సల్యదైవిక వైభవంతో అలరారుతున్న శ్రీమదలర్మేల్మంగా పద్మావతీ ఆండాళ్ సమేత శ్రీవేంకటేశ్వర స్వామి వారి త్రయస్త్రింశత్ (33వ) వార్షిక పాంచాహ్నిక బ్రహ్మోత్సవ పర్వసమయ విశేషం ఆసన్నమవ్వబోతున్న తరుణంలో....
స్వామి వారి విశేషానుగ్రహంతో భక్తులెల్లరూ తరించెదరు గాక అని ఆకాంక్షిస్తూ శ్రీనివాస శ్రీపాదపద్మముల చెంత చిరుకవనకుసుమాంజలి...🙂💐

ఈ బ్రహ్మోత్సవాలకు ఏతెంచే 33 కోట్ల (గణముల) దేవతాశక్తులు స్వామివారి విశేషమహిమ్నతను విశ్వవ్యాప్తం గావించెదరు గాక...💐🪷🍨🎉🏵️🌟
🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔
🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔
🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔

బ్రహ్మగారికి ప్రత్యక్షంగా ప్రత్యేకంగా పూజలు నిర్వహింపబడకున్నా, మీరు గమనించి ఉండి ఉంటే అన్ని వరిష్ఠ ఉత్సవాలు, పూజలు, వైభవాలు, ఆర్భాటాలు కూడా బ్రహ్మ గారి గౌరవగౌణగుణకంగానే ఈ లోకంలో శ్లాఘింపబడుతుంటాయ్....

ఫర్ ఎగ్సాంపుల్...

ఒక గొప్ప రుచికరమైన పాయసం వడ్డిస్తే...
"అబ్బా...బ్రాహ్మాండంగా అమృతంలా ఉంది...ఏది ఇంకొంచెం వడ్డించండి..." అని అంటారు...

ఒక గ్రాండ్ ఫంక్షన్ కి వెళ్ళొస్తే...
"అబ్బా...ఎంత బ్రాహ్మాండంగా నిర్వహించారో ఫంక్షన్...
మేము కూడా అట్లే చేద్దామని అనుకుంటున్నాము..."
అని అంటారు...

"బ్రహ్మగారిని, మరియు వారు సృష్టించే బ్రహ్మాండాన్ని మీరేమైనా చూసారా..?
మరి 'అబ్బో...బ్రహ్మాండంగా ఉంది....'
అని ఏలా అంటున్నారు...ఎందుకంటున్నారు...?
అందలి ఆంతర్యమేమి... ?"
అనే సందేహం విజ్ఞ్యులకు రాకమానదు కద....

కొంచెం అక్షరాలను అటు ఇటు చేసి చూడండి...

భ్రమ 
బ్రహ్మ

సరైన ఉచ్ఛారణ లోపిస్తే ఈ రెండు పదాలు కూడా దాదాపుగా ఒకేలా అనిపిస్తాయ్...

1.
అంతా భ్రాంతియేనా జీవితాన వెలుగింతేనా...
అని అంటారు ఒక కమర్షియల్ సినీకవి...
పాతతరం 'దేవదాసు' సినిమాలో....
(భ్రాంతి, భ్రమ పర్యాయపదాలు...)

2.
"ముసిముసి నవ్వులలోనా...కురిసెను పువ్వులవాన...
బ్రహ్మఒక్కడే...పరబ్రహ్మఒక్కడే..."
అని అంటారు మరో కమర్షియల్ సినీకవి...
(మోహన్ బాబు గారి "బ్రహ్మ" సినిమాలో...యేసుదాస్ గారి ఈ అమరగానం చాలామందికి గుర్తుండే ఉంటుంది...)

ఇక్కడ 'బ్రహ్మ' అంటే, ' సృష్టికర్త ' అని పిలువబడే ఒక నిర్ణీత కాలపరిధి గల దేవలోక / సత్యలోక పదవిని అలంకరించే వారు....
ఆ పదవిని అలకరించిన వారిని "బ్రహ్మాగారు" అని సంబోధిస్తారని.. మరియు...
ఆ పదవీకాలాన్ని "బ్రహ్మకల్పం" అని సంబోధిస్తారని...
మరియు...సినిమాల్లో చూపెట్టినట్టుగా పెద్ద గడ్డం మీసం తో కాకుండా...బ్రహ్మగారు కూడా ఇతర దేవతా ఉపాధుల్లో ఉండే త్రిదశులు ఉన్నట్టుగానే....ఉంటారని...
శ్రీచాగంటి సద్గురువులు వారి ప్రవచనాల్లో వివరించడం...
కొద్దిమందికైనా గుర్తుండే ఉంటుంది....

3.
"బ్రహ్మమొక్కటే...పరబ్రహ్మమొక్కటే...పరబ్రహ్మమొక్కటే...పరబ్రహ్మమొక్కటే..."
అని అన్నారు మన అన్నమాచార్యులు.....
వారి "బ్రహ్మమొక్కటే...." అనే సుప్రసిద్ధ సంకీర్తనలో....
ఇక్కడ "బ్రహ్మము" అనగా సర్వేసర్వత్రా పరివ్యాప్తమై ఉండే పరమాత్మ అని అర్ధం...

ఇప్పుడు మీకు 

భ్రమ,
బ్రహ్మ,
బ్రహ్మము / పరబ్రహ్మము,

అనే పదాలకు గల అంతరము, మరియు అందలి ఆంతర్యం పై అవగాహన వచ్చింది కాబట్టి..
ఇక మన అసల్ టాపిక్ గురించి చర్చిద్దాం....

ఎంతో విశేషమైన వామనావతార వైభవాన్ని వర్ణించే సుప్రసిద్ధ అన్నమాచార్యుల సంకీర్తన....
"బ్రహ్మ కడిగిన పాదము...
బ్రహ్మము తానెని పాదము..."

ఈ సంకీర్తనలో ఎంతోమంది భక్తులకు ఎంతగానో ఇష్టమైన 3వ చరణంలోని సాహితీ సరాన్ని ఒకసారి పరికిస్తే.....

"పరమ యోగులకు పరి పరి విధముల - పరమొసగెడి నీ పాదము
తిరువేంకటగిరి తిరమని చూపిన - పరమ పదము నీ పాదము"

అని అనుగ్రహించారు శ్రీతాళ్ళపాక అన్నమాచార్యుల వారు...

సృష్టికర్తగా బ్రహ్మ గారు నిర్వహించే ప్రక్రియను ఒక సింపుల్ ఎగ్సాంపుల్ తో వివరించాలంటే...

శ్రీచాగంటి సద్గురువులు ఉదహరించే ఒక వాక్యాన్ని ఆలంబనగా గావించి వివరించే ప్రయత్నం చేస్తాను...

"మహామయావిశ్వంభ్రమయసి పరబ్రహ్మమహిషీం..." 

అనే వాక్యం యొక్క వివరణ శ్రీచాగంటి సద్గురువుల ప్రవచనాల్లో చాలామంది చాలాసార్లు వినే ఉంటారు...

ఒక hypothetical immeasurable and eternally spinning roller coaster moving at a decently slower pace so that anyone can be off-loaded at any given point in time in-order to continue with a similar roller coaster journey in a new seat from the so called yet another new beginning...
అనే ప్రక్రియను మనం ఎగ్సాంపుల్ గా తీస్కొని...

అది నడిపించేది బ్రహ్మాగారు అని...
కొత్త సీట్ అనగా ఒక కొత్త జన్మ/శరీరం అని...
మళ్ళీ కొత్తగా అదే తరహా ప్రయాణం మొదలు అని అంటే ఒక కొత్త ఉపాధి లో జన్మించడం, జీవించడం, లయించడం...అనే నిరంతర భ్రమణ ప్రక్రియ అని..

మనం సామ్యమును దర్శించగలిగితే.....

అదే నిరంతరంగా కొనసాగే జన్మాంతర జీవుడి ప్రయాణం...

ఆ జీవప్రయాణం యొక్క ఆది ఒక బండరాయ్ గా మొదలై,
సంచితం, ప్రారబ్ధం, ఆగామి అనే
కర్మసంచయం తో ఎన్నో ఎన్నెన్నో జన్మలదొంతరల్లో కొనసాగుతూ, 
ఏనాడు ఏదో ఒక జన్మలో సత్పురుష, భక్తభాగవత, యోగుల, అనుగ్రహంతో పరబ్రహ్మము యొక్క చింతన గూర్చి స్వాధ్యాయం ప్రారంభమవుతుందో...
అప్పుడు ముక్తి / మోక్షము / పరమపదము అనే సర్వోన్నతమైన ఆరామము గూర్చిన ఎరుకతో జీవిస్తూ, వాటిని సాధించుకునే దిశగా పరిశ్రమిస్తూ, జన్మపరంపరా ప్రయాణంలో కొనసాగుతూనే అభ్యున్నతి దిశగా పురోగమిస్తూ, కేవలం కొద్ది జన్మల్లోనే లేక ఈ జన్మలోనే ఈశ్వరుడు సంతసించి అనుగ్రహించే...
సాలోక్య, సారూప్య, సామీప్య, సాయుజ్య ముక్తిని బడసి తరించడం అనే గహనమైన ప్రక్రియలో బ్రహ్మగారిది ఎంతో కీలకమైన అనుగ్రహం కాబట్టే.....

బ్రహ్మాండం అనే పదం గురించి ఏమి తెలియకపోయినా సరే...
ఎంతో మంది అలా క్యాజువల్ గా 
"ఓహ్ ఇవ్వాళ భోజనాలు బ్రహ్మాండంగా ఉన్నాయ్...."
అని అనేస్తారు....

"అబ్బో వారిచ్చిన గౌరవాల గురించి ఏమని చెప్పాలి...
నాకు బ్రహ్మరథం పట్టారండి..."
అని అనేస్తారు....

బ్రహ్మరథం అంటే ఏంటో, బ్రహ్మగారి వైభవం అంటే ఏంటో, తద్వారా బ్రహ్మగారి అనుగ్రహం అంటే ఏంటో ఇప్పుడు మీకు వివరిస్తాను.....

చతుర్ముఖ బ్రహ్మగారి సృష్టి కార్యం గురించి చెప్పాలంటే....
ఒక సూపర్ కంప్యూటర్ ఏ విధంగానైతే క్షణంలో కొన్ని లక్షల సాధారణ గణితశాస్త్ర లెక్కలను చక్కబెడుతూ (ఫ్లిప్ ఫ్లాప్స్) మరింత గహనమైన గణితశాస్త్ర లెక్కలను సాధించే దిశగా తన సూపర్ కంప్యూటింగ్ స్కిల్స్ ని టకటక మని కనబరుస్తుందో.....

అదే విధంగా "బ్రహ్మగారు" అనే ఆ సత్యలోక పదవిలో కొలువైఉండే వారికి,
"పర, వ్యూహ, విభవ, అంతర్యామి, అర్చ,"  అనే పంచవిధ స్థిత పరతత్వ విశేషంలో, "వ్యూహ" పరతత్త్వం యొక్క అనుగ్రహశక్తి వల్ల, అలాంటి అమేయ సృష్టిరచనా శక్తి సంప్రాప్తించి, ఒక జీవుడు చీమగా ఎందుకు ఎప్పుడు ఎక్కడ జన్మించాలో అనే అంశం నుండి ఒక జీవనది ఎక్కడ ఉద్భవించి ఎవ్విధంగా సాగుతూ తుదకు ఎక్కడ సముద్రంలో సంగమించాలో అనే అంశం వరకు, ఎంతో ఆశ్చర్యకరమైన రీతిలో టకటక మని మనం దర్శించే యావద్ సృష్టిని సృజిస్తూ ఉంటారు....

చతుర్ముఖ బ్రహ్మగారి ఈ సృష్టిరచనా వైభవం ఎంత ఘనంగా, ఎంత పర్ఫెక్ట్ గా, ఎంతటి విజ్ఞ్యాన ప్రజ్ఞ్యాన ప్రౌఢిమ సమ్మిళిత సారస్వత శక్తి యొక్క రూపాంతర ప్రక్రియ గా ఉంటుందో...
మీకు చాల సింపుల్ గా అర్ధం అవ్వాలంటే...

మీరు ఎప్పుడైన తిరుమల ఆర్జిత సేవల్లో పాల్గొని ఉంటే, తి.తి.దే వారి ఆస్థాన పండితులు, ఘనాపాఠీలు, శ్రీభూసమేతమలయప్ప స్వామి వారి ముందు ఆసీనులై, నలుగురు ఘనాపాఠీలు కూడా ఒక్కరేనేమో అన్నట్టుగా ఎంతో సుస్వరమైన ముక్తకంఠంతో వేదపన్నలను, సూక్తాలను, ఘనజటలను ఆలపించి అనుగ్రహిస్తారో గమనించారా....?
ఆ వేదపఠనజనిత వైశ్విక దైవికతరంగశక్తికి సంతసించే 
శ్రీమలయప్పస్వామి వారి నగుమోమును కళ్ళారా దర్శించారా...?

అటువంటి తన్మయ భరిత దైవదర్శనంలో మనలో అనగా మన ఆంతరచైతన్య శక్తి యొక్క బౌద్ధిక పరిణతలో ఎన్ని ఆశ్చర్యకరమైన విభూతులు వాటంతట అవే సంతరించుకుంటున్నాయో అంతర్ముఖులై దర్శించుకున్నారా...?

ఒక గంటసేపు మనం వేదమూర్తులు అనుగ్రహించిన అంతటి ఘనమైన సుస్వరవేదపఠనాన్ని ఆలకించి అంతగా ఆనందమగ్నులమై మైమరచామే....

మరి ఏకంగా చతుర్ముఖ బ్రహ్మగారు నిరంతరం నాలుగు ముఖాలతో సత్యలోకంలో శ్రీమహావిష్ణువు యొక్క నాభికమలంలో ఆసీనులై, నుడివే వేదపఠన జనిత శక్తికి ఈ విశ్వంలో ఎన్ని మార్పులు నిరంతరం సంతరించుకుంటూ ఉంటాయో ఒకసారి ఆలోచించండి....

ఒక న్యూస్ పేపర్ రీడింగ్ ని ఎగ్సాంపుల్ గా తీస్కుంటే...

రమారమి ఒక 14 పేజీల దైనందిన వార్తాపత్రికను,
అనగా అందులోని అన్నిరకాల వార్తలను...
మొదటి పేజి హెడ్లైన్స్ నుండి ఆఖరి పేజీల్లో ఉండే స్పోర్ట్స్ కాలం మరియు ఇతర ఫిల్లర్స్ లో ఉండే సంక్షిప్త వార్తాకథనాలవరకు...

నేను ఒక అరగంటలో అవన్నీ చదివేసి ఏ పేజీలో ఎక్కడ ఏముందో చెప్పేయగలను...
అదే వార్తాపత్రిక ఒకటవ తరగతి చదివే స్కూల్ పిల్లలు చదవడానికి ఎన్నో రోజుల సమయం పడుతుంది....

ఎందుకంటే నా బౌద్ధిక స్థాయిని, నా స్పీడ్ ని అందుకోవాలంటే,
ఆ పిల్లలు 10 సంవత్సరాల స్కూల్ చదువు, ఆతదుపరి 6 సంవత్సరాల ఉన్నతవిద్య, చదివి ఉత్తీర్ణులైనతదుపరి అంతటి వేగం అందుకోగలరు.....

అచ్చం అదే విధంగా ఈ భూలోకంలో వేదఘనాపాఠీలచే 
పరివ్యాప్తమయ్యే వేదం యొక్క శక్తికి...
మరియు
భూలోకాన్ని, భూగురుత్వాకర్షణ శక్తిచే ప్రభావితమయ్యే రోదసీ పరిధిని దాటి...
భువర్లోక,
సువర్లోక,
మహర్లోక,
జనోలోక,
తపోలోకాలను దాటి వాటిపైన సువ్యవస్థీకరింపబడి ఉండే
సత్యలోకంలో కొలువైన చతుర్ముఖ బ్రహ్మగారు నుడివే చతుర్వదనవినిర్ముక్తవేదపఠన శక్తి యొక్క స్థాయిని, ఆ వేదశక్తి జనిత వైశ్వికదైవిక తరంగ శక్తికి అనుగుణంగా టకటక మని సృజింపబడే సృష్టి విలాసాన్ని ప్రత్యక్షంగా దర్శించడం మానవమాత్రులకు దుర్లభం....కేవలం ఈశ్వరానుగ్రహంగా ధ్యానగోచరమయ్యే ఆశ్చర్యకరమైన అంశం అది....

ఏ విధంగానైతే కొన్ని లక్షల మంది పదవతగతి విద్యార్ధుల భవిత ను ఎగ్సాం రిసల్ట్స్ అని అరచేతిలో ఇమిడే 
సి.డి/డి.వి.డి/బ్లూరే-డిస్క్/పెన్ డ్రైవ్/
లో నిక్షిప్తంగావింపబడిన విశ్లేషిత సమాచారాన్ని,
వెబ్సైట్ ద్వారా రిలీస్ గావింపబడిన తదుపరి కోట్లాది మంది ఇంటర్నెట్ ద్వారా సదరు విద్యార్ధి యొక్క
"హాల్ టికెట్ నంబర్" అనే ప్రైమరి కీ తో అనుసంధానమైన సదరు రిసల్ట్ ని స్క్రీన్ పై దర్శించి ఫలితాలను తెల్సుకుంటున్నారో...

అదే విధంగా చతుర్ముఖ బ్రహ్మగారు నుడివే అనంతవేదసాగరాన్ని,

12. ద్వాదశ ఆదిత్యులు, 
https://te.m.wikipedia.org/wiki/%E0%B0%A6%E0%B1%8D%E0%B0%B5%E0%B0%BE%E0%B0%A6%E0%B0%B6%E0%B0%BE%E0%B0%A6%E0%B0%BF%E0%B0%A4%E0%B1%8D%E0%B0%AF%E0%B1%81%E0%B0%B2%E0%B1%81

11. ఏకాదశ రుద్రులు, 
https://te.m.wikipedia.org/wiki/%E0%B0%8F%E0%B0%95%E0%B0%BE%E0%B0%A6%E0%B0%B6%E0%B0%B0%E0%B1%81%E0%B0%A6%E0%B1%8D%E0%B0%B0%E0%B1%81%E0%B0%B2%E0%B1%81

10. దశదిక్కులు, 
( తూర్పు East, పడమర West, దక్షిణము South, ఉత్తరము North, ఆగ్నేయము, South East, నైఋతి South West, వాయువ్యము North West, ఈశాన్యము North East, ఊర్థతము Sky, అధోభాగము Earth.)

9. నవగ్రహాలు (అధ్యాత్మ సంబంధమైనవి)

సూర్యుడు (Sun)
చంద్రుడు (Moon), 
అంగారకుడు (Mars)
బుధుడు (Mercury)
శుక్రుడు (Venus)
గురుడు (Jupiter)
శనైశ్చరుడు (Saturn)

(ఛాయాగ్రహాలు)
రాహువు, (Rahu)
కేతువు (Ketu)

8. అష్టవసువులు, 
(అపుడు, ధ్రువుడు, సోముడు, అధర్వుడు. అనిలుడు, ఆనలుడు, ప్రత్యూషణుడు, ప్రభాసుడు )

7. సప్తసముద్రాలు, (అధ్యాత్మ సంబంధమైనవి)
లవణ(ఉప్పు), ఇక్షు(చెరకు రసము), సుర(కల్లు), సర్ఫి(నెయ్యి), దధి(పెరుగు), దుగ్ధ(పాలు), జల(నీరు)

6. ఆరు ఋతువులు, 
(వసంతఋతువు, గ్రీష్మఋతువు, వర్షఋతువు, శరదృతువు, హేమంతఋతువు, శిశిరఋతువు)

5. పంచభూతాలు, 
(ఆకాశం, వాయువు, అగ్ని, జలం, పృథ్వి)

4. నాలుగు యుగాలు, 
(సత్య/కృతయుగం, త్రేతాయిగం, ద్వాపరయుగం, కలియుగం)
(కృతేతు నరసింహ భూత్రే తాయాం రఘునందనః 
ద్వాపరే వాసు దేవశ్చ కలౌ వేంకటనాయకః )

3. మూడు కాలాలు,
(భూత, past, వర్తమాన, present, భవిష్యద్ future )

(దినము = 30 ముహుర్తములు, మాసము = 30 దినములు, ఋతువు = 2 మాసములు, ఆయనము = 3 ఋతువులు, సంవత్సరం = 2 ఆయనములు, దేవతల దినము = 1 సంవత్సరం, దైవత యుగము = 12,000 దేవ సంవత్సరములు...)

అనగా వాటి యొక్క అధిదేవతలు, ప్రత్యధిదేవతలు.....

చతుర్ముఖ బ్రహ్మగారి వేదపఠన జనిత శక్తికి,

సదరు జీవుడి సంచితం యొక్క లెక్కల నుండి స్వీకరింపబడిన, 
సదరు ప్రారబ్ధానుభవానికి,
సదరు ఉన్నతమైన జన్మగా, సదరు జీవుడు మనిషిగా, 
ఉత్తమజన్మను ఎత్తడానికి....

సదరు ఆదిత్యుడి ఆజ్ఞ్యగా, సదరు రుద్రుడి అనుగ్రహంగా, సదరు దిశగా రోదసీ ప్రయాణం సాగించి, 
నవగ్రహాలచే శాసింపబడే సదరు జాతకచక్రంతో జన్మించేందుకు, అష్టవసువులూ అనుకూలించి సప్తసముద్రాలను దాటి, సదరు ఋతువులో సదరు వ్యక్తి యొక్క వీర్యశక్తి బీజంగా పంచభూతాల అనుగ్రహంతో సదరు మనిషి గా పాంచభౌతిక శరీరం తో ప్రభవించేందుకు, ఓషధీ శక్తి నుండి సదరు కర్మసంబంధం గల వ్యక్తి యొక్క వీర్యశక్తిగా రూపాంతరం చెంది, మేఘమండలం నుండి భూమండలానికి సాగే సదరు జీవుడి యాత్రను దర్శిస్తే ఎంతగా ఆశ్చర్యపోతారంటే ఒక సూపర్ కంప్యూటర్ యొక్క గణకప్రక్రియను దర్శించినప్పుడు కలిగేంతటి ఆశ్చర్యం...

అదేంటి ఎక్కడో సుదూరాకాశంలో ఎక్కడో ఉండే ఒక సూక్షరూప మెరుపు లాంటి జీవుడు, ఒక మనిషిగా metamorphosis చెందే ప్రక్రియ ఇంతటి అలౌకిక + లౌకిక ప్రయాణం తో ఇమిడి ఉంటుందా...?
Doesn't it sound strange to say so...?
అనే సందేహం కొందరు ఇరుడైట్ ఇంటెలెక్చువల్స్కు రావచ్చు...

హాల్ టికెట్ నంబర్ ఒక సింపుల్ వెబ్ పేజ్ లో ఎంటర్ చేయగానే....
మీ హాల్ టికెట్ నంబర్ యొక్క రిసల్ట్ డిస్టిన్షన్ అని...,
మీ పక్కన ఉన్న హాల్ టికెట్ నంబర్ ఫస్ట్ క్లాస్ అని...,
మీ వెనక ఉన్న హాల్ టికెట్ నంబర్ సెకండ్ క్లాస్ అని...,
ఇంకో హాల్ టికెట్ నంబర్ థర్డ్ క్లాస్ అని...,

ఇలా ఇన్ని రకాలుగా ఉన్న రిసల్ట్స్ ఒకే బ్లూరే డిస్క్ పై ఉన్న సూక్ష్మాతిసూక్ష్మైన మెరుపు రేఖల్లో నిక్షిప్తమైన రిసల్ట్స్ అలా
క్రోడీకరింపబడడానికి, ఎంత మంది ఎగ్సామినర్స్ తో ఒక్కో పేపర్ ఏవాల్యూషన్ గావింపబడి, అన్ని సబ్జెక్ట్ పేపర్ల కౌంటింగ్స్ అగ్గ్రిగేట్ గావింపబడి,  అలా రిసల్ట్స్ ని క్లాసిఫై చేసారో అనేది ఎగ్సామినేషన్ / పేపర్ ఏవాల్యూషన్ డిపార్ట్మెంట్ ఫ్రెటర్నిటి కి తెలిసిన అంశం...

అచ్చం అదే విధంగా....యావద్ సృష్టి రచనా ప్రక్రియ కూడా బ్రహ్మ గారి ఆజ్ఞ్యానుసారంగా పైన వివరింపబడిన ఒక పెద్ద వైశ్విక వ్యవస్థ ద్వారా సువ్యవస్థీకరింపబడిన దైవిక ప్రక్రియ...

అది సాధికారసశాస్త్రీయ పంథాలో అర్ధం చేసుకొని ఆకళింపజేసుకోవాలంటే...
ఎంతో అధ్యాత్మ స్వాధ్యాయం, ఈశ్వరానుగ్రహం ఆవశ్యకం...
ఒకటవ తరగతి స్కూల్ పిల్లవాణ్ణి 14 పేజీల న్యూస్పేపర్ మొత్తం అరగంటలో చదవమంటే ఎట్లుంటదో...
ఎట్టి అధ్యాత్మ స్వాధ్యాయం లేకుండా, 
ఈశ్వరానుగ్రహం సంతరించుకోకుండా,
అడిగే సందేహాలు కూడా అట్లనే ఉంటయ్....

కాబట్టి మన ఆర్షవాంగ్మయ విజ్ఞ్యులు నుడివే వేద పురాణ ఇతిహాస, సశాస్త్రీయ శ్రేయోకారక ప్రాచీన అధ్యాత్మ విజ్ఞ్యాన సిరులను అందుకొని జీవితాలు తరింపజేసుకోవాలంటే...

ఆలయాలను దర్శించడం, ఆలయాల్లో నిర్వహింపబడే బ్రహ్మోత్సవాల్లో పాల్గొని భగవద్ దర్శనం / ప్రసాదం తో తరించడం, బ్రహ్మోత్సవాంతర్గతంగా నిర్వహింపబడే వివిధ క్రతువుల్లో పాల్గొని వాటిలోని ఆంతర్యాన్ని అర్ధం చేసుకునే దిశగా స్వాధ్యాయంతో పరిశ్రమించడం....
ఇవన్నీ కూడా ఎంతో గొప్ప విషయాలు అని గౌరవించి ఆదరించి జీవితానికి అన్వయించుకొని తరించగలగడం తెలిసిఉన్నప్పుడు, ఈశ్వరానుగ్రహంగా.....
జ్ఞ్యానం విజ్ఞ్యానమై...
విజ్ఞ్యానం ప్రజ్ఞ్యానమై...
ప్రజ్ఞ్యానం సుజ్ఞ్యానమై...
సుజ్ఞ్యానం పరతత్త్వజ్ఞ్యానానుగ్రహంగా పరిణమించి....
మనిషి సంపూర్ణంగా తరించగలుగుతాడు....

బ్రహ్మోత్సవాల్లో, మొదటి రోజున ధ్వజారోహణం, చివరి రోజున ధ్వజ అవరోహణం, పేరుతో సకల దేవతాహ్వాన / దేవతా ఉద్వాసన ప్రక్రియను....
నాదస్వర విద్వాంసుల చే గావింపబడే మేళతాళ పూర్వక భేరితాడన ప్రయుక్త వేదస్వరఘోషలో....
"హే బ్రహ్మ, హంసవాహనమారుహ్య..."
అని బ్రహ్మగారితో పాటుగా...,
ఇంద్ర, అగ్ని, యమ, నిర్రుతి, వరుణ, వాయు, కుబేర, ఈశ్వర, అనే అష్టదిక్పాలకులను సవాహన, సపత్నీ పూర్వకంగా ఆహ్వానించడం...అనే ప్రక్రియను మీరు దర్శించి ధ్యానంలో ఆరాధిస్తే, ఆ బ్రహ్మగారి వైభవాన్ని మరింత గొప్పగా ఆకళింపుజేసుకోగలరు.....

" కలౌ వేంకటనాయకః .... "
అని అన్నారు మన పెద్దలు.....

కాబట్టి మీమీ ఇంటి దెగ్గర్లోని శ్రీవేంకటేశ్వరాలయాల్లో నిర్వహింపబడే వార్షిక బ్రహ్మోత్సవాల్లో, 

గరుడధ్వజారోహణం మొదలుకొని
గరుడధ్వజ అవరోహణం వరకు....
అక్కడి వేదమూర్తులు, ఋత్విక్కులు, పండితులతో పాటుగా,
మనం కూడా  
ఏకాహ్నిక / త్రయాహ్నిక / పాంచాహ్నిక / సప్తాహ్నిక / నవాహ్నిక మానసిక దీక్షాకంకణధారులమై
(ఆయా ఆలయాచారాన్ని అనుసరించి కావింపబడే...,) ఈశ్వరానుగ్రహం తో శాస్త్రవివేచన గావించగా లభించే జ్ఞ్యానమే సర్వోన్నతమైన పరతత్త్వ జ్ఞ్యానం / ఆత్మజ్ఞ్యానం....

శ్రీవేంకటాచలం వంటి సదాచారసంపన్నభరిత క్షేత్రాల్లో నిర్వహింపబడే బ్రహ్మోత్సవాల్లో, బ్రహ్మగారి గౌరవార్ధమై, బ్రహ్మగారికి ప్రత్యక్ష ప్రతీకగా, ఒక రథాన్ని అందరికంటే ముందుగా తిరువీధుల్లో ప్రదక్షిణగా ఊరెరిగిస్తారు....
ఆ రథాన్నే బ్రహ్మరథం అని సంబోధిస్తారు...

అందుకే లోకంలో బ్రహ్మరథం పట్టారండి...అనే నానుడి వచ్చింది.
అనగా అన్నిటికంటే / అందరికంటే ముందుగా గౌరవింపబడే ప్రక్రియను 'బ్రహ్మరథం పట్టడం' అని అంటారు....

కాబట్టి భృగుమహర్షి వచనాల కారణంగా ప్రత్యక్షంగా ఆలయాల్లో ప్రత్యేకంగా ఆరాధన లేకున్నా...
ఈ లోకంలోని సర్వోన్నతమైన మరియాదను పొందే సృష్టికర్త యొక్క గౌరవార్ధమై ప్రతి సర్వోన్నతమైన విభూతిని బ్రహ్మ అనే గౌణసమ్మిళితంతో వచించడం ఆ పరమాత్మ యొక్క ప్రీతికి కారణం అవుతున్నది...

బ్రహ్మమాయకు బద్ధులైఉండే వారే ఈ సృష్టిలోని జీవులందరూ కూడా...ఎందుకంటే ఆ సృష్టికర్త సృజించిన బ్రహ్మాండాన్ని దాటి బ్రహ్మపదార్దాన్ని దర్శించే భాగ్యం కేవలం బ్రహ్మమాయను లయించి సత్యదర్శనం గావింపజేసే విష్ణుమాయకు మాత్రమే సాధ్యం...

శ్రీమద్భాగవతం లో ప్రత్యక్ష బ్రహ్మమాయను కూడా లయించివేసి తన విష్ణుమాయతో, బ్రహ్మగారు మాయం చేసిన ఏ గోపాలుడు ఎప్పుడు ఎక్కడ ఎట్ల ఉండునో అట్లే ఉండేలా గావించిన శ్రీకృష్ణపరమాత్మ యొక్క అత్యత్భుతమైన లీలల్లో ఒకటైన "కౌమారపౌగండలీల" ను శ్రీచాగంటి సద్గురువుల ప్రవచనాల్లో విన్నవారికి తెలిసినట్టుగా, పరమాత్మ మాయ యందు బ్రహ్మమాయ లయించును....అనగా ఆ పరబ్రహ్మము యొక్క స్వస్వరూపానుసందర్శనంతో, బ్రహ్మాండానికి ఆవల ఉండే శాశ్వతమైన సత్యపదార్ధాన్ని దర్శించే ప్రక్రియనే బ్రహ్మజ్ఞ్యానం అని వచింతురు....

అనేయడానికి ఏదో..
"ఒక స్పెషల్ రేంజ్ అడ్వాన్స్డ్ సుఖోయ్ F16 ఫైటర్ జెట్ ప్లేన్ లో అప్పటికప్పుడు ఎక్కి ఈ లోకం అంచులవరకు వెళ్ళి అన్నిటిని దర్శించగలగడం..." అన్నట్టుగా అనిపించినా....
బ్రహ్మజ్యాన సముపార్జన అంత తేలికమాత్రం కాదు....

నిత్యం హృదయపంచకోశాంతరమునందు చిత్తాన్ని స్థిరీకరించి భగవద్దర్శనం కోసం తపస్సును ఆచరించే వరిష్ఠయోగులు కూడా నిరంతరం ఆ బ్రహ్మజ్యానసముపార్జనలో లీనమై
ఉండే ప్రక్రియను సర్వోన్నతమైన తపస్సుగా బహిర్ముఖులైనప్పుడు వచింతురు....

అట్టి సర్వోన్నతమైన జ్ఞ్యానభూమికల్లో ఓలలాడే సౌభాగ్యం తన శ్రీపాదయుగళధ్యానం లో అనుగ్రహించే కలియుగప్రత్యక్ష పరమాత్మ శ్రీవేంకటాచలపతిని అందుకే అన్నమాచార్యుల వారు....
నీశ్రీపాదములే పరమపదము...అంటూ అంత ఘనంగా కీర్తించారు...

"
పరమ యోగులకు పరి పరి విధముల - పరమొసగెడి నీ పాదము
తిరువేంకటగిరి తిరమని చూపిన - పరమ పదము నీ పాదము
"

తిరుమల అంటే కేవలం ఆనందనిలయ అష్టదలపద్మపీఠంపై మాత్రమే శ్రీవేంకటేశ్వరుడు ఉన్నడనుకుంటే అది మన అమాయకత్వం....

"ఇన్ని సార్లు తిరుమల వెళ్ళోచ్చాం అండి అని కొందరు అంటుంటారు...
ఏది తిరుమలో మీరు ఎన్ని తీర్థాలను దర్శించారో చెప్పండి అని అడిగితే మాత్రం తెల్లమొహం వేస్తారు..."
అని శ్రీచగంటి సద్గురువులు తిరుమల యొక్క తీర్థాల వైభవాన్ని ఉటంకిస్తూ ఇవ్విధంగా ప్రస్తావించడం కొందరికైన గుర్తుండే ఉంటుంది...

సర్వోన్నతమైన శ్రీస్వామిపుష్కరిణి, తిరుమల ఆలయంలోని
బంగారుబావి తీర్థం, ఆనందనిలయంలో అంతర్నిహితమైఉండే విరజా తీర్థం తో మొదలుకొని...

1. శంఖుతీర్థం (సుపథం పరిసరాల్లో)
2. నాగతీర్థం (గజశాల వెనక)
3. పాండవతీర్థం (గోగర్భండ్యాం దెగ్గర, తిరుమల క్షేత్రపాలక శ్రీరుదశిల ఇప్పుడు కొలువైఉన్న చోట)
4. చక్రతీర్థం (శిలాతోరణం దెగ్గర)
5.జపాలితీర్థం (స్వయంభూ హనుమద్ ఆలయం వెనక)
6. ధృవతీర్థం (జపాలి ఆలయం నుండి కొద్దిగా పైకి అడవిలో)
7. పాపనాశనం 
8. అకాశగంగ
9. సనకసనందనతీర్థం
10. తుంబురుతీర్థం
11. కపిలతీర్థం

వీటితో పాటుగా ఇంకా అడవిలోకి మున్ముందుందుకు సాగుతుంటే ఎన్నో ఎన్నెన్నో నేను కూడా ఇంకా ప్రత్యక్షంగా దర్శించని తీర్థాలు తిరుమల గిరుల్లో నిత్యం ఆ పరమాత్మ యొక్క ఎన్నో విభూతులను భక్తులకు అందిస్తూ ప్రవహిస్తూ అలరారుతున్నాయి....

ఎల్లరూ దర్శించే ఇట్టి తీర్థాలతో పాటుగా, సామాన్యంగా దర్శించలేని, కేవలం తిరుమలేశుడి విశేషానుగ్రహంతో మాత్రమే దర్శనయోగ్యమయ్యే తీర్థాలు అనేకం...వాటి అనుగ్రహం అనన్యసామాన్యం....

ఈ మర్త్యలోకంలోని జీవనదులకు, అన్ని తీర్థాలకు కూడా గంగా ఝరులే మూలం....

వామనావతారంలో శ్రీమహావిష్ణువు యొక్క త్రివిక్రమాకృతిని సంభ్రమాశ్చర్యాలతో తిలకిస్తూ,
"యావద్ విశ్వాన్ని కొలుస్తున్న సాక్షాత్ శ్రీమన్నారాయణుడి శ్రీపాదం, ఎల్లప్పుడూ శ్రీలక్ష్మీదేవి చే పాదసంవాహం తో సర్వంలక్ష్మీమయమై విరాజిల్లే పాదం, పరమయోగీంద్రులకు సౌదామిని సదృశమైన దర్శనంతోనే పరమును అనుగ్రహించే పావనపాదం...
ఇప్పుడు నా సత్యలోకాన్ని చేరింది..."
అని ఎంతో సంతోషించి ఆనాడు చతుర్ముఖ బ్రహ్మగారు వారి కమండలం లోని సమంత్రకజలంతో అభిషేకింపగా, శ్రీహరిపాదోద్భవీం గా జనించిన సురగంగా ప్రవాహం సర్వపాపహారిణిగా, సర్వపుణ్యదాయినిగా,
సర్వోత్తమ తీర్థంగా, అలరారుతూ,
సూర్యవంశ చక్రవర్తుల పరంపరలోని భగీరథుడి తపః శక్తితో అమరలోకము నుండి ఈ మర్త్యలోకానికి ఏతెంచే క్రమంలో రుద్రజటాజూటోద్భవీం గా పేర్గాంచి యావద్ భరతఖండ వైభవాన్ని విశ్వవ్యాప్తం గావిస్తూ మందాకినిగా శ్రీకాశివిశ్వనాథుణ్ణి అభిషేకిస్తూ, భోగవతిగా పాతళానికి ప్రవహించి సగరపుత్రుల భస్మరాశుల మీదుగా ప్రవహించి వారికి ఉత్తమగతులను కలిగించిన కపిలమహర్షి ఆశ్రమానికి, ఇప్పుడు మనం తిరుపతిలో దర్శించే శ్రీకామాక్షి సమేత కపిలేశ్వరస్వామివారికి, మరియు కపిలతీర్థం దెగ్గర ఉన్న వకుళమాతగుహ గురించి శ్రీచాగంటి సద్గురువుల ప్రవచనాల్లో చాలమంది శ్రద్ధగా వినేఉంటారు కద....

మరి అటువంటి మహత్తరమైన సురగంగా నదీ ఉద్భవించడానికి మూలకారణమైన బ్రహ్మగారి కమండలం లోని దైవికజలం ఏ దేవనదిది అని మీకు ఎప్పుడూ సందేహం రాలేదా..?
ఆ పరమపావన జలం దేవలోకాల్లో మాత్రమే లభ్యమయ్యే నిరంతర శ్రీహరి శ్రీపాద సేవకతీర్థమైన శ్రీవైకుంఠ లోకంలో లభ్యమయ్యే విరజా నదీ జలం...!

ఈ భూలోస్థిత పుణ్యజీవులైన శ్రీహరిభక్తులకు వివిధ తిరుమల తీర్థాల రూపంలో లభ్యమయ్యే అత్యంత మహిమోపేతమైన జలం ప్రాకృతమైనది కాదు....
అది సాక్షాత్తు విరజానది యొక్క వివిధ ఝరులు...!!

ఆదిశేషుడు, వాయుదేవుడు ఇద్దరూ కూడా నేనంటే నేనే గొప్ప అనే తగువులో ఉండగా, ఆ తగువును లోకోపకారకంగా మార్చేందుకు శ్రీహరి అనుగ్రహంగా శ్రీవైకుంఠముండి వాయువేగంతో దూసుకొచ్చిన క్రీడాద్రి అనే సాలిగ్రామ పర్వతం, స్వామివారి ఆజ్ఞ్యగా శేషాచలం అనే పేరుతో సువర్ణముఖరీ నదీతీరప్రాంతంలో వెలసి, ద్రావిడ దేశంలో తిరువేంగడం గా స్థిరపడింది...

ఒక సహజసిద్ధమైన వికసిత శతదళశోభనసువర్ణకమలానికి
అమోఘమైన దైవిక గంధం అలదబడితే ఎంత వైభవంగా ఉండునో....

అవ్విధముగా, మహిమాన్వితమైన శేషాచలాన్ని 
సకలవిధలక్ష్మీయుతమైన తన శ్రీపాదంతో శ్రీహరి శ్రీవేంకటేశ్వరుడిగా పావనం గావించగా...
వివిధ దైవిక సంఘటనల కారణంగా....,

శేషాద్రి
గరుడాద్రి
వేంకటాద్రి
నారాయణాద్రి
వృషభాద్రి
వృషాద్రి
నీలాద్రి

గా ఆ శ్రీవైకుంఠ క్రీడాద్రి పర్వతం 7 వివిధ ప్రముఖ పేర్లతో ప్రస్తుతింపబడుతూ సప్తాచలంగా కొనియాడబడుతూ, ప్రపంచవ్యాప్తంగా అనుగ్రహాన్ని వర్షిస్తున్నది....

రాత్రి ఏకాంత సేవానంతరం, ఆనంద నిలయ ద్వారబంధనానంతరం, యోగమార్గంలో స్వామి సన్నిధికి చేరుకునే ఎందరెందరో మనుష్యేతర పుణ్యజీవులచే నిత్యం అర్చింపబడే స్వామివారి శ్రీపాదయుగళాన్ని ఇప్పటికీ కూడా బ్రహ్మ గారు నిత్యం అర్చించడం విశేషం..! ఆ తీర్థాన్నే మరుసటి రోజున ఉదయం ప్రప్రథమ ఆరాధనగా గావింపబడే సుప్రభాతసేవలో, బ్రహ్మగారు అర్చింపగా మిగిలిన తీర్థశేషాన్ని బ్రహ్మతీర్థం గా భక్తులకు / వి.ఐ.పి సుప్రభాత టికెట్ హోల్డర్స్ కి 
అనుగ్రహిస్తారు..!!

మహాయోగులచే, సిద్ధసాధ్యవిద్యాధరగంధర్వులచే, యక్షకిన్నెరకింపురుషులచే, పరస్పర ఆజన్మవైరాన్ని కూడా మరచిన నాగగరుడ జాతులచే, నిండి ఉండే ఆ తైజసిక ఆనందనిలయ పరిసరాలను దర్శించడం ఎంతటి శ్రీవేంకటేశ్వరానుగ్రహమో మాతృశ్రీ తరిగొండవెంగమాంబ గారు వారి శ్రీవేంకటాచలమాహాత్మ్యం గ్రంథంలో విశదీకరించిఉన్నారు....

ప|| ఈ పాదమేకదా యిల యెల్లగొలిచినది |
ఈ పాదమే కదా యిందిరా హస్తముల కితవైనది ||

చ|| ఈ పాదమే కదా యిందరును మ్రొక్కెడిది |
యీపాదమే కదా యీ గగన గంగ పుట్టినది |
యీపాదమే కదా యెలమి బొంపొందినది |
యీపాదమే కదా యిన్నిటికి నెక్కుడైనది ||

చ|| ఈ పదమే కదా యిభరాజు దలచినది |
యీపదమే కదా యింద్రాదు లెల్ల వెదకినది |
యీపాదమే కదా యీబ్రహ్మ కడిగినది |
యీపాదమే కదా యెగసి బ్రహ్మాండ మంటినది ||

చ|| ఈ పాదమే కదా యిహపరము లొసగెడిది |
యీపాదమే కదా యిల నహల్యకు గోరికైనది |
యీపాదమే కదా యీక్షింప దుర్లభము |
యీపాదమే కదా యీ వేంకటాద్రిపై నిరవైనది ||

కోటిసూర్యకాంతమణిసంఘాతసదృశమైన స్వామివారి శ్రీపాద ద్యుతిని అందుకే అన్నమాచార్యులవారు..

"యీపాదమే కదా యీక్షింప దుర్లభము | "

అని సంకీర్తించారు....

ఇటు లౌకికంగానూ ఆ పాదాలు దర్శించడం దుర్లభమే....
ఎందుకంటే ఎల్లప్పుడూ స్వర్ణకవచాలంకృతమై తులసీ తో ఆచ్ఛాదింపబడి ఉండి....కేవలం శుక్రవార పూరాభిషేకానంతరం మాత్రమే కొద్ది సేపు
" నిజపాదదర్శనం " గా భక్తులకు దర్శనీయమై ఉన్నవి కాబట్టి..

ఇలా చెప్తే మీకు అతిశయంగా అనిపిస్తుందేమో కాని, స్వామి వారి పాదాలపై ఉన్న మంజీరములు కూడా, ఈ లోకంలోని ఏ శిల్పి కూడా సృజించలేనంత అందంగా, ఆశచర్యకరంగా ఉంటాయి...!!

ఎన్నో సార్లు అట్టి మహిమోపేతమైన నిజపాదదర్శనం టికెట్ తో నన్ను ధన్యుణ్ణిచేసిన స్వామివారి అమేయానుగ్రహానికి, వాత్సల్యానికి, భక్తపరాధీనతకు, నేను సదా బద్ధుడను...!
🙂🙏

శ్రీవత్సవక్షసం శ్రీశం శ్రీలోలం శ్రీకరగ్రహం
శ్రీమంతం శ్రీనిధిం శ్రీఢ్యం శ్రీమివాసం భజేదనిశం.......

Wednesday, March 20, 2024

శ్రీ శోభకృత్ 2024 ఫాల్గుణ పౌర్ణమి (25-మార్చ్-2014) / తిరుమల అభయారణ్య స్థిత తుంబురుతీర్థముక్కోటి పర్వోత్సవ శుభాభినందనలు...🙂💐


మినపవడ తినడం వేరు....
దహివడ / దైవడ / పెరుగువడ తినడం వేరు...

మినపవడలో ఉండే మినుముల వేడిని తగ్గించి పెరుగు యొక్క చల్లదనాన్ని / పుష్టిని జోడించి ఎనలేని సత్తువను శరీరానికి అందించే మినపవడ ఎంతో ఆరోగ్యకరమైన ఆహారం అని వడ ప్రియులెల్లరికీ తెలిసిందే...

అచ్చం అదేవిధంగా, పుణ్యక్షేత్ర యాత్ర వేరు తీర్థయాత్ర వేరు....
ఎందుకంటే ఒక పుణ్యక్షేత్ర పరిసరాల్లో కొలువైఉండే దైవిక మహత్తును సదరు యాత్రికుడికి సంపూర్ణంగా లభింపజేసే దైవడ లాంటిది తీర్థయాత్ర...

ఒక పుణ్యక్షేత్ర దర్శనంలో పుణ్యార్జనకు మీకు కొన్ని పరిధులు ఉండొచ్చు....
ఫర్ ఎగ్సాంపుల్, వి.ఐ.పి దర్శనం వాళ్ళకు చాలా సేపు దెగ్గరగా భగవద్ దర్శనం, 
నార్మల్ Q లైన్ వాళ్లకు కొద్ది సేపే దూరం నుండి దర్శనం,
వి.ఐ.పి దర్శనం వాళ్ళకు చాలా రకాల ప్రసాదాలు / గౌరవాలు,
నార్మల్ Q లైన్ వాళ్లకు కొద్దిగా ప్రసాదం,
ఇత్యాది గా ఒక్కో క్షేత్రంలో ఒక్కో రకంగా ఒక్కో భక్తిడికి లభించే పుణ్యం, దర్శన ఫలం, ప్రసాద ఫలం, ఇత్యాదివాటిలో అనివార్యమైన భేదాలు ఉండొచ్చుగాక....

కాని...
రాజ్యాన్ని ఏలేటి ప్రభువులకైన, 
రాజ్యంలో ఉండే బంట్రోతులకైన,
సంకల్ప సహిత తీర్థస్నానం ప్రసాదించే ఫలితం సమంగా విశేషంగా ఉంటుంది....
అందుకే, అనాదిగా భారతావనిలో తీర్థయాత్రల వైభవం ఎంతో విశేషమైనది...

దహివడలోకి తియ్యని అల్లం చట్ని / స్వీట్ జింజర్ సాస్, లైట్ గా అద్దుకుంటే, ఆ అమృతమయమైన రుచే వేరు...

అదే విధంగా పౌర్ణమి నాటి తీర్థస్నానం / విశేషించి సదరు తీర్థానికి నిర్దేశింపబడిన ముక్కోటి పర్వోత్సవ పౌర్ణమి యొక్క తీర్థస్నాన ఫలితం కూడా అమృతమయమైన అనుగ్రహం గా పరిఢవిల్లును...

ఈ భువిపై గల అత్యంత మహిమోపేతమైన అప్రాకృత అమేయ పుణ్యదాయక పావనక్షేత్రం తిరుమల / ఏడుకొండల పర్యంతం పరివ్యాప్తమై ఉండే భూవైకుంఠం, కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీవేంకటేశ్వరుడి ఆనందనిలయ క్షేత్రానికి ఆవాసం గా అలరారుతూనే, ఎన్నెన్నో మహిమోపేతమైన తీర్థములకు ఆలవాలం గా అలరారుతోంది...

కొన్ని తీర్థాలు, తిరుమల ఆనందనిలయానికి సమీపంలో భక్తులకు కొద్ది దూరంలోనే అందుబాటులో ఉంటే...
మరికొన్ని తీర్థాలు కొంత ఎక్కువ దూరంలో అందుబాటులో ఉన్నాయి....
మరెన్నో తీర్థాలు ఎంతో ఎక్కువ దూరంలో అందుబాటులో ఉన్నాయి....

అటువంటి ఎంతో ఎక్కువ దూరంలో ఉండే తీర్థాల్లో ఒకటి, గహనమైన శేషాచల అభయారణ్య లోయల్లో నెలకొని ఉన్న  తుంబురు కోనలో ప్రవహించే తీర్థం మహిమాన్వితమైన తుంబురుతీర్థం....

దేశకాలవైభవం గురించి ఇదివరకే శివరాత్రి కి సంబంధించిన పోస్ట్ లో విశదీకరించాను...

ఫాల్గుణ పౌర్ణమి అనేది తుంబురుతీర్థం యొక్క మొక్కోటితీర్థపర్వోత్సవ దేశకాలవైభవం.....

అనగా ఈ విశ్వంలో పరివ్యాప్తమై ఉండే అనేకానేక దృశ్యాదృశ్య తీర్థాలను మూడు కోట్ల తీర్థాలు గా / తీర్థముక్కోటి గా పెద్దలు వ్యవహరించారు....
అవన్నీ తిరుగుతూ తత్ ప్రసాదిత పుణ్యాన్ని సముపార్జించడం మానవులకు దుర్లభం....
కేవలం ఆకాశయానం గావించల సిద్దయోగులకు, దివిజులకు, దేవతాగణములకు, మాత్రమే వాటిని దర్శించడం సాధ్యం....

అట్టి తీర్థములన్నీ కూడా వాటివాటి సూక్ష్మరూప శక్తిపుంజాలతో వచ్చి ఒక తీర్థంలో ఫలానా పౌర్ణమికి చంద్రుడి అమృతకళలతో సమ్మిళితమై కొలువైఉండే రోజునే తత్ తీర్థం యొక్క తీర్థముక్కోటి ఉత్సవం గా వ్యవహరింపబడును....

Should I be explaining this phenomenon in a much simpler yet an effective way...then it shall be as below....

Traveling all over the world to visit each and every who's who of the very well established global tycoons in their respective businesses or empires may not always be feasible for me due to many a limitation / constraint...
However, if all those big shots assemble in an event to which I too am an invitee via a guest/visitor pass, I have access to all those umpteen global big shots to smile at / shake hand / have a selfie with...

For example....take the recent pre-wedding lunch and dinner parties hosted by a global Indian kubera, to which all the global big shots have lined up to meet and greet the soon to become jodi / have a picture with them...

Irrespective of whosoever one might be, being an invitee or a guest or a visitor to such an event shall enable them to have a look at all those global big tycoons in one place and if feasible to meet and greet each other saying Hi, Hello, How are you and so on and so forth.....

Quite similarly, a TeerthaMukkoti pavotsawam celebrated on a full moon day shall enable every devotee participating in the same, to have access to that unlimited unfathomable universal power brought in by all the microscopically compacted theerthams residing all over the universe.....

It is generally a well known concept that the more compacted an entity is, the more power it is vested with....
For example take a pressurized canister containing a medicine and observe its power via its reach upon spraying the same...
and take a normal water bottle spray used in the saloons and observe its power via its reach upon spraying the same...

So shall be the case with a theertham during normal generic days and during such Mukkoti teertha pavotsawa pournami day....

Hence, it is considered quite magnanimous to have a sankalpa sahita teerthasnaanam during such a Mukkoti parvotsawam in-order to replenish our merit quotient (punya sanchayam) that shall subsequently enable us to have a much high standard living in the upcoming times and lives...

One important point to make a note of is...
there is a significant difference between attending an event as a guest / invitee and as a cameraman or an event caretaker person to whom any and every guest / invitee shall remain the same, i.e., just another person to click at with the same camera or greet with a flower bouquet...

Because, a guest / invitee shall be considered as a prospective business opportunity only by another similar guest / invitee... For example, some global tycoon named Mittal ji while attending such a grand party might consider another guest, say, some Vittal ji, as a prospective business opportunity to expand the reach of the former's overseas business within Indian sub-continent and so on and so forth....

Quite.similarly, participating in a TeerthaMukkoti parvotsawam with due faith and respect in the same and participating by considering it as some casual bath in some waters / waterfalls makes a significant difference between the merits imparted by the same...

March 25th-2024 is the TeerthaMukkoti parvotsawam of Tirumala Tumburu Teertham and those who are aspiring to visit the same,
pls do walk in groups from the Paapanaashanam dam and watch your step once you reach the mystical Tumburu kona...
Because not everything one looks at is just another stone or a tree or an anthill or a mere water stream located in the Tumburu kona...
Only a careful closer observation would reveal who they are and for what are they doing such penance
in Tumburu kona....🙂
Because Shree Taallapaaka Annamaachaarya has already said....

సర్వదేవతలు మృగజాతులై చరించేకొండ
నిర్వహించి జలధులే నిట్టచరులైన కొండ
వుర్విదపసులే తరువులై నిలచిన కొండ
పూర్వటంజనాద్రి యీ పొడవాటి కొండ

in his famous Sankeertana 
https://annamacharya-lyrics.blogspot.com/2006/11/79katteduraa-vaikuntamu.html?m=1

MahaaTapaswini, Shree Tarigonda Vengamaamaba, was suggested and escorted by none other than, lord Shree Venkateshwara, to shift from Thirumala temple premises to this highly sacred Tumburu kona to continue her penance peacefully without getting disturbed by the then folks staying around the temple premises...
and thus this Tumburu TeerthaMukkoti utsawam is a much cherished one by Lord Shree Venkateshwara as an explicit remembrance and respect towards his ardent devotee Shree Vengamaamaba..!

I heard this poem in sathguru Shree Chaaganti gaari discourses long ago....

దంతంబు ల్పడనప్పుడే తనువునం దారూఢియున్నప్పుడే
కాంతాసంఘము రోయనప్పుడె జరాక్రాంతంబు గానప్పుడే
వింతల్మేన చరించనప్పుడె కురుల్వెల్వెల్లగానప్పుడే
చింతింప న్వలె నీ పదాంబుజములన్ శ్రీకాళహస్తీశ్వరా

(
Referred from the famous ShreeKaalahasteeshwara shatakam written by Shree Dhoorjati kavikovida mahaanubhavaa...@
https://te.m.wikipedia.org/wiki/%E0%B0%B6%E0%B1%8D%E0%B0%B0%E0%B1%80%E0%B0%95%E0%B0%BE%E0%B0%B3%E0%B0%B9%E0%B0%B8%E0%B1%8D%E0%B0%A4%E0%B1%80%E0%B0%B6%E0%B1%8D%E0%B0%B5%E0%B0%B0_%E0%B0%B6%E0%B0%A4%E0%B0%95%E0%B0%AE%E0%B1%81
)

and had as many pilgrimages as I could during my weekends and day offs....amongst which, the 2014 Phaalguna Pournami's Tirumala Tumburu Teertha Mukkoti parvotsawam...
(under the guidance of Shree Renu gaaru, after completing the then Tirumala Srivaari Seva)
would always remain a very special one for all that it blessed me with...🙂💐

Attached is the picture of the BhaktaBhaagawata bandhujanam / pilgrims' group with whom my most memorable Tumburu Teertha yaatra was blessed by lord Shree Venkateshwara...☺️💐

(As shown in one of the attached pics, one has to wade thru knee deep or even deeper water streams after reaching the Tumburu kona, in-order to reach the Tumburu waterfalls' destination and thus it is required to walk in groups holding each other so as to remain firm to keep moving ahead.....)

శ్రీశోభకృత్ నామ సంవత్సర మాఘ బహుళ త్రయోదశి ప్రయుక్త చతుర్దశి, 2024 మహాశివరాత్రి పర్వసమయ శుభాభినందనలు.....🙂


శివశివేతిశివేతిశివేతివా..
హరహరేతిహరేతిహరేతివా..
భవభవేతిభవేతిభవేతివా...!

సాంబసదాశివ సాంబసదాశివ సాంబసదాశివ సాంబశివ..!

ఓం నమఃశివాయ్ ఓం నమఃశివాయ్ హరహరభోళే నమఃశివాయ్..!

అరుణాచల శివ అరుణాచల శివ 
అరుణాచల శివ అరుణాచల
అరుణాచల శివ అరుణాచల శివ 
అరుణాచల శివ అరుణాచలా..!

ఇత్యాదిగా ఒక్కొక్కరూ ఒక్కోవిధంగా శివనామ స్మరణలో పరవశించి తరించే మహాశివరాత్రి పర్వం / జాగరణ గురించి తెలియనివారుండరు....

ఎందుకంటే శివమయమైనదే మన జీవితం...
మన జీవితంలో ఆ శివం లుప్తమైతే పేరుతో కాకుండా ఫలానా బాడి అని పిలుస్తారు...
నిత్యం ఫలాన పేరుతో పిలవబడడానికి మరియు ఫలాన బాడి అని పిలువబడడానికి వ్యత్యాసం కేవలం ఊపిరి పీల్చుకోకపోవడం మాత్రమే అనేది అందరికీ తెలిసినదే...
ఆ ఊపిరి ఎవరికి వారే పీల్చుకోవడం అనేదే నిజమైతే...
మరి మన తాత నానమ్మ అమ్మమ్మ మరియు గతించిన ఇతర బంధుమితృల ఊపిరి ఎందుకు ఒకానొకరోజు ఆగింది..?

ఫలానా సంఖ్య ఊపిరిలో, ఫలాన వ్యక్తిలోని శివం పరమేశ్వరుడిలోకి లయించే ప్రక్రియ తనంతతానుగానే జరిగిపోతుందా .....
లేక ఆ నిర్ణయాధికార వ్యవస్థకి లయకర్త గా ఒకరు బాధ్యులై ఉన్నారా....? ఉంటే వారికి ఆ బాధ్యతను అప్పగించిన భగవంతుడెవ్వడు...??
అనే అంశాలగురించి...
"కోటి మంది వైద్యులు కూడివచ్చిన గాని మరణమయ్యెడి వ్యాధి మాన్పలేరు..." అనే వాక్యాన్ని శ్రీ చాగంటి సద్గురువుల ప్రవచనాల్లో ఎందరో విని, తగురీతిలో వివేచనాత్మక అంతర్విచారణ గావించే ఉంటారు...

"యమస్యకరుణానాస్తి.." అని అంటోంది శాస్త్రం...అట్టి యముడికే యముడైన పరమేశ్వరుణ్ణి...
" శంభ॑వే॒ నమః॑ । నమ॑స్తే అస్తు భగవన్-విశ్వేశ్వ॒రాయ॑ మహాదే॒వాయ॑ త్ర్యంబ॒కాయ॑ త్రిపురాంత॒కాయ॑ త్రికాగ్నికా॒లాయ॑ కాలాగ్నిరు॒ద్రాయ॑ నీలకం॒ఠాయ॑ మృత్యుంజ॒యాయ॑ సర్వేశ్వ॒రాయ॑ సదాశి॒వాయ॑ శ్రీమన్-మహాదే॒వాయ॒ నమః॑ ॥ "
అని సర్వేశ్వరుడిగా కీర్తిస్తున్నది శ్రీరుద్రం...

"
నమః॒ సోమా॑య చ రు॒ద్రాయ॑ చ॒
నమ॑స్తా॒మ్రాయ॑ చారు॒ణాయ॑ చ॒
నమః॑ శం॒గాయ॑ చ పశు॒పత॑యే చ॒
నమ॑ ఉ॒గ్రాయ॑ చ భీ॒మాయ॑ చ॒
నమో॑ అగ్రేవ॒ధాయ॑ చ దూరేవ॒ధాయ॑ చ॒
నమో॑ హం॒త్రే చ॒ హనీ॑యసే చ॒
నమో॑ వృ॒క్షేభ్యో॒ హరి॑కేశేభ్యో॒
నమ॑స్తా॒రాయ॒
నమ॑శ్శం॒భవే॑ చ మయో॒భవే॑ చ॒
నమః॑ శంక॒రాయ॑ చ మయస్క॒రాయ॑ చ॒
నమః॑ శి॒వాయ॑ చ శి॒వత॑రాయ చ॒
"

రుద్రపఠనంలోని తదనంతరభాగం, 
"నమో హంత్రేచ..." అని ఆ లయకర్తయొక్క విద్యుక్తధర్మ స్ఫోరక గౌణమును కీర్తిస్తూ...
తుదకు 
"నమః శివాయచ..శివతరాయచ.."
అని అట్టి లయకర్తకు శుభంకర అని కృతజ్ఞ్యతలను ఆవిష్కరిస్తున్నది శ్రీరుద్రపఠనం....

"సమ్హరించేవాణ్ణి శంకరుడిగా (శం కరోతి ఇతి శంకరః), శివుడిగా నమస్కరించడం ఏంటి..?"
అని కొంచెం ఆశ్చర్యకరమైన స్తుతిగా అనిపించవచ్చు....
కాని అందలి అంతరార్ధం వేరు....
కరెక్ట్ గా చెప్పలంటే...
శివుడు "కాలసమ్హారమూర్తి"...
అందుకే శుభంకరుడిగా, శివుడిగా శ్రీరుద్రం అంత ఘనంగా నమస్కరిస్తున్నది...

మీరెప్పుడైనా చిదంబరం వెళ్ళినప్పుడు అక్కడ ఉండే "కాలసమ్హారమూర్తి" ని దర్శించి, ధ్యానించి ఆ విశేషాలను తెలుసుకోండి....

నా ధ్యానంలో ఈశ్వరుడు అనుగ్రహించినంత మేర నేను ఆ సమ్హారమూర్తి శివుడెట్లు అవుతున్నాడో...
కాబట్టి శివతరాయచ గా ఎందుకు నిత్యం నమస్కరింపబడుతున్నాడో...
కొంత తెలియజేసే ప్రయత్నంగావిస్తాను...

మీ ఇంటి దెగ్గర్లో ఒక పార్క్ ఉందని అనుకుందాం...
మొదటి రోజు, ఆ పార్క్ ఎంతో చూడముచ్చటగా...
పచ్చని చెట్లతో, పూలమొక్కలతో, లతలతో, అలరారుతోంది......
అట్లు కొన్ని నెలల గడచిన తర్వాత సరైన "మేంటనెన్స్" లేక....
చిత్తు కాగితాలు, చెత్తచెదారం, తో నిండి పచ్చదనం పరిశుభ్రత లుప్తమై దుర్గంధభూయిష్ఠమైన ప్రదేశం గా మారింది....

అనగా కాలంతర్గతంగా వచ్చిచేరిన అవాంఛిత నిరుపయోగ 
పదార్ధాల వల్ల, ఆ చూడచక్కని ఉద్యానవనం అలా ఒక డస్ట్బిన్ గా మారింది...అని అర్ధం....

అనతికాలంలో భూమిలో కలిసి కరిగిపోయే ఆకులు ఇత్యాది ప్రకృతి సిద్ధమైన చెత్త తనంత తానుగా కొన్నాళ్ళకు లయించినా....ప్లాస్టిక్, రబ్బర్, సీసం, ఇత్యాదివి వాటంతట అవి అంత తేలికగా లయించవు...కాబట్టే ఒక "మేంటనెన్స్"
వ్యవస్థ (జి.హెచ్.ఎం.సి లాంటివి) తరచు ఆ శుభ్రపరిచే ప్రక్రియను ( అనగా కాలాంతర్గతంగా పోగయ్యే వ్యర్ధాలను లయించే ప్రక్రియ ) నిర్వహిస్తూ ఆ ఉద్యానవనం ఎప్పటికీ అట్లే నిత్యనూతనంగా అలరారేలా చేస్తున్నది అని అర్ధం....

మనిషి జీవితంలో శివుడి అనుగ్రహ పాత్ర కూడా అట్టిదే...
"కాలం" అనేది ఒక అగోచర, అమేయ, అగ్రాహ్య, అనిర్వచనీయ, ఆశ్చర్యకరమైన అంశం... కాలం ఎల్లరి జీవితాలను శాసించడం అనేది తనంతతానుగా జరిగిపోతూఉండే ప్రక్రియ...
అట్టి కాలం తన అధీనంలో ఉండేవాడే శివుడు...
అందుకే ఆతడు వాసుకి అనే సర్పాన్ని కంఠాభరణంగా కలిగి ఉన్నాడు.....
అమృతం కోసం దేవదానవులు ప్రయత్నిస్తే కాలంతర్గతంగా ఉద్భవించిన అవాంఛితమైన హాలహలం అనే కాలకూట విషాన్ని తన కంఠంలో బంధించి లయించాడు....
అనగా తత్త్వతః కాలంతర్గతంగా జనించే సకల అవాంఛనీయ ప్రక్రియలను, ప్రకోపాలను, తనలోకి లయించే కారుణ్యమూర్తియే లయకర్త...తద్వరా ఆతడు శ్రీకరుడు శుభంకరుడు అయిన శంకరుడిగా వర్ధిల్లుతునాడు...

చక్కని ఇల్లు ఉండడం ఎంత ముఖ్యమో...
ఇల్లును అంత చక్కగా మేంటేన్ చేయడం కూడా అంతే ముఖ్యం...
(అనగా ఎప్పటికప్పుడు కాలాంతర్గతంగా వచ్చి పోగయ్యే అవాంఛిత దుమ్ము, ధూళి, ఉండకుండా శ్రీకరంగా ఉండడం..)

చక్కని శరీరం ఉండడం ఎంత ముఖ్యమో...
శరీరాన్ని అంత చక్కగా మేంటేన్ చేయడం కూడా అంతే ముఖ్యం...
(అనగా ఎప్పటికప్పుడు కాలాంతర్గతంగా వచ్చి పోగయ్యే అవాంఛిత రుగ్మతలు, జాఢ్యాలు, ఉండకుండా శ్రీకరంగా ఉండడం..)

ఇది లౌకికం...
కాబట్టి...మనచేతిలో ఉన్న అంశం...

చక్కని పుణ్యకర్మలఫలితం ఉండడం ఎంత ముఖ్యమో...
పుణ్యకర్మలఫలాలను అంత చక్కగా మేంటేన్ చేయడం కూడా అంతే ముఖ్యం...

చక్కని కాలం చిరంతనంగా ఉండడం ఎంత ముఖ్యమో...
ఆ కాలవైభవాన్ని అంత చక్కగా మేంటేన్ చేయడం కూడా అంతే ముఖ్యం...

ఇది అలౌకికం...కాబట్టి...
మనచేతిలో లేని అంశం...

మరి ఎవరి చేతిలో ఉన్న అంశం...??

కాలాన్ని సువ్యవస్థీకరించే నాదశక్తిని సృజించే ఢమరుకం కట్టబడిన త్రిశూలం ఆయుధంగా చేతిలో ఉన్నవాడి చేతిలో ఉండే అంశం..
కాలాధిపతి, దినాధిపతి, గ్రహాధిపతి, ఆత్మాధిపతి, ఆరోగ్యాధిపతి అయిన సూర్యశక్తి నుండి ఒకానొక సందర్భంలో విశ్వకర్మచే తయారుచేయబడినది త్రిశూలం కాబట్టి...
కాలాంతర్గతంగా ఉనికిని సంతరించుకునే సకలవైశ్విక పారమార్ధిక మరియు లౌకిక చర్యలను నియంత్రించే శక్తి  శివుడు ధరించే ఆ దైవిక త్రిశూలానికి ఉంటుంది....
ఆ నియంత్రణను శ్రేయోదాయకమైన విధంగా సువ్యవస్థీకరించడం చాలా ముఖ్యం కాబట్టి, అట్టి త్రిశూలానికి దైవిక ఢమరుకం కట్టబడి ఉంటుంది....
అదే విధమైన కాలనియంత్రక శక్తి శ్రీమహావిష్ణువు ధరించే సుదర్శనచక్రానికి కూడా అదే సూర్యశక్తిగా అందివ్వబడింది...
హరి స్థితికారక పనులకు...
హరుడు లయకారక పనులకు ...
వారివారి దైవిక శస్త్రాస్త్రాల సూర్యశక్తిని అనగా ప్రత్యక్ష కాలస్వరూపం యొక్క శక్తిని వినియోగిస్తున్నారు అని అర్ధం...

హరి సమ్హారకుడిగా....
హరుడు సమ్రక్షకుడిగా....
ఉన్న ఉదంతాలే మన పురాణాల్లో ఎక్కువ...కాబట్టి హరిహరులకు అభేదం....
కాని తత్త్వతః ఒక ప్రక్రియకు ఒక శక్తికేంద్రాన్ని నిర్వచించాలి కాబట్టి అలా హరి స్థితికర్తగా...హరుడు లయకర్తగా ఆదిపరాశక్తిచే నియమితులైరి...

నిజానికి ఆ లయకర్త సమ్హరించేది కాలాన్ని....అందుకే శివుడు కాలసమ్హారమూర్తిగా ఆరాధింపబడుతున్నాడు.....
కాలభైరవుడు క్షేత్రపాలకుడిగా ఉండడంలో అసలైన అర్ధం ఏంటో తెలుసా....
రవం అనగా ధ్వని....
భైరవ అనగా ఆ ధ్వనిని తన అధీనంలో అదిమిపెట్టగల శక్తి..
కాలభైరవ అనగా కాలాంతర్గతంగా ధ్వనించే అన్నిరకాల శక్తులను కూడా తన అధీనంలో అదిమిపెట్టి ఉండే శక్తి..
అట్టి కాలభైరవ శక్తి తనకు క్షేత్రపాలకుడిగా ఉండడం అంటే...

అన్ని కాలాలు, అన్ని కాలాంతర్గత క్రియాకలాపాలు, కాలం యొక్క అన్ని స్వరూపాలు, కూడా ఎవరికి కింకరులై వ్యవహరిస్తాయో, అట్టి రుద్రుడే మహాకాలుడైన కాలకాలుడు....అనే సందేశమే కాలభైరవుడు పరమేశ్వరుడి క్షేత్రపాలకుడిగా ఉండడంలోని ఆంతర్యం.....

మీరు ఈ కాలభైరవశక్తి యొక్క విశేషాలను బాగుగా అర్ధంచేసుకోవాలంటే...
శ్రీశైలం క్షేత్రానికి వెళ్ళినప్పుడు అక్కడ, శ్రీఆదిశంకరమఠం నిర్వహణలో ఉన్న సత్రం/విశ్రాంతిగృహసముదాయానికి దెగ్గర్లో ఉండే కాలభైరవ మూర్తిని దర్శించి ధ్యానించి తెలుసుకోండి....

శ్రీ చాగంటి సద్గురువుల ప్రవచనాల్లో, "శ్రీకంచిపరమాచార్య వారి శ్రీశైల యాత్ర, 7 తాటిచెట్ల లోతు తవ్వమని చెప్పడం, అప్పుడు సరస్వతీ తీర్థం బహిర్గతమవ్వడం, అప్పటినుండి ఇప్పటికీ కూడా శ్రీఆదిశంకర మఠ నిర్వాహకుల సమ్రక్షణలో ఉన్న ఆ సర్వస్వతీ తీర్థం భక్తులకు దర్శనీయమై ఉండడం...", గురించి శ్రద్ధగా విన్నవారికి నేను చెప్పే ప్రదేశం సుపరిచితమే కద....
శ్రీశైల గ్రామ దేవత అంకాళపరమేశ్వరి ఆలయం, 
బయలువీరభద్రుడు, సిద్ధరామప్ప పాదాలు, గోశాల దెగ్గర్లోని హేమారెడ్డి మలమ్మ ఆలయం, కొంచెం దూరంలో ఉండే
సాక్షిగణపతి ఆలయం, హాఠకేశ్వరం, శిఖరనంది, ఫాలధారపంచధార ఇత్యాది శ్రీశైల ఆలయ పరిసర ఇతర దర్శనీయ వాటికలు భక్తులకు విదితమే కద....

దేశము, కాలము, నామము అనే శక్తిత్రయంతో ముడిపడిన అద్వితీయ మహోన్నత దైవిక ప్రదేశమే మన ప్రాచీన భారతావని.....

"ఫాలానా మహాశివరాత్రి నాడు అరుణాచలగిరిప్రదక్షిణ గావిస్తున్నప్పుడు, ఆది అన్నామలై ఆలయ వెనక భాగంలో కొలువైన లింగోద్భవమూర్తికి గావించిన అభిషేకాన్ని దర్శించి శివనామస్మరణతో జాగరణలో తరించడం మా జన్మాంతర సుకృతం...."
అని ఎవరైనా భక్తులు మీతో చెప్పినపుడు.....

ఇక్కడ 

1. దేశము - అనగా అరుణాచల అగ్నిలింగక్షేత్రానుబంధమైన ఆది అన్నామలై ఆలయం...

2. కాలము - అనగా మహాశివరాత్రి పర్వదినం

3. నామము - అనగా శివనామము

యొక్క సమ్మిళిత సమాహార స్వరూపం యొక్క విశేషమే మహాపుణ్యప్రదమైన అంశంగా పరిగణింపబడుతోంది అని అర్ధం కద....

ఇక్కడ మీరు గమనిస్తే, మొదటి రెండు విశేషాలు అనగా దేశము, కాలము ఎల్లప్పుడూ మన అధీనంలో ఉండడం కుదరదు....

అనగా,
"నేను ప్రతి తిరుమల బ్రహ్మోత్సవంలో అన్ని వాహనసేవలను దర్శిస్తూ గోవింద నామస్మరణ గావిస్తాను..."అని అనడం అందరికీ ఎల్లవేళలా కుదరదు...

"నేను ప్రతి శివరాత్రికి అరుణాచల గిరిప్రదక్షిణం గావించి లింగోద్భవకాల అభిషేకానికి ఆది అన్నామలై ఆలయానికి చేరుకుంటాను......"అని అనడం అందరికీ ఎల్లవేళలా కుదరదు...

అప్పుడప్పుడు అలాంటి పుణ్యం ఈశ్వరానుగ్రహంగా సంప్రాప్తించును....

కాని,
నేను ఎల్లప్పుడు
శివగోవిందగోవింద...
హరిగోవిందగోవింద...
హరగోవిందగోవింద...
ఇత్యాది భగవద్ నామస్మరణలో లీనమై ఉంటాను....
అని అనడం ఎవ్వరికైనా ఎప్పుడైనా ఎక్కడైనా ఈశ్వరకృపగా కుదిరే అనుగ్రహమే.....

కాబట్టి దేశము, కాలము, నామము అనే శక్తిత్రయంలో నామము ఎల్లప్పుడూ కూడా భక్తుడి అధీనమై ఉండును...
తద్వారా నామి కూడా ఎల్లప్పుడూ భక్తుడి అధీనమై ఉండును..
కాబట్టే యావద్ భారతావనిలో ఒక్కోభక్తుడి ఆర్తికి తగ్గట్టుగా పలికిన ఈశ్వరుడు అక్కడ అట్ల కొలువై, విరాజిల్లుతున్నాడు అనేది జగద్విదితమైన విశేషం...

అనగా, "Order of precedence" (సాఫ్ట్వేర్ ప్రపంచానికి బాగా సుపరిచితమైన అంశం) అనే విశేషం కారణంగా,
భగవద్ నామమే ఎల్లప్పుడూ కూడా అత్యంత మహిమాన్వితమై ఉండును....

అనగా మీరు మహాశివరాత్రికి అరుణాచలంలో ఉన్మా కూడా శివనామ స్మరణలో కాకుండా మీ మనసు ఏదో లౌకిక సినిమాపై నిమగ్నమై ఉన్నప్పుడు, అది ఎందుకు పనికిరాని తీర్థయాత్ర....

మీరు ఏదో ఒక లౌకిక సినిమా చూస్తున్నా కూడా, మీ మనసు అరుణాచలశివ అంటూ స్మరించగలిగే స్థాయిలో ఉంటే, సినిమా వీక్షణం కూడా పుణ్యదాయకమైన వ్యాపకమైనది....
కద ...

చ10. ప్రేమ ముప్పిరికొను వేళ
నామము తలచే వారు
రామ భక్తుడైన త్యాగ-
రాజ నుతుని నిజ దాసులైన వా(రెందరో)

అని కృతిపరిచారు సద్గురు శ్రీత్యాగబ్రహ్మం గారు... జగద్ప్రసిద్ధినొందిన వారి "ఎందరో మహానుభావులు" అనే శ్రీరాగ పంచరత్నకృతిలో....

మరియు
కాలసమ్హారమూర్తిగా కొనియాడబడే పంచాస్య పరమేశ్వరవైభవాన్ని "విదళితకాలం" అని ఎంతో ఘనంగా కీర్తిస్తూ, సంగీతరసఝరుల్లో సమ్మిళితం గావింపబడిన భగవద్ నామం యొక్క వైభవాన్ని సామవేదసారంగా అభివర్నిస్తూ, శ్రీత్యాగరాయుల వారు చిత్తరంజని రాగంలో అందించిన ఈ కృతి ఎంతటి ఆహ్లాద దాయకమో కద....

ప. నాద తనుమనిశం శంకరం
నమామి మే మనసా శిరసా

అ. మోదకర నిగమోత్తమ సామ
వేద సారం వారం వారం (నా)

చ. సద్యోజాతాది పంచ వక్త్రజ
స-రి-గ-మ-ప-ధ-ని వర సప్త-స్వర
విద్యా లోలం విదళిత కాలం
విమల హృదయ త్యాగరాజ పాలం (నా)

దేశకాలనుగుణంగా ఈశ్వరనామస్మరణవైభవం ఎట్టిదో చాలా సింపుల్ గా వివరిస్తాను....

ఈశ్వర నామము అనేది ఒక 500 రూపాయల పచ్చ నోటు అనిగనక మీరనుకుంటే..,(ఇది ధనప్రధానమైన కలియుగం కాబట్టి కరెన్సి నోట్ ని ఉదాహరణ గా స్వీకరించాను)

అమెరికా, సాన్ఫ్రాన్సిస్కో డౌన్టౌన్ లో మీరు ఈ 500 రూపాయల పచ్చ నోటు ని వినియోగిస్తే, ఓ 6 డాలర్ల  ఫారిన్ ఎక్స్చేంజ్ రొక్కం గా విలువకట్టి హార్డ్లీ ఓ కప్ కాఫి పొందగలరు...
అదే ఇండియా, హైదరాబాద్ లో జె.ఎన్.టి.యు ఏరియాలో అయితే 2 విస్తర్ల ఫుల్ అన్లిమిటెడ్ పరిశుభ్రమైన ఆరోగ్యకరమైన అమృతమయమైన బ్రాహ్మణ భోజనాన్ని పొందగలరు....
అనగా
అదే వ్యక్తి..అదే 500 నోట్....
కాని...
దేశం మారింది...తద్వారా ఫలితం కూడా మారింది...
కద....

హైదరాబాద్, జె.ఎన్.టి.యు ఏరియాలో... వింటర్ సీసన్ లో మీరు 500 రూపాయల పచ్చ నోటు ని వినియోగించినా, ఓ కిలో మామిడిపండ్లు కూడా దొరకవు...
అదే హైదరాబాద్, జె.ఎన్.టి.యు ఏరియాలో... 
సమ్మర్ సీసన్ లో మీరు 500 రూపాయల పచ్చ నోటు ని వినియోగిస్తే, 5 కిలోల రకరకాల వెరైటీల్లో అమృతమయమైన మామిడిపండ్లు దొరుకుతాయ్....

అనగా
అదే వ్యక్తి..అదే 500 నోట్....
కాని...
కాలం మారింది...తద్వారా ఫలితం కూడా మారింది...
కద....

అచ్చం ఇదే విధంగా దేశకాలానుగుణంగా ఈశ్వరనామ స్మరణ వైభవం ఫలితం కూడా మారుతూ ఉంటుంది...

కాని ఇక్కడ గమనించవలసిన ముఖ్యమైన విషయం ఏంటంటే...
మీరు హైదరాబాద్, జె.ఎన్.టి.యు ఏరియాకి వెళ్ళినా...
అమెరికా, సాన్ఫ్రాన్సిస్కో డౌన్టౌన్ కి వెళ్ళినా...
పక్క గల్లికి వెళ్ళినా సరే...
500 నోటు ఉంటేనే దేశకాలానుగుణంగా వివిధ ఫలితాలను పొందగలం...
లేనిచో ఎన్ని దేశాలు తిరిగినా, ఏ కాలంలో తిరిగినా, ఫలితం నిష్పలం..
అచ్చం అదే విధంగా మీరు గమనించవలసిన ముఖ్యమైన విషయం ఏంటంటే...
మీరు అరుణాచలం వెళ్ళినా, కాశి వెళ్ళినా, తిరుమల వెళ్ళినా, శ్రీశైలం వెళ్ళినా, చిదంబరం వెళ్ళినా...
ఇంటికి దెగ్గర్లో ఉండే ఏదేని ఆలయానికి వెళ్ళినా... సరే...
ఈశ్వరనామస్మరణ యొక్క నిధి మీవద్ద ఉంటేనే.... దేశకాలానుగుణంగా వివిధ ఫలితాలను పొందగలం...
లేనిచో ఏ కాలంలో ఎన్ని తీర్థాలు తిరిగినా, ఎన్ని క్షేత్రాలు దర్శించినా ఫలితం గగనం...

ఎందుకంటే ఈశ్వరుడిపై మనకు గల విశ్వాసానికి సూచికయే ఈశ్వరనామస్మరణ...
ఎందుకంటే నామమే నామికి ఉనికి కాబట్టి....
నామస్మరణమే నామిని మనవద్దకు రప్పించే సాధనం కాబట్టి...

ఆఫ్ట్రాల్ ఓ 50 మంది ఉన్న క్లాస్ లోనే,
అటెండెన్స్ కి పూర్తి పేరు పిలిచినా సరే సరిగ్గా పలకని ఎందరో లాస్ట్ బెంచ్ దోస్తుల అల్లరి మనకు తెలిసినదే...
మరి అటువంటిది...కోటానుకోట్ల జీవుల వివిధ స్థాయిలోని స్థితిని, లయాన్ని, చక్కబెట్టే పనిలో బాగా బిజిగా ఉండే ఈశ్వరుడు తగురీతిలో నామస్మరణం అనే సాధనం ద్వారా పిలిస్తేనే పలుకుతా అని అంటే అందులో అతిశయం అని అనడానికి ఏముంటుంది...?

అంటే అన్నిసార్లు అంత గొప్పగా పిలిస్తేనే పలకడానికి ఈశ్వరుడు సరిగ్గా వినడా ఏంటి...?
అనే వెర్రి డౌట్లు కొందరికి రావొచ్చు....

"ఒక చీమ కాలికి మువ్వలను తయారుచేసి తొడిగితే చీమలు నడుస్తున్నప్పుడు జనించే ఆ అత్యంత స్వల్ప మాగ్నిట్యూడ్ లో ఉండే అందెలరవాన్ని కూడా ఈశ్వరుడు వినగలడు...."
అనే శ్రీచాగంటి సద్గురువుల వివరణ కొందరికైన గుర్తుండే ఉంటుంది...

కాబట్టి ఇక్కడ ప్రశ్న ఈశ్వరుడు వినగలడా అని కాదు...
ఈశ్వరుడు తనకు పలికేలా భక్తుడు స్మరించగలడా అనేదే ప్రశ్న...
ఆ ప్రశ్నకు సమాధానం తెలిసేది కేవలం ఆర్తితో పిలిచే సదరు భక్తుడికి మాత్రమే కాబట్టి....
ఈశ్వర నామస్మరణం, మననం, నిధిధ్యాసనం లోని వైభవం ప్రస్ఫుటంగా ప్రకటనమయ్యేది ఆయా భక్తుల హృదయాలకు మాత్రమే....అని అనడం అతిశయోక్తి కానేరదు....

కీ.శే|| వీర్రాజు గారు అని, ఎందరో భక్తులచే ఎల్లప్పుడూ మనస్పూర్తిగా నమస్కరింపబడే 90 సంవత్సరాల మహానుభావులు ఒకరు ఉండేవారు వి.వి.నగర్ భగవద్ నామస్మరణ భజన బృందంలో....
ప్రతీ శనివారం నన్ను ఎంతో ఆప్యాయంగా ఆదరించి భజన సంప్రదాయంలోని ఈశ్వర నామస్మరణ వైభవాన్ని అలది భజనలో పాల్గొనే ఎల్లరినీ ఎంత గొప్పగా తరింపజేసేవారో నేను ఎప్పటికీ మరవలేను...

అంతటి వృద్ధ్యాప్యంలో కూడా, కట్టుడు పళ్ళతో, వణుకుతున్న చేతులతో, గాద్గదిక స్వరంతోనే వారు గావించే గగనగంభీరమైన భజనల్లో ఆ ఈశ్వరుడు ఎంతగా ఓలలాడేవాడో, అక్కడుండే ఎందరికో సుపరిచితమే....
వీర్రాజు గారి స్వరంలో భజనలు వినడం కోసమే నేను అప్పట్లో ఆలయానికి తప్పకుండా వెళ్ళేవాణ్ణి....
రోమాలు నిక్కపొడిచేలా వారు ఈ క్రింది నరసిమ్హశతకపద్యాన్ని ఆలపిస్తుండేవారు....అందులో ప్రతిపాదింపబడే వేదాంత సందేశంలో ఈశ్వరనామస్మరణ యొక్క వైభవం ఎంత గొప్పగా వర్నింపబడిందో కద....

సీ. బ్రతికినన్నాళ్లు నీ - భజన తప్పను గాని
మరణకాలమునందు - మఱతునేమొ
యావేళ యమదూత - లాగ్రహంబున వచ్చి
ప్రాణముల్ పెకలించి - పట్టునపుడు
కఫ వాత పైత్యముల్ - గప్పగా భ్రమచేత
గంప ముద్భవమంది - కష్టపడుచు
నా జిహ్వతో నిన్ను - నారాయణా యంచు
బిలుతునో శ్రమచేత - బిలువనొ

తే. నాటి కిప్పుడె చేతు నీ - నామభజన
తలచెదను, జెవి నిడవయ్య । - ధైర్యముగను.
భూషణవికాస । శ్రీధర్మ - పురనివాస ।
దుష్టసంహార । నరసింహ - దురితదూర ।

హరుడి రుద్రాంశలో సద్యోఈశ్వరశక్తిగా స్తంభోద్భవ నారసిమ్హశక్తిగా భక్తుడి మాటకు కట్టుబడి ప్రభవించిన
శ్రీలక్ష్మీనరసిమ్హస్వామి అనుగ్రహం భక్తుల దురితాలను భన్జించే భవుడి అనుగ్రహమై భక్తులెల్లరికి లభించుగాక......

హరిలోనే హరుణ్ణి దర్శించిన శ్రీ తాళ్ళపాక అన్నమాచార్యులవారు శ్రీవేంకటేశ్వరస్వామి పై రచించిన ఈ క్రింది సంకీర్తన, శ్రీగరిమెళ్ళ అనిల్ బ్రో గారి అమృతగళంలో నిజంగా ఎంత వైభవంగా ఉంటుందో ఒకసారి వింటే తెలుస్తుంది...ఆ హరిహరాత్మక చిద్విలాస వైభవం..

[ Lyrics too are present in the comments section of the rendition
https://youtu.be/xEhbBo377-w?si=u9Mt3Xygmglx3DTR ]

హరనమః పార్వతీపతయే హరహరమహాదేవ శంభోశంకర...

సర్వం వేములవాడ శ్రీరాజరాజేశ్వరి సమేత 
శ్రీరాజరాజేశ్వర శ్రీచరణారవిందార్పణమస్తు...
☺️🪔🌙🫐🌷🌸🌟🍊🍀🪷🇮🇳
🙏🙏🙏🙏🙏